సుబ్రహ్మణ్య స్వామి విభూతికి అంత శక్తి
సుబ్రహ్మణ్య స్వామివారికి అభిషేకం చేయబడిన లేదా సుబ్రహ్యణ్య క్షేత్రమునందు ప్రసాదముగా ఈయబడిన విభూతిని ఇంటికి తెచ్చి ఏ మూల పెట్టినా సరే ఇంటికి రక్షణగా ప్రహరీ గోడ ఎంతవరకు ఉన్నదో అంత వరకు భూతప్రేతములు చూడడానికి భయపడి పోయి వెళ్ళిపోతాయి. ఆ విభూతికి అంత శక్తి ఉంటుంది. ఈ విషయమును శంకరాచార్యుల వారు సుబ్రహ్మణ్య భుజంగంలో చెప్పారు. సుబ్రహ్మణ్యుడి విభూతి ఇంట్లో ఉంటే పిల్లలకి అనారోగ్యం వస్తే రక్ష. పిల్లలకీ చక్కగా నుదుటిపై మూడు విభూతి రేఖలు పెట్టడం అలవాటు చేస్తే ఆ పిల్లలకి మంచి ఆలోచనలు వచ్చి సుబ్రహ్మణ్య భక్తులై వంశమునకు కీర్తి తీసుకువస్తారు. వంశవృద్ధి కారకాయై నమః అనే నామం స్వామికి కలిగి వుంది. ఆ విభూతి అంత గొప్పది.
No comments:
Post a Comment