🌷*కీటాః పతంగాః మశకాశ్చ వృక్షాః*
*జలే స్థలే యే నివసంతి జీవాః!*
*దృష్ట్వా ప్రదీపం నచ జన్మ భాగినః*
*భవంతి త్వం శ్వపచాహి విప్రాః!!*🌷
వెలిగించి దీప శిఖలో దామోదరుణ్ణి కానీ , త్రయంబకుడిని కానీ ఆవాహన చేసి పసుపో , కుంకుమో , అక్షతలో వేయాలి. అది కార్తీక దీపం దానికి నమస్కారం చేయాలి. ఆరోజు దీపం చాలా గొప్పది. ఆ దీపపు వెలుతురు మనమీద పడినా చాలు. కీటాశ్చ - పురుగులు , మశకాశ్చ - దోమలు , ఈగలు మొదలైనవి , అంతే కాదు చెరువు ఉంది అనుకోండి అందులో రకరకాలైన పురుగులు ఉంటాయి. అవి జ్యోతి చూడగానే ఎగిరి వస్తాయి. నీటిలో ఉన్న పురుగులు , భూమి పై ఉన్నటువంటి పురుగులు ఇవన్నీ దీపం ఎక్కడ ఉందో అక్కడికి వచ్చేస్తాయి.
ఇవన్నీ కూడా ఈ దీపం వెలుతురు ఎంత దూరం పడుతోందో ఈ దీపాన్ని ఏవేవి చూస్తున్నాయో ఆఖరికి చెట్లు కూడా అవన్నీ కూడా భగవంతుణ్ణి పొందుగాక ! వాటికి ఉత్తరోత్తర జన్మలు తగ్గిపోవుగాక ! అవి తొందరలో మనుష్య జన్మ పొంది ఈశ్వరుని అనుగ్రహాన్ని పొంది ఈశ్వర కర్మానుష్ఠానము చేసి భగవంతుణ్ణి చేరుగాక ! అని శ్లోకం చెప్పి దీపం వెలిగించి నమస్కరిస్తారు.
ఇది మనుష్యులు మాత్రమే చేయగలిగినటువంటి గొప్ప విశేషం. కార్తీక పౌర్ణమి దీపం.
దీపపు కాంతి పడితేనే అవి అంత గొప్ప ప్రయోజనాన్ని పొందితే ఇక ఆ దీపం పెట్టిన వాడు ఎంత ప్రయోజనాన్ని పొందాలి.
1 comment:
Nice post
Post a Comment