🌿స్వామిమలై
స్వామినాధన్ దర్శనానికి
కొండ మెట్లు ఎక్కడానికి ముందు అక్కడ వున్న పుష్కరిణిలోని తీర్ధాన్ని
నెత్తిన జల్లుకోవాలి.
🌸చల్లని ఆ తీర్థజలాన్ని తాకి జల్లుకోగానే
మనసుకు , దేహానికి ఒక పవిత్రమైన
భావం కలుగుతుంది.
🌿పుణ్యక్షేత్రాల లోని తీర్ధాలకి ఎన్నో
మహిమలు వున్నాయి.
ఈ తీర్ధంలోనే స్వామినాథన్ తెప్పోత్సవం జరిగుతుంది.
🌸ఈ స్వామి దర్శనానికి
మొత్తం 60 మెట్లు ఎక్కాలి. ఒక్కొక్క
మెట్టు ఎక్కుతుంటేనే మనసులో వుండే భారాలన్నీ తీరినట్లనిపిస్తుంది.
🌿కుమారస్వామి సన్నిధికి ముందు సాధారణంగా మయూరం వుంటుంది.
కాని స్వామినాథన్ ఆలయంలో ఏనుగు వుంటుంది.
🌸భక్తులు స్వామినాథన్ దివ్యమంగళ రూపాన్ని దర్శించగానే తనువంతా పులకరించి తెలియకుండానే కన్నుల నుండి ఆశ్రువులు వస్తాయి.
🌿స్వామి సన్నిధానంలో , అర్చకులు ఇచ్చే దీపారాధన హారతి కాంతిలో స్వామినాధ స్వామి "నేనుండగా భయం ఎందుకు?" అన్నట్లు చిరునవ్వుతో దర్శనమిస్తాడు.
🌸ఆ దీప కాంతులమధ్య కుమారస్వామి
దివ్యమంగళ విగ్రహం ప్రకాశిస్తూంటుంది.
🌿స్వామినాధ స్వామి దర్శనంతో, భక్తుల పాపాలు , సమస్యలు సమస్తం పటాపంచలౌతాయని
భక్తుల విశ్వాసం.
🌸కుమారస్వామి నివాసముండే ఆరు ప్రముఖ ఆరుపడై క్షేత్రాలలో స్వామిమలై ఒకటి. స్వామిమలై మీద సుబ్రహ్మణ్య స్వామి తనే సర్వాంతర్యామిగా అవతరించాడు.
🌿దానికి ఒక ఉదాహరణ..
సాధారణంగా పంచమూర్తుల
ఊరేగింపు జరుగుతుంది.
సోమస్కందుడు వినాయకుడు, మురుగన్,
🌸పరాశక్తి మూర్తి, చండికేశ్వరుడు మొదలైనవారికి ఊరేగింపు
జరుపుతారు. కాని ఈ ఆలయంలో
వళ్ళీ , దేవసేనా సమేత
సుబ్రహ్మణ్యేశ్వర స్వామి,
🌿బాల దండాయుధపాణి,
వినాయకుడు, చండికేశ్వరుని
మాత్రం ఊరేగిస్తారు.
ఇక్కడ అమ్మవారు పరాశక్తి,
అయ్యవారు పరమేశ్వరుడు
సుబ్రహ్మణ్యేశ్వర స్వామి
స్వరూపం.
🌸ఇక్కడ వున్న నటరాజస్వామి సుబ్రహ్మణ్య
స్వామి స్వరూపమే.
మార్గశిర మాసంలో ఆరుద్రా
నక్షత్రం రోజున జరిగే
"తిరువాదిరై" అభిషేకం
సుబ్రహ్మణ్య స్వామికే చేస్తారు.
🌿ఇక్కడ ప్రవహించే కావేరినదికి
పేరు కుమారధార.
ఇక్కడ సర్వం స్వామినాధమయం.
ఈ ఆలయంలో వున్న వినాయకుడు " నేత్ర వినాయకుడు" .
🌸ఒకనొక సమయంలో , కళ్ళు కనబడని ఒక భక్తునికి కంటిచూపుని ప్రసాదించాడని ఐహీకం. సుబ్రహ్మణ్య స్వామి దయామయుడు.
🌿జీవితమంతా కష్టాలతో కాలం గడుపుతూ తనను
వేడుకునే భక్తుల సమస్యలను కష్టాలను తీర్చి కరుణతో అనుగ్రహం ప్రసాదించేది ఈ వైద్యనాధుడే.
🌸స్వామినాధస్వామి మహిమ గురించి ప్రచారంలో వున్న గాధ.
సుమారు నలభై సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన :
🌿బొంబాయి నుండి ఒక వ్యక్తి తన భార్య , బిడ్డతో వచ్చాడు. పాప బంగారు బొమ్మలా చక్కగా చూడ ముచ్చటగా వుంది. భక్తుల రద్దీ అంత ఎక్కువగా లేని సమయం.
🌸వారు ముగ్గురూ స్వామి సన్నిధిలో కూర్చున్నారు. వారి కళ్ళ వెంట ధారగా నీరుకారిపోతోంది..అది చూసిన అర్చకుడు కారణం అడిగాడు. వారి సమాధానం విన్న అర్చకుడి నోట మాట రాక నిశ్చేష్టుడైయ్యాడు.
🌿ఆ దంపతులకు ఆ పాప ఒక్కతే శిశువు. ఎంతో గారాబంగా పెంచుతున్నారు.
దురదృష్టం , ఆ పాపకి పుట్టినప్పటి నుండి హృదయంలో రంధ్రం వున్నదట. ఎంత తొందరగా
ఆపరేషన్ చేస్తే అంత మంచిదని డాక్టర్లు చెప్పేరట.
🌸చేయవలసిన ఆపరేషన్ కొంచెం కష్ట తరమైనదని కూడా చెప్పడంతో పాప విషయంలో ఆ తల్లిదండ్రులు యమయాతన అనుభవిస్తూ
ఆపరేషన్ కి ముందు
స్వామినాధ స్వామిని దర్శించుకోవాలని వచ్చారట.
🌿అర్చకుడు ఏమీ సమాధానం చెప్పలేదు విని వూరుకున్నాడు. ఆ నాడు
స్వామికి చందన పూత అలంకారం.
🌸 అర్చకుడు స్వామి వక్షస్ధలం నుండి కొంచెం చందనం తీసి ఆ పాప తల్లి
తండ్రులకిచ్చి, తమ ఊరు చేరగానే
11 రోజుల పాటు
🌿రాత్రి పూట కొంచెం కొంచెం గా యీ చందనాన్ని పాలలో కలిపి యివ్వమని , తరువాత డాక్టర్ దగ్గరకు వెళ్ళి చూడమని ధైర్యం చెప్పి పంపాడు.
🌸తరువాత అర్చకుడు
ఆ విషయం గురించే మర్చిపోయాడు.
తరువాత మరొక మాసానికి అర్చకునికి బొంబాయి నుండి ఒక ఉత్తరం వచ్చింది. అందులో ఇలా వుంది.
🌿" నాగరాజ అర్చకులకి వందనాలు. (అది అర్చకుని పేరు) బొంబాయి రాగానే
మీరు చెప్పినట్టు పాపకి నిత్యం
కొంచెం కొంచెం గా చందనం
కలిపి ఇచ్చాను.
🌸11 రోజుల తరువాత డాక్టరు వద్దకి చెకప్ కి తీసుకు వెళ్ళేము. ఆపరేషన్ కి అడ్మిట్ చేసుకుని కొన్ని పరీక్షలు జరిపారు.
🌿మేము స్వామినాధ స్వామి మీద భారం వేసి , పరీక్షలు
ముగించుకొని అడ్మిట్
అయ్యేము.
🌸పరీక్షలు జరిపిన రిపోర్టు లు పట్టుకొని వైద్యులు మా రూమ్ కి వచ్చారు. ఎప్పుడు ఆపరేషన్
చేస్తారోనని ఎదురు చూస్తున్నాము.
🌿 మా పాపకు ట్రీట్మెంట్ ఇస్తున్న వెద్యుడు నవ్వుతూ, ' సార్ మేము నమ్మలేకపొతున్నాము.
ఇప్పుడు తీసిన ఎక్స్ రే లలో మీ పాపకి హృదయంలో రంధ్రమే
కనపడలేదు.
🌸చాలా మిరకిల్ గా వున్నది పాపకు ఏ విధమైన ఆపరేషన్ అవసరంలేదు. చాలా ఆరోగ్యంగా వుంది. పాపను మీరు ఇంటికి తీసుకు వెళ్ళిపోవచ్చు.
అని చెప్పి మమ్మల్ని ఇంటికి
పంపేశారు.
🌿స్వామిమలై స్వామినాధ స్వామి మా జీవితంలో పాలు పోశాడు" అన్నది
ఆ ఉత్తరం లోని సారాంశం.
🌸కరుణామయుడైన స్వామినాధ స్వామిని ఏం కోరుకున్నా లేదనే మాటే ఉండదు. స్వామిమలై కొండకి 60 మెట్లుంటాయి . అవి మన సంవత్సరాల పేర్లకి సంకేతంగా చెపుతారు.
🌿ఈ స్వామియే కాలాలన్నింటికీ అధిపతిగా అర్ధం చేసుకోవాలి. స్వామి సన్నిధిలోని నాలుగు మెట్లు నాలుగు వేదాలు.
🌸ఈ స్వామినాధనే వేదబ్రహ్మ స్వరూపంగా దర్శన మనుగ్రహిస్తున్నాడు.
🌿స్వామినాధ స్వామి యీ కొండమీద గురువుగా కూడా గోచరిస్తాడు. తన
తండ్రి అయిన పరమేశ్వరునికే
మంత్రోపదేశం చేసిన స్ధలం యిది.
🌸సాధారణంగా గురువు స్వభావం ఏమిటంటే తనను శరణు వేడుకొన్న
జీవాత్మల స్థితి , స్థాయి, అంతస్తులతో నిమిత్తం లేకుండా తన
దివ్యశక్తితో తన ఉపదేశాన్ని కోరి వచ్చినవారిని కరుణతో అనుగ్రహిస్తారు.
🌿స్వామినాధ స్వామి శరణు కోరుకొన్న భక్తులకి సర్వ శుభాలు లభిస్తాయి...స్వస్తి...
No comments:
Post a Comment