వేదాధ్యయన తత్పరుడు, తపసంపన్నుడు అగు నారదమహర్షి వాల్మీకి ఆశ్రమానికి విచ్చేశాడు.
ఆ మహర్షిని పూజ చేసి వాల్మీకి ఈ లోకం లో ఈ కాలం లో గుణవంతుడు ఎవడు.?
వీర్యవంతుడు ఎవడు?
ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు, సత్యవాక్యుడు, దృఢవ్రతుడును ఎవ్వడు?
చారిత్రము తో కూడుకొన్నవాడు ఎవడు?
సర్వభూతములయందు హితుడెవ్వడు?
విద్వాంసుడెవ్వడు?
సమర్థుడెవ్వడు.?
ఏకప్రియదర్శునుడు ఎవడు?
ద్యుతిమంతుడు, అసూయలేనివాడు ఎవ్వడు?
కోపము వచ్చినచో దేవతలైనను భయపడుదురో అట్టి నరుడెవ్వడు?
అని 16 గుణాలను సంబందించిన ప్రశ్నలను గూర్చి తెలిపి సమాధానము వినగోరుతున్నాను అని వాల్మీకి తెలిపెను.
సమాధానము గా నారదుడు ఓ మహర్షి..!
నీవు ప్రశ్నించిన గుణముల పరంపర అంతా ఒకే చోట వుండటం దుర్లభం ......
కానీ ఇప్పుడు ఇక్ష్వాకు కులమున జన్మించిన వాడు రాముడు అను పేర జనుల చే పిలుచు కొనువాడు లో అన్ని గుణాలతో పాటు ఏ ఒక్క చెడు గుణము లేని వాడు గా ఉన్నాడు....
అనిచెబుతూ రామాయణ గాథను మొత్తం సంక్షిప్తం గా ఉపదేశాత్మకంగా, నారదుడు అందించాడు.
ఇదం పవిత్రం పాపఘ్నం
పుణ్యం వేదైశ్చ సమ్మితం ౹
యః పఠే ద్రామచరితం
సర్వపాపై: ప్రముచ్యతే౹౹
పాపములను నశింపచేయునది, పుణ్యమైనది, వేదములతో సమానమైనది ఈ చరిత్ర,
ఎవడుచదువుతాడో, తెలుసుకుంటడో
అతడు సర్వపాపములనుండి విముక్తి చెందుతాడు
ఈ చరిత్ర ఆయుష్యకరమైనది, సత్యమైనది, నిత్యం చదువు మానవుడు పుత్రుడు పౌత్రులతోడ బంధు సమూహములతో జీవనం గడుపుతాడు.
శరీరం పడిపోయినతరువాత పరమపదము చేరును. అని తెలిపి నారదుడు ప్రయాణమయ్యెను.
సంక్షిప్తం గా తెలిపిన ఈ రామచరిత్రను సంక్షిప్త రామాయణం గాను, బాల రామాయణం గానూ, మూల రామాయణం గాను, ప్రసిద్ధి.
నిత్యపారాయణ యోగ్యం..
(ఇంకా ఉంది..)
- జై శ్రీరామ...
- జై శ్రీరామ...
No comments:
Post a Comment