Adsense

Wednesday, June 11, 2025

వాల్మీకి రామాయణం - 30

గంగావతరణ గాధను విశ్వామిత్రుని ద్వారా విన్న రామలక్ష్మణులు రాత్రి సుఖంగా గంగాతీరంలో నిద్రించి,

ఉదయం కావడంతోనే విశ్వామిత్ర సమేతంగా నౌకా సహాయంతో గంగోత్తర తీరం చేరి, అక్కడ విశాల పురాన్ని చేరారు.

రామ లక్ష్మణుల కోరిక పై మహర్షి విశాల పురి పూర్వవృత్తాంతాన్ని సముద్ర మథనగాధను వివరించాడు.

దేవతలు, దైత్యులు -తాము అజరులు, అమరులు కాదలచి క్షీరసాగరంలో నిక్షిప్తములయిన అమూల్య ఔషధాల సారాన్ని సేవింపదలచారు

క్షీరసాగరంలో మంధరాద్రిని కవ్వంగా జేసికొని, దానికి అనేక శిరస్సులు గల వాసుకి మహాసర్పమును త్రాడుగా చుట్టి, మధథనానికి సిద్ధమయ్యారు

సహస్ర సంవత్సరాలు అలా చిలుకగా, వాసుకి సహస్రశిరముల నుండి విషాగ్ని జ్వాలలు ఎగసి హాలాహలము ఉద్భవించింది.

దానిని పానం చేయడానికి భక్తవశంకరుడైన శంకరుడు ముందు కొచ్చాడు. ఆగరళాన్ని తనగరమందే నిలిపాడు

అనంతరము మళ్లీ మథనం మొదలైంది. మంధర మంధానము పాతాళము దాకా దిగిపోయింది. సురాసురుల ర్థనపై జగద్భర్త తాబేలుగా మారి తన వీపుపై మంధరాన్ని భరించాడు.

అంతేకాదు తానుకూడ ఉపేంద్రుడుగా ఆకవ్వాన్ని త్రిప్పసాగాడు
మరొక వేయి వర్గాలు గడిచాయి. దండ కమండల ధారియై ధన్వంతరి దివ్యవైద్యుడు ప్రభవించాడు.

అ సంఖ్యాకులైన అప్సరసలు ఆవిర్భవించారు ఆ అద్భుత సుందర సురభామినులను ఎవ్వరు స్వంతం చేసి కోవాలనుకోలేదు.

అందువలన వారు సర్వదేవతా సాధారణులుగా మిగిలిపోయారు
ఆతరువాత వరుణ పుత్రి వారుణి సురభాండంతో ఉదయించింది పరను సేవించిన దేవతలు సురలయ్యారు. దానిని ఆదరింపని దైత్యులు
అసురులయ్యారు

అనంతరము ఉచ్చైశ్రవము, ఐరావతము, కౌస్తుభమణి, కల్పవృక్షాలు కలిగాయి.

వచ్చిన ప్రతివస్తువును అదేలాభంగా ఆదితేయులు సొంతం చేసుకొన్నారు. అమృతమునే అంతిమ లక్ష్యంగా భావించిన అసుకులు మిగిలిన వస్తువులపై తమకము చూపక వాటిని దేవతలు తీసికొంటుంటే ఊరకున్నారు.

అంభోధి మథనాంతములో అమృతము ఆవిర్భవించింది. శ్రీమహావిష్ణువు స్వయంగా 'మోహిని" రూపము ధరించి అమృతాన్ని ఆదితేయులందరికి అందించాడు. 

అసురులకు అమృతము అందలేదు.
అమృత వినిమయాంతంలో -మోహిని మాయమయింది. మోసాన్ని గ్రహించి రాక్షసులు దేవతల పై యుద్ధాన్ని ప్రకటించారు.

అయితే భగవత్సహాయంతో దేవతలు రాక్షసులపై విజయాన్ని సంపూర్ణంగా సాధించారు.

ఇది విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు వినిపించిన క్షీరసాగర మధన వృత్తాంతము..

( స‌శేష‌ము )

No comments: