Adsense

Monday, April 24, 2023

పరశురామ క్షేత్రం....!!

పరశురామ క్షేత్రం....!!



🌿"పరశురామ క్షేత్రమనగానే
మనకు ప్రకృతి సౌందర్యం ఉట్టిపడే కేరళ ప్రాంతమే జ్ఞాపకం వస్తుంది.

🌸అలాగే అవతార పురుషుడైన  పరశురాముడు పుట్టిన
ఊరు కూడా అత్యంత ప్రసిద్ధి చెందినది.

🌿పరశు రామ్ అనే ఆ భూమి ఎంతో
మహిమాన్వితం.
పవిత్రమైన భరత భూమికే అలంకారాలైనవి  యిక్కడి నదీనదాలు,
సముద్రములు, పర్వతాలు , లోయలు , అడవులు.

🌸మహారాష్ట్ర మాత నెన్నుదుటి తిలకం
చిప్లూన్ తాలూకాలోని
పరశురామ్ అనే పుణ్యస్ధలం.

🌿పశ్చిమానున్న నాసిక్ నుండి  కొచ్చిన్ దాకా వున్న  పడమటి కొండలను
మహారాష్ట్ర లో సహ్యాద్రి
కొండలుగా పిలుస్తారు.

🌸పూనేలో సతారా అనే ప్రదేశమును  దాటేక పర్వతశ్రేణులు ఆరంభమౌతాయి.  పూనే నుండి సుమారు 250 కి.మీ దూరంలో  రత్నగిరి జిల్లాలో చిప్లూన్ తాలూకా వున్న ఈ ప్రదేశం ఒక సుందరమైన లోయ .

🌿ఆ లోయలో  ఒక కొండ గ్రామం పరశురామ్. చిప్లూన్  నుండి
12  కి.మీ.  దూరం కొండ మీదకి వెడితే , రమణీయ ప్రకృతితో  నిండి వున్న యీ గ్రామాన్ని దర్శించవచ్చును.

🌸 ఈ కొండలలో   అనేక 
వర్ణాలు కనువిందు కలిగిస్తాయి.
ఇక్కడ వున్న రాతిబండలు
ఎఱుపు రంగు కలిగి వుంటాయి. ఆలయాలు,
ఇళ్ళు కూడా  యీ బండలతో
నిర్మించబడినవే. 

🌿సహ్యాద్రి కొండలమీద నుండి  చిప్లూన్ మార్గం అంతా కూడా మామిడి వంటి ఫలవృక్షాలతో దట్టంగా  పెరిగి ఎటువైపు చూసినా  ప్రకృతి అంతా పచ్చగా ఆహ్లాదం కలిగిస్తుంది.

🌸ఎఱ్ఱని షవురీ  పుష్పాలతోపాటు పలురకాల  పరిమళ పుష్పాల సౌరభాలతో నిండి వుంటుంది
ఆ మార్గంలో వశిష్టా  నది
అందాలతో వంపులుతిరిగి ప్రవహిస్తున్నది.

🌿అక్కడ అక్కడ కోతులు ఒక చెట్టునుండి
మరొక చెట్టుకి దూకుతూ
వుండడం, పక్షుల కలకలారావాలతో  నిండివుండడం , మనోహరమైన ఆ ప్రదేశం వీక్షించగలము.

🌸ప్రధమంగా శ్రీమహావిష్ణువు అంశయైన
పరశురాముడు స్వయం భూమూర్తి గా అక్కడ  అవతరించాడు. తరువాత ఆయనకు పూజా పునస్కారాలు ప్రారంభమై క్రమేపీ జన  వాసాలు ఏర్పడ్డాయి.

🌿మెల్లగా ఒక  గ్రామం నిర్మించబడినది. నాలుగు తరాలుగా  ఆ ఆలయ
కైంకర్యం చేస్తూ వస్తూన్న
కొంకణదేశ బ్రాహ్మణ కుటుంబాలు ;
ఇతరులు అక్కడ నివసిస్తున్నారు.

🌸ఈ పరశురామ ఆలయాన్ని బ్రహ్మేంద్ర స్వామి నిర్మించినట్లు తెలుస్తున్నది.
భూలోకంలోని  రాజులందరూ
కలహించుకుంటూ శాంతి భధ్రతలు పూర్తిగా క్షీణదశకు వచ్చినప్పుడు

🌿భూదేవి  ఆ అశాంతిని  సహించ లేక  శ్రీమహావిష్ణువు తో
మొర పెట్టుకోగా,  మహావిష్ణువు తన ఆరవ అవతారం గా పరశురామునిగా
యీ భూలోకాన జన్మించాడు.

🌸జమదగ్ని మహర్షికి రేణుకాదేవి అనే భార్య నలుగురు పుత్రులు వున్నారు. కుటుంబభారం కారణంగా జమదగ్నికి
పేదరికం అనుభవించవలసివచ్చింది.

🌿 భార్యా పిల్లలు ఆకలితో బాధ పడ్డారు.
అప్పుడు జమదగ్ని బ్రహ్మను ధ్యానించగా బ్రహ్మ  ప్రత్యక్ష మై  'కావలసిన వరం కోరుకొనమనగా'
జమదగ్ని తన బీదరికాన్ని
తొలగించమని కోరుకున్నాడు.

🌸బ్రహ్మదేవుడు జమదగ్నికి కామధేనువును
ఇచ్చాడు.  జమదగ్ని ని చూసి " నీకు ఐదవ పుత్రుడిగా శ్రీమహావిష్ణువు అవతరించబోతున్నట్లు తెలిపాడు. కొన్నాళ్ళకు రేణుకాదేవి అందమైన బాలునికి జన్మనిచ్చింది.

🌿ఆ బాలునికి 'రామా' అని
నామకరణం చేశారు. ఆ
రాముడు  పెరిగి పెద్ద వాడై
సకల విద్యాపారంగతుడై
అత్యంత పరాక్రమవంతుడైనాడు.

🌸రాముడు  శివుని గురించి తీవ్రమైన తపస్సు చేశాడు.  పరమశివుడు ప్రత్యక్ష మై" ఎందుకు  యింత కఠోర
తపస్సు చేస్తున్నావని "
అడిగాడు. ఈ లోకంలో
పాలకులైన క్షత్రియులంతా దుష్టులై , దుర్మార్గులై లోకకంటకులై వున్నారు.

🌿వారిని ఎదుర్కొని శాంతి కలిగే మార్గాన్ని సూచించమని  ప్రార్ధించాడు .
పరమేశ్వరుడు 'పరశువు' అనే దైవీక శక్తి కలిగిన  గొడ్డలిని ప్రసాదించి దుష్ట సంహారం చేయమని ఆదేశించాడు.

🌸పరశువును పొందిన రాముడు ఆనాటి
నుండి పరశురామునిగా
ప్రసిధ్ది చెందాడు. పరశురాముని దశావతారాలలో ఆరవ అవతారంగా చెప్తారు.

🌿ఈ పరశురాముడు త్రేతాయుగ గాధయైన రామాయణంలో , ద్వాపరయుగం నాటి మహాభారత గాధలోనూ దర్శనమిస్తాడు.

🌸ఈ పరశురాముని ఆలయం
ఎన్నో వందల సంవత్సరాల చరిత్ర కలిగినదిగా చెప్తారు.  పరశురాముని మూర్తి స్వయంభూగా
వెలసినందున స్వయంభూమూర్తికే పూజలు చేసే వారు.

🌿ఈనాడు పరశురామునికి
ఒక విగ్రహాన్ని  ప్రతిష్టించి పూజలు జరుపుతున్నారు.

🌸ఆలయ ప్రాంగణమంతా దట్టమైన పచ్చని చెట్లతో , ప్రశాంతంగా వుంటుంది.  కొండ మీద వున్న యీ ఆలయానికి సుమారు  50  మెట్లు ఎక్కి మీదకు వెళ్ళాలి.

🌿గర్భగుడి లో పరశురాముడు
నాలుగు హస్తాలతో దర్శనమిస్తాడు.
కుడివైపు  చేతిలో
గొడ్డలి  , మరొకటి అభయ హస్తం ,  ఎడమ వైపు ఒక చేతిలో బాణం,  మరొక చేతిలో కమండలం తో దర్శనం అనుగ్రహిస్తున్నాడు.

🌸పరశురాముడు చిరంజీవి.
కాముని గెలిచిన బ్రహ్మచారి
పరశురాముడు  కుడి ప్రక్కన
మన్మధుని శిల, కాలుని పై విజయం సాధించి చిరంజీవియైన పరశురాముని ఎడమ ప్రక్కన  కాలుని శిలా ప్రతిమలు
వున్నాయి.

🌿పరశు రాముని తల్లి రేణుకాదేవికి  గర్భగుడి వెనుక ఒక
ప్రత్యేక సన్నిధి వున్నది.
రేణుకాదేవి సన్నిధికి కుడి
ప్రక్కన  పైన హోమ మండపం ఎడమ ప్రక్కన బాణ గంగా పుష్కరిణి వున్నాయి.

🌸పరశురాముడు
ఐదు బాణాలు  వేయగా
భూగర్భం నుండి గంగా జలం పైకి వచ్చి  పుష్కరిణి గా మారిందని చెప్తారు.

🌿రాముడు ప్రజల సౌకర్యార్ధం అతి విశాలమైన అరవై మంచినీటి సలస్సులను , అరవై అతి పెద్ద సుందర ఉద్యానవనాలను నిర్మించినట్లు పురాణ కధనం.

🌸రేణుకాదేవి  సన్నిధినుండి కుడి ప్రక్క  కొన్ని మెట్లు ఎక్కి పైకి వెడితే , హోమాలు చేయడానికి ప్రత్యేక మండపం వస్తుంది. 

🌿సూర్యోదయ, సూర్యాస్తమయ
సమయాలలో  హోమం చేస్తే గృహాలకి శాంతి చేకూరుతుందని , 
దేహానికి ఆరోగ్యం సమకూరుతుందని
చెప్తారు.

🌸పరశురామ భూమిలో ,అక్షయ తృతీయనాడు పరశురామ జయంతి
వైభవంగా జరుపుతారు.
ఈ  ఉత్సవాలు  మూడు రోజులు జరుగుతాయి.ఈ ఉత్సవాలకు  చిప్లూన్ ప్రాంత ప్రజలేకాక

🌿చుట్టు ప్రక్కల గ్రామస్థులు , ప్రధాన నగరాలైన  పూనే, ముంబయి ,   గోవాల నుండి కూడా వేలొది యాత్రీకులు
వెళ్ళి పాల్గొంటారు.

🌸ఛత్రపతి శివాజీ మహరాజ్  ఈ ఊరుకు
వచ్చి, పరశురాముని
పూజించినట్టు చరిత్ర చెప్తోంది. 

🌿చిప్లూన్ దాకా రైలు , బస్సుల
వసతి వుంది.  చిప్లూన్
నుండి   పరశురామ్ గ్రామానికి వెళ్ళడానికి కారు, ఆటో వసతులు
వున్నాయి.

🌸ప్రకృతి అందాలతో నిండిన యీ సుక్షేత్రం పర్యాటకులకు , విహారయాత్రీకులకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తుంది.
దైవీక వాతావరణం మనసులకి
ఆనందాన్ని తృప్తిని కలిగిస్తుంది.

No comments: