Adsense

Friday, May 26, 2023

సత్యం మాట్లాడాలి.ప్రియంగా మాట్లాడాలి.

సత్యం మాట్లాడాలి.ప్రియంగా మాట్లాడాలి.

 సత్యమే అయినా అప్రియంగా బాధించేదిగా మాట ఉండకూడదు. ఇదే వేద   సూక్తి.*నవవ్యాకరణ పండితుడైన హనుమ మాట్లాడే విధానం రాముణ్ని ఆకట్టుకుంది. లక్ష్మణుడికి హనుమ మాట చాతుర్యం వివరించాడు.*

*మాట్లాడేటప్పుడు హావభావాలు ఎలా ఉండాలో కనురెప్పలు ఎగరవేయకుండా, ఎగతాళిగా నవ్వకుండా ప్రియంగా ఎలా మాట్లాడాలో హనుమ అలాగే ప్రవర్తించాడు.*

*తడబడకుండా, పునరుక్తి దోషం రాకుండా గబగబా కాక, అతినెమ్మదిగా కాక ప్రసంగం సాగాలని, ఎదుటివ్యక్తిలో నమ్మకాన్ని కలిగించాలని, అదే మాటకు ప్రాణమని తెలిపాడు శ్రీరాముడు.*

*హనుమంతుడు అశోకవనంలో సీతాదేవిని దర్శించినప్పుడు తాను ఎలా మాట్లాడితే ఆమెకు నమ్మకం కలుగుతుందో అలాగే సంభాషించాడు. సంస్కృతంలో కాక కోసలదేశ భాషలో ప్రసంగించాడు.*

*రావణసభలో గట్టిగా, నిష్కర్షగా నిజాల్ని తెలియజేశాడు. భయపడకుండా తన మనసులోని భావాల్ని వివరించాడు. ఎప్పుడు ఎక్కడ ఏ మాట వాడాలో తెలియడం ఒక కళ. అది హనుమలోని ఘనత. *

*సీతాదేవిని చూసి, లంకను కాల్చి శ్రీరాముడి దగ్గరికి రాగానే ‘చూశాను సీతను, లంకలో పాతివ్రత్య నియమంతో ఉన్నది’ అని ఒకే వాక్యంలో శ్రీరాముడికి చెప్పడం- ఆయనలోని ప్రతిభకు నిదర్శనం.*

*హనుమంతుని పరాక్రమం గురించి శ్రీరాముడు స్వయంగా చెప్పిన విశేషాలు:*

*మాట్లాడేటప్పుడు ఆవేశం పనికిరాదు. ఆలోచన చేయాలి. తన మాట విశ్వశ్రేయస్సుకు నాంది కావాలి అనుకునేదే దైవత్వ లక్షణం. మాటలు సమాజంలో మానవతా విలువలను పెంపొందించాలి!*

No comments: