మన సాంప్రదాయంలోని కొన్ని భోజన నియమాలు
💕 *భోజనానికి ముందు,తరువాత తప్పక కాళ్ళు, చేతులు కడుక్కోవాలి. తడికాళ్ళను తుడుచుకుని భోజనానికి కూర్చోవాలి.*
💕 *తూర్పు, ఉత్తరం వైపు కూర్చుని భోజనం చేయడం మంచిది.*
💕 *ఆహార పదార్థాలు(కూర, పప్పు, పచ్చళ్ళు, మొ.) తినే పళ్ళానికి తాకించరాదు.* *అలా చేస్తే అవి ఎంగిలి అవుతాయి.* *ఎంగిలి పదార్థాలు ఎవ్వరికీ పెట్టరాదు.*
💕 *అన్నపు పాత్రలో నేతి గిన్నెను పెట్టి కాచడం చేయరాదు.* *మెతుకులు నేతిలో పడరాదు.*
💕 *భోజనం చేస్తున్నప్పుడు మధ్యలో లేవకూడదు.*
💕 *ఎంగిలి చేతితో ఏ పదార్థాన్ని చూపించరాదు.తాకరాదు.*
💕 *ఎడమచేతితో తినే కంచాన్ని ముట్టుకోకూడదు.* *ఒకవేళ కంచాన్ని ముట్టుకుంటే వెంటనే ఎడమచేతితో నీటిని ముట్టుకోవాలి.*
💕 *సొట్టలు ఉన్న కంచం, విరిగిన కంచం భోజనానికి పనికిరాదు.*
💕 *నిలబడి అన్నం తింటూ ఉంటే క్రమంగా దరిద్రులు అవుతారు.*
💕 *భగవన్నామము ఉచ్చరించి భోజనం చేయాలి.*
💕 *అన్నం తింటున్నప్పుడు వంట బాగాలేదని దూషించడం, కోపముతో అన్నం పెట్టేవారిని తిట్టడం చేయరాదు.*
💕 *కంచం ఒడిలో పెట్టుకుని భోజనం చేయరాదు. పడుకునే మంచం మీద భోజనం చేయరాదు.*
*(ఇది వృద్ధులకు, అనారోగ్యం ఉన్నవారికి వర్తించదు.)*
💕 *మాడిన అన్నాన్ని నివేదించరాదు.అతిథులకు పెట్టరాదు.*
💕 *భోజనం అయ్యాక క్షురకర్మ చేసుకోరాదు.*
💕 *గురువులు, పెద్దవాళ్లు ఇంటికి వస్తే మనం తినగా మిగిలినవి పెట్టరాదు.మళ్ళీ ప్రత్యేకంగా వంటచేయాలి.*
💕 *భోజనం వడ్డించేటప్పుడు పంక్తిబేధం చూపరాదు. అనగా ఒకరికి ఎక్కువ వడ్డించడం మరొకరికి తక్కువ వడ్డించడం చేయరాదు.*
💕 *భోజనం చేస్తున్నప్పుడు తింటున్న పదార్థాలలో వెంట్రుకలు, పురుగులు వస్తే తక్షణం విడిచిపెట్టాలి.*
💕 *భగవన్నామము స్మరిస్తూ,*
*భగవత్ కథలు వింటూ వంట చేయడం,భోజనం చేయడం చాలా ఉత్తమం.*
💕 *ఉపాసకులను, ఏదైనా దీక్షలో ఉన్నవారిని ఎక్కువ తినమని బలవంతపెట్టరాదు. ( అతిగా ఆహారం స్వీకరిచడం వారి అనుష్ఠానానికి ఇబ్బంది అవ్వచ్చు)*
💕 *గిన్నె మొత్తం ఊర్చుకుని తినరాదు.*
💕 *ఆహార పదార్థాలను కాళ్ళతో తాకరాదు.*
💕 *భోజనం చేస్తున్నప్పుడు నీళ్ళ పాత్రను కుడివైపు ఉంచుకోవాలి.*
💕 *అరటిఆకుల వంటి వాటిలో భోజనం చేసిన వ్యక్తి వాటిని మడవకూడదు.(తిన్న విస్తరిని మడవడం అనాచారం). తన ఇంటిలో తాను ఒక్కడే ఉన్నప్పుడు ఈ నియమం వర్తించదు.*
💕 *ఎంగిలి విస్తరాకులను తీసేవాడికి వచ్చే పుణ్యం అన్నదాత కు కూడా రాదని శాస్త్రం.*
*(జగద్గురువైన శ్రీ కృష్ణుడు కూడా ధర్మరాజు చేసిన రాజసూయయాగం లో లక్షలాది మంది తిన్న ఎంగిలి ఆకులు ఎత్తాడని మహాభారతం చెబుతోంది.)*
💕 *భోజనం అయ్యాక రెండుచేతులూ,కాళ్ళూ కడుక్కోవాలి.* *అవకాశం లేనప్పుడు రెండు చేతులైనా తప్పక కడుక్కోవాలి.*నోరు నీటితో పుక్కిలించుకోవాలి.*
💕 *భోజనం అయ్యాక నేలను లేదా బల్లను శుద్ధి(మెతుకులు తీసేసి,తిన్న చోట తడిగుడ్డతో శుభ్రం) చేసి మాత్రమే అక్కడ వేరేవారికి భోజనం వడ్డించాలి.(ఇప్పటికీ సదాచారాలు పాటించే కొందరి ఇళ్ళల్లో గోమయం లేదా పసుపు నీళ్ళు చల్లి మరీ శుద్ధి చేస్తారు.)*
💕 *స్నానం చేసి మాత్రమే వంట వండాలని కఠోర నియమము.*
*పెద్దలు,సదాచారపరులు హోటళ్ళలో మరిఎక్కడంటే అక్కడ భోజనం చేయకపోవడానికి ఇదే ముఖ్యకారణం.అక్కడ వంట చేసే వారు స్నానం చేసారో లేదో తెలియదు*
💕 *పాచిముఖంతో వంట చేసినా, రోడ్డు మీద తిరిగే చెప్పులు ధరించి వంటచేసినా దోషం.అవి తిన్న వారికి మెల్లగా వారి మనసుపై ప్రభావం చూపుతుంది. పుణ్యం క్షీణిస్తుంది.*
💕 *ఒకసారి వండాక అన్నము, కూర, పప్పు వంటి ఇతర ఆహార పదార్థాలను మళ్ళీ వేడి చేసి తినరాదు.ద్విపాక దోషం వస్తుంది.*
💕 *ఆడవారు గాజులు ధరించకుండా భోజనం చేయరాదు. వడ్డించరాదు.*
❤️ *ॐశ్రీవేంకటేశాయ నమః*
No comments:
Post a Comment