ఈ రోజు 8వ మహర్షి అంగీరస మహర్షి చరిత్ర
🌿మనం ఇప్పుడు ' అంగిరస ' మహర్షి గురించి తెలుసుకుంటున్నాము . ఈ మహర్షి ఎలా పుట్టాడో తెలుసా ! బ్రహ్మదేవుడు ముఖం నుంచి .
🌸 బ్రహ్మ మానసపుత్రులు అంటూంటారు మీరెప్పుడైనా విన్నారా .... అందులో మూడవవాడు ఈ అంగిరస మహర్షి
🌿ఈ బ్రహ్మ కుమారుడు అంగిరసుడు తండ్రి ఆదేశానుసారం తపస్సు ప్రారంభించాడు.
🌸అంగిరసుడు దివ్వ తేజోసంపన్నుడు తపశ్శక్తిచే ఇంకను తేజస్సు సంపాదించాడు.అంగిరసునకు సర్వశక్తులు లభించాయి.
🌿అయినా నిగర్విగానే సంచరిస్తున్నాడు.అతడు లబ్ధుడు కాదు,సర్వసంగ పరిత్యాగి.త్యాగమును సంతోఫ మున్నదని గ్రహించాడు.
🌸ఆ అంగీరసుడు కర్దమ ప్రజాపతి కుమార్తెయగు శ్రద్ధను వివాహం చేసికొన్నాడు.శ్రద్ధా అంగీరసులను దేవతాగణాలు ఆశీర్వదించాయి.
🌿అత్తమామల ఆశీస్సులు గొని ఈ నూతనదంపతులు తమ ఆశ్రమమునకు వెళ్ళిపోయారు.ప్రశాంతంగా గృహస్ధ జీవితము గడుపుతున్నారు.
🌸 కాలక్రమాన ఆ దంపతులు ఏడుగురు కుమారులను ఏడుగురు కుమార్తెలను కన్నారు.వారివల్ల అంగీరసుని వంశము పెరిగి విశ్వమంతము ప్రాకినది.
🌿దేవతలపై అగ్నిహోత్రుడు కోపించి తన విద్యుక్త ధర్మములు నిర్వర్తింపక రహస్యముగ ఏకాంత వాసం చేయసాగాడు.
🌸ఈ విషయమును దేవతలు భ్రక్ష్మ్మీకు తెలయజేయగా లంగీరసుని పిలిపించి అగ్నిహోత్రుని విధులను నిర్వహించమని ఆదేశించాడు.
🌿తండ్రి ఆజ్ఞను శిరసావహించి అంగీరసుడు అగ్నిదేవుని విధులు నిర్వర్తిస్తున్నాడు.అగ్ని లేని లోపం తీరుస్తున్నాడు. అగ్నిదేవుని మరచి అంగిరసుని పూజిస్తున్నారు. దేవతా గణాలు
🌸ఆ విషయం అగ్నిహోత్రునకు తెలియగా తనకు నామరూపాలుండవని గ్రహించి అంగిరసుని వద్దకు వచ్చి తన పనులు తానే నిర్వహించగలనని పలికాడు.
🌿అంగిరుడు అంగీకరించి అగ్నిహోత్రునే ఆ విధులు నిర్వర్తించమన్నాడు.అగ్ని సంతసించి అంగీరసునకు ద్వితీయాగ్ని స్ధానమిచ్చి సత్కరించాడు. అంతే కాదు అంగీరసుని కుమారుడగు బృహసృతికి తృతేయాగ్ని స్దానం ఏర్పరిచాడు.
🌸అది అంగిరసుని ఘనతకు నిదర్శనం. పూర్వకాలమున చిత్రకేతుడను రాజు గలడు.అతడు శూరసేన దేశమును పాలించుచుండెను. సర్వసంపదలు గల ఆ రాజుకు సంతానము లేదు.
🌿సంతానహీనుడైన ఆ రాజు శాంతిలేక జీవిస్తున్నాడు. ఒకనాడు అంగిరసుడు ఆ రాజు సందర్శనార్ధం వచ్చాడు.చిత్రకేతుడు ఆ మహర్షిని ఆదర్శపూర్వకంగా ఆహ్వానించాడు.
🌿భార్యవహితుడై సేవించాడు.మహర్షి సంతసించి రాజు సంతానహీనుడని గ్రహించి పుత్రకామేష్టి చేయించి పట్టమహిషియగు కృతద్యుతి గర్భం దాల్చునట్లు చేశాడు.
🌸రాజు పరమానందభరితుడై అయాడు. మాసములు నిండగా ఆమె ఒక కుమారుని కన్నది కాని తక్కిన రాణులు ఈర్ష్యతో ఆ బిడ్డకు విషమిచ్చి చంపారు.
🌿రాజు దు:ఖము పెరిగింది.ఆ దంపతులు బిడ్డ మరణానికి దు:ఖించ సాగారు. ఆ విషయము అంగిరసునకు తెలిసింది. ఆయన నారద మహర్షి వెంటబెట్టుకుని చిత్రకేతుని వద్దకు వాచ్చడు.
🌸పుత్రశోకంతో కుమిలిపోయే ఆ రాజదంపతులను సమీపించి చావు పుట్టకలు జీవికి సహజమని అందుకై విచారింపరాదని ధైర్యం చెప్పి తత్వభోద చేశాడు.
🌿అనంతరం రాజు వద్ద సెలవు తీసికొని తిన్నగా బ్రహ్మలోకం చేరుకున్నాడు. అంగిరసుడు ఒకప్పుడు కశ్యపమహర్షి వలన పుణ్యక్షేత్రముల మహిమ నెరిగి గౌతమమహర్షి వలన వాటి ప్రభావమును తెలిసికొని
🌸వరుసగా చంద్రభాగ, హిరణ్యబిందు, ఇంద్రతోయ,కరతోయ,అపాంహ్రదము, మహాశ్రయ,భృగుతుంగ, కన్యాకూప,సుందరికాహ్రద,
🌿వైమానిక,విపాశ, కాళాకాశ్రమము, ద్రోణశర్మ పదము, శరస్తంభము, దేవరారువనము, చిత్రకూటము, జన్మస్ధానము,శ్యామాశ్రము, కౌశికవాల,మతంగ వాపిక, నైమికము, ఉత్పలావనము,
🌸 వైవస్వతి, లౌహిత్య, రామహ్రదము, మహాహ్రాద, నర్మద, జంబూనది, కోకాముఖ, కండులికాశ్రమము, కుల్య, ఆర్షి సేవశ్రమము,ధర్మారణ్యము, బ్రహ్మసరస్సు మొదలైన పుణ్యక్షేత్రములు తిరిగి వాటిని గురించి గౌతములను తెలిపి అంగిరసుడు ఆనందించాడు.
🌷సప్తర్షి పత్నులకు శాపం🌷
🌿ఒకప్పుడు అగ్నిసప్తర్షి పత్నులను మోహించాడు.ఆ విషయం అంగిరసుడు గ్రహించి అగ్నిని, సప్తర్షి పత్నులను శపించాడు.
🌸అగ్నిని సర్వభక్షకుడవు కమ్మని,సప్తర్షిపత్నులను బ్రాహ్మణుల యింట సౌందర్యవతులై జన్మించమని శపించాడు.
🌿శౌనకుడు అంగిరసుని వద్దకు వచ్చి బ్రహ్మ విద్యను బోధించమని కోరగా అంగిరసుడు సవివరముగా ఉపదేశిచాడు.
🌸ఈ విషయములు ముండకోపనిషత్తునందు ప్రతిపాదింపడ్డాయి. అంగిరసుడు స్మతికర్తకారులో ఒకడుగా పరగణింపబడ్డాడు.
🌿 ఆయన బోధించిన ధర్మవిషయాలుఅంగిరస స్మృతియను పేర ప్రసిద్ధికెక్కినది. అంగిరసుని మహర్షులందరు స్తుతించారు.
🌸అంగిరసులు అధర్వణ వేదద్రష్టలు.వారు ధర్మ పూర్ణమాన యజ్ఞమును చేసి స్వర్గమునందినారు.వారి యజ్ఞఫలమును భూలోకకాసులకు ధారపోసారు.
🌿 అంగిరసులు దేవతాతుల్యులు, ఆదిత్యులు. అంగిరసులకు భూమిని దానం చేశారు.బ్రహ్మసృష్టిలో మొదటివారు అంగిరసులు.
🌸వారు రాజులకు,పురోహితులుగా ఉండెడివారు.ఉపనిషత్తులలో అంగిరసుల ప్రస్థాపన గలదు. ఆత్మ అవినాశియని అంగిరసులు తెలియజేశారు.
🌿 ఓంకారమును గురించి వివరించి చెప్పినవారు అంగిరసులే.ఇదండీ అంగీరసుడు మహర్షి చరిత్ర.
No comments:
Post a Comment