Adsense

Monday, October 4, 2021

అంజనాద్రి

అంజనాద్రి
  
తిరుమల ప్రాంతాలలోని అడవులలో నివసిస్తూ తపస్సు చేసుకునే దైవభక్తులు కేసరి , అంజనాదేవి దంపతులు. 

పవిత్ర ఆకాశగంగ పవిత్ర ఒడ్డున 
దీర్ఘ తపస్సు చేస్తున్న ఆంజనాదేవిపై కరుణతో
వాయు భగవానుడు  నిత్యమూ ఒక ఫలాన్ని ప్రసాదంగా
యిస్తూవుండేవాడు. 

ఆ వరప్రసాద ఫలాల మహిమ వలన అంజనాదేవికి  వానరరూపంలో ఒక మగ బిడ్డ జన్మించాడు.
అతిబలాఢ్యుడైన ఆ బాలుడు జన్మిస్తూనే
అప్పుడే ఉదయిస్తున్న సూర్యుని చూసి అదొక ఎఱ్ఱని పండుగా
భావించి  దానిని తినడానికి  ఆకసానికి ఎగసివెళ్ళాడు.

అప్పుడు సూర్యభగవానునికి ఏ ముప్పు కలగరాదని దేవతలు బ్రహ్మదేవునికి మొరలిడగా
బ్రహ్మదేవుడు తన మంత్ర దండంతో 
అంజనా పుత్రుని  తల మీద మోదగా ఆ
బాలుడు మూర్ఛపోయి పడిపోయాడు. మాతృమూర్త అంజనాదేవి  బ్రహ్మదేవుని ప్రార్ధించింది. బ్రహ్మదేవుడు ఆ బాలుని ఆశీర్వదించి, 
కీర్తి ప్రతిష్టలతో, నిత్య చిరంజీవిగా
అందరి పూజలు అందుకొంటాడని ఆశీర్వదించాడు.

తిరుమలలో అంజనాదేవి
తపస్సు చేసిన స్ధలంలో
వాయుదేవుని వరప్రసాదంగా ఆంజనేయుడు జన్మించినందున ఆ స్థలానికి
'అంజనాద్రి' అనే పేరు వచ్చినట్లు తిరుమల స్థలపురాణాలు చెపుతున్నాయి...

No comments: