THE COMPLETE BLOG FOR PEOPLE // NEWS, DEVOTIONAL, TECHNOLOGY, LIFE STYLE, SPORTS, ENTERTAINMENT, SCIENCE, ONLINE EARNING, RIDDLES, SILLY QUESTIONS, IMPORTANT DAYS, BEAUTY TIPS, HEALTH
Adsense
Friday, September 30, 2022
లోకపావని శాకంబరీ. - Sakambari Devi
🌿అన్నపుర్ణాదేవిగా పరమశాంతి స్వరూపిణిగా చిరు మందహాసంతో, ప్రశాంతతను కలిగించే ఆ దుర్గమ్మను ఒక్కసారి దర్శించి మనం మనసారా ధ్యానిస్తే చాలు,
🌸 ఎన్నో జన్మల పాపాల నుండి మనకి విముక్తి లభిస్తుంది. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి, వేద వేదాంత వనవాసినీ అయిన శ్రీ కనకదుర్గా అవతారమునకు పూర్వం జగన్మాత శాకాంబరీ దేవిగా అవతరించిందని
🌿దేవి భాగవతం, మార్కండేయ పురాణం, దుర్గా సప్తశతి పురాణాలలో విశేషంగా చెప్పబడింది.
🌸శాకాంబరీ అంటే వివిధ శాకములనే ( అనగా రకరకాల కూరగాయలు మరియు ఆకు కూరలు) వస్త్రాభరణాలుగా ధరించిన తల్లి అని అర్ధం.
🌿పూర్వం భూలోకంలో వర్షాలు లేక పంటలు పండక అనావృష్టి సంభవించింది.
🌸తాగడానికి చుక్క నీరు దొరకక ప్రజలు అల్లడుతున్న సమయంలో వారి బాధలను చూడలేని మునీశ్వరులు జగన్మాతను అనేక విధాలుగా స్తుతించగా,
🌿వారి కోరిక మేరకు జగదీశ్వరీ "
ఓ మునులారా..నేను అయోనిజనై అవతరించి, నూరు కన్నులతో చల్లని చూపులు ప్రసరిస్తూ..ముల్లోకాలను కాపాడుతాను.
🌸అప్పుడు ఈ చరాచర సృష్టిలోని జనులు నన్ను " శతాక్షి దేవిగా" కొల్చుకుంటారు.
🌿ఆ విధంగా నేను " శతాక్షి దేవిగా" కీర్తించబడుతాను. ఆ తరువాత నాదేహం నుండి శాకములను పుట్టించి, ప్రజల ఆకలిని తీరిస్తూ,
🌸 మరలా వర్షాలు కురిపిస్తూ జగతిని సస్యశ్యామలంగా, సుభీక్షముగా మార్చి కాపాడుతాను" అని జగదంబ అభయమిచ్చింది.
🌿దేవి యొక్క దేహాన్ని శాకములుగా మార్చింది. కనుక ఆ తల్లి "శాకంబరీ" నామంతో కీర్తి పొందింది.
🌸లోక కల్యాణార్ధం ఆదిశక్తిగా, అన్నాన్ని ప్రసాదించే అన్నపూర్ణగా, శాకములను ( కాయగూరలను) ప్రసాదించే జగమునేలే ఆ జగన్మాతకే చెల్లింది.
🌷తతోహమఖిలం లోకమాత్మాదేహ సముద్భవైః
భరిష్యామి సురా శాకై రావృష్టీః ప్రాణధారకైః
శాకంబరీం స్తువన్ ధ్యాయన్ జపన్ సంపూజయన్నమన్
అక్షయ మశ్నుతే శీఘ్రమన్న పానామృతం ఫలం...🌷
🌿తల్లీ అంతా నీవే . అన్నింటా నీవే ఆవరించి ఉన్నవు. ప్రాణాధారం కోసం. శాకాలను సృష్టించిన మాతవు నీవే. శాకంబరీగా అవతరించి లోకాలను కాపాడావు.
🌸శాకంబరిగా నిన్ను స్తుతించి ,ధ్యానం చేసి, జపించిన భక్తుల ఇంట అక్షయం కలుగచేస్తావు. అన్నపానాదులకు స్తుతించినట్లు వేదోక్తి.
🌿శాకంబరీగా అవతరించిన తరువాత విశ్వకల్యాణార్ధం దుర్గముడు అనే రాక్షసుణ్ణి వధించడం వలన నేను " దుర్గా దేవిగా"
🌸మహిషాసురుణ్ణి సమ్హరించాక ఆ దుర్గా దేవి కీలుడి కిచ్చిన మాట ప్రకారం మహిషాసుర మర్ధినీ స్వరూపంతో కీలద్రి మీద ఆవిర్భవించింది.
🌿నీలమేఘ శ్యామంతో సుమనోహరంగా సర్వాంగ సుందరంగా అభయ, వరద హస్తంతో చిరుమందహాసంతో శోభిల్లుతూ పద్మంలో ఆశీనురాలై వివిధ ఫలపుష్పాదులతో పాటు,
🌸కూరగాయల సమూదాయాన్ని ధరించి అఖిల లోకాశ్చర్యమైన సౌందర్యంతో కోరిన వారికి కొంగు బంగారంగా, జీవుడికి ఆకలి,
🌿దప్పిక తీర్చే సకల సంపదలకూ మూలమైన శక్తులు ఆ చల్లని తల్లి కనుసైగల్లోనే సంచరిస్తాయని పురాణాలు ఘోషిస్తున్నాయి.
అందుకే శాకంబరీ దేవికి అంత విశిష్టత ఏర్పడింది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment