*శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం |*
*ప్రసన్నవదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాంతయే ||*
*సర్వపాపహరం పుణ్యం స్నానం వైశాఖకాలికం |*
*నిర్విఘ్నం కురుమేదేవ దామోదర నమోస్తుతే ||*
*వైశాఖః సఫలోమాసః మధుసూదన దైవతః |*
*తీర్థయాత్రా తపోయజ్ఞ దానహోమఫలాధికః ||*
*వైశాఖః సఫలం కుర్యాత్ స్నానపూజాదికం |*
*మాధవానుగ్రహేణైవ సాఫల్యంభవతాత్ సదా ||*
*మధుసూదన దేవేశ వైశాఖే మేషగేరరౌ |*
*ప్రాత స్నానం కరిష్యామి నిర్విఘ్నం కురు మాధవ ||*
----------------------------------------
*ఓం మమ ఉపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభేశోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణో రాజ్ఞయా శ్రీ శివశంభోరాజ్ఞయా ప్రవర్తమానస్య ఆద్యబ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే , కలియుగే , ప్రథమపాదే , జంబూద్వీపే , భరతవర్షే , భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే కృష్ణా / గంగా /గోదావర్యోః మధ్యదేశే అస్మిన్ (ఆయా ప్రాంతాలకు మార్చుకోవాలి) వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్టి సంవత్సరానాం మధ్యే శ్రీ .......(సంవత్సరం పేరు చెప్పాలి) నామసంవత్సరే , ఉత్తరాయనే , వసంతఋతౌ , వైశాఖమాసే , ....పక్షే , ....తిథౌ, ......వాసర యుక్తాయాం , శుభనక్షత్ర, శుభయోగ , శుభకరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం, శుభతిథౌ , శ్రీ మాన్ .....(పేరు చెప్పాలి), గోత్రః .........(గోత్రం పేరు చెప్పాలి) నామధేయస్య , ధర్మపత్నీ సమేతస్య అస్మాకం సహకుటుంబానాం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం , శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం క్షేమ , స్థైర్య , విజయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం, ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం , గంగావాలుకాభి సప్తర్షిమండల పర్యంతం కృతవారాశేః పౌండరీకాశ్వమేధాది సమస్త క్రతుఫలావాప్త్యర్థం , ఇహజన్మని జన్మాంతరేచ బాల్య యౌవ్వన కౌమారవార్ధకేషు , జాగ్రత్ స్వప్నసుషుప్త్యవస్థాను జ్ఞానతో జ్ఞానతశ్చకామతో కామతః స్వతః ప్రేరణతయా సంభావితానాం , సర్వేషాం పాపానాం అప నోద నార్థంచ గంగా గోదావర్యాది సమస్త పుణ్యనదీ స్నానఫల సిద్ధ్యర్థం , కాశీప్రయాగాది సర్వపుణ్యక్షేత్ర స్నానఫలసిద్ధ్యర్థం , సర్వపాపక్షయార్థం , ఉత్తరోత్తరాభివృద్ధ్యర్థం మేషంగతేరవౌ మహాపవిత్ర వైశాఖమాస ప్రాతః స్నానం కరిష్యే*
---------------------------------------
*సంకల్పము చెప్పుకొనుటకు ముందు చదువవలసిన ప్రార్థనా శ్లోకము*
----------------------------------------
*గంగాగంగేతియోబ్రూయాత్ యోజనానాంశతైరపి*
*ముచ్యతే సర్వపాపేభ్యో విష్ణులోకం సగచ్ఛతి ||*
*పిప్పలాదాత్సముత్పన్నే కృత్యే లోకాభయంకరి*
*మృత్తికాంతే ప్రదాస్యామి ఆహారార్థం ప్రకల్పయ ||*
*అంబత్వద్దర్శనాన్ముక్తిర్నజానే స్నానజంఫలం*
*స్వర్గారోహణ సోపాన మహాపుణ్య తరంగిణి ||*
*విశ్వేశం మాధవండుంఢిం దండపాణీం చ భైరవం*
*వందేకాశీం గుహం గంగాం భవానీం మణికర్ణికాం ||*
*అతితీక్షమహాకాయ కల్పాంత దహనోపమ*
*భైరవాయనమస్తుభ్యం అనుజ్ఞాం దాతుమర్హసి ||*
*త్వంరాజా సర్వతీర్థానాం త్వమేవ జగతః పితా*
*యాచితో దేహిమే తీర్థం సర్వపాపాపనుత్తయే ||*
*యోసౌసర్వగతో విష్ణుః చిత్ స్వరూపీనిరంజనః*
*సేవద్రవ రూపేణ గంగాంభో నాత్రసంశయః ||*
*నందినీ నళినీ సీతా మాలినీ చమహాసగా*
*విష్ణు పాదాబ్జ సంభూతా గంగా త్రిపథ గామినీ ||*
*భాగీరథీ భోగవతీ జాహ్నవీ త్రిదశేశ్వరీ*
*ద్వాదశైతాని నామాని యత్ర యత్ర జలాశయే*
*స్నానకాలేపఠేత్ నిత్యం మహా పాతక నాశనం ||*
*సమస్త జగదాధార శంఖచక్ర గదాధర*
*దేవదేహిమమానుజ్ఞాం తవ తీర్థ నిషేవణే ||*
*నమస్తే విశ్వగుప్తాయ నమో విష్ణుమపాంసతే*
*నమోజలధిరూపాయ నదీనాంపతయే నమః ||*
*మధుసూదన దేవేశ వైశాఖే మేషగేరవౌ*
*ప్రాతఃస్నానం కరిష్యామి నిర్విఘ్నంకురు మాధవ ||*
---------------------------------------
*స్నానం తరువాత ప్రార్థనాశ్లోకాలను చదువుతూ , ప్రవాహానికి యెదురుగా , వాలుగా తీరానికి పరాజ్ముఖముగా కుడిచేతి బొటనవ్రేలుతో నీటిని కదిలించి 3 దోసిళ్ల నీళ్లు తీరానికి జల్లి , తీరానికి చేరి కట్టుబట్టలను పిండుకోవాలి , తరువాత మడి / పొడి బట్టలను కట్టుకొని తమ సాంప్రదాయానుసారం విభూతి వగైరాలని ధరించి సంధ్యావందనం చేసుకోవాలి. తరువాత నదీతీరాన / గృహమున దైవమును అర్చించాలి. స్నానము చేయుచు క్రింది శ్లోకములను చదువుచు శ్రీహరికి - యమునికి అర్ఘ్యమునీయవలెను*
---------------------------------------
*వైశాఖే మేషగే భానౌ ప్రాతఃస్నాన పరాయణః |*
*అర్ఘ్యం తేహం ప్రదాస్వామి గృహాణమధుసూదన ||*
*గంగాయాః సరితస్సర్వాః తీర్థాని చహ్రదాశ్చయే |*
*ప్రగృహ్ణీత మయాదత్త మర్ఘ్యం సమ్యక్ ప్రసీదధ ||*
*ఋషభః పాపినాంశాస్తాత్వం యమ సమదర్శనః |*
*గృహాణార్ఘ్యం మయాదత్తం యథోక్త ఫలదోభవ ||*
---------------------------------------
*దానమంత్రం*
----------------------------------------
*ఏవం గుణవిశేషణ విశిష్టాయాంశుభతిథౌ* *అహం .....గోత్ర, .....నామధేయ ఓం
ఇదం వస్తుఫలం(దానంయిచ్చే వస్తువుని పట్టుకొని) అముకం సర్వ పాపక్షయార్థం , శుభఫలావాప్త్యర్థం అముక ......గోత్రస్య(దానం పుచ్చుకొనేవారి గోత్రం చెప్పాలి) ప్రాచ్యం/నవీనందదామి అనేన భగవాన్ సుప్రీతః సుప్రసన్నః భవతు దాత దానము నిచ్చి అతని చేతిలో నీటిని వదలవలెను*.
------------------------------------
*దాన పరిగ్రహణ మంత్రం*
--------------------------------------
*ఓం ఇదం , ఏతద్ ఓమితిచిత్తనిరోధస్స్యాత్ ఏతదితి కర్మణి ఇదమితి కృత్యమిత్యర్థాత్* *అముకం ......గోత్ర , ....నామధేయః దాతృ సర్వపాప అనౌచిత్య* *ప్రవర్తనాదిక సమస్త దుష్ఫలవినాశార్థం ఇదం అముకం దానం ఇదమితి* *దృష్ట్యాన అముకమితి వస్తు నిర్దేశాదిత్యాదయః పరిగృహ్ణామి* *స్వీగృహ్ణామి దానమును తీసికొనవలయును*
-------------------------------------
*నదీస్నానమాచరించే సమయములో చదువవలసిన మంత్రము*
-------------------------------------
*పిప్పలాద సముత్పన్నే కృత్యే లోక భయంకరీ*
*సైకదం తే మయా దత్తం ఆహారార్తం ప్రకల్పితం*
---------------------------------------
*మృత్తికా లేపన మంత్రం*
----------------------------------------
*అశ్వక్రాంతే రథక్రాంతే విష్ణుక్రాంతే వసుంధరే మృత్తికే హరమే పాపం యన్మయా దుష్కృతం కృతం*
----------------------------------------
*స్నానమాచరించే సమయములో స్నానానుజ్ఞ మంత్రము*
---------------------------------------
*ఉధృతాపి వరాహేన కృష్ణేన శతబాహునా ఆరుహ్య మమగాత్రాణి సర్వం పాపం ప్రమోచయ పుణ్యందేహి మహాభాగే స్నానానుజ్ఞాం కురుష్వమాం*
---------------------------------------
*నదిలో నాభివరకు దిగినతరువాత పఠించవలసిన మంత్రము*
--------------------------------------
*గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతీ*
*నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు*
---------------------------------------
*నందినీ నళినీ సీతా మాలినీచ మహాపగా*
*విష్ణు పాదాబ్జ సంభూతాం గంగా త్రిపధగామినీ*
*భాగీరధీ భోగవతీ జాహ్నవీ త్రిదశేశ్వరీ*
*ద్వాదశైతాని నామాని యత్ర యత్ర జలాశయే*
*స్నాన కాలే పటేన్నిత్యం మహాపాతక నాశనం*
----------------------------------------
*స్నానమాచరించే సమయములో తలుచుకోవలసిన నామాలు*
----------------------------------------
*పావని,హ్రదిని,నళిని,సీత,సుచెక్షువు,సింధువు,గంగ,పద్మావతి,భోగవతి,స్వర్ణరేఖ,కౌశికి,దక్ష, పృధివి,సుభగా,విశ్వకాయ,శివామృత,*
*విద్యాధరి,సుప్రసన్న,లోకప్రసాదిని,క్షేమ, వైష్ణవి,శాంతిదా,గోమతి,సతి,సావిత్రి,తులసి, దుర్గ,మహాలక్ష్మి,సరస్వతి,రాధిక,లోపాముద్రా, దితి,రతి,అహల్యా,అదితి,సంఙ్ఞ,స్వధా, స్వాహా,అరుంధతి, శతరూపా,దేవహూతి.*
---------------------------------------
*వైశాఖ మాసం విశిష్టత*
--------------------------------------
*వైశాఖ మాసానికి మరో పేరు మాధవ మాసం. మాసాలన్నింట్లో వైశాఖమాసం ఉత్తమమైనది. విశేషదానాలకి ఎంతో పుణ్య ప్రదమైన మాసంగా పురాణాలలో చెప్పబడింది. శ్రీ మహా విష్ణువు కు ప్రీతి కరమైన ఈ వైశాఖ మాసం లో తులసి దళాలతో శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవితో కలిపి పూజించిన వారికి ముక్తి దాయకం. ఈ మాసం లో ఏక భుక్తం , నక్తం అయాచితం గా భుజించడం ఉత్తమం గా చెప్పబడింది. వైశాఖ మాసం దేవతలతో సహా అందరికీ పూజనీయమైనది. యజ్ఞాలకు , తపస్సులకు పూజాదికాలకు , దాన ధర్మాలకు ఎంతో ఎక్కువ ఫలమిచ్చి శాంతినిచ్చి కోరికలను తీరుస్తుంది.ఎవరైతే ఈ మాసం లో సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేస్తారో , వారికి ఉత్తమగతులు కలుగుతాయి. ఉదయాన్నే స్నానం చేసి ఎక్కువ నీటి తో రావి చెట్టు మొదళ్ళను తడిపి ప్రదక్షిణాలు చేస్తే పూర్వీకులంతా తరిస్తారు. ఈ మాసం లో శివునికి ధారపాత్ర ద్వారా అభిషేకం జరిగేలా ఏర్పాటు చేయడం శుభ ఫలితాలనిస్తుంది.మన సంస్కృతి ఉత్కృష్టమైనది. మనకు ఈ ప్రకృతి.. అందులోని చరాచరాలన్ని పూజనీయాలే ! అంతేకాకుండా మనం కాలగణనకు ఉపయోగించే తిథులు , నక్షత్రాలు , వారాలు , మాసాలు అన్నీ ఎంతో గొప్పదనాన్ని , ప్రత్యేకతను సంతరించుకున్నటువంటివే. చాంద్రమానం పాటించే మనకు చైత్రం మొదలుకుని ఫాల్గుణం వరకు పన్నెండు నెలలు ఉన్నాయి. ఒక్కో మాసానికి ఒక్కో ప్రత్యేకత , విశిష్టత ఉన్నాయి.కార్తీక మాఘమాసాల తర్వాత అంతటి మహత్యాన్ని స్వంతం చేసుకున్న పుణ్యప్రదమైన మాసం వైశాఖం. ఈ నెలలోనే పూర్ణిమ తిథినాడు విశాఖ నక్షత్రం ఉండడం వల్ల ఈ మాసానికి వైశాఖమాసం అనే పేరు ఏర్పడింది.ఆద్యాత్మికత , పవిత్రత , దైవశక్తి ఉన్న నెలల్లో వైశాఖమాసానికి ప్రత్యేక స్థానం ఉంది.ఇది శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాకరమైన నెల. అందువల్లనే వైశాఖమాసానికి మాధవమాసం అని పేరు.అత్యంత పవిత్రమైన మాసంగా పేరు పొందిన వైశాఖమాస మాహత్మ్యంను పూర్వం శ్రీమహావిష్ణువు స్వయంగా శ్రీమహాలక్ష్మికి వివరించినట్టు పురాణాలు పేర్కొంటున్నాయి. అత్యంత పవిత్రమైన మాసంగా చెప్పబడుతూ ఉన్న వైశాఖమాసంలో ప్రతి దినమూ పుణ్యదినమే. అటువంటి ముప్పై పుణ్యదినాలు కలిగిన ఈ మాసంలో ఆచరించాల్సిన విధులు పురాణా గ్రంధాల్లో వివరించబడ్డాయి.ముఖ్యంగా స్నాన , పూజ , దానధర్మాల వంటి వాటిని ఈ నెలలో ఆచరించడం వల్ల మానవుడికి ఇహలోకంలో సౌఖ్యం , పరలోకంలో మోక్షం సిద్ధిస్తాయని పురాణ కథనం.వైశాఖమాసంలో నదీ స్నానం ఉత్తమమైనదిగా చెప్పబడింది. అందుకు అవకాశం లేని స్థితిలో గంగ , గోదావరి వంటి పుణ్యనదులను స్మరించుకుంటూ*
----------------------------------------
*కాలువల్లోగానీ , చెరువులోగాని , బావుల వద్దగానీ అదీ కుదరకపోతే ఇంట్లోనే స్నానం చేయాలి నీటియందు సకల దేవతలు కొలువుతీరి ఉంటారని పురాణాలు* *చెబుతున్నాయి.వైశాఖమాసంలో సూర్యుడు మేషరాశిలో సంచరిస్తూ ఉంటాడు. కనుక ఎండలు అధికంగా ఉండి మానవులను ఇబ్బందులను గురిచేస్తూ ఉంటాయి.*
*కనుక వేడిమినుంచి ఉపసమనం కలిగించేవాటిని దానం ఇవ్వాలనేది శాస్త్రవచనం , నీరు , గొడుగు , విసనకర్ర , పాదరక్షలు వంటివి దానం చేయడం శ్రేష్టం. అట్లే దాహంతో ఉన్నవారికి మంచినీటిని ఇవ్వడం , చలివేంద్రాలను ఏర్పాటు చేయడం వల్ల దేవతానుగ్రహం కలుగుతుంది.*
*సంధ్యావందనాలు ఆచరించడంతో పాటు శ్రీమహావిష్ణువును తులసీదళాలతో పూజించవలెను. శ్రీమహావిష్ణువు వైశాఖమాసం మొదలుకొని మూడునెలలపాటూ ఈ భూమి మీద విహరిస్తూ ఉంటాడు.*
-------------------------------------
*అతనికి అత్యంత ప్రీతికరమైన తులసీదళములతో అర్చించడం వల్ల సంతుష్టుడై సకల సౌభాగ్యాలను, సౌఖ్యాన్ని ప్రసాదిస్తాడని చెప్పబడుతున్నది.*
---------------------------------------
*’వైశాఖే మాధవో, రాధో’*
---------------------------------------
*ఈ మాసంలో విష్ణుస్మరణతో, అభీష్ట దేవతారాధనతో నియమపాలన చేయడం ఇహ పర శ్రేయస్సునిస్తుందని పురాణాలు చెప్తున్నాయి. వైశాఖమాసాన్ని మహిమాన్వితమైన దివ్యమాసంగా శాస్త్రాలు వర్ణించాయి. ఈ మాసాన ప్రాతః కాలాన లేచి మధుసూదనుని స్మరిస్తూ స్నానం చేయడం విశేష ఫలప్రదం.*
----------------------------------- *ప్రాతః సనియమ స్నాన్యే ప్రీయతాం మధుసూదనః!*
*అదే విధంలో*
---------------------------------------
*"మాధవే మేషగే భానౌ మురారే మధుసూదన*
*ప్రాతః స్నానేన మే నాథ ఫలదోభవ పాపహన్.*
----------------------------------------
*అనే ప్రార్థనతో తీర్థాదులలో చేసిన స్నానం దివ్యఫలాన్నిస్తుంది.*
---------------------------------------
*తులసీ కృష్ణ గౌరాభ్యాం తయాభ్యర్చ్య మధుద్విషమ్!*
*విశేషేణ తు వైశాఖే నరో నారాయణో భవేత్!!*
--------------------------------------
*మాధవం సకలం మాసం తులస్యాయోర్చయే న్నరః!*
*త్రిసంధ్యం మధుహంతారం తస్యనాస్తి పునర్భవః!!*
--------------------------------------
*వైశాఖమాసమంతా శ్రీ మహావిష్ణువును తులసీ దళాలతో అర్చించితే శ్రేష్ఠం.*
------------------------------------
*ప్రాతః స్నానానంతరం అధికజలంతో అశ్వత్థ (రావి) వృక్షపు మూలాన్ని తడిపి ప్రదక్షిణలు చేస్తే పూర్వీకులంతా తరిస్తారు.*
----------------------------------------
*ఈ మాసంలో ఒంటిపూట భోజనం లేదా నక్తం (పగలంతా ఉపవసించి రాత్రి ప్రారంభంలో భుజించడం) ఆచరించడం మంచిది.ఈ మాసంలో చలివేంద్రాలు, పళ్ళరసాలు, మజ్జిగ వంటి పానీయాల శాలలని నిర్వహించడం, విసనకర్రలు, గొడుగులు, పాదరక్షలు దానం చేయడం పుణ్యఫలాన్నిస్తుంది.* --------------------------------------- *వైశాఖ పురాణం ప్రారంభo* ---------------------------------------- *వైశాఖ పురాణము లోని అధ్యాయములు*
------------------------------------- *1 . వైశాఖమాస ప్రశంస*
*2 . వైశాఖ మాసమున చేయవలసిన వివిధ దానములు - వాటి ఫలితములు*
*3 . వివిధ దానములు - వాటి మహత్యములు*
*4 . వైశాఖ ధర్మ ప్రశoస*
*5 . వైశాఖమాస విశిష్టత౮
*6 . జలదాన మహత్యము - గృహగోధికా కథ*
*7 . వైశాకమాస దానములు*
*8 . పిశాచ మోక్షము*
*9 . సతీదేహ త్యాగము*
*10 . దక్షయజ్ఞనాశము కామదహనము*
*11 . రతి దుఃఖము - దేవతల ఊరడింపు*
*12 . కుమార జననము*
*13 . అశూన్య శయన వ్రతము*
*14 . ఛత్రదాన మహిమ*
*15 . వైశాకవ్రత మహిమ*
*16 . యముని పరాజయము*
*17 . యమదుఃఖ నిరూపణము*
*18 . విష్ణువు యముని ఊరడించుట*
*19 . పిశాచత్వ విముక్తి*
*20 . పాంచాలరాజు రాజ్యప్రాప్తి*
*21. పాంచాలరాజు సాయుజ్యము*
*22 . దంతిల కోహల శాపవిముక్తి*
*23 . కిరాతుని పూరజన్మ*
*24 . వాయుశాపము*
*25 . భాగవత ధర్మములు*
*26 . వాల్మీకి జన్మ*
*27 . కలిధర్మములు - పితృముక్తి*
*28 . అక్షయతృతీయ విశిష్టత*
*29 . శునీ మోక్షప్రాప్తి*
*30 . పుష్కరిణి - ఫలశ్రుతి--------------------------------------- *వైశాఖ పురాణం - 1 వ అధ్యాయము*
----------------------------------------
*వైశాఖమాస ప్రశంస:*
----------------------------------------
*నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం |*
*దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత్ ||*
--------------------------------------
*సూతమహర్షి శౌనకాది మహర్షులనుద్దేశించి యిట్లు పలికెను. మహర్షులారా! వినుడు రాజర్షియగు అంబరీషుడు బ్రహ్మ మానసపుత్రుడగు నారదుని జూచి నమస్కరించి మహర్షీ! మీరు అన్ని మాసముల మహత్త్వమును వివరించిరి. అన్ని మాసముల యందును వైశాఖ మాసము మిక్కిలి యుత్తమమైనది. శ్రీమహావిష్ణువునకు మిక్కిలి ప్రీతి పాత్రమైనదని చెప్పినారు. వైశాఖమాసము శ్రీమహావిష్ణువునకు యిష్టమగుటకు కారణమేమి? ఈ మాసమునందు విష్ణుప్రియములైన ధర్మములేవి? మానవు లాచరింవలసిన దానములను, వాని ఫలములను వివరింపగోరుచున్నాను. పూజ, దానము మున్నగు వానిని యే దైవము నుద్దేశించి చేయవలయును? వాని ఫలమెట్టిది? పూజాద్రవ్యములెట్టివి? మున్నగు విషయములను దయయుంచి వివరింపగోరుచున్నానని సవినయముగ ప్రశ్నించెను.*
----------------------------------------
*నారదుడనేను రాజర్షీ! అంబరీషా! వినుమని యిట్లు పలికెను. పూర్వమొకప్పుడు నేను బ్రహ్మను మాసముల మహిమను మాస ధర్మములను వివరింపగోరితిని. బ్రహ్మయు 'నారదా! శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవికి మాసధర్మములను చెప్పుచుండగ వింటిని. నీకిప్పుడు శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవికి చెప్పిన విషయమునే చెప్పుదును. మాసములన్నిటిలోను కార్తికము, మాఘము, వైశాఖము ఉత్తమములు. ఆ మూడు మాసములలో వైశాఖమాసము మిక్కిలి ఉత్తమము. వైశాఖము ప్రాణులకు తల్లివలె సదా సర్వాభీష్టములను కలిగించును. ఈ మాసమందాచరించిన స్నానము, పూజ, దానము మున్నగునవి పాపములన్నిటిని నశింపజేయును. ఈ మాసమున చేసిన స్నాన, పూజా, జప, దానాదులను దేవతలు సైతము తలవంచి గౌరవింతురు. విద్యలలో వేదవిద్యవలె, మంత్రములలో ఓంకారమువలె, వృక్షములలో దివ్యవృక్షమైన కల్పవృక్షము వలె, ధేనువులలో కామధేనువువలె, సర్వసర్పములలో శేషునివలె, పక్షులలో గరుత్మంతునివలె, దేవతలలో శ్రీమహావిష్ణువువలె, చతుర్వర్ణములలో బ్రాహ్మణునివలె యిష్టమైన వానిలో ప్రాణమువలె, సౌహార్దములు కలవారిలో భార్యవలె, నదులలో గంగానది వలె, కాంతి కలవారిలో సూర్యుని వలె, ఆయుధములలో చక్రమువలె, ధాతువులలో సువర్ణమువలె, విష్ణుభక్తులలో రుద్రునివలె, రత్నములలో కౌస్తుభమువలె, ధర్మహేతువులగు మాసములలో వైశాఖమాసముత్తమమైనది*
--------------------------------------
*విష్ణుప్రియమగుటచేతనే వైశాఖమాసమును మాధవమాసమనియునందురు. విష్ణుప్రీతిని కలిగించు మాసములలో వైశాఖమాసమునకు సాటియైనదిలేదు. సూర్యుడు మేషరాశియందుండగా వైశాఖమున సూర్యోదయమునకు ముందుగ నదీ తటాకాదులలో స్నానమాచరించినచో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో గలసి అతిప్రీతితో వానినుద్దరింపనెంచును. ప్రాణులు అన్నమును తిని సంతోషమునందినట్లు శ్రీమహావిష్ణువు వైశాఖ స్నానమాచరించిన వారి విషయమున సంప్రీతుడగుచున్నాడు. అట్లు వైశాఖ స్నానమాచరించినవారికి అన్ని వరముల నీయ సిద్దమై యున్నాడు. వైశాఖమాసమున ఒకసారి మాత్రమే స్నానమును, పూజను చేసినను, పాప విముక్తుడై విష్ణులోకమును చేరుచున్నాడు. వైశాఖమున వారమునాళ్లు స్నానాదికమును చేసినను ఈ మాత్రమునకే శ్రీహరియనుగ్రహ బలమున, కొన్నివేల అశ్వమేధయాగములను చేసినచో వచ్చునంతటి పుణ్యమునందును. స్నానము చేయు శక్తి లేక, స్నాన సంకల్పము దృఢముగనున్నచో నతడు నూరు అశ్వమేధయాగములు చేసినంత పుణ్యము నందును. సూర్యుడు మేషరాశిలోనుండగా వైశాఖస్నానము నది/ఏరులో చేయవలెనని సంకల్పించిన వాడై అశక్తుడై యున్నను, కొంతదూరమైనను యింటి నుండి ప్రయాణమైన వాడు వైశాఖమున నదీ స్నాన సంకల్పము దృఢముగనున్నచో విష్ణు సాయుజ్యము నందును.*
-------------------------------------
*అంబరీష మహారాజా! సర్వలోకములయందున్న తీర్థ దేవతలు బాహ్యప్రదేశముననున్న జలము నదియైనను, తటాకమైనను, సెలయేరైనను, అందుచేరియుండును. జీవి చేసిన సర్వపాపములను, జీవి అట్టిజలమున పవిత్ర స్నానమాచరించు వరకును, యముని యాజ్ఞననుసరించి జీవి సూక్ష్మ శరీరముననుసరించి రొద చేయుచుండును. జీవి వైశాఖమున అట్టి బాహ్యప్రదేశమున నున్న జలమున స్నానమాచరింపగనే ఆ జలమునధిష్టించి యున్న సర్వతీర్థ దేవతల శక్తి వలన ఆ జీవి చేసిన సర్వపాపములు హరించును. సర్వతీర్థదేవతలు సూర్యోదయమును మొదలుకొని ఆరు ఘడియల వరకు బాహ్య ప్రదేశమునందున్న ఆ నదీ జలమునాశ్రయించి యుండును. ఆ జలమున తామున్న సమయమున స్నానమాచరించిన వారికి హితమును కలిగింతురు. చేయనివారిని శాపాదులచే నశింపచేయుదురు. వారు శ్రీ మహావిష్ణువు ఆజ్ఞననుసరించి యిట్లు చేయుదురు. సూర్యోదయమైన ఆరు ఘడియల తరువాత తీర్థ దేవతలు తమ తమ స్థానములకు పోవుదురు. మరల సూర్యోదయమునకు ముందుగా బాహ్య ప్రదేశమందున్న జలము నావహించి స్నానమాడిన వారి పాపముల నశింప జేయుచుందురు.
*వైశాఖ పురాణం ఒకటవ అధ్యాయము సంపూర్ణము*