Adsense

Friday, February 18, 2022

శ్రీకృష్ణుడి అష్ట మహిషిలు ఎవరు?

 


🌷1.రుక్మిణి: 

విదర్భ దేశాధీశుడైన "భీష్మకుడు" అను చక్రవర్తి కుమార్తె "రుక్మిణి"

 అయిదుగురన్నలతోడ గారాబు పట్టియై పుట్టింది. ఆమె అన్న రుక్మి చెల్లెలిని తన స్నేహితుడు "శిశుపాలు" నికిచ్చి చేద్దామనుకున్నాడు.. కాని రుక్మిణీదేవి మాత్రం శ్రీకృష్ణుని యందే మనసు నిలుపుకుని ఒక బ్రాహ్మణుని ద్వారా తన మనసు తెలిపి తనను చేకొనమని శ్రీకృష్ణుని వద్దకు రాయబారము పంపించింది. 

ఆమె మొరాలకించిన శ్రీకృష్ణుడు మహాలక్ష్మి సంభూతురాలైన రుక్మిణీదేవిని పట్టమహిషిగా స్వీకరించాడు.

రుక్మిణి వల్ల కృష్ణుడికి ప్రద్యుమ్నుడు, చారుదేష్ణుడు, సుదేష్ణుడు, చారుదేహుడు, సుబారుడు, చారుగుప్తుడు, భద్రాచారుడు, చారుచంద్రుడు, విచారుడు, చారుడు అనే మగ బిడ్డలు కలిగారు. చారుమతి అనే కూతురు జన్మించింది.

🌷2 సత్యభామ:

సత్రాజిత్తు కుమార్తె. ఈమె భూదేవి అవతారం. గోదాదేవి సత్యభామ అవతారం అని అంటారు.

కృష్ణుడికి సత్యభామ వల్ల భానుడు, సుభానుడు, స్వర్భానుడు, ప్రభానుడు, భానుమంతుడు, చంద్రభానుడు, బృహద్భానుడు, అతిభానుడు, శ్రీభానుడు, ప్రతిభానుడు అనే బిడ్డలు కలిగారు.

🌷3 జాంబవతి:

జాంబవంతుడిని 28 రోజుల యుద్ధంలో ఓడించి, జాంబవతిని చేపడతాడు శ్రీకృష్ణుడు. వీణా విద్వాంసురాలు.

జాంబవతీ శ్రీకృష్ణులకు సాంబుడు, సుమిత్రుడు, పురజిత్తు, శతజిత్తు, సహస్రజిత్తు, విజయుడు, చిత్రకేతుడు, వసుమంతుడు, ద్రవిడుడు, క్రతువు అనే సంతానం కలిగింది.

 జాంబవతికి కలిగిన ఈ బిడ్డలంటే కృషుడికిజాంబవతికి కలిగిన ఈ బిడ్డలంటే కృష్ణుడికి ప్రత్యేకమైన
ప్రేమ ఉండేది

🌷4. మిత్రవింద:

ఆమె కోరిక మేరకే బహిరంగంగా స్వయం వరానికొచ్చి అందులోనే ఇతర రాజకుమారులందరిన ఓడించి చేపట్టాడు.

మిత్రవింద, కృష్ణులకు వృకుడు, హర్షుడు, అనిలుడు, గృద్ధుడు, వర్ధనుడు, అన్నాదుడు, మహాశుడు, పావనుడు, వహ్ని, క్షుధి అనే పుత్రులు పుట్టారు.

🌷5 భద్ర:

మేనత్త కేకయ దేశపు రాజు భార్య అయిన శృతకీర్తి కుమార్తె. పెద్దలందరి ముందు పెళ్ళాడాడు.

కృష్ణుడికి భద్ర అనే భార్య వల్ల సంగ్రామజిత్తు, బృహత్సేనుడు, శూరుడు, ప్రహరణుడు, అరిజిత్తు, జయుడు, సుభద్రుడు, వాముడు, ఆయువు, సత్యకుడు అనే పిల్లలు పుట్టారు.

🌷6. సుదంత (నాగ్నజితి):

నగ్నజిత్తు కృష్ణుడు ఏడు రూపాలను ధరించి ఏడు ఎద్దులను ఒక్కొక్క గుద్దు గుద్ది లొంగదీసుకుని వాటిని తాళ్ళతో బంధించి పెళ్ళి చేసుకున్నాడు.

 నాగ్నజితి కోసల దేశాధిపతియైన నాగ్నజిత్తు కుమార్తె. ఈ రాజు నగరంలోని ఏడు వృషభములు ప్రజలకు అపాయము చేయుచున్నవి. రాజ్యంలో ఎవ్వరును వీటిని పట్టలేక పోతారు. రాజు వీటిని పట్టగలవానిని తన కూతురు నిచ్చి వివాహము చేయుదునని ప్రకటించెను.

 శ్రీ కృష్ణుడు ఆ ప్రకటన విని కౌసల్యకు వెళ్ళి ఆ వృషభాలను వధించి నాగ్నజితిని పరిణయమాడెను.

నాగ్నజితి, కృష్ణులకు వీరుడు, చంద్రుడు, అశ్వసేనుడు, చిత్రగుడు, వేగవంతుడు, వృషుడు, లముడు, శంకుడు, వసుడు, కుంతి అనే పిల్లలు కలిగారు.

🌷7. కాళింది:

కాళింది సూర్యుని కూతురు. ఆమె విష్ణుమూర్తి భర్త గావాలని తపస్సు చేసింది. 

కృష్ణార్జునులు యమునా నదిలో స్నానం చేయటానికి వెడితే అక్కడే ఉన్న ఆమెను చూచి అర్జునుడు ఆమె వివరాలు అడిగి ఆమె మనోగతాభిప్రాయం కృష్ణునికి చెప్పి యిద్దరికీ సంధానం చేశాడు. 

గోపాలుడు ఆమె భక్తికి మెచ్చి ఆమెను ద్వారక తీసికెళ్ళి వివాహం చేసుకున్నాడు. పెద్దలందరి ముందు పెళ్ళాడాడు.

కృష్ణుడికి కాళింది వల్ల శ్రుతుడు, కవి, వృషుడు, వీరుడు, సుబాహుడు, భద్రుడు, శాంతి, దర్శుడు, పూర్ణమానుడు, శోమకుడు అనే కుమారులు జన్మించారు.

🌷8. లక్షణ:

మద్ర దేశపు రాజకుమారి. మత్స్యయంత్ర పరీక్ష. స్వయంవరంలో యంత్రాన్ని పడగొట్టి లక్షణను చేపట్టాడు.

లక్షణకు, శ్రీకృష్ణుడికి ప్రఘోషుడు, గాత్రవంతుడు, సింహుడు, బలుడు, ప్రబలుడు, ఊర్ధ్వగుడు, మహాశక్తి, సహుడు, ఓజుడు, అపరాజితుడు అనే సంతానం కలిగింది.

No comments: