Adsense

Tuesday, August 3, 2021

నోములు - వ్రతాలు - 1 పూర్ణాదివారముల నోము కథ



☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️

ఒకానొక రాజకూతురు గర్భముతో దుఃఖించుచుండెను. ఆమెకు ఏడుగురు పిల్లలు పుట్టిరి. వారందరూ పుట్టిన వెంటనే చనిపోయిరి. ఆ దుఃఖమును భరించలేక ఆమె ఘోరారణ్య మధ్యమునకేగి పార్వతీ పరమేశ్వరులను ప్రార్ధించుచుండెను. అంత నొకనాడు పార్వతీపరమేశ్వరులు ఆమెకు ప్రత్యక్షమై *“కుమారీ నీ వెందుల కిట్లు దుఃఖించుచున్నావు?”* అని అడిగిరి. అందుకామె *“ స్వామీ ! పుట్టి చచ్చిపోతున్న బిడ్డలతో పడలేక ఏడ్చుచున్నాను ,”* అని బదులు చెప్పెను. ఆ సంగతివిని వారు జాలిబడి *“ అమ్మాయీ ! నీవు క్రిందటి జన్మలో పూర్ణాదివారముల నోము నోచి దానిని ఉల్లంఘన చేసితివి. అందుచే నీకీ జన్మలో ఇట్టి దుఃఖము సంప్రాప్తమయ్యెను. ఇప్పటికైనా నీవా నోము సక్రమముగా నోచి , కథ చెప్పుకొని అక్షతలు శిరస్సుపై వేసుకొనినయడల నీకీ దుఃఖము కలుగదు”* అని వెడలిపోయిరి. వారి మాట ప్రకారము రాజకుమార్తె ఇంటికి వెళ్ళి పూర్ణాదివారముల నోమునోచి యధావిధిగా దానిని నిర్వర్తించెను. అప్పటినుండి ఆమెకు గర్భశోకము లేకుండెను. 

*దీనికి ఉద్యాపనము:*

ప్రతీ ఆదివారమూ పై కథ చెప్పుకొని అక్షతలు శిరస్సుపై వేసుకొని , ఒంటిపూట భోజనము చేయవలెను. మరియు నొక ముత్తయిదువునకు అభ్యంగన స్నానము చేయించి ఐదు మానికల బియ్యమును , పూర్ణపు ఉండ్రములను , దక్షిణ తాంబూలములతో వాయనమీయవలెను. కథలో లోపము వచ్చిననూ వ్రతములో లోపము రాకూడదు.

No comments: