మన మహర్షుల చరిత్రలు
39వ దీర్ఘతమ మహర్షి గురించి తెలుసుకుందాము.
🌿ఈ మహర్షి ఉతథ్య మహర్షికి మమతకి పుట్టినవాడు . బృహస్పతి ఇతని తమ్ముడు .
🌸ఉతథ్యుడికి ఎప్పుడూ తపస్సు చేయడం , తీర్థయాత్రలు చేయడం , అంటే చాలా ఇష్టం .
🌿గొప్ప జ్ఞానవంతుడై వుండేవాడు . దేవతల గురువు బృహస్పతి ఈ మహర్షికి సోదరుడున్న మాట .
🌸ఉతథ్యుడి భార్య మమత గర్భవతిగా వున్న రోజుల్లో బృహస్పతి తన సోదరుణ్ణి చూడ్డానికి వచ్చాడు .
🌿మమత అతనికి అతిథి సత్కారాలు చేసింది . శాపగ్రస్థుడైన బృహస్పతి అన్న భార్య అని కూడ చూడకుండా ఆమెని బలవంతం చేశాడు .
🌸మమత కడుపులో వున్న పిల్లవాడు బృహస్పతిని అవమానించాడు . బృహస్పతి ఆపిల్లవాణ్ణి గుడ్డివాడుగా పుట్టమని శపించాడు .
🌿అలా పుట్టు గుడ్డివాడిగా పుట్టిన వాడే మన దీర్ఘతమ మహర్షి . దీర్ఘతముడు గ్రుడ్డివాడుగా పుట్టినా వేదవేదాంగాలు చదివి విజ్ఞానవేత్త , కీర్తిగలవాడు , తపశ్శాలి అయ్యాడు .
🌸తండ్రి దీర్ఘతముడికి ప్రద్వేషిణిని ఇచ్చి పెళ్ళి చేశాడు . పేరుకి తగ్గట్టే ప్రద్వేషిణి అందర్నీ ద్వేషించడంలో గొప్పది .
🌿దీర్ఘతముడికి ప్రద్వేషిణి యందు చాలా మంది కొడుకులు పుట్టారు . ఒకసారి దీర్ఘతముడు ఒక్కడూ తపస్సు చేసుకుంటూ వున్నాడు .
🌸అక్కడికి కామధేనువు కొడుకు వచ్చి దీర్ఘతముణ్ణి నువ్వు గ్రుడ్డివాడివైనా శక్తిమంతుడివి .
🌿నీకు నేను పిల్లలు లేని వాళ్ళకి పిల్లల్ని పుట్టించగల విద్యని నేర్పిస్తాను .
🌸దీనివల్ల వంశనాశనం అయిపోతున్న వాళ్ళ వంశం నిలబెట్టినవాడ వవుతావని చెప్పి ఆ విద్యని దీర్ఘతముడికి నేర్పించాడు .
🌿ఈ విద్య ఎలా పనిచేస్తుందో చూద్దామని భార్యని సహకరించమంటే తిట్టింది .
🌸అది ఆవిడ జన్మ హక్కు కదా . సరే ఈ విద్యని పరీక్షించుకోవాలి కదా పిల్లలులేని వాళ్ళ దగ్గరకి వెళ్ళి తాను నేర్చుకున్నది పనిచేస్తోందని నిరూపించుకున్నాడు .
🌿తన భర్త అందరితో తిరుగుతున్నాడనుకుని ప్రద్వేషిణి అసహ్యించుకుని ఇంట్లోంచి పొమ్మంది
🌸విష తెలుసుకోకుండా భర్తనని చూడకుండా నన్నవమానించావు కాబట్టి ఇక మీదట ప్రతిస్త్రీకి జీవితాంతం ఒక్క భర్తె ఉండాలి .
🌿వాడు ఉన్న చచ్చిపోయినా ఇంకొకణ్ణి పెళ్ళి చేసుకోకూడదు . అలా చేస్తే ఆమెకి అపకీర్తి , నింద వస్తాయని శపించాడు దీర్ఘతముడు .
🌸ప్రద్వేషిణి పిల్లల్ని పిలిచి మీ తండ్రి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడు , తీసుకువెళ్ళి గంగలో పడెయ్యమంది .
🌿పిల్లలు అలాగే చేశారు . దీర్ఘతముడు కాళ్ళు చేతులు కట్టేసి బుట్టలో గంగా నదిలో పడేసినా దాంట్లోనే వేదాలు వల్లె వేసుకుంటున్నాడు .
🌸అలలు ఎటువైపు వెడితే అటువైపు ఆ బుట్ట కొట్టుకుపోతోంది . కొన్నాళ్ళ తర్వాత బలి అనే మహారాజు గంగాభిషేకం చేద్దామని వచ్చి
🌿నదిలో కొట్టుకువస్తున్న దీర్ఘతముణ్ణి చూసి ఇంటికి తీసుకెళ్ళి అతని గురించి మొత్తం తెలుసుకుని , అంతటి మహర్షిని చూడగల్గినందుకు ఎంతో సంతోషించాడు .
🌸దీర్ఘతముణ్ణి రాజసౌధానికి తీసికెళ్ళి సపర్యలు చేసి బలిమహారాజు తనకి పిల్లలు లేరని పిల్లలు కలిగేటట్లు చూడమని ప్రార్థించాడు .
🌿తన భార్య సుధేష్ణని మహర్షి దగ్గరకు వెళ్ళమన్నాడు . కాని సుధేష్ణ ఆ మహర్షి రూపం చూసి అసహ్యించుకుని పనిమనిషిని పంపింది .
🌸ఆపనిమనిషికి పదకొండుమంది కొడుకులు పుట్టారు .
ఆ పదకొండుమంది తన పిల్లలే అనుకుని
🌿 బలిరాజు ఆ పిల్లలకి వేదం నేర్పించాలని దీర్ఘతముడి దగ్గరకు తీసుకువచ్చాడు .
🌸మహర్షి ఈ పిల్లలు సుధేష్ణకు పుట్టిన వాళ్ళు కాదని పనిమనిషి పిల్లలని చెప్పాడు . బలి బాధపడి మళ్ళీ సుధేష్ణని మహర్షి దగ్గరకి పంపాడు .
🌿సుధేష్ణ వలన బలిమహారాజుకి అయిదుగురు కొడుకులు పుట్టారు . వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళయి అంగదేశం , కళింగదేశం , వంగదేశం , పుండ్రము , సుహ్మము అనే | రాజ్యాలు పాలించారు .
🌸ఈ రకంగా దీర్ఘతమ మహర్షి చాలా రాజవంశాల్ని నిలబెట్టాడు .
దీర్ఘతమ మహర్షి ఋగ్వేదంలో తన తాత్విక శ్లోకాల ద్వారా చాలా బాగా ప్రసిద్ధుడు.
🌿ఋగ్వేదం సంహితలోని మొదటి మండలం లోని 140 నుండి 164 వరకు గల సూక్తము (శ్లోకాలు) లకు ఇతను రచయిత,
🌸ఋగ్వేదం ఆరవ మండల యొక్క ప్రవక్త అయిన ఋషి భరద్వాజుడు, సోదరుడుగా భావిస్తారు...
🌿ఇదండీ మహర్షి గురించి .. స్వస్తి..
No comments:
Post a Comment