ఒకప్పుడు ఒక రైతు ఉండేవాడు. అతనికి పొలం చాలా ఉండేది. ఎండలోనూ, వానలోనూ రోజూ కష్టపడి పనులు చేసేవాడు. ఓ సంవత్సరమో చాలా దారుణమైన కరవు వచ్చింది. వర్షం పడలేదు. చాలా మంది రైతులు పొలాలు వదిలేసి ఊరుని వదిలి వెళ్లిపోయారు. కానీ ఆ రైతు మాత్రం ― "ఇంతకాలం నేను ఇక్కడ కష్టపడ్డాను. ఇప్పుడు వదిలేసుకుంటే నా కష్టం వృథా అవుతుంది" అని అనుకొని, మరింత కష్టపడ్డాడు. చివరికి ఆ రైతు ఆశ వమ్ముకాలేదు. వానలు వచ్చాయి, పంట బాగా పండింది.
ఈ కథలో అర్థం ఏమిటంటే — మనం ఏ పనిలో అయినా చాలా దూరం వచ్చేసినపుడు, కొంచెం ఇబ్బంది వచ్చినా ఆ సమయాన వదిలేయకూడదు. మన కష్టం చివరికి మంచి ఫలితాన్నిస్తుందనే నమ్మకంతో ముందుకు సాగాలి.
- తెలుగుపథం
No comments:
Post a Comment