Adsense

Wednesday, April 7, 2021

ఆవు నెయ్యి ప్రాముఖ్యత

ఆవు నెయ్యి ప్రాముఖ్యత
గోమాత నామావళిలో హవ్య కవ్య ప్రదాయిని అన్న నామమున్నది. గోఘృతం లేదా ఆవు
నెయ్యితోనే దేవతలకు హవిస్సులర్పిస్తాము అలానే పితృదేవతలకు కవ్యమూ.. ఇది
అందరకూ తెలిసినదే, ఐతే నిత్యమూ యజ్ఞ యాగాదులు జరిగేచోట, ఆవు నెయ్యి ఇతర
సమిధలతో కాలి ఆవిరి అయ్యిన చోట రేడియోధార్మిక పదార్థాల యొక్క విషపు
గాలులయొక్క ప్రభావం నామమాత్రం లేదా అసలు ఉండదని రష్యన్ శాస్త్రజ్ఙ్యులు
డా శిరోవిచ్ తమ పరిశోధనలో తెలిపి నిరూపించారు.

మనవాళ్ళు చెప్తే నమ్మని మనవారు ఇతరులు చెప్పినా కొన్ని సార్లు సనాతన ధర్మ గొప్పదనాన్నిఒప్పుకోలేరు. ఈ విషయం 1980వ దశకంలో జరిగిన అత్యంత ఘోర ప్రమాదమైన బోపాల్ గ్యాస్ విషవాయువులు, రేడియోధార్మికశక్తిల వలన ఆ ప్రాంత చుట్టూ ఐదారుమైళ్ళ వరకూ అత్యంత ఉపద్రవంతో కూడిన వ్యాధులు సోకాయి, ఎందరో చనిపోయారు,కొందరికి చర్మం కాలిపోయింది, ఇప్పటికీ ఆ ప్రాంతం వారిలో కొంతమందికి ఆ
రసాయనాల వల్ల కలిగిన రోగాలను పోగొట్టుకోలేని స్థితిలో ఉన్నారు.

ఇంత అత్యంత దారుణ బాధాకరవిపత్కర పరిస్థితులలో ఈ ప్రమాదం సంభవించిన
కర్మాగారానికి ఒక మైలులోపు ఉన్న రెండు కుటుంబాలకు మాత్రం ఎటువంటి హానీ
జరగలేదు, ఎవరి ప్రాణాలకీ ముప్పు కలగలేదు, కనీసం ఎవరూ అనారోగ్యం పాలు
కాలేదు. కారణం ఈ రెండు కుటుంబాలు నిత్యాగ్నిహోత్రీకులు అగ్నిహోత్రంలో
రోజూ ఆజ్యంవేసి హవిస్సులర్పిస్తారు. వారి పేర్లు వివరాలతో సహా ఆంగ్ల దిన
పత్రిక "ద హిందూ" 4-May-1985 నాడు "Vedic way to Beat Pollution" అన్న
శీర్షికన ఈ కథనాన్ని ప్రచురించింది. ఆ ఇద్దరు ఇంటి యజమానులు శ్రీ సోహన్
లాల్ ఎస్.ఖుశ్వాహ, శ్రీ ఎమ్ ఎల్ రాథోర్ గార్ల పేర్లను ప్రస్తావిస్తూ ఆ
ఆర్టికల్ ప్రచురించబడింది.

సనాతన ధర్మంలో ఏ కార్యం చేసినా ప్రకృతి ప్రసాదాన్ని చెడగొట్టుకునేలా
ఉండవు అన్నీ ప్రకృతికి అనుగుణంగానే చేయబడతాయి, ప్రకృతియొక్క
అనుగ్రహంకోసమే చేయబడతాయి, యజ్ఙ యాగాదులు కాలుష్యాన్ని పెంపొందించవు, పైగా
అవి వాతావరణంలో ఉన్న కాలుష్యాన్ని తగ్గిస్తాయి అని మన పూర్వీకులు
చెప్పినదే పాశ్చాత్య ఇతర దేశాల శాస్త్రవేత్తలూ తమ పరిశోధనలచేత
నిర్ధారించారు. ఐనప్పటికీ వీటిమీద అధ్యయనం చేసే వైపుగా కానీ, చక్కని
ప్రచారం కల్పించడం కానీ మనవారికి చేయడం చేతకాదు.

ఏది ఏమైనప్పటికీ... మన సనాతన ధర్మపు విలువలను నిత్య విధులను పట్టుకుని
నిత్యాగ్నిహోత్రీకులై భోపాల్ గ్యాస వంటి దురదృష్టకర ప్రమాదాన్ని తేలికగా
ఎదుర్కుని మన వైదిక సంస్కృతి గొప్పదనాన్ని చాటిని ఆ ఇద్దరు కుటుంబీకులకు
వారి వంశానికి ఆ పరాదేవత గోమాత అనుగ్రహం ఎప్పటికీ ఉండుగాక అదే ధృతి,
ధర్మమునందు నిర్భయంగా చరించే శక్తి మనకు అనవరతమూ ఉండుగాక అని
ప్రార్థిస్తూ.....

No comments: