ప్రతి మాసంలో వచ్చే పౌర్ణమి ప్రత్యేకతను కలిగి ఉంటుంది. పౌర్ణమి రోజున చేసే పూజాభిషేకాలు వలన లభించే ఫలితం కూడా అధికంగా ఉంటుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.
అలాంటి పౌర్ణమిలలో భాద్రపద పౌర్ణమి మరింత విశిష్టతను సంతరించుకుని కనిపిస్తుంది. ఈ రోజున శివపార్వతులను సేవించడం వలన , విశేషమైన ఫలితాలు లభిస్తాయని స్పష్టం చేయబడుతోంది.
అందువల్లనే ఈ రోజున *'ఉమామహేశ్వర వ్రతం'* ఆచరించాలని చెప్పబడుతోంది. ఉమా మహేశ్వరులను లోకానికి తల్లిదండ్రులుగా భావించి పూజించడం జరుగుతుంటుంది. పాపాలను నశింప జేసి .. పుణ్యలోకాలను ప్రసాదించేవాడు శివుడైతే , సంతాన సౌభాగ్యాలను అనుగ్రహించే అమ్మగా పార్వతీదేవి కనిపిస్తుంది. అలాంటి ఆది దంపతులను ఏ రోజున పూజించినా .. స్మరించినా ఆశించిన ఫలితాలు అందుతాయి.
అయితే ముఖ్యంగా భాద్రపద పౌర్ణమి రోజున *ఉమామహేశ్వరులను వ్రత విధానం* ద్వారా పూజించడం వలన , ఆదిదంపతులు మరింత ప్రీతి చెందుతారని అంటారు. ఈ రోజున నియమ నిష్ఠలను పాటిస్తూ .. అత్యంత భక్తి శ్రద్ధలతో ఉమా మహేశ్వరులను ఆరాధించడం వలన సకల సంపదలు ప్రాప్తిస్తాయనీ .. సకల శుభాలు కలుగుతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు స్పష్టం చేస్తున్నాయి...స్వస్తి..🚩🌞🙏🌹🎻
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
No comments:
Post a Comment