Adsense

Friday, July 22, 2022

గుహలో అనంత పద్మనాభ స్వామి (ఉండవల్లి - గుంటూరు జిల్లా, తాడేపల్లి మండలం

             

🌿ఉలి మలచిన  ఉన్నత కళా
శిల్పరూపాలతో   
ఉండవల్లి గుహలు ప్రతిష్టాత్మకంగా నిలిచివున్నాయి.

🌸ఈ గుహలో  ఆనందంగా
శయన భంగిమలో
దర్శనమనుగ్రహిస్తున్నాడు
అనంత పద్మనాభ స్వామి.
🌿 ఉండవల్లి  ఆంధ్రప్రదేశ్ లోని
గుంటూరు జిల్లా తాడేపల్లి
మండలానికి చెందిన  ఒక
గ్రామము.

🌸 అమరావతి చుట్టూ
వున్న గ్రామాల్లో ఇది ఒకటి. 
ఇక్కడ ఒక కొండ వరసలో
ముందు భాగము నుండి
లోపలికంటా దొలుచుకుంటూ
పోయి,
🌿 నాలుగు అంతస్తులుగా  శిల్పకళతో అద్భుతాలను
సృష్టించారు.  వీటిలో 
గుహాలయాలు, శిల్పాలు
అత్యంత   సౌందర్యం
మలచబడి  సందర్శకులను అమితంగా  ఆకర్షిస్తున్నాయి. 

🌸అనంతపద్మనాభ స్వామి
నరసింహ స్వామి  ప్రధాన దైవాలుగా   ఈ  ప్డడడలచీన గుహల్లో కొలువై దర్శనమిస్తున్నారు.  

🌿ఒకే బండ మీద మలచిన  20 అడుగుల ఏకశిలా విగ్రహంగా అనంతపద్మనాభుడు  దర్శకుల కనులకి, మనసుకి పవిత్రతను
ఆనందం కలిగిస్తుంది. 

🌸ఇందుతోపాటూ , 
బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల
ముమ్మూర్తులకు గుహాలయాలు వున్నాయి. 

🌿ఇక్కడ వున్న శిల్ప కళా శైలి అజంతా, ఎల్లోరా శిల్పాలని
తలపింప చేస్తాయి. 

🌸ఈ శిల్పశైలి  గుప్తుల కాలంనాటి ప్రధమ భాగానికి  చెందినట్లు
భావించబడుతున్నది.  

🌿ఈ గుహాలయాలు ,  
విష్ణు కుండినులు రాజ్యమేలుతున్న కాలంనాటివిగా  చెప్ప బడుతున్నవి. 

🌸ఈ గుహలు  బయటికి
బౌధ్ధ విహారాల వలె కనబడినప్పటికి ,  
గుహాలయములుగానే
ఆంధ్రప్రదేశ్ లో ప్రఖ్యాతి చెందాయి.

🌿ఈ ఆలయాలు  బౌధ్ధ హిందూమత సంగమంగా కనిపిస్తాయి. ఈ గుహాలయాల మొదటి అంతస్తులో, 
నరసింహ స్వామి, వినాయకుడు, దత్తాత్రేయుడు ఇతర శిల్పాలు  మలచబడి వున్నాయి. 

🌸ఋషులు, సింహాల శిల్పాలు కూడా వున్నవి. స్ధంభాల మీద కూడా కొన్ని
శిల్పాలు కనిపిస్తాయి. 

🌿రెండవ అంతస్తులో  శయన
భంగిమలో అనంతపద్మనాభ
స్వామి దర్శనమిస్తున్నాడు.

🌸గర్భాలయం ముఖ ద్వారము 
వద్ద జయ విజయుల విగ్రహాలు నిలబడిన భంగిమలో వున్నాయి.  అనంతపద్మనాభ స్వామి విగ్రహం  పొడవుగా సర్ప శయనంగా  గోచరిస్తుంది.

🌿ఈ గుహాలయం  లోపల 
తామరపుష్పం లో ఆశీనుడైన
బ్రహ్మ,  సప్త ఋషుల , పలు దేవతల   శిల్పాలు   వున్నవి.

🌸కొండ వెలుపల, గుహ పై భాగాన సప్త ఋషుల పెద్ద పెద్ద శిల్పాలు   మలచబడి దర్శనమిస్తాయి.

🌿మూడవ అంతస్తులో అసంపూర్ణంగా మలచబడని
త్రికూట ఆలయం వున్నది.
దీనిలో శిల్పాలు ఏమీ లేవు.

🌸యీ గుహాలయాలు మధ్య మధ్య వున్న స్ధంభాలతో, 
వాటి మీద చెక్కిన లతలు, 
గుహాలయ గోడల మీద చెక్కిన దైవ శిల్పాలతో,

🌿ఆలయాలు విశాలంగా కనిపిస్తాయి.
ఒకే కొండని  గుహలుగాను, దైవ శిల్పాలుగాను, ఏక శిలపై చెక్కి  నిర్మించిన

🌸శిల్పుల  శిల్పకళా నైపుణ్యాన్ని
మెచ్చుకోకుండా వుండలేము.
గుహాలయాల  చుట్టూ పచ్చని
చేలు కళ్ళకి విందు చేస్తాయి. 

🌿ఈగుహ నుండి సొరంగ మార్గాలు.. 
ఆ కాలంలో పాలించిన 
కొండవీటి రాజుల కోటలోకి, 
మంగళగిరి కొండకి, విజయవాడ కనక దుర్గా దేవి ఆలయానికి 

🌸 రహస్య మార్గాలు వున్నట్టు తెలుస్తోంది.  ఆ కాలంలో ఈ మార్గాలగుండా  శత్రువులకు తెలియకుండా
యుధ్ధ సైనికులను  పంపడానికి వుపయోగించే వారట. 

🌿ఇప్పుడవి  పూర్తిగా శిధిలమై మూసుకు పోయి, పాడైపోయివున్నాయి.
ఉండవల్లి గుహాలయాలకు
గుంటూరు, విజయవాడ నగరాల నుండి  రోడ్డు మార్గాలు వున్నవి. 

🌸గుంటూరు నుండి 30 కి.మీ
దూరములోను,  విజయవాడ నుండి , 6 కి .మీ దూరంలోనూ వున్నవి. 

🌿ఉదయం  6 గం..
నుండి  సాయంకాలం 5 గం.30 ని ..   వరకు   యాత్రీకులు సందర్శనార్ధం అనుమతిస్తారు...

No comments: