Adsense

Tuesday, February 15, 2022

దేవునికి పుష్పాన్ని అర్పించి ప్రసాదం తీసుకోవటం ద్వారా ఎలాంటి ఫలితం లభిస్తుందని తెలుసుకుందాం…. Let us know what is the result of offering a flower to God and taking offerings.

 పుష్పార్చన....!!
దేవునికి పుష్పాన్ని అర్పించి ప్రసాదం తీసుకోవటం ద్వారా ఎలాంటి ఫలితం లభిస్తుందని తెలుసుకుందాం….


1. దేవునికి జాజిపూలు అర్పించి ప్రసాదం స్వీకరిస్తే – మీలో ఉన్న దుష్టగుణాలు తొలగి మంచి గుణం వస్తుంది. ఉద్యోగంలో ఉన్నవారి సమస్యలు తొలగిపోతాయి.

2.దేవునికి సంపెంగ పూలు అర్పించి ప్రసాదం స్వీకరిస్తే – మాంత్రిక ప్రయోగాలు మీపై పని చేయవు. శత్రువుల నివారణ సాధ్యమవుతుంది.

3.పారిజాత పూవును అర్పిస్తే – కాలసర్ప దోషం నివారించబడి మనసుకు శాంతి లభిస్తుంది.

4. రుద్రాక్షపూవును అర్పిస్తే – ఎన్ని కష్టాలు వచ్చినా అంతిమ విజయం మీదే అవుతుంది.

5. మొగలిపూలను అర్పిస్తే – అధికారంలో ఉన్నవారి మనస్తాపాలు పరిహరించబడతాయి.

6. లక్కి పూవుతో పూజిస్తే – భార్య, పిల్లలతో కలహాలు లేకుండా సంతోషంగా ఉంటాయి.

7. పద్మం లేదా కమలంతో పూజిస్తే – సమస్త దారిద్ర్య నివారణ, శ్రీమంతులు అవుతారు.

8. మల్లెపూవుతో పూజిస్తే – అన్ని రోగాలు నయం అవుతాయి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది.

9. కల్హర పుష్పంతో పూజ చేస్తే – అందరిలోనూ మీకు గుర్తింపు వచ్చి ఆకర్షణ పెరుగుతుంది.

10. గన్నేరు పూలతో పూజిస్తే – కవులకు కల్పనా సాహిత్యం వృద్ధి చెందుతుంది.

11. కలువ పూవుతో పూజ చేస్తే – స్తంభన తదితర మంత్ర సంబంధ బాధలు తొలగిపోతాయి.

12. పాటలీ పుష్పంతో పూజ చేస్తే – వ్యాపార-వ్యవహారాల్లో అధిక లాభం వస్తుంది.

13. కుంద పుష్పంతో పూజ చేసి ప్రసాదాన్ని స్వీకరిస్తే ముఖంలో అధికమైన తేజస్సు కాంతి  స్తుంది.

14. మల్లెపూవుతో పూజ చేసి ప్రసాదన్ని స్వీకరిస్తే – అన్ని రకాల మానసిక, దైహిక రోగాలు నయం అవుతాయి.

15. కనకాంబరం పూలతో దేవునికి పూజ చేయకూడదు. ఒకవేళ చేసి ప్రసాదాన్ని స్వీకరిస్తే – జీవితం పట్ల వైరాగ్యం వస్తుంది.

16. మాధవీ పుష్పంతో – సరస్వతి, గాయత్రి, శ్రీ చక్రం, శ్రీ రాజరాజేశ్వరి దేవికి జ్యోతిష్యం చెప్పేవారు పూజ చేస్తే మంచి వాక్‌శుద్ధి కలిగి పలికినట్లే జరుగుతుంది.

17. తుమ్మపూలతో ఈశ్వరునికి పూజ చేస్తే – దేవునిపై భక్తి అధికమవుతుంది.

18. నందివర్థనం పూలతో శివునికి పూజ చేస్తే – జీవితంలో సుఖం, శాంతి, ప్రశాంతత లభిస్తుంది.

19. కణగలె పుష్పం – దీనితో దేవునికి పూజ చేస్తే మనను పట్టి పీడిస్తున్న భయం, భీతి తొలగిపోతాయి.

 గణపతికి ఈ పూలతో పూజ చేస్తే మాంత్రిక బాధల తొలగిపోతాయి. విద్యా ప్రాప్తి సిద్ధిస్తుంది. దుర్గాదేవికి ఈ పూలతో పూజ చేస్తే దేవీ అనుగ్రహంతో శత్రువుల నిర్మూలనం అవుతుంది.

20. పొద్దుతిరుగుడు పువ్వుతో పూజ చేస్తే – పూవును హోమం పూర్ణాహుతికి వేస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి.

No comments: