26వ గర్గ మహర్షి గురించి తెలుసుకుందాము..
🌿 దేవకీ వసుదేవులకు పుట్టిన కృష్ణుడు యశోదా నందుల వద్ద పెరిగాడు. మరి కృష్ణ అని నామకరణం చేసినది ఎవరు?
🌸"కృష్ణ " అన్న పేరే సరైనది అని ఎవరు నిర్ణయించారు. ? శ్రీ కృష్ణుని జన్మ రహస్యం తెలిసినవారు మాత్రమే ఈ పనులు చేయగలరు. వారే... గర్గ మహర్షి.
🌿 భరద్వాజ వంశం లో పుట్టగానే శివ భక్తుడైన గర్గ మహర్షి శివుడ్నే గురువు
గ చేసుకొని తపమాచరించినాడు. సకల విద్యలు శివుడినుంచే పొందినాడు.
🌸 ఇటువంటి గర్గ మహర్షి యదు వంశానికి కుల గురువు. యశోదా మాతకు శ్రీ కృష్ణుని జన్మ రహస్యాన్ని తెలిపినారు.
🌿 శ్రీకృష్ణుడు ... గో లోక వాసి అని స్పష్టం చేసిన వారు గర్గ మహర్షి. శ్రీ కృష్ణ సహస్ర నామావళి లో "గర్గ:" నామం కూడా కనిపించడం విశేషం.
🌸దీని గురించి సద్గురువర్యులు "మార్గ దర్శకులు మహర్షులు " గ్రంథం లో వివరిస్తూ శ్రీ కృష్ణ తత్త్వం లో మహా యోగియే గర్గుడని వెళ్లడించారు.
🌿గర్గ మహర్షికి స్వయంగా శివుడే గురువు . గర్గుడికి అన్ని విద్యలు శివుడే నేర్పించాడు . గర్గుడు బ్రహ్మమానస పుత్రుడు .
🌸ఆయన దగ్గర వేలకు వేలు శిష్యులు వేదాలు , శాస్త్రాలు నేర్చుకునే వాళ్ళు . హైహయవంశం వాళ్ళు , యాదవులు ఇంకా ఎంతోమంది రాజులు గర్గుడిని కులగురువుగా పెట్టుకున్నారు .
🌿 ఒకసారి గర్గుడు శిష్యుల్ని తీసుకుని దేవకీ వసుదేవుల కోరిక ప్రకారం వ్రేపల్లె వచ్చాడు . యశోద కృష్ణుడికి పాలిస్తూ ఒక బంగారు ఆసనంమీద కూర్చుంది .
🌸 శిష్యులతో సహా వచ్చిన గర్గ మహర్షిని చూసి యశోద సత్కారం చేసి కూర్చోమని చెప్పి మహర్షీ ! మీరెవరో గొప్ప తేజస్సుతో మనిషిరూపంలో ఉన్న విష్ణుమూర్తిలా ఉన్నారు .
🌿 మీ పేరు చెప్తారా ? అని అడిగి “ స్వామీ ! ఈ చిన్ని కృష్ణుణ్ని దీవించండి ” అంది యశోద .
🌸 గర్గుడు యశోదానందుల్ని చూసి తల్లీ ! నేను గర్గ మహర్షిని . మీకిద్దరికి ఏకాంతంలో నేను వచ్చిన పని చెప్తాను అన్నాడు .
🌿గర్గుడికి సాష్టాంగ నమస్కారం చేసి చెప్పండి అని రహస్య మందిరానికి తీసికెళ్ళారు యశోదానందులు .
గర్గ మహర్షి వాళ్ళతో కృష్ణుణ్ణి గురించి ఇలా చెప్పాడు .
🌸 మీ యింట్లో ఉన్న ఈ చిన్నవాడు దేవకీ వసుదేవుల కొడుకు . రోహిణికి పుట్టినవాడు ఇతనికి అన్న అవుతాడు .
🌿కంసుడు చంపేస్తాడనే భయంతో మీకు పుట్టిన కూతుర్ని తీసికొని ఈ పిల్లవాడిని ఇక్కడ ఉంచారు .
🌸 ఈ పిల్లవాడు సాక్షాత్తూ నారాయణుడే ! దుష్టుల్ని శిక్షించడానికి , శిష్టుల్ని రక్షించడానికి మనిషి రూపంలో పుట్టాడు నారాయణుడు .
🌿రాధేశ్వరడు , భార్గవీకాంతుడు , నలినాక్షుడు , నరనారాయణులు , కపిలుడు మొదలైన వారు విష్ణుమూర్తి అంశతో పుట్టినవాళ్ళే .
🌸అంతమంది కలిసి ఒకటిగా ఈ పిల్లవాడు పుట్టాడు . ఇతడు పుట్టగానే నిజస్వరూపం దేవకీ వసుదేవులకి చూపించాడు .
🌿ఇతడు ప్రతియుగంలోనూ పేరు రంగు మార్పులతో పుడతాడు . కృతయుగంలో తెల్లగాను , త్రేతాయుగంలో ఎర్రగాను , ద్వాపరయుగంలో పీతవర్ణంతోను ఇపుడు కృష్ణవర్ణంతో కృష్ణుడు అని పిలవబడతాడు అని చెప్పాడు గర్గ మహర్షి
🌸ఈ కృష్ణ అనే పేరులో ఎంత గొప్పతనం ఉందో చెప్తాను వినండని గర్గ మహర్షి యశోదానందులకిలా చెప్పాడు . కకారం బ్రహ్మవాచకం , ఋకారం అనంతవాచకం , షకారం వాచకం .
🌿 కృష్ణ నామం స్వరశక్తిమయం . ఈ పేరు పలకడం వల్ల మోక్షం కలుగుతుంది అని చెప్పాడు . కృష్ణుడికి ఇంకా ఎన్ని పేర్లున్నాయో చెప్పాడు గర్గ మహర్షి .
🌸 శ్రీకృష్ణుడు , పీతాంబరుడు , కంసధ్వంసి , విష్టరశ్రవుడు , దేవకీనందనుడు , శ్రీమంతుడు , యశోదానందనుడు , హరి సనాతనుడు , అచ్యుతుడు , విష్ణుడు , సర్వేశ్వరుడు , సర్వరూపధరుడు , సర్వాధారుడు , సర్వగతి ,
🌿 సర్వకారణకారుడు , పరిపూర్ణతముడు , పరబ్రహ్మ , గోవిందుడు , గరుడధ్వజుడు , రాధాబంధుడు , రాధికాంతరాత్మ , రాధికాజీవనుడు మొదలయినవి .
🌸ఈ పేర్లు వేదాల్లో కూడ ఉన్నాయనీ , ఈ పేర్లు పలకడం వల్ల పాపాలన్నీ పోతాయని చెప్పాడు గర్గ మహర్షి .
🌿ఈ పిల్లవాడి అన్న పేరు బలరాముడు . రాధాకృష్ణులు గోలోకంలో ఉన్న శ్రీరామ రాధికలే ! అని కృష్ణుడు చెయ్యబోయే అన్నీ పనుల గురించి విపులంగా చెప్పి జాతకర్మ ,నామకర్మ , అన్నప్రాశన అన్ని చేయించాడు గర్గ మహర్షి .
🌸గర్గ మహర్షి శ్రీకృష్ణుణ్ణి ఏకాంతంగా తీసుకువెళ్ళి ప్రదక్షిణ నమస్కారం చేస్తుంటే గర్గ మహర్షి శరీరం పులకరించింది .
🌿ఎదురుగా ఉన్నది చిన్నపిల్లవాడే అయినా విష్ణుమూర్తె కదా ! తన మనస్సెప్పుడు విష్ణుమూర్తి పాదపద్మాల మీదే లగ్నం అయ్యేట్లు చూడమని కోరుకున్నాడు గర్గ మహర్షి .
🌸గర్గ మహర్షి కొంతకాలం తపస్సు చేసుకుని కంసుడు కృష్ణుడి చేతిలో మరణించాక దేవకీవసుదేవుల దగ్గరకు శిష్యసమేతంగా వచ్చాడు .
🌿రామకృష్ణులకు ఉపనయనం చేసే వయస్సు వచ్చిందని , మంచి ముహూర్తం చూసుకుని కావలసిన సామగ్రిని సిద్ధం చేసుకుని తనకు కబురుపంపితే ఉపనయనం చేస్తానని చెప్పాడు .
🌸కృష్ణుడు తలుచుకోగానే బంధుమిత్రులు , మహర్షులు , సర్వదేవతలు అందరూ వచ్చారు .
🌿గర్గ మహర్షి బలరామకృష్ణులకి ఉపనయనం చేసి సాందీపని మహర్షి దగ్గర వాళ్ళని శిష్యులుగా పంపించాడు .
🌸హైహయ వంశం వాడయిన కార్తవీర్యార్జునుడికి గొప్ప వైరాగ్యం వచ్చి రాజ్యం వదిలేసి తపస్సు చేసుకుందుకు వెళ్ళిపోతానన్నాడు . అతని కులగురువు గర్గుడు ఎంత చెప్పినా వినలేదు .
🌿 అయితే నువ్వు దత్తాత్రేయుడి గురించి తపస్సు చెయ్యి అన్నాడు గర్గుడు . కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయుడి కోసం తపస్సు చేసి వరం పొంది ఆ గర్వంతో జమదగ్ని మహర్షి హోమధేనువుని తెచ్చేసుకున్నాడు .
🌸ఆ మహర్షిని హింస పెట్టవద్దని గర్గుడు ఎంత చెప్పినా వినలేదు కార్తవీర్యార్జునుడు . తర్వాత పరశురాముడి చేతిలో మరణించాడు .
🌿 ఒకసారి గర్గ మహర్షిని యాదవులు అవమానించారు . గర్గుడికి కోపం వచ్చి మూర్ఖులారా ! నావలన పుట్టిన కాలయవనుడు మిమ్మల్ని నానాబాధలు పెడ్తాడని శపించాడు .
🌸 యాదవులు తమ తప్పు తెలుసుకుని బాధపడి బ్రతిమాలుకున్నారు . కృష్ణుడు మిమ్మల్ని రక్షిస్తాడని చెప్పాడు గర్గ మహర్షి .
🌿యవనరాజు దగ్గర ఉన్న గర్గ మహర్షి తనకు సేవలు చేస్తున్న అప్సరసకి కాలయవనుడనే కొడుకుని ప్రసాదించాడు . తర్వాత గర్గుడు తపస్సు చేసుకుందుకు , అప్సరస తన లోకానికి వెళ్ళిపోయారు .
🌸 యవన మహారాజు కాలయవనుడ్ని పెంచాడు . కాలయవనుడు యాదవుల్ని నానా బాధలు పెడ్తుంటే కృష్ణుడు అతడ్ని చంపేశాడు .
🌿గర్గ మహర్షి “ గసంహిత ” రాశాడు . ఖగోళశాస్త్రాన్ని రాసిన ఈయన జ్యోతిష్యంలో కూడ గొప్పవాడు .
🌸గర్గ మహర్షి ఎంత గొప్పవాడో ధర్మప్రవక్తగా , వేదశాస్త్రాలు తెలిసిన వాడుగా , ఖగోళశాస్త్ర గ్రంథకర్తగా ,
జ్యోతిషశాస్త్ర పండితుడుగా ఎంత గొప్పవాడో చూశారా మరి ......
🌿 స్వయంగా భగవంతుడికి జాతకర్మ , నామకరణం , ఉపనయనం , చేశాడంటే
ఎంత గొప్ప పండిత మహర్షి.. !!
🌸ఇదండి గర్ల మహర్షి చరిత్ర
🌸హైహయ వంశం వాడయిన కార్తవీర్యార్జునుడికి గొప్ప వైరాగ్యం వచ్చి రాజ్యం వదిలేసి తపస్సు చేసుకుందుకు వెళ్ళిపోతానన్నాడు . అతని కులగురువు గర్గుడు ఎంత చెప్పినా వినలేదు .
🌿 అయితే నువ్వు దత్తాత్రేయుడి గురించి తపస్సు చెయ్యి అన్నాడు గర్గుడు . కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయుడి కోసం తపస్సు చేసి వరం పొంది ఆ గర్వంతో జమదగ్ని మహర్షి హోమధేనువుని తెచ్చేసుకున్నాడు .
🌸ఆ మహర్షిని హింస పెట్టవద్దని గర్గుడు ఎంత చెప్పినా వినలేదు కార్తవీర్యార్జునుడు . తర్వాత పరశురాముడి చేతిలో మరణించాడు .
🌿 ఒకసారి గర్గ మహర్షిని యాదవులు అవమానించారు . గర్గుడికి కోపం వచ్చి మూర్ఖులారా ! నావలన పుట్టిన కాలయవనుడు మిమ్మల్ని నానాబాధలు పెడ్తాడని శపించాడు .
🌸 యాదవులు తమ తప్పు తెలుసుకుని బాధపడి బ్రతిమాలుకున్నారు . కృష్ణుడు మిమ్మల్ని రక్షిస్తాడని చెప్పాడు గర్గ మహర్షి .
🌿యవనరాజు దగ్గర ఉన్న గర్గ మహర్షి తనకు సేవలు చేస్తున్న అప్సరసకి కాలయవనుడనే కొడుకుని ప్రసాదించాడు . తర్వాత గర్గుడు తపస్సు చేసుకుందుకు , అప్సరస తన లోకానికి వెళ్ళిపోయారు .
🌸 యవన మహారాజు కాలయవనుడ్ని పెంచాడు . కాలయవనుడు యాదవుల్ని నానా బాధలు పెడ్తుంటే కృష్ణుడు అతడ్ని చంపేశాడు .
🌿గర్గ మహర్షి “ గసంహిత ” రాశాడు . ఖగోళశాస్త్రాన్ని రాసిన ఈయన జ్యోతిష్యంలో కూడ గొప్పవాడు .
🌸గర్గ మహర్షి ఎంత గొప్పవాడో ధర్మప్రవక్తగా , వేదశాస్త్రాలు తెలిసిన వాడుగా , ఖగోళశాస్త్ర గ్రంథకర్తగా ,
జ్యోతిషశాస్త్ర పండితుడుగా ఎంత గొప్పవాడో చూశారా మరి ......
🌿 స్వయంగా భగవంతుడికి జాతకర్మ , నామకరణం , ఉపనయనం , చేశాడంటే
ఎంత గొప్ప పండిత మహర్షి.. !!
🌸ఇదండి గర్ల మహర్షి చరిత్ర
No comments:
Post a Comment