Adsense

Saturday, April 29, 2023

గంగా పుష్కరాలకు కాశీకి పోలేని వారి కోసం శంకరాచార్యులు కాశీ పంచకంలో చెప్పిన శ్లోకం

గంగా పుష్కరాలకు కాశీకి పోలేని వారి కోసం 
శంకరాచార్యులు కాశీ పంచకంలో చెప్పిన శ్లోకం

ఈశ్లోకం మనస్పూర్తిగా స్మరించుకొంటే చాలు:
"కాశీ క్షేత్రం శరీరం, త్రిభువనజననీ వ్యాపినీ జ్ఞాన గంగా|

భక్తిఃశ్రద్ధా గయేయం నిజగురుచరణధ్యానయోగః ప్రయాగః|

విశ్వేశోయం తురీయ సకలజనమనస్సాక్షిభూతోంతరాత్మా|

దేహే సర్వం మదీయే యది వసతి పునః తీర్థ మన్యత్ కిమస్తి|"

తాత్పర్యం:
మన శరీరమే కాశీ క్షేత్రం. జ్ఞానమే మూడు లోకాలలో వ్యాపించిన గంగానది. మన భక్తిశ్రద్ధలే గయాక్షేత్రం.
మన గురు చరణ ధ్యాన యోగమే ప్రయాగాతీర్థం.
సకల జనుల మనస్సాక్షి భూతంగా మనలోని సమాధ్యవస్థాతత్త్వమైఉన్న ఆత్మయే కాశీ విశ్వేశ్వరుడు. ఈ విధంగా మన శరీరంలోనే సర్వ తీర్థాలు నెలకొని ఉండగా ఇంకా వేరే సేవింపదగ్గ పుణ్య తీర్థాలు ఏముంటాయి..! అని అర్థం.
ఓం శ్రీ కాశీ విశ్వేశ్వర నమోస్తుతే!!

No comments: