Adsense

Saturday, September 18, 2021

వినాయక నవరాత్రుల్లో తొమ్మిదవ రోజు మూషికం మీద కూర్చున్న ధూమ్రవర్ణ గణపతి

🎻🌹🙏ఓం గం గణపతయే నమః 🙏
వినాయక నవరాత్రుల్లో తొమ్మిదవ రోజు మూషికం మీద కూర్చున్న ధూమ్రవర్ణ గణపతిని 'ఓం శ్రీ శివాత్మనే ధూమ్రవర్ణాయ నమః' అని ధ్యానించాలి లేదా ఓం ధూమ్రవర్ణాయ నమః అని 108 సార్లు జపించవచ్చు. 

ఈ రోజు ధూమ్రవర్ణ వినాయకుని స్మరణ వలన అభిమాన దోషం నివారణవుతుంది.

 అనవసరమైన అభిమానం/ అహంకారం నశిస్తుంది.

 ఈయన శివస్వరూపుడు. అహాన్ని అణగద్రొక్కి తనలో ఐక్యం చేసుకుంటాడు

. తన భక్తులు ఎక్కడ ఉన్నా, వాయువు రూపంలో ఉంటూ, వారిని గమనిస్తూ, రక్షిస్తూ ఉంటాడు. 

నేతి అప్పాలు నివేదించాలి.


ఓం శ్రీ శివాత్మనే ధూమ్రవర్ణాయ నమః

 ఓం ధూమ్రవర్ణాయ నమః 🙏

No comments: