Adsense

Friday, October 28, 2022

57వ మహర్షి.. మంకణ మహర్షి

 మన మహర్షుల చరిత్రలు..
57వ మంకణ మహర్షి గురించి తెలుసుకుందాం


🌿పూర్వం మాతరిశ్వుడనే గొప్ప తపశ్శాలుండేవాడు . ఆయన భార్య సుకన్య . వాళ్ళ కొడుకే మన మంకణ మహర్షి .

🌸మంకణ మహర్షి ఆశ్రమం ఉత్తములైన బ్రాహ్మణులతోనూ చక్కటి పూల , పండ్ల చెట్లతోనూ , సాధు జంతువులతోనూ , మునుల వేదఘోషతోనూ నిండి ఉండేది .

🌿ఈ ఆశ్రమాన్ని సరస్వతి తీర్థం అంటారు . ఒకసారి మంకణ మహర్షి బ్రహ్మర్షులందర్నీ పిలిచి సత్రయాగం ప్రారంభించాడు . అందరూ వచ్చారు , ఏర్పాట్లన్నీ జరిగాయి .

🌸కానీ సరస్వతీనది అక్కడ ప్రవహించట్లేదని అనుకుంటూండగా బ్రహ్మ సరస్వతిని తల్చుకుని అక్కడ ప్రవహించేలా చేసి వాళ్ళ యాగం చక్కగా జరిగేలా చేశాడు .

🌿అక్కడ సరస్వతీ నదికి ' సుప్రభ ' అని పేరు . సరస్వతీనదికి నైమిశారణ్యంలో ' కనకాక్షి ' అని , గయలో ' విశాల ' అని , ఉద్దాలకుడు యాగం చేసిన చోట ' మనోరమ ' అని , కురుక్షేత్రంలో కరువు వచ్చినపుడు ' సురేణువు ' లేక ' సురతన్వ ' అని వసిష్ట మహర్షి యాగం చేసినపుడు ' ఓఘవతి ' లేక ' ఓఘమాల ' అని , ఇంకొక చోట విమలోదక సువేణి అనే పేర్లతో ప్రవహించింది .

🌿ఈ ఏడు నదులు కలిసిన చోటునే ' సరస్వతి తీర్థం ' అంటారు . అక్కడే మంకణ మహర్షి ఆశ్రమం ఉంది .

🌸మంకణ మహర్షికి ఒకసారి వేలికి దర్భ గుచ్చుకుని రక్తానికి బదులుగా ఆ “ ఆకురసం ” రావడం మొదలయ్యింది . ఇంకేముంది నా తపస్సు ఎంత గొప్పదో అందుకే రక్తం ఈరకంగా వస్తోందని గంతులెయ్యడం మొదలెట్టాడు .

🌿ఆనందంతో అతను వేసే గంతులు నృత్యంగా మారిపోయి ఆపకుండా చేస్తున్న నృత్యానికి ఏం చెయ్యాలో తెలియక చూసి చూసి ముగ్ధమోహనంగా అనిపించేసరికి
ఆ పరిసరాలన్ని నాట్యం చెయ్యడం మొదలు పెట్టాయి .

🌸ఈ నాట్యానికి లోకాలన్నిటికి ఉపద్రవం వస్తుందో ఏమో అని అది ఎల్లా ఆపాలో తెలియక బ్రహ్మతో కలిసి అందరూ శివుణ్ణి కలిశారు .

🌿 పరమశివభక్తుడు మంకణ మహర్షి 'ఆర్యావర్తము' అనే ప్రదేశము చేరి తపోనిష్టలో నాట్యం లో మునిగిపోయాడు.

🌸పంచాక్షరీ (నమఃశివాయ) మంత్రజపంతో అతని శరీరం సూర్యసమాన తేజోవంతమైంది.

🌿కానీ మంకణుడు తాండవం ఆపడే. శివుడు అతని తాండవం ఆపడానికి ప్రయత్నించి ప్రశ్నించాడు "ఎవరికోసం నీ తపస్సు, నీ కోరిక ఏమిటి?".

🌸దేనికీ జవాబు చెప్పడాయే ఆ మహర్షి. తాండవం ఆపడు. దానితో శివుడు ఉగ్రుడై- "వెయ్యి శిరస్సులు, వెయ్యి చేతులు, వెయ్యి కాళ్ళుతో కూడిన విరాడ్రూపంతో మహాతేజోమూర్తిగా" మహా శివతాండవం ప్రారంభించాడు.

🌿ఆయనతోపాటు ఒక స్త్రీమూర్తి కూడా ఉంది. ఆ మహాతాండవం ముందు మంకణుని నాట్యం వెలవెలబోయింది. దానితో అతనికి జ్ఞానోదయమయింది. శరణంటూ సాష్టాంగ నమస్కారం చేసాడు శివుడికి.

🌸అప్పుడు శివుడు శాంతించి విశ్వరూపం ఉపసంహరించాడు. ప్రక్కనున్న దేవీ కూడా అంతర్ధానమైంది. మహర్షి శివుడికి నమస్కరించి

🌿"దేవాదిదేవా! ఈ మహాతాండవం ఏమిటి? ఆ స్త్రీమూర్తి ఎవరు?" అంటూ ప్రశ్నించాడు. అప్పుడు శివుడు "నా  దివ్యరూపం. ఆ దివ్యమూర్తిని నేనే. నాతో ఉన్న దేవి ప్రకృతి రూపిణి.

🌸బ్రహ్మరూపుడినై నేను సకల ప్రాణులను 25 (పంచవింశతి) తత్వాలతో పుట్టిస్తాను. విష్ణురూపుడినై వాటిని పోషిస్తాను. సంహారకాలంలో నేనే కాలస్వరూపుడినై వాటిని లయం చేస్తాను.

🌿సర్వప్రాణులయందు నేనే జీవాత్మనై ఉంటాను. నాకంటే అన్యమైనదేదీ లేదు. ఈ విషయం గ్రహించి, భక్తితో నన్ను ఉపాశించి, శివసాయుజ్యం పొందు" అని చెప్పాడు శివుడు.

🌸వెంటనే మంకణ మహర్షి శివుడి కాళ్ళ మీద పడి క్షమించమన్నాడు .
నువ్వు తపస్సు చేసిన ఈ ప్రదేశాన్ని ' సప్తసారస్వతంగా అనుగ్రహిస్తున్నానన్నాడు శివుడు .

🌿 కొంతకాలం తర్వాత మంకణ మహర్షి పెళ్ళి చేసుకుని ఆకధుడనే కొడుకుని కని తపస్సు చేసుకుంటూ కొన్నాళ్లకు శివసాయుజ్యం పొందాడు

🌸ఇదండి  మంకణ మహర్షి చరిత్ర 

No comments: