🌿స్వతంత్ర్య నాయకీ సమేత వాగీశ్వరుని దేవాలయం తమిళనాట మైలాడుతురై కు సమీపమున వున్న పెరుంచేరి లొ వున్నది.
🌸విశాల ప్రాంగణం లో నిర్మించబడ్డ ఈ ఆలయంలో ధ్వజస్ధంభం , నంది, బలి పీఠం దాటిన తరువాత
మూడు అంతస్తుల రాజగోపురం దర్శనమిస్తుందీ.
🌿దాని తరువాత వున్న ముఖ్య మండపానికి కుడి ప్రక్కన అమ్మవారి సన్నిధి. మహామండపం
దాటేక అర్ధ మండపం , గర్భగుడి వున్నాయి.
🌸గర్భగుడి లో వాగీశ్వరుడు
లింగరూపంలో తూర్పు
ముఖంగా అనుగ్రహిస్తున్నాడు.
పానువట్టం చతురంగా వుండడం, విమానం ఇంద్ర విమానము వలె
వలయాకారంలో వుండడం యీ ఆలయ ప్రత్యేకత.
🌿ఆలయ లోపలి ప్రాకారంలో, సరస్వతీ దేవి పరమేశ్వరునికి పూజచేసే
శిల్పం అత్యద్భుతంగా
మలచబడి వున్నది.
🌸ఆవరణకి దక్షిణమున
వినాయకుడు సరస్వతి,
దక్షిణామూర్తి, పడమట
అణ్ణామలైయారు, ఉత్తరాన బ్రహ్మ, దుర్గాదేవి
దర్శనం అనుగ్రహిస్తున్నారు.
🌿తూర్పు ప్రాకారంలో నాలుగు భైరవమూర్తులు వున్నాయి.
ఇప్పుడు ఈ వాగీశ్వరాలయ స్థల మహత్యం గురించి తెలుసుకుందాము.
🌸గురుభగవానుడు వేద, వేదాంగాలు , సకల ఆగమాలు, భూత, వర్తమాన ,భవిష్యత్ లు
తెలిసిన గొప్ప జ్ఞాని .
🌿ఈయననే బృహస్పతి అని అంటారు
ఈయన భార్య తార సౌందర్యవతి.
గురువు ఆశ్రమంలో గురుకుల వాసం చేసే విద్యార్థుల లో చంద్రుడు కూడా ఒకడు.
🌸ఆ చంద్రుడు తారను మోహిస్తాడు. ఆమె కూడా చంద్రుని కోరుకుంటుంది.
వీరి విషయం తెలిసిన గురువు చంద్రుడు కుష్టు వ్యాధితో క్షీణించమని శపించాడు.
🌿ఒకసారి గురు భగవానుడు, మయూరంలో వున్న దక్షిణా మూర్తిని తనకు దేవతలకి గురువుగా వుండే పదవి కలగాలని వేడుకున్నాడు.
🌸పరమేశ్వరుడు , గురువు కోరిక నెరవేరడానికి, పెరుంచేరి పవిత్ర స్ధలంలో శివలింగాన్ని ప్రతిష్టించి, పూజించమని చెప్పాడు.
🌿ఆ విధంగా తీర్ధయాత్రకి బయలుదేరిన గురువు పెరుంచేరికి వచ్చి, పంచాగ్నిని ప్రజ్వలింప చేసి, పరమశివుని గురించి తపమాచరించి ఆత్మ జ్ఞానాన్ని పొందాడు.
🌸ఆత్మ జ్ఞానాన్ని పొందిన గురుభగవానుని దేవతలకి గురువుగా నియమించాడు పరమేశ్వరుడు.
అందువలన ఈ స్ధల ఈశ్వరుడు జ్ఞానాన్ని అనుగ్రహించినందున
వాగీశ్వరుని పేరుతో పిలుస్తారు.
🌷అలాగే మరొక కధ కూడా ఇక్కడ చెపుతారు.🌷
🌸ఉమాదేవిని పుత్రికగా పొందిన దక్షుడు ఒక గొప్ప యజ్ఞం తలపెట్టాడు. ఆ యాగానికి తన అల్లుడైన పరమశివుని తప్ప బ్రహ్మాది దేవతలనందరిని ఆహ్వానించి పరమేశ్వరుని అవమానించాడు.
🌿దేవతలందరూ పత్నీ సమేతంగా ఆ యాగానికి వెళ్ళేరు. విషయం తెలిసిన దక్షుని కుమార్తె ఉమాదేవి
శివుడు వద్దంటున్నా వినక దక్షుని యాగాన్ని నిలిపి వేయాలని
🌸వెళ్ళిన పార్వతీ దేవికి తండ్రి వలన అవమానం పొంది ఆ క్రోధంతో యాగ గుండంలో దూకి ఆత్మాహుతి చేసుకున్నది.
🌿ఇది తెలిసిన పరమశివుడు మహోగ్రుడై త్రినేత్రాన్ని
తెరవగా, ఆ నేత్రము నుండి వీరభద్రుడు ఆవిర్భవించాడు.
🌸 దక్షుని యాగ శాలకు వెళ్ళిన వీరభద్రుడు, ఈశ్వరుని యొక్క ఆవిర్భాగము యిమ్మని అడుగగా ,
🌿దక్షుడు ఇవ్వడానికి అంగీకరించక మాటలతో పరమశివుని తీవ్రంగా అవమానించాడు .
రుద్రమూర్తి అయిన వీరభద్రుడు యాగశాలని విధ్వంసం చేసి అక్కడకు వచ్చినవారందరిని హింసించాడు.
🌸దేవతలందరూ భయంతో కేకలు పెడుతూ పరుగులు పెట్టేరు.
వీరభద్రుని ఆవేశంనుండి సూర్యుడు, చంద్రుడు , యముడు, నైఋతి, కుబేరుడు, వాయువు ,ఇంద్రుడు కూడా ఎవరూ వీరభద్రుని నుండి తప్పించుకోలేక పోయారు.
🌿అభయం అడిగి శరణు వేడుకొన్న వారిని మన్నించి వదలివేశాడు. బ్రహ్మదేవుడు, సరస్వతీదేవి వీరభద్రుని చేతీకి చిక్కేరు.
🌸బ్రహ్మదేవుని తల మీద మోదగా క్రింద పడిపోయాడు బ్రహ్మదేవుడు. ప్రక్కనే నిలబడిన సరస్వతీ దేవి
ముక్కు కోసి అవమానించాడు.
🌿ఆఖరికి దక్షుని తల నరికి భూమి మీద పడకుండా దానిని యాగ గుండానికి ఆహూతి చేశాడు.
🌸పిదప ప్రక్కనే వున్న ఒక మేక తల తీసువచ్చి దక్షునికి అమర్చాడు.
ముక్కు కోయబడిన సరస్వతి , అవమానంచెంది వేదనతో, బ్రహ్మదేవుని వద్ద దుఃఖించినది.
🌿బ్రహ్మదేవుడు సరస్వతీ దేవితో, " శివుడు శాంతిస్తే సమస్తం చక్కబడుతుందని బ్రహ్మ చెప్పడంతో సరస్వతీ దేవి పెరుంచ్చేరి పుణ్యస్ధలానికి
వచ్చి అక్కడ వున్న
వాగీశ్వరుని గురించి తపస్సు చేసింది.
🌸తపస్సును మెచ్చిన వాగీశ్వరుడు సరస్వతీదేవికి దర్శనమిచ్చాడు.
తన అంగ విహీనతను రూపుమాపి , అందరి నాల్కల మీద నివసించి వారికి వాక్పటిమ అనుగ్రహించేలా వరాలు కోరుకున్నది.
🌿సరస్వతి కోరినవిధంగానే వరములు
అనుగ్రహించాడు పరమేశ్వరుడు.
సరస్వతీదేవి పోయిన ముక్కుని తిరిగి పొంది, బహ్మ దేవుని చేరి, వాక్పటిమని అనుగ్రహించే శక్తి ని పొందినది.
🌸సుమారు 800 సంవత్సరాలు పురాతనమైన యీ వాగీశ్వరాలయ స్థలవృక్షం పన్నీరు వృక్షం.
🌿గురు భగవానుడు
దేవ గురువు గా పదవి పొందిన పుణ్య క్షేత్రం అవడం వలన, గోచార గురువు యొక్క దొషపరిహార స్ధలంగా కూడా ఈ ఆలయం ప్రసిధ్ధి పొందివున్నది.
🌸మంచి వాక్కు , జ్ఞానం కావాలని కోరుకునే భక్తులు తప్పక దర్శించ
వలసిన ఆలయం.
No comments:
Post a Comment