Adsense

Sunday, July 4, 2021

🕉పూరీ జగన్నాథ్ ఆలయంలో సైంటిస్టులనే ఆశ్చర్యపరిచే 7 మిస్టరీలు...🕉

🕉పూరీ జగన్నాథ్ ఆలయంలో 
సైంటిస్టులనే ఆశ్చర్యపరిచే 7 మిస్టరీలు...🕉
🛎 ఒడిశాలోని పూరీ జగన్నాథ్ ఆలయం దేశంలోనే పేరెన్నిక గన్నది. ఇక్కడ ఏటా జరిగే రథయాత్రకు లక్షలసంఖ్యలో భక్తులు హాజరవుతారు. ఈ అపురూప దృశ్యాన్ని కవర్ చేసేందుకు దేశ, విదేశాల నుంచి మీడియా ప్రతినిధులు వస్తుంటారు.

అయితే ఇంతటి ప్రతిష్ట , ప్రాశస్త్యం ఉన్న పూరీ జగన్నాథ్ ఆలయంలో ఎన్నో విశిష్టతలు ప్రత్యేకతలూ వున్నాయి. దేశంలోని మరే ఇతర ఆలయంలో లేనన్ని అద్భుతాలు ఇక్కడ జరుగు తున్నాయి. అవి శాస్త్రవేత్తల మేధస్సుకు కూడా అంతు పట్టకపోవడం విశేషం.  అవేంటో ఒకసారి మీరే చదవండి ...

👉మొదటిది...:  తనంతట తానే ఆగిపోయే రథం.. 

ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగే రథ యాత్రలో ఊరేగింపు గుండీజా ఆలయానికి ఊరేగింపు రాగానే  రథం తనంతట తానే ఆగిపోతుంది. ఇందులో ఎవరి ప్రమేయం వుండదు.

👉రెండవది...:  నీడ కనిపించని గోపురం.. 

జగన్నాథ ఆలయం ప్రధాన ద్వారం గోపురం నీడ కనిపించదు . సూర్యుడు వచ్చినా నీడ పడదు . 
ఏ సమయంలోనూ గోపురం నీడ మాత్రం కనిపించదు ఇది శాస్త్రవేత్తలకు కూడా అంతు చిక్కడం లేదు.

👉మూడవది...:  గాలికి వ్యతిరేక దిశలో ఎగిరే జెండా... 

ఎక్కడైనా జండా గాలికి అనుకూలంగా ఎగురుతుంటుంది. కానీ  పూరీ ఆలయ గోపురం పైన వుండే జెండాకు మాత్రం గాలి వస్తున్న వైపు కాకుండా వ్యతిరేక దిశలో ఎగురుతుంటుంది .

👉నాలుగవది...:  మనవైపే చూసే చక్రం... 

పూరీ జగన్నాథ్ ఆలయం గోపురం పైన సుదర్శన చక్రం ఉంటుంది. ఈ చక్రం ఎటువైపు వెళ్లి చూసినా  అది మనవైపే చూస్తున్నట్టు వుంటుంది .

👉ఐదవది...:  ఈ ఆలయంపై ఎగరని పక్షులు... 

ఇది మరో వింత.  ఈ జగన్నాథ ఆలయం పైన పక్షులు ఎగరవు. ఎందుకు పక్షులు అక్కడ ఎగరవు  అనే విషయం మాత్రం అంతు పట్టడం లేదు.

👉ఆరవది...:  ఆలయం లోకి వినిపించని అలల సవ్వడి...

ఇదో విచిత్రం. సముద్ర తీరాన కొలువుతీరిన 
ఈ ఆలయం సింహద్వారంలో అడుగు పెట్టగానే అప్పటివరకూ వినిపించిన సముద్రపు హోరు ఆలయంలో వినిపించదు. మళ్లీ ఆలయం నుంచి అడుగు బయపెట్టగానే అలల శబ్దం వినిపిస్తుంది.

👉ఏడోది...:  ఘుమఘుమల ప్రసాదం ...

పూరీ జగన్నాథుడికి 56 రకాల ప్రసాదాలు సమర్పిస్తారు. అయితే  ప్రసాదాన్ని, అన్న ప్రసాదాన్ని తయారు చేస్తున్నప్పుడు ఎలాంటి వాసనా రాదు. దేవుడికి ప్రసాదం నివేదించిన తర్వాత మాత్రం ప్రసాదాలు మంచి సువాసనతో ఘుమఘుమలాడుతుంటాయి.

(సేకరణ)

No comments: