కార్తిక మాసమున నెల రోజులు తులసీమాలను లేదా ధాత్రి(ఉసిరి) మాలను తప్పక ధరించవలెను.
నివేద్య కేశవే మాలాన్ తులసీ కాష్ట సంభవామ్
వహతే యోనరో భక్త్యా తస్యవై నాస్తి పాతకమ్
నజహ్యత్ తులసీ మాలామ్ ధాత్రీ మాలామ్ విశేషత:
మహా పాతక సంహర్తీ ధర్మ కామార్ధ దాయనీ
స్పృశేత్తు యాని రోమానీ ధాత్రీ మాలా కలౌనృణామ్
తావత్ వర్ష సహస్రాణి వైకుంఠే వసతి: భవేత్
ఈ మంత్రము స్కాంద పురాణమున ద్వారకామహాత్యం ద్వారా తెలుస్తోంది. శ్రీమన్నారాయణునికి తులసీమాలను లేదా ధాత్రి మాలను సమర్పించి కార్తికమాసమంతా ఏనాడూ విడువక భక్తితో మాలను ధరించాలి.
ఈ రెండు మాలలు మహాపాతకములను నశింపజేసి ధర్మార్థకామములను ప్రసాదించును. ఈ మాలలు హృదయభాగమున ఎన్ని రోమములను స్పృశించునో అన్ని వేల సంవత్సరములు వైకుంఠములో అలాగే కోరుకున్నచో కోటి కల్పములు స్వర్గమున నివాసముండవచ్చును.
తులసీ కాష్ట సంభూతే మాలే కృష్ణ జన ప్రియే
బిభర్మి త్వామహమ్ కం ఠె కురుమామ్ కృష్ణ వల్లభమ్
అను మంత్రముతో తులసిమాలను ధరించవలెను.
తులసీ దళ ల క్షేణ కార్తికే యోర్చయేత్ హరిమ్
పత్రే పత్రే ముని శ్రేష్ట మౌక్తికం లభతే ఫలం
కార్తికమాసంలో కేశవునికి లక్ష తులసీ అర్చన చేసినచో ప్రతి తులసీ పత్రముతో ముక్తి లభించును.
No comments:
Post a Comment