Adsense

Showing posts with label TODAY NEWS. Show all posts
Showing posts with label TODAY NEWS. Show all posts

Friday, March 17, 2023

నేటి వార్తలు మార్చి - 17, TODAY NEWS MARCH 17


నేటి ప్రత్యేకత

భారత్ లోక్సభ స్పీకర్ గా నీలం సంజీవరెడ్డి పదవి బాధ్యతలు స్వీకరించారు 1967

తెలుగు కవి రాయప్రోలు సుబ్బారావు జననం 1892

ఇండియన్ అమెరికన్ వ్యోమగామి కల్పనా చావ్లా జననం 1962

బాడ్మింటన్ క్రీడాకారిని సైనా నెహ్వాల్ జననం 1990

నటుడు పునీత్ రాజ్ కుమార్ జననం 1975

అంతర్జాతీయ వార్తలు:

1 ) న్యూజిలాండ్ లో భూకంపం సంబంధించింది రిక్టర్ స్కేల్ పై 7.1 నమోదు.

2) భారత్ కు అమెరికా రాయబారిగా ఎరిక్ గార్సిటీ నియామకం.

3) ఆఫ్ఘనిస్తాన్లో ఘోర ప్రమాదం బస్సు బోల్తాపడటంతో 17 మంది కార్మికులు మృతి చెందారు . మరో ఏడుగురు గాయపడ్డారు.

4) దక్షిణ కొరియా ప్రపంచంలోనే అతి తక్కువ సంతాన ఉత్పత్తి కలిగిన దేశంగా రికార్డుల్లో ఉంది .దీంతోపాటు ప్రస్తుతం వివాహం చేసుకొనే వారు కూడా తగ్గారు.

5) భారతీయ విద్యార్థులకు కెనడా అధికారులు షాక్ ఇచ్చారు. నాలుగు సంవత్సరాలు క్రితం కెనడా వెళ్లి చదువు పూర్తి చేసిన వారిని తిరిగి ఇండియాకు పంపుతున్నారు . ఫేక్ ఆఫ్ లెటర్స్ తో కెనడాకు వచ్చినట్లు కెనడియన్ బోర్డర్ సెక్యూరిటీ ఏజెన్సీ గుర్తించింది.

6) రికార్డ్ సృష్టిస్తున్న RRR సినిమా ఆస్కార్ అవార్డుతో పాటు ,జపాన్ లో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా నిలిచేటట్లు తెలుస్తుంది.

7) సికింద్రాబాద్ స్వప్న లోక్ కాంప్లెక్స్ అగ్ని ప్రమాదంలో ఆరుగురు మృతి.


జాతీయ వార్తలు:


1) బాల్యవివాహాలపై అసోం ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకున్నట్లు సీఎం హేమంత్ శర్మ తెలిపారు .2026 నాటికి బాల్యవివాహాలను రూపుమాపుతామన్నారు.

2 ) GATE గ్రాడ్యుయేట్ ఆటిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ 2023 ఫలితాలు వెలువడ్డాయి.

3) భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఈనెల 26న 36 సాటిలైట్లను ప్రయోగించనున్నది. శ్రీహరికోట లో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ ఉపగ్రహాలను ప్రయోగించనున్నట్లు తెలిపారు .వీటిని తయారు చేయడంలో కీలక పాత్ర వహించిన భారతీ ఎంటర్ప్రైజెస్ మరియు వన్ వెబ్ ఇంగ్లాండ్ సంస్థ కలిసి ఈ ఉపగ్రహాలను తయారు చేశారు.

4) దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో ఆరు రాష్ట్రాలైన మహారాష్ట్ర ,కర్ణాటక, గుజరాత్ ,తెలంగాణ, తమిళనాడు, కేరళకు, కేంద్ర ఆరోగ్య శాఖ లేఖ రాసింది.

5) దేశంలో మహిళల వలసలకు పెళ్లిల్లే కారణం అవుతున్నాయని, ఉపాధి కోసం భర్తలు వలస వెళ్తుండటంతో వారితో పాటు భార్యలు కూడా వెళ్తున్నారు .దేశంలోని 87% మహిళలు ఈ కారణంగా వలస వెళ్లవలసి వస్తుంది.


రాష్ట్రీయ వార్తలు:


1 ) వివిధ శాఖలకు, కార్పొరేషన్లకు ,సంస్థలకు , సంక్షేమ పథకాలకు కేటాయింపులతో ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు .రాష్ట్ర వృద్ధి రేటు 11.43% కలదని ,ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర ప్రవేశపెట్టిన బడ్జెట్ కు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

2 ) దరఖాస్తు చేసుకున్న 21 రోజుల్లోనే రేషన్ కార్డులు జారీ ప్రజెంట్ పంపిణీ వ్యవస్థ ద్వారా 4.25 కోట్ల మందికి రాష్ట్రంలో ప్రయోజనం చేకూరుతుందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు.
3) రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన వివిధ ఎమ్మెల్సీ ఫలితాలు వెలువడుతున్నాయి.

4) ఉత్కంఠ భరితంగా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు


క్రీడావార్తలు:

1 ) ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్ భారత్ కు సుబారంభం దక్కింది .50 కిలోల విభాగంలో డిపెండింగ్ ఛాంపియన్ నికిత్ జిరిన్, అజర్ బైజాన్ కు చెందిన అనాఖనీమ్ఇస్మై లోవపై గెలుపొందింది.

2) నేటి నుంచి భారత్ ,ఆస్ట్రేలియా మధ్య 3 వన్డేల క్రికెట్ సిరీస్ ప్రారంభం కానున్నది.