Adsense

Saturday, April 1, 2023

శ్రీరామచంద్రుడు జటాయు సంస్కారాలు జరిపిన ప్రదేశం తిరుపుల్లంపూధన్ గుడి- తంజావూరు...!!

శ్రీరామచంద్రుడు జటాయు సంస్కారాలు జరిపిన ప్రదేశం తిరుపుల్లంపూధన్ గుడి- తంజావూరు...!!



🌿శ్రీరామచంద్రుడు ఈ క్షేత్రములో సీతా వియోగమైన తరువాత జటాయువికి అంతిమ సంస్కారాలు ఇచ్చట జరిపి ఈ స్థలంలో కొంత సేదతీరేను.

🌸ఈ సేద తీరిన స్థలమే ఈ క్షేత్రమని నానుడి. "ఫుల్"  అనగా తమిళంలో గరుడ జాతి పక్షి వంశము,

🌿ఆ కారణము చేత ఈ స్థలమునకు "పుళ్ళంపూధన్ "గుడి పేరు వచ్చింది.
శ్రీరాముడు ఇచ్చట విశ్రమించిన సమయమున ఆ గరుడ జాతి పక్షుల రాజు అయిన గరుత్మంతుడు, శ్రీరాముడి దగ్గరే ఉండి శ్రీమన్నారాయణుడి కోసం తపస్సు చేశారు.

🌸ఆ భక్తికి మెచ్చిన శ్రీమన్నారాయణుడు భుజంగ శయన మూర్తిగా దర్శనమిచ్చి అనుగ్రహించెను. అందుకే ఇక్కడ విగ్రహం శయనమూర్తి.

🌿సీత దేవిని రావణాసురుడు లంకకు గైకొని వెడలినందున ఈ క్షేత్రములో సీతా దేవి విగ్రహం లేదు.

🌸ప్రత్యేక సన్నిది భూదేవికి మాత్రం కలదు. ఉత్సవ విగ్రహము చతుర్భుజములతో శంఖము, చక్రములతో దర్శనము ఇచ్చును.

🌿ఈ క్షేత్రమునకు 1 కి మీ. దూరములో మండంగుడి అను గ్రామము తొండరడిప్పొడి ఆళ్వార్ జన్మస్థలము. ఈ గ్రామములొ తొండరిడిప్పోడి ఆలయము, రంగనాధుని క్షేత్రము కలవు. 

🌸అక్కడి రంగనాథ స్వామి కోవిల తొండరడిప్పొడి ఆళ్వార్ జన్మస్థలము.
ఇది అతి చిన్న కుగ్రామము. ఆలయము నకు రాబడి అతి తక్కువ. 

🌿ఇక్కడికి అతి సమీపములో అహోబిల మఠం బృందావనము ఉన్నది.
ఈ క్షేత్రము , శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారి ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన స్వామిమలైకి  కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో కలదు...స్వస్తి..

No comments: