సనాతన_సంస్కృతిలో పండుగలంటే
కేవలం విశ్రాంతికోసమో,
ఆహ్లాదం కోసమో ఉద్ద్యేశించబడినవి కావు.
ప్రతి సంబరంలోనూ ఆధ్యాత్మికత,
దైవికత ఉంటుంది. ప్రతి పండుగకు వైజ్ఞానిక, ఆరోగ్య, శాస్త్రీయ కారణాలుంటాయి.
అంతరిక్షం నుంచి ప్రసరించే కాస్మిక్ కిరణాలను, విద్యుత్ అయస్కాంత తరంగాలను దృష్టిలో ఉంచుకుని, ఏ రోజున ఏ పనిచేయ డం వలన మనిషి జీవనం వికసిస్తుందో,
ఇంతకముందు ఉన్నస్థితినుంచి మరింత గొప్ప స్థితికి ఎదిగే అవకాశం లభిస్తుందో, గమనించి ఆయా రోజు లలో ప్రత్యేక పర్వదినాలు ఏర్పరిచారు మన మహర్షులు.
🌹*శివరాత్రే_యోగరాత్రి*🌹
శివరాత్రికి రోజు ప్రకృతిలో ఉండే తరంగాలు, అంతరిక్షం నుంచి వెలువడే కాస్మిక్ కిరణాలు విశ్వ మానవ వికాసానికి, మనిషి తన పరిపూర్ణమైన రూపాన్ని తెలుసుకోవడానికి,
ఆత్మ సాక్షాత్కా రానికి తోడ్పడుతాయి.
అందుకే శివరాత్రికి కొన్ని ప్రత్యేక నియమాలు విధించారు.
🌹1.ఉపవాసం : 🌹
శివరాత్రికి చేసే ఉపవాసానికి,జాగరణకు విశేష ప్రాధాన్యం ఉంది.శివరాత్రి అందరూ ఉపవాసంచేయా లని శాస్త్రం చేయబడింది.ఐతే, చిన్నపిల్లలకు,
ముసలివాళ్ళకు,
అనా రోగ్యంతో బాధపడేవాళ్ళకు,
గర్భవతులకు,
ఔషధసేవనంచేయాల్సిన వాళ్ళకు మినహాయింపు ఇచ్చింది శాస్త్రం.
ఉపవాసం ఉండే ముందు రోజు, ఉపవాసం మరుసటి రోజు మాంసాహారం,
గుడ్డు మొదలైనవి తినకూడదు,
మద్యపానం చేయకూడదు.ఎలాగూ ఉపవాసం
చేస్తున్నాం కదా,ఉదయం లేస్తే ఆకలి త ట్టుకోవడం కష్టమని, ఆలస్యంగా లేస్తారు కొందరు.
అలాచేయకూడదు.ఉపవాసం ఉండే రోజు ఉదయం,సూర్యోదయానికి ముందే నిద్రలేచి,
తలపై నుంచి స్నానం చేసి,
ఈ రోజు నేను శివునకు ప్రీతికరంగా శివరాత్రి ఉప వాసం చేస్తున్నాను అని సంకల్పం చెప్పుకోవాలి.
ఉపవాసం అనే పదానికి అర్ధం దగ్గరగా ఉండడం అని.భగవంతునికి మనసును,ఇంద్రియా లను దగ్గరగా జరపడమే ఉపవాసం.
ఆరోగ్యపరంగా చూసినప్పుడు ఉపవాసం శరీరంలో ఉన్న విష పదార్ధాలను తొలగించడంతో పాటు శరీరంలో ప్రాణశక్తిని,
ఇంద్రియ నిగ్రహాన్ని పెంచుతుంది.
మరీ నీళ్ళు కూడా తాగకుండా ఉపవసించమని ఎవరూ,ఎక్కడా చెప్పలేదు. అలా చేయకూడదు కూడా. ఎందుకంటే శరీరాన్ని కష్టపెడుతూ, భగవంతుని వైపు మనసును తిప్ప డం కష్టం.
🌹2.జీవారాధాన 🌹
అట్లాగే మీరు ఉపవాసం ఉన్నప్పుడు ఎంతబియ్యం, ఇతర ఆహారపదార్ధాలు మిగిలుతాయో, వాటిని ఆకలితో ఉన్న పేదలకు పంచాలి.
అష్టమూర్తి తత్వంలో శివుడు లోకంలో జీవుల రూపంలో సంచరిస్తూ ఉంటాడు.అన్నార్తుల ఆకలిని తీర్చడం కూడా ఈశ్వరసేవయే అవుతుంది.
అందుకే స్వామివివేకానంద'జీవారాధానే_శివారాధాన' అన్నారు. ఉపవాస నియమాలు కూడా అవే చెప్తాయి.
శివరాత్రి రోజు ప్రకృతిలో ఉన్న శివశక్తిని శరీరం గ్రహించాలంటే, వెన్నును నిటారుగా పెట్టికూర్చోవాలి.అంటే కూర్చునే సమయంలో ముందుకు వంగి కూర్చోవడం లాంటివి చేయకుండా, మీ వెన్నుపూస నిటా రుగా ఉండేలా కూర్చోవాలి,నిలబడాలి.
🌹 3.మౌనవ్రతం 🌹
శివరాత్రి రోజు చేసే మౌనవ్రతం చాలా అద్భుత ఫలితాలను ఇస్తుంది.మానసిక ప్రశాంతతను చేకూరుస్తుంది.మౌనం అనగానే నోరు మూసుకుని కూర్చోవడం అని భావించవద్దు.
వ్రతంలో త్రికరణములు (మనోవాక్కాయములు) ఏకం కావాలి. మనసును మౌనం ఆవరించినప్పుడు మౌనవ్రతం సంపూర్ణమవుతుంది. అందువల్ల ఆలోచనలను, వాదనలను కట్టిపెట్టి, మనసును శివుని పై కేంద్రీకరించాలి.
శివాలయానికి వెళ్ళండి,అక్కడ రుద్రాభిషేకం చేస్తారు. రుద్రం ఒకసారి చదవటానికి.అరగంట పడుతుంది. మీరు అభిషేకం చేయించుకోక పోయిన ఫర్వాలేదు, శివాలయంలో ప్రశాంతంగా కళ్ళు మూసు కుని కూర్చుని,పండితులచే చదవబడుతున్న
రుద్ర_నమకచమకాలను వినండి.
ఆ తర్వాత వచ్చే ఫలితాలను చూడండి. ఉద్యోగస్తులు, ముఖ్యంగా ప్రైవేటు రంగంలో పని చేస్తున్న వారికి ఆ రోజు సెలవు ఉండకపోవచ్చు. విదేశాల్లో చదువుతున్న విద్యార్ధులకు అదే పరిస్థితి ఎదురుకావచ్చు.మరి అలాంటప్పుడు ఏం చేయాలి?
అవసరమైంతవరకే మాట్లాడండి, అనవసరమైన మాటలు కట్టిపెట్టండి. ఎవరితోను గొడవ పడకండి,
తిట్టకండి.సాధ్యమైనంత తక్కువ మాట్లాడండి.
ఇంటికి వచ్చాక, కాళ్ళుచేతులు
ముఖం శుభ్రపరుచుకుని శివుడిముందో, ఆలయంలోనో కాసేపు కన్నులు మూసుకుని మౌనంగా కూర్చోండి
🌹4.అభిషేకం🌹
శివుడు అభిషేక ప్రియుడు. శివుడికి కాసిన్ని నీరు పోసిన, సంతోషంతో పొంగిపోతాడు.
శివరాత్రి నాడు అందరూ వర్ణ, లింగ, జాతి, కుల భేధం లేకుండా శివుడిని అర్చించడం వల న, అభిషేకించడం వలనసదాశివుని అనుగ్రహంతో జీవితానికి పట్టినపీడ తొలగిపోతుంది.
🌹 5.జాగరణ 🌹
శివరాత్రికి చేసే జాగరణ మనలో ఉన్న శివత్వాన్ని జాగృతం చేస్తుంది. జాగరణం మనలో ఉన్న శివుడిని జాగృతం చేస్తుంది, తమస్సును తొలగిస్తుంది.
సినిమాలు చూస్తునో, పిచ్చి కబుర్లు చెప్పుకుంటూనో, కాలక్షేపం చేస్తూనో చేసే జాగరణ జాగరణ అవ్వదు, కాలక్షేపం మాత్రమే! అవుతుంది. అప్పుడు పుణ్యం రాక పోగా, ఆ సమయంలో మట్లాడిన చెడు మాటల వలన పాపం వస్తుంది...
🌹6.మంత్ర_జపం🌹
శివరాత్రి మొత్తం శివనామంతో, ఓం నమః_శివాయ అనే పంచాక్షరీ మహా మంత్ర జపం/స్మరణతో జాగరణ మీలో నిక్షిప్తమై ఉన్న అనంతమైన శక్తిని జాగృతం చేస్తుంది.
శివోహం అనే భావనను కలిగిస్తుంది.
శివరాత్రి మరునాడు ఉదయం శివాలయాన్ని సందర్శించి,ప్రసాదం తీసుకుని,ఇంటికి వచ్చి భోజనం చేసి ఉపవాస వ్రతం ముంగించాలి.
అందరూ గుర్తు పెట్టుకోవలసిన ముఖ్యవిష యం, శివరాత్రి నాడు ఉపవాసం,జాగరణ చేసినవారు,తరువాతి రోజు రాత్రి వరకు నిద్రించకూడదు. అప్పుడే సంపూర్ణ. ఫలందక్కుంతుదని చెప్తారు...స్వస్తి..
*ఓం నమః శివాయ.
No comments:
Post a Comment