గత 24 గంటల్లో 15.37 లక్షల పరీక్షలతో వారపు పాజిటివిటీ శాతం 18.17%కు తగ్గుదల
గత 26 రోజులలో మొదటి సారిగా రోజువారీ కొత్త కోవిడ్ కేసులు 3 లక్షల దిగువకు పడిపోవటం ఆశాజనక పరిణామం. గత 24 గంటల్లో 2,81,386 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి.ఈ నెల 9 వ తేదీ నూమ్చి కొత్త కెసులు తగ్గిముఖం పట్టటాన్ని ఈ దిగువ చిత్రపటం చూపుతుంది..

వారపు పాజిటివిటీ శాతం తగ్గటాన్ని ప్రతిబింబిస్తూ ఈరోజు 18.17% నమోదైనట్టు క్రింది చిత్రపటం చూపుతోంది. గత 24 గంటలలో జరిపిన కోవిడ్ నిర్థారణ పరీక్షలు 15,73,515 కాగా, ఇప్పటిదాకా దేశమంతటా జరిపిన మొత్తం పరీక్షలు 31,64,23,658

రాష్ట్రాలవారీగా అత్యధిక స్థాయిలో పాజిటివ్ కెసులు నమోదవుతున్న జిల్లాల వివరాలు ఈ క్రింది పట్టికలో ఉన్నాయి. కర్నాటకలో అత్యధికంగా 27 జిల్లాల్లో 20% పైగా పాజిటివిటీతో కేసులు ఎక్కువగా వస్తుండగా మధ్య ప్రదేశ్ లో అత్యధిక సంఖ్యలో 38 జిల్లాల్లో 10% మించి పాజిటివిటీ నమోదవుతోంది.

దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా కోవిడ్ బారినుంచి కోలుకున్నవారి సంఖ్య 2,11,74,076కు చేరింది. అందువలన జాతీయ స్థాయి కోలుకున్నవారి శాతం 84.81% అయింది. గత 24 గంటలలో 3,78,741 మంది కోలుకున్నారు. అదే సమయంలో కొత్త కేసులకంటే కోలుకున్నవారు ఎక్కువగా ఉండటం గత 7 రోజుల్లో 6 సార్లు కాగా వరుసగా నాలుగురోజులుగా ఈ పరిస్థితి కొనసాగుతోంది.

కొత్తగా కోలుకున్నవారిలో 71.35% మంది పది రాష్ట్రాలకు చెందినవారు.

మరోవైపు దేశంలో చికిత్సపొందుతున్న కోవిడ్ బాధితుల సంఖ్య తగ్గి 35,16,997 కు చేరింది. ఇది మొత్తం పాజిటివ్ కేసులలో 14.09%. గత 24 గంటలలో చికిత్సపొందుతూ ఉన్నవారి సంఖ్య నికరంగా 1,01,461 కేసుల తగ్గుదల నమొదు చేసుకుంది. ఇందులో పది రాష్ట్రాల వాటా 75.04% ఉంది.

దేశవ్యాప్తంగా మూడో విడత టీకాల కార్యక్రమం కూదా మొదలవటంతో ఇప్పటిదాకా ఇచ్చిన మొత్తం కోవిడ్ డోసులు దాదాపు 18.30 కోట్లకు చేరాయి.
ఈ రోజు ఉదయం 7 గంటలవరకు అందిన తాత్కాలిక నివేదిక ప్రకారం మొత్తం 18,29,26,460 డోసులను 26,68,895 శిబిరాల ద్వారా పంపిణీచేశారు. అందులో ఆరోగ్య సిబ్బందికిచ్చిన 96,45,695 మొదటి డోసులు, 66,43,661 రెండో డోసులు, కోవిడ్ యోధులకిచ్చిన 1,44,44,096 మొదటి డోసులు, 81,96,053 రెండో డోసులు, 18-44 వయోవర్గం వారికిచ్చిన 52,64,073 మొదటి డోసులు, 45-60 వయోవర్గానికిచ్చిన 5,72,78,554 మొదటి డోసులు, 91,07,311 రెండో డోసులు, 60 పైబడ్డవారికిచ్చిన 5,45,15,352 మొదటి డోసులు, 1,78,01,891 రెండో డోసులు ఉన్నాయి.
| ఆరోగ్య సిబ్బంది | మొదటి డోస్ | 96,45,695 | 
| రెండో డోస్ | 66,43,661 | |
| కోవిడ్ యోధులు | మొదటి డోస్ | 1,44,44,096 | 
| రెండో డోస్ | 81,96,053 | |
| 18-44 వయోవర్గం | మొదటి డోస్ | 52,64,073 | 
| 45 -60వయోవర్గం | మొదటి డోస్ | 5,72,78,554 | 
| రెండో డోస్ | 91,07,311 | |
| 60 పైబడ్డవారు | మొదటి డోస్ | 5,45,15,352 | 
| రెండో డోస్ | 1,78,31,665 | |
| 
 | మొత్తం | 18,29,26,460 | 
దేశంలో ఇప్పటివరకు ఇచ్చిన మొత్తం టీకా డోసులలో పది రాష్టాలవాటా 66.73% ఉంది.

18-44 వయోవర్గానికి చెందిన 4,35,138 మంది లబ్ధిదారులు గత 24 గంటలలో మొదటి డోస్ అందుకున్నారు. దీంతో 33 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో ఈ వయోవర్గంలో టీకాలు తీసుకున్నవారి మొత్తం సంఖ్య 52,64,073 కు చేరింది. ఆ సమాచారం ఈ క్రింది పట్టికలో ఉంది.
| సంఖ్య | రాష్ట్రం | మొత్తం | 
| 1 | అండమాన్, నికోబార్ దీవులు | 1,181 | 
| 2 | ఆంధ్రప్రదేశ్ | 3,443 | 
| 3 | అస్సాం | 2,29,233 | 
| 4 | బీహార్ | 7,36,144 | 
| 5 | చండీగఢ్ | 2,078 | 
| 6 | చత్తీస్ గఢ్ | 1,028 | 
| 7 | దాద్రా, నాగర్ హవేలి | 4,291 | 
| 8 | డామన్, డయ్యూ | 4,703 | 
| 9 | ఢిల్లీ | 6,39,929 | 
| 10 | గోవా | 7,929 | 
| 11 | గుజరాత్ | 5,12,290 | 
| 12 | హర్యానా | 4,55,205 | 
| 13 | హిమాచల్ ప్రదేశ్ | 14 | 
| 14 | జమ్మూకశ్మీర్ | 31,204 | 
| 15 | జార్ఖండ్ | 1,09,245 | 
| 16 | కర్నాటక | 1,14,539 | 
| 17 | కేరళ | 2,398 | 
| 18 | లద్దాఖ్ | 570 | 
| 19 | మధ్యప్రదేశ్ | 1,81,735 | 
| 20 | మహారాష్ట్ర | 6,52,119 | 
| 21 | మేఘాలయ | 5,712 | 
| 22 | నాగాలాండ్ | 4 | 
| 23 | ఒడిశా | 1,40,558 | 
| 24 | పుదుచ్చేరి | 3 | 
| 25 | పంజాబ్ | 6,959 | 
| 26 | రాజస్థాన్ | 8,16,241 | 
| 27 | సిక్కిం | 350 | 
| 28 | తమిళనాడు | 32,645 | 
| 29 | తెలంగాణ | 500 | 
| 30 | త్రిపుర | 2 | 
| 31 | ఉత్తరప్రదేశ్ | 4,15,179 | 
| 32 | ఉత్తరాఖండ్ | 1,22,916 | 
| 33 | పశ్చిమ బెంగాల్ | 33,726 | 
| మొత్తం | 52,64,073 | |
గత 24 గంటలలో దాదాపు 7 లక్షల టీకా డోసుల పంపిణీ జరిగింది. టీకాలు మొదలైన 121వ రోజైన మే 16 నాడు 6,91,211 టీకాలు 6,068 శిబిరాల ద్వారా ఇవ్వగా అందులో 6,14,286 మంది లబ్ధిదారులు మొదటి డోస్, 76,925 మంది రెండో డోస్ తీసుకున్నారు.
తేదీ: మే 16, 2021 (121వ రోజు)
| ఆరోగ్య సిబ్బంది | మొదటి డోస్ | 3,270 | 
| రెండవ డోస్ | 2,395 | |
| కోవిడ్ యోధులు | మొదటి డోస్ | 18,168 | 
| రెండవ డోస్ | 9,077 | |
| 18-44 వయోవర్గం | మొదటి డోస్ | 4,35,138 | 
| 45 -60 వయోవర్గం | మొదటి డోస్ | 1,13,616 | 
| రెండవ డోస్ | 37,979 | |
| 60 పైబడ్డవారు | మొదటి డోస్ | 44,094 | 
| రెండవ డోస్ | 27,474 | |
| మొత్తం | మొదటి డోస్ | 6,14,286 | 
| రెండవ డోస్ | 76,925 | 
తాజాగా నిర్థారణ అయిన కరోనా కేసుల్లో 75.95% పది రాష్ట్రాలకు చెందినవే కాగా మహారాష్ట్రలో అత్యధికంగా 34,389 కేసులు, ఆ తరువాత స్థానంలో ఉన్న తమిళనాడులో 33,181 కేసులు నమోదయ్యాయి.

జాతీయ స్థాయిలో మరణాల శాతం 1.10% గా నమోదంది. గత 24 గంటలలో 4,106 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. అందులో పది రాష్ట్రాల వాటా 75.38% ఉండగా మహారాష్ట్రలో అత్యధికంగా ఒక్క రోజులో 974 మంది, కర్నాటకలో 403 మంది కోవిడ్ తో చనిపోయారు .

విదేశీ సాయానికి తోడుగా సహాయ సామగ్రిని అత్యంత వేగంగా రాష్టాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇప్పటిదాకా దాకా మొత్తం 11,058 ఆక్సిజెన్ కాన్సంట్రేటర్లు; 13,496 ఆక్సిజెన్ సిలిండర్లు; 19 ఆక్సిజెన్ తయారీ ప్లాంట్లు; 7,365 వెంటిలేటర్లు; దాదాపు 5.3 లక్షల రెమిడిసెవిర్ ఇంజెక్షన్లు రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు పంపిణీ జరిగాయి. రోడ్డు, వాయు మార్గాల ద్వారా ఈ పంపిణీ కొనసాగుతోంది.
No comments:
Post a Comment