🌹శ్రీ అయ్యప్ప స్వామి దివ్య చరిత్ర
పదమూడో భాగం ప్రారంభం...!!🌹
🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
🌸అడవి దాటి వాటితో రాజ్య సరిహద్దులు చేరుకోగానే అక్కడ నివశిస్తున్న ప్రజలు భయభ్రాంతులై ‘‘అమ్మో ! ఎన్ని పులులో ! దండుగా మనమీదకే వస్తున్నాయి !పరుగెత్తండి ! పారిపోండి !’’ అని అరుచుకుంటూ పరుగులు తీయసాగారు ! అది గమనించాడు మణికంఠుడు ! వెనుదిరిగి ఆడ పులులను గర్జనలు ఆపమని ఆజ్ఞాపించాడు ! అన్నీ నిశ్శబ్దంగా నిలిచాయి.
🌿 ‘‘ప్రజలారా ! నేనుండగా మీరు భయపడవలసిన అవసరం లేదు ! అవి మీకు హాని కలిగించవు ! భయపడకండి !’’ అంటూ మణికంఠుడు పెద్దగా చెప్పేసరికి తమ ప్రియతమ నాయకుని కంఠాన్ని గుర్తుపట్టి పరుగులు ఆపి ముందు ఠీవిగా పెద్ద పులి మీద కూర్చుని వున్న మణికంఠుని గుర్తుపట్టి ఆనందంగా చప్పట్లు చరిచారు జనాలు !
🌸 ‘‘అదుగో ! మన రాకుమారుడు , పులుల గుంపునే వెంట తీసుకువచ్చాడు , తల్లి అస్వస్థతను పోగొట్టడానికి ! అయ్యా , రాకుమారా ! నీకు స్వాగతం ! మా అందరి ప్రాణాలు లేచి వచ్చాయి నీ రాకతో !’’ అంటూ నమస్కరించారు. వాళ్లవైపు ప్రసన్నంగా చూసి ముందుకు కదిలాడు మణికంఠుడు ! పులుల మంద మధ్యగా మణికంఠుడు వెళుతూ వుంటే వెనకగా ప్రజలు జయజయ ధ్వానాలు చేస్తూ అనుసరించారు.
🌿రాజ భవనం సమీపిస్తున్నారు రాణి శయ్యాగారం గవాక్షం దగ్గర నిలుచుని బయటకు చూసిన రాజు ఆశ్చర్యానికి అంతం లేకుండాపోయింది ! మంత్రి కూడా చూసి ఆశ్చర్యంతో ఆ మాట రాణికి తెలయజేశాడు ! ఇద్దరూ ఒకరిని మరొకరు చూసుకున్నారు భయంతో ! ‘‘రాకుమారుడు సామాన్య బాలుడు కాదు ! తాము ఆడిన నాటకం గూర్చి పసికట్టి వుంటే ఇపుడు అందరి ముందర ఆ విషయం చెబుతాడేమో ! ఏం చేయాలి ?’’ అన్న ఆందోళన తొంగి చూస్తున్నది వాళ్ల ముఖాలలో !
🌸రాజభవనం ముందర వాహనం మీద నుండి దిగి త్వరగా నడుస్తూ తండ్రిని సమీపించి నమస్కరించాడు మణికంఠుడు ! ‘‘తండ్రీ ! తల్లిగారి అస్వస్థత తగ్గించానికి కావలసినన్ని పాలు పులులనుండి తీసుకోవచ్చును ! ఆ తర్వాత వాటిని అడవిలోకి పంపివేస్తాను ! మీరెవరూ భయపడవలసిన అవసరం లేదు !’’ అన్నాడు మృదువుగా !రాజుకు మణికంఠుని చూస్తుంటే ఏదో దివ్యానుభూతి కలిగింది !
🌿‘‘నాయనా ! నీవు సామాన్యుడవు కాదు ! మాపై కరుణతో మాకు పుత్రుడివై ఆనందాన్ని పంచడానికి వచ్చిన భగవంతుడివి ! అవును ! నేనెంతటి అదృష్టవంతుడిని !’’అంటూ దగ్గరకు తీసుకుని గాఢంగా ఆలింగనం చేసుకున్నాడు !
🌸ఆ కౌగిలిలో ఎనలేని ఆనందాన్ని పొందాడు ! మణికంఠుని చూస్తూనే దురాలోచనలతో అతనికి కీడు తలపెట్టడానికి పన్నాగం పన్నిన మంత్రి మనస్సులో పరివర్తన కలిగింది ! రాణి పరిస్థితి కూడా అలాగే వుంది ! వాళ్ళు వణుకుతున్న చేతులతో నమస్కరించి క్షమాభిక్ష వేడారు ! ‘‘ఇక ఏ పులి పాలు అవసరం లేదు ! దురాలోచనతో నటించిన పాపులం ! మమ్మల్ని క్షమించు కుమారా ! నీవు సామాన్య బాలుడివి కావనీ , మమ్మల్ని ఉద్ధరించడానికి వచ్చిన దైవాంశ సంభూతుడివనీ తెలుసుకున్నాము. మమ్మల్ని క్షమించు పుత్రా !’’ అంటూ పశ్చాత్తాపంతో కన్నీళ్లు పెట్టుకున్న తల్లిని ఓదార్చాడు మణికంఠుడు !
🌿 మంత్రికి క్షమాభిక్ష ప్రసాదించాడు ! మంత్రి చేతిలో కీలుబొమ్మలై అసత్యం పలికిన రాజవైద్యుడు సేనాపతి కూడా తప్పులు ఒప్పుకుని క్షమాభిక్ష కోరడంతో వాళ్లను మన్నించాడు కరుణామూర్తి అయిన మణికంఠుడు ! అందరినీ ఉద్దేశించి ఇలా అన్నాడు ! ‘‘మీరందరూ నన్ను గుర్తించటమే నాకు కావలసినది !
🌸ఒక ప్రయోజనం కోసం నేను ఈ విధంగా పన్నెండు సంవత్సరాలు గడపవలసి వచ్చింది ! రాక్షసత్వంతో దేవతలను బాధిస్తున్న మహిషిని మర్దించడమనే లక్ష్యంతో భూమిపై అవతరించిన భూతనాథుడను , హరిహర పుత్రునిగా నన్ను గుర్తెరగండి ! మీ అందరి మనస్సులలో జ్యోతిరూపంలో వెలుగుతూ ఇకపై మీ యోగక్షేమాలు చూసే పరమాత్మగా మీలోనే నిలిచి వుంటాను !
🌿 మణికంఠునిగా నేను వచ్చిన కార్యం పూర్తయినందువల్ల నేను ఈ మానవ రూపాన్ని ఉపసంహరించి మీ అందరి క్షేమాన్ని కోరి మీతోనే మీ మధ్య వుండటానికి నా అర్చారూపాన్ని నాకు ప్రతిగా అనుగ్రహిస్తున్నాను !రాజా ! నా అర్చారూపానికి దేవాలయాన్ని నిర్మించవలసిన బాధ్యత నీపై వుంచుతున్నాను ! నీ చేత నిర్మింపబడే ఆ దేవాలయంలో నా విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఏ విధంగా పూజాది కార్యక్రమాలు నిర్వర్తించాలో తెలియజెప్పడానికి ఒక మహర్షి త్వరలోనే మీ దగ్గరకు రాగలడు !’’ అంటూ మేఘ గంభీర స్వరంతో చెబుతుంటే నిశ్శబ్దంగా విన్నవాళ్లంతా ఒక్కసారిగా ఉద్విగ్నులైనారు !
🌸ప్రజలందరూ ‘‘రాకుమారా ! మమ్మల్ని విడిచి వెళతావా ? వద్దు అయ్యా ! అంతటి కఠినత్వం చూపకు మా పట్ల ! మా ప్రాణంలో ప్రాణానివి నీవు ! నిన్ను ప్రత్యక్షంగా చూడలేకపోతే మా జీవితాలు వ్యర్థం ! అప్పా , మణికంఠస్వామి ! మా మొరాలకించు ! మా మధ్యనుండి వెళ్లిపోవాలని అనుకోకు !’’ అంటూ వేడుకోసాగారు.
🌿రాజశేఖరుని పరిస్థితి దయనీయంగా మారింది ! మణికంఠుని చూడకుండా వుండటం సాధ్యంకాదు తనకు ! వరపుత్రుడుగా లభించిన ఈ బంగారు కొండను నా నుండి వేరుగా భావించలేను ! ఆపాలి ! ఎలాగైనా నా కళ్లముందరే వుండేలా చూడాలి !’’ అనుకుంటూ మణికంఠుని చేయి గట్టిగా పట్టుకున్నాడు !
🌸 ‘‘పుత్రా ! అంత కఠినంగా మాట్లాడకు ! నిన్ను , నీ మోహన రూపాన్ని చూడకుండా వుండటం మా వల్ల అవుతుందని ఎలా అనుకున్నావు ! వద్దు పుత్రా వద్దు ! నీ నిర్ణయాన్ని మార్చుకో ! మమ్మల్ని అనాథలను చేసి వెళ్లిపోకు !’’ అన్నాడు రుద్ధమైన కంఠంతో ! మణికంఠుడు అందరి ప్రార్థనలు విన్నాడు ! చెరగని చిరునవ్వు ముఖంతో నిర్వికారంగా చూస్తూ వాళ్లకు జ్ఞానోపదేశం చేశాడు !
🌿‘రాజా ! నామీద పుత్రుడనే వ్యామోహంతో నీవు , తమను సదా కాపాడుతుండే ధర్మపరులైన పాలకుడిగా ప్రజలు భావిస్తూనా వియోగాన్ని భరించలేకపోతున్నారు ! నిజానికి ఇటువంటి బంధాలకు నేను అతీతుడిని ! నేను నాది అనే భావాలకు నాలో తావు లేదు ! నేను గుణాతీతుడిని , బంధముక్తుడిని ! అందుకే వ్యర్థంగా విచారానికి గురికాకండి !
🌸నాకూ , నా అర్చారూపానికి ఏ విధమైన భేదం లేదు ! నా అర్చారూపాన్ని పూజించటంవల్ల నేను ప్రసన్నుడినై మీ సర్వాభీష్టాలు నెరవేరుస్తాను ! రాజా ! ఇలా చూడు ! ఈ రాజ భవనం నుండి నేను వదులుతున్న ఈ బాణం అక్కడ ఆ అరణ్య భాగంలో పడ్డ చోటు ఆలయ నిర్మాణం కావించి , నా విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆరాధించు ! మీ అందరి వెంట ఎప్పుడూ నా ఆశీర్వాదాలు వెన్నంటే వుంటాయి !’’ అని చెప్పి బాణం వదిలి అంతర్థానం చెందాడు !
🌿 రాజపరివారం , ప్రజలు కొంతసేపటి వరకు నోట మాటరాక అలాగే వుండిపోయారు . చెప్పటం ఆపి అందరినీ కలియజూసాడు సూతమహర్షి ! ఏకాగ్రతతో కన్నులరమూసి మణికంఠుని పావన చరితలో తాదాత్మ్యం చెంది వింటున్న నైమిశారణ్యవాసులందరూ మెల్లగా కనులు విప్పి సూతమహర్షి వైపు కృతజ్ఞతా పూర్వకంగా చూశారు !
🌸 ‘‘మహర్షి ! మీ నోట హరిహర పుత్రుడు మణికంఠుని పావన చరితాన్ని విని ధన్యులమైనాము ! స్వామి బాణాన్ని విడిచి అంతర్థానం చెందిన తర్వాత ఏం జరిగింది ? పందల రాజు నిర్మాణం ప్రారంభించాడా ? ఆ వివరాలు కూడా చెప్పవలసిందిగా ప్రార్థిస్తున్నాము’’ అన్నారు. ‘‘తప్పకుండా చెబుతాను , వినండి !’’ అంటూ సూతమహర్షి చెబుతుంటే శ్రద్ధగా వినసాగారు నైమిశారణ్యవాసులు !...సశేషం... 🙏
🌹తరువాయి భాగం రేపటి శీర్షికలో తెలుసుకుందాం...🌞
🌿‘రాజా ! నామీద పుత్రుడనే వ్యామోహంతో నీవు , తమను సదా కాపాడుతుండే ధర్మపరులైన పాలకుడిగా ప్రజలు భావిస్తూనా వియోగాన్ని భరించలేకపోతున్నారు ! నిజానికి ఇటువంటి బంధాలకు నేను అతీతుడిని ! నేను నాది అనే భావాలకు నాలో తావు లేదు ! నేను గుణాతీతుడిని , బంధముక్తుడిని ! అందుకే వ్యర్థంగా విచారానికి గురికాకండి !
🌸నాకూ , నా అర్చారూపానికి ఏ విధమైన భేదం లేదు ! నా అర్చారూపాన్ని పూజించటంవల్ల నేను ప్రసన్నుడినై మీ సర్వాభీష్టాలు నెరవేరుస్తాను ! రాజా ! ఇలా చూడు ! ఈ రాజ భవనం నుండి నేను వదులుతున్న ఈ బాణం అక్కడ ఆ అరణ్య భాగంలో పడ్డ చోటు ఆలయ నిర్మాణం కావించి , నా విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆరాధించు ! మీ అందరి వెంట ఎప్పుడూ నా ఆశీర్వాదాలు వెన్నంటే వుంటాయి !’’ అని చెప్పి బాణం వదిలి అంతర్థానం చెందాడు !
🌿 రాజపరివారం , ప్రజలు కొంతసేపటి వరకు నోట మాటరాక అలాగే వుండిపోయారు . చెప్పటం ఆపి అందరినీ కలియజూసాడు సూతమహర్షి ! ఏకాగ్రతతో కన్నులరమూసి మణికంఠుని పావన చరితలో తాదాత్మ్యం చెంది వింటున్న నైమిశారణ్యవాసులందరూ మెల్లగా కనులు విప్పి సూతమహర్షి వైపు కృతజ్ఞతా పూర్వకంగా చూశారు !
🌸 ‘‘మహర్షి ! మీ నోట హరిహర పుత్రుడు మణికంఠుని పావన చరితాన్ని విని ధన్యులమైనాము ! స్వామి బాణాన్ని విడిచి అంతర్థానం చెందిన తర్వాత ఏం జరిగింది ? పందల రాజు నిర్మాణం ప్రారంభించాడా ? ఆ వివరాలు కూడా చెప్పవలసిందిగా ప్రార్థిస్తున్నాము’’ అన్నారు. ‘‘తప్పకుండా చెబుతాను , వినండి !’’ అంటూ సూతమహర్షి చెబుతుంటే శ్రద్ధగా వినసాగారు నైమిశారణ్యవాసులు !...సశేషం... 🙏
🌹తరువాయి భాగం రేపటి శీర్షికలో తెలుసుకుందాం...🌞
No comments:
Post a Comment