Adsense

Friday, September 24, 2021

కాకులను తాత, ముత్తాతల ప్రతిరూపంగా ఎందుకు భావిస్తారు..! హిందూ శాస్త్రం ఏం చెబుతోంది..?


పితృపక్షం ప్రారంభమైంది. ఇది అక్టోబర్ 6 వరకు కొనసాగుతుంది. పితృపక్షంలో కాకికి చాలా ప్రాముఖ్యత ఉంది.

 హిందూ సంప్రదాయం ప్రకారం.. కాకులను పూర్వీకుల రూపంగా భావిస్తారు. పిండప్రదానం చేసేటప్పుడు కాకి వెనుక భాగంలో కూర్చుంటే చాలా శుభసూచకమని నమ్ముతారు. ఎందుకంటే మన పూర్వీకులు మన కుటుంబాన్ని ఆశీర్వదించినట్లుగా చెబుతారు.

కాకిని పూర్వీకుల రూపంగా ఎందుకు భావిస్తారు..?
కాకికి సంబంధించిన ఒక కథ త్రేతాయుగం నాటిది. ఇంద్రుని కుమారుడు జయంత్ కాకి రూపంలో సీత కాలికి గాయం చేస్తాడు. ఇది చూసిన రాముడు కాకి కన్ను పొడిచేస్తాడు. తర్వాత జయంత్ తన తప్పును గ్రహించి శ్రీరాముడిని క్షమాపణ కోరుతాడు. అప్పుడు రాముడు అతడిని క్షమించి ఈ రోజు తర్వాత మీకు ఇచ్చిన ఆహారం పూర్వీకులు అందుకుంటారని చెబుతాడు. అప్పటి నుంచి కాకిని పూర్వీకుల రూపంగా భావిస్తారు. అలాగే మరో కథ కూడా ఉంది. 

కాకిని యముడి వాహనంగా భావిస్తారు. అయితే మీరు పెట్టే ఆహారం కాకి తింటే యముడు చాలా సంతోషిస్తాడని, పితృ దోష నివారణ కలిగి అన్ని సమస్యల నుంచి విముక్తి ప్రసాదిస్తాడని నమ్ముతారు.

కాకి కనిపించకపోతే ఏం చేయాలి..?
పర్యావరణ ప్రభావం ఇప్పుడు జంతువులు, పక్షులపై కూడా కనిపిస్తుంది. చాలా పక్షులు అంతరించిపోతున్నాయి. కాకి కూడా ఇప్పుడు అరుదుగా కనిపిస్తుంది. అటువంటి పరిస్థితిలో పెద్దలకు పిండ ప్రదానం చేసేటప్పుడు కాకి కనిపించకపోతే ఏం చేయాలి.. అనే ప్రశ్న అందరిలో మెదులుతుంది. ఈ విషయంలో జ్యోతిష్యులు ఏం చెబుతున్నారంటే ఒకవేళ కాకి రాకపోతే కనిపించిన పక్షికి ఆహారం పెట్టవచ్చని చెబుతున్నారు...సేకరణ..

No comments: