శ్రీ అయ్యప్ప స్వామి దివ్య చరిత్ర 15 భాగం...ప్రారంభం..!!🌹🙏
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸
‘🌿‘ఇక్కడ నుండి ఈశాన్య దిశగా వెళ్లు ! ఆ త్రోవలో ప్రయాణించడం చాలా కష్టంతో కూడిన కార్యం ! అయినా నీవు ఆ దిక్కుగా ప్రయాణిస్తూ పోగలిగితే కొండపైనుండి పడుతున్న ‘కుంభదళ’ అనే జలపాతం కనిపిస్తుంది ! ఆ జలపాతం నీటిలో స్నానం ఆచరించి ఈ మట్టి పాత్రలో నీరు పట్టుకుని త్రాగు !
🌸 ఆ జలపాతం నీరు చాలా మహిమ గలది ! ధర్మశాస్తాగా తారకబ్రహ్మ ఆవిర్భవించినపుడు కైలాసంలో దేవతలు , మునిగణాలు పుష్పవృష్టి కురిపించి పవిత్ర గంగాజలాలతో అభిషేకం చేయగా ఆ అభిషేక జలాలు ఈ కుంభదళ జలపాతంగా భూమిపైకి ప్రవహించటం జరిగింది !
🌿అందుకే ఆ పవిత్ర జలాలు త్రాగడంవల్ల నీ కోర్కె ఫలిస్తుంది ! వెళ్లు !’’ అంటూ తన దగ్గర వున్న ఒక మట్టి పాత్రను అందించి ఆశీర్వదించింది శబరిమాత !
🌸 ‘‘నీకు నా కోటి కోటి ప్రణామాలు మాతా ! నాకు మార్గదర్శకం చేసిన గురుమూర్తివి. నీకున ప్రణామాలర్పించడం తప్ప వేరే ఏమీ ఇవ్వలేనివాడిని ! క్షమించు మాతా ! అంటూ పాదాభివందనం చేసి మట్టిపాత్రను కళ్లకద్దుకుని ఈశాన్య దిశగా సాగిపోయాడు విజయుడు !
🌿విజయుడు తారకబ్రహ్మను దర్శించుట విజయుడు సాగిపోతున్న మార్గం చాలా కష్టంగా , ముళ్లపొదలతో నిండి వుంది ! వాటిని జాగ్రత్తగా దాటుకుంటూ వెళుతుంటే ఏవేవో వికృతమైన అరుపులు చేస్తూ భూతపిశాచాలు మీదకు వస్తున్నట్లు భయానకమైన అనుభూతులు కలగడంతో కళ్లు గట్టిగా మూసుకుని ఓంకారనాదం ధ్యానిస్తూ ఎలాగో శబరిమాత చెప్పిన జలపాతాన్ని చేరుకున్నాడు విజయుడు !
జలపాతం మీదనుండి సాగివస్తున్న చల్లని గాలులు అప్పటివరకు పడ్డ శ్రమను మరచిపోయేలా చేసాయి.. తనివితీరా ఆ నీటిలో స్నానం చేసి శబరిమాత ఇచ్చిన మట్టిపాత్రలో నీరు నింపుతుంటే ఆ నీటిలో తనవైపే చూస్తూ నవ్వుతున్న పపిపాపడు కనిపించాడు !
🌸ఆ బాలుడు సామాన్యుడిలా లేడు ! దివ్యమైన తేజంతో వెలిగిపోతున్నాడు ! మెడలోని మణిహారం నుండి వెలువడుతున్న కాంతి కిరణాలు ఆ ప్రాంతాన్నంతా వెలుగుతో నింపివేసాయి !
🌿‘ఆహా ! ఈ బాలుడేనేమో తాను చూడాలనుకుంటున్న తారకబ్రహ్మ ! ఓంకారనాదం యొక్క సగుణ రూపం !’ అనుకునేసరికి మనస్సు అలౌకికానందంతో పులకించిపోయింది ! ‘హే పరబ్రహ్మరూపా ! నీవే తారకబ్రహ్మవు , ఓంకారనాదానివి ! నాపై కరుణతో దర్శనమిచ్చిన కరుణా సముద్రుడివి ! నీకివే నా కోటి కోటి ప్రణామాలు ! నీవే సృష్టి స్వరానికి మూలాధారుడవు ! అయినా పసిపాపడిగా దర్శనమిచ్చి నన్ను కటాక్షించిన కరుణా సముద్రుడివి ! నాపట్ల దయాదృష్టిని ప్రసరింపజేయ స్వామి !’’ అంటూ పరిపరివిధాలుగా ప్రార్థించాడు !
🌸పరబ్రహ్మరూపుడైన పసిపాపడు విజయుని ప్రార్థన విని వుండాలి ! అందుకే ఆ పాపడిలో దివ్యజ్యోతి , అందులో స్వామి విరాట్ స్వరూపం ఒక్క క్షణం కనిపించి అంతర్థానమైనాయి ! అదే సమయంలో ఆకాశవాణి పలుకులు వినవచ్చాయి ! ‘‘విజయా ! నిర్మలాత్ముడివై నీవు చేసిన ఓంకార ధ్యానానికి ప్రసన్నుడినైనాను ! నీకేం కావాలో కోరుకో !’’
🌿 ! ‘‘స్వామీ ! ఇంతకాలంగా సంతానం కోసం ధ్యానించాను , నా కోర్కె తీర్చమంటూ ! కానీ హే ! జ్యోతిరూపా ! పరబ్రహ్మా ! నాకిప్పుడు నిన్నే పుత్రునిగా పొందాలన్న కోర్కె బలంగా నాటుకుంది హృదయంలో ! నీకు తండ్రినై , నిన్ను ‘పుత్రా’ అంటూ నోరారా పిలుస్తూ ఒడిలోకి తీసుకోవాలన్న ఆశ కలుగుతున్నది ! అది పేరేశ కావచ్చును ! అయినా నిన్ను వేడుకునే సాహసం చేస్తున్నాను ! నీవు నాకు పుత్రుడివై నన్ను ధన్యుడిని చేయి !’’ అంటూ మనస్సులోని మాటను విన్నవించుకున్నాడు విజయుడు !
🌸 ‘‘అసాధారణమైన కోరికను వెల్లడించావు ! అందుకు నీ పుణ్యబలం చాలదు ! మరుజన్మలో నీ కోరిక తీరగలదు ! నీ పుత్రునిగా పిలువబడతాను !’’ అని వరం ప్రసాదించాడు !
🌿ఆకాశవాణి మాటలు విని ఆనందంతో పులకించిపోయాడు విజయుడు !
‘‘తారకబ్రహ్మ నాకు పుత్రుడు కానున్నాడు ! నా వంటి భాగ్యశాలి మరొకడు వుండబోడు !’’అనుకుంటూ ఇంటిదారి పట్టాడు ! తర్వాత కొంతకాలం దైవధ్యానంలో ప్రశాంతంగా కాలం గడిపి మరణించాడు విజయుడు !
🌸కన్నులు తెరిచి చుట్టూ చూశాడు రాజశేఖరుడు ! తనవైపే చూస్తున్న అగస్త్య మహర్షి కనిపించడంతో ఆయనకు నమస్కరించాడు ! ‘‘రాజా ! నీ పూర్వజన్మ వృత్తాంతం తెలుసుకున్నావు గదా ! విజయుడుగా నీవు కోరిన అసాధారణ వరానికి కట్టుబడి అందరిని తరింపజేసే తారకబ్రహ్మ నీకు శిశువుగా లభించి నీకు పుత్రుడై ఇంతకాలం నీకు ఆనందాన్ని ప్రసాదించాడు !
🌿సామాన్య మానవులకు లభించని అదృష్టం నీకు లభించినందుకు సంతోషించాలి కానీ ఈ విధంగా నిరాశ నిస్పృహలకు , వ్యామోహానికి గురై కర్తవ్యాన్ని విస్మరించగూడదు ! లే , ఇకనైనా స్వస్థుడివై ఆ స్వామి నీపై మోపిన కార్యాన్ని నెరవేర్చు !’’ అంటూ ఉపదేశించాడు అగస్త్యుడు !
🌸 ‘‘సమయానికి వచ్చి నన్ను మీ ఉపదేశంతో స్వస్థుడిని చేసినందుకు కృతజ్ఞుడిని మహర్షి ! ఇక నాకే విచారమూ లేదు. మొదటిసారిగా అరణ్యంలో శిశువు రూపంలో నాకోసం అవతరించిన ఆ పరబ్రహ్మ ముఖాన్ని చూస్తూనే అంతకుపూర్వం ఎక్కడ చూసిన బాధ నాలో కలగడానికి కారణం ఇప్పుడర్థమైంది.
🌿 ప్రణవ స్వరూపుడు , పరబ్రహ్మకు తండ్రిగా గౌరవింపబడే భాగ్యాన్ని ప్రసాదించిన మణికంఠునికి కోటి కోటి ప్రణామాలు’’ అంటూ భక్తిపూర్వకంగా నమస్కరించాడు రాజశేఖరుడు ! ‘‘రాజా ! పంబానది పాపాలను నశింపచేసే పావనమైన నది ! ఆ నదీ సమీపంలోనే మణికంఠుడు నిర్దేశించిన స్థలంలో ఆలయ నిర్మాణం కావించి జీవితం ధన్యం కావించుకో !’’ అని చెప్పి వెళ్లిపోయాడు అగస్త్య మహర్షి ! ‘‘మీ ఆజ్ఞానువర్తిని’’ అంటూ మరోసారి కృతజ్ఞతలు తెలుపుకుని కార్యోన్ముఖుడైనాడు రాజశేఖరుడు !
🌸వింటున్నవారిలో ఒక మునికుమారుడు లేచి నిలబడటం చూసి చెప్పటం ఆపాడు సూతమహర్షి ! ‘‘మహర్షి ! శబరి విషయం మరికొంత వివరంగా తెలియజేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను ! మణికంఠుని దర్శన భాగ్యం ఆమెకు లభించిందా ?’’ అని అడిగాడు వినయపూర్వకంగా నమస్కరించి ! ‘‘అవును మహర్షి ! మా అందరి ప్రార్థన కూడా అదే !’’ అని వింటున్న మునులందరూ కూడా కుతూహలం వ్యక్తం చేయడంతో శబరి గూర్చి చెప్పసాగాడు సూత మహర్షి !
🌹శబరి వృత్తాంతము...🌹
🌿శబరస్య గృహేజాత శబరీ భాగ్యశాలినే! చిరకాలేన సహ్యాద్రౌ జ్ఞానయ తపస్థితా!’’
🌸 (శబరి కులంలో పుట్టిన మహాభాగ్యశాలిని శబరి ! ఆమె సహ్యాద్రి పర్వతంమీద చాలాకాలం జ్ఞానసిద్ధికోసం తపస్సు చేసింది)
🌿 ‘‘నైమిశారణ్య వాసులారా ! శబరి కారణ జన్మురాలు ! కైలాసంలో హరిహర పుత్రుడు ప్రభవించినప్పుడు భూతగణాలు , ప్రమథ గణాలు పార్వతీదేవి శక్తిగణాలు ఆ స్వానిని సేవించి తరించారు ! శక్తిగణాలలో పావని అమ్మవారి చెలికత్తెలలో ముఖ్యమైనది !
🌸ఆమె హరిహర పుత్రుడైన భూతనాథుని స్వయంగా భక్తిశ్రద్ధలతో సేవించాలని తహతహలాడుతూ పార్వతీదేవి సేవలో కొంత ఏమరుపాటుతో ప్రవర్తించి ఆ దేవి ఆగ్రహానికి గురైంది !
🌿 ‘‘పావని ! నీ కర్తవ్యాన్ని విస్మరించి నా సేవకు దూరమైనందున తక్షణమే కైలాసాన్ని విడిచి భూలోకంలో అరణ్యాలకు శబరుల ఇంట జన్మించు ! భూలోకవాసమే నీకు తగినది !’’ అని శపించింది తీవ్రమైన కంఠంతో !
🌸 ‘‘దేవీ ! నున్న మన్నించండి ! ఇంకెప్పుడూ పొరబాటు జరగనివ్వను !’’ అని పావని దీనంగా ప్రార్థించినా అమ్మవారు శాపాన్ని మరల్చలేదు ! నిజానికి ఆ శాపం పావని పట్ల వరమే అయింది ! భూతనాథుడు భూమిపై అవతరించినప్పుడు ఆ స్వామిని సేవించే అవకాశం ఇవ్వడానికే మాత అటువంటి శాపాన్ని ఇచ్చింది !
🌿ఆ విషయం భూతనాథునికి అర్థమైంది ! అందుకే పావని కోర్కె తీర్చాలనుకున్నాడు ! పావని శబరి కులంవారి నాయకుడికి కుమార్తెగా జన్మించి శబరి అనే పేరుతో పెరగసాగింది
🌸 చిన్నప్పటినుంచే ఆమెలో పరమాత్మ గురించి తెలుసుకోవాలన్న కోరిక బలవత్తరం కాసాగింది ! సుగుణవతి , శాంత స్వభావురాలు , మృదువుగా మాట్లాడేది అయిన శబరికి తపస్సు చేయడంవల్ల జ్ఞానం లభిస్తుందని , ఆమె కోరుకుంటున్న భూతనాథుని దర్శనం , సేవాభాగ్యం లభిస్తాయని ఒకసారి అటువచ్చిన నారద మహర్షి చెప్పడంతో సహ్య పర్వతం మీద తపస్సు చేస్తూ గడిపింది చాలాకాలం వరకు !
🌿శబరికి గురుమూర్తిగా మణికంఠుని ఉపదేశం ఒక రోజు.. తపోమగ్నురాలై వున్న శబరి ఉలిక్కిపడి కళ్లు తెరిచింది ! ‘ఏమైంది తనకు ? ఎవరో పలకరించినట్లు ఎందుకనిపించింది ? ధ్యానం ఆపి వెంటనే లేచిందెందుకు ?’ తనలో తనే ప్రశ్నించుకుంటూ లేచి చుట్టుప్రక్కలంతా చూసింది ఎవరైనా కనిపిస్తారేమోనని !
🌸ఎవరూ కనిపించకపోవడంతో కూర్చుని ఓంకారాన్ని ధ్యానిస్తూ కన్నులరమూయగానే దూరం నండి ఎవరో తనవైపు వస్తున్నట్లుగా తోచి గబగబా ఆ వైపుగా రెండడుగులు వేసింది ! ఎవరో వృద్ధ సన్యాసి తనవైపే వస్తుండటం గమనించి ఎదురువెళ్లి ‘‘ప్రణామాలు మహాత్మా’’ అంటూ నమస్కరించింది భక్తిపూర్వకంగా !
🌿ఆమె వైపు ప్రసన్నంగా చూస్తూ ‘‘ఎవరివి నీవు బాలికా ! ఈ పర్వతంమీద ఒంటరిగా ఏం చేస్తున్నావు ?’’ అని అడిగాడు వృద్ధుడు ! ‘‘స్వామీ ! నా పేరు శబరి ! నేను చిన్ననాటినుండి హరిహర పుత్రుడైన మణికంఠుని దర్శించాలన్న కోరికతో జీవిస్తున్నాను ! ఆ స్వామి దర్శనభాగ్యం కోసం ఎదురుచూస్తూ తపం కావిస్తున్నాను !
అయినా మహానుభావులైన పరమయోగి పుంగవులు కావించే కఠిన తపస్సులు ఫలించడానికే ఎన్నో పరీక్షలకు గురి కావలసి వుంటుంది కదా ! ఇక నావంటి సామాన్యురాలు కావించే తపం ఆ స్వామికి వినిపించే అవకాశం వుంటుందంటారా ? అయినా ఎప్పటికైనా ఈ జన్మలో కాకపోతే మరో జన్మలోనైనా ఆ స్వామి కరుణార్ద్ర దృష్టి నాపై ప్రసరించకపోతుందా అనుకుంటూ ఎదురుచూస్తున్నాను !’’ అంటూ తన విషయాలు చెప్పింది దాపరికం లేకుండా ! చిన్నగా నవ్వాడు వృద్ధుడు !
🌸 ‘‘నీ భక్తిశ్రద్ధలు , నీ మృధుభాషణం నన్ను ప్రసన్నుడిని కావించాయి ! బాలికా భగవత్స్వరూపుడైన మణికంఠుడు సర్వవ్యాపకుడు ! బాహ్య ప్రపంచమంతటా , ఈ ప్రపంచంలో నివసించే ప్రాణులందరిలో ఆత్మజ్యోతిగా వెలుగుతూ నిలిచి వుండే ఆ భగవంతుడిని జ్ఞాన నేత్రంలో దర్శించడానికి ప్రయత్నించాలి ! అందుకు నిర్మలమైన హృదయం , దృఢమైన విశ్వాసం అనే రెండు సాధనాలు అవసరం !......సశేషం... 🙏
🌹తరువాయి భాగం రేపటి శీర్షికలో తెలుసుకుందాం...🌞
🌸వింటున్నవారిలో ఒక మునికుమారుడు లేచి నిలబడటం చూసి చెప్పటం ఆపాడు సూతమహర్షి ! ‘‘మహర్షి ! శబరి విషయం మరికొంత వివరంగా తెలియజేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను ! మణికంఠుని దర్శన భాగ్యం ఆమెకు లభించిందా ?’’ అని అడిగాడు వినయపూర్వకంగా నమస్కరించి ! ‘‘అవును మహర్షి ! మా అందరి ప్రార్థన కూడా అదే !’’ అని వింటున్న మునులందరూ కూడా కుతూహలం వ్యక్తం చేయడంతో శబరి గూర్చి చెప్పసాగాడు సూత మహర్షి !
🌹శబరి వృత్తాంతము...🌹
🌿శబరస్య గృహేజాత శబరీ భాగ్యశాలినే! చిరకాలేన సహ్యాద్రౌ జ్ఞానయ తపస్థితా!’’
🌸 (శబరి కులంలో పుట్టిన మహాభాగ్యశాలిని శబరి ! ఆమె సహ్యాద్రి పర్వతంమీద చాలాకాలం జ్ఞానసిద్ధికోసం తపస్సు చేసింది)
🌿 ‘‘నైమిశారణ్య వాసులారా ! శబరి కారణ జన్మురాలు ! కైలాసంలో హరిహర పుత్రుడు ప్రభవించినప్పుడు భూతగణాలు , ప్రమథ గణాలు పార్వతీదేవి శక్తిగణాలు ఆ స్వానిని సేవించి తరించారు ! శక్తిగణాలలో పావని అమ్మవారి చెలికత్తెలలో ముఖ్యమైనది !
🌸ఆమె హరిహర పుత్రుడైన భూతనాథుని స్వయంగా భక్తిశ్రద్ధలతో సేవించాలని తహతహలాడుతూ పార్వతీదేవి సేవలో కొంత ఏమరుపాటుతో ప్రవర్తించి ఆ దేవి ఆగ్రహానికి గురైంది !
🌿 ‘‘పావని ! నీ కర్తవ్యాన్ని విస్మరించి నా సేవకు దూరమైనందున తక్షణమే కైలాసాన్ని విడిచి భూలోకంలో అరణ్యాలకు శబరుల ఇంట జన్మించు ! భూలోకవాసమే నీకు తగినది !’’ అని శపించింది తీవ్రమైన కంఠంతో !
🌸 ‘‘దేవీ ! నున్న మన్నించండి ! ఇంకెప్పుడూ పొరబాటు జరగనివ్వను !’’ అని పావని దీనంగా ప్రార్థించినా అమ్మవారు శాపాన్ని మరల్చలేదు ! నిజానికి ఆ శాపం పావని పట్ల వరమే అయింది ! భూతనాథుడు భూమిపై అవతరించినప్పుడు ఆ స్వామిని సేవించే అవకాశం ఇవ్వడానికే మాత అటువంటి శాపాన్ని ఇచ్చింది !
🌿ఆ విషయం భూతనాథునికి అర్థమైంది ! అందుకే పావని కోర్కె తీర్చాలనుకున్నాడు ! పావని శబరి కులంవారి నాయకుడికి కుమార్తెగా జన్మించి శబరి అనే పేరుతో పెరగసాగింది
🌸 చిన్నప్పటినుంచే ఆమెలో పరమాత్మ గురించి తెలుసుకోవాలన్న కోరిక బలవత్తరం కాసాగింది ! సుగుణవతి , శాంత స్వభావురాలు , మృదువుగా మాట్లాడేది అయిన శబరికి తపస్సు చేయడంవల్ల జ్ఞానం లభిస్తుందని , ఆమె కోరుకుంటున్న భూతనాథుని దర్శనం , సేవాభాగ్యం లభిస్తాయని ఒకసారి అటువచ్చిన నారద మహర్షి చెప్పడంతో సహ్య పర్వతం మీద తపస్సు చేస్తూ గడిపింది చాలాకాలం వరకు !
🌿శబరికి గురుమూర్తిగా మణికంఠుని ఉపదేశం ఒక రోజు.. తపోమగ్నురాలై వున్న శబరి ఉలిక్కిపడి కళ్లు తెరిచింది ! ‘ఏమైంది తనకు ? ఎవరో పలకరించినట్లు ఎందుకనిపించింది ? ధ్యానం ఆపి వెంటనే లేచిందెందుకు ?’ తనలో తనే ప్రశ్నించుకుంటూ లేచి చుట్టుప్రక్కలంతా చూసింది ఎవరైనా కనిపిస్తారేమోనని !
🌸ఎవరూ కనిపించకపోవడంతో కూర్చుని ఓంకారాన్ని ధ్యానిస్తూ కన్నులరమూయగానే దూరం నండి ఎవరో తనవైపు వస్తున్నట్లుగా తోచి గబగబా ఆ వైపుగా రెండడుగులు వేసింది ! ఎవరో వృద్ధ సన్యాసి తనవైపే వస్తుండటం గమనించి ఎదురువెళ్లి ‘‘ప్రణామాలు మహాత్మా’’ అంటూ నమస్కరించింది భక్తిపూర్వకంగా !
🌿ఆమె వైపు ప్రసన్నంగా చూస్తూ ‘‘ఎవరివి నీవు బాలికా ! ఈ పర్వతంమీద ఒంటరిగా ఏం చేస్తున్నావు ?’’ అని అడిగాడు వృద్ధుడు ! ‘‘స్వామీ ! నా పేరు శబరి ! నేను చిన్ననాటినుండి హరిహర పుత్రుడైన మణికంఠుని దర్శించాలన్న కోరికతో జీవిస్తున్నాను ! ఆ స్వామి దర్శనభాగ్యం కోసం ఎదురుచూస్తూ తపం కావిస్తున్నాను !
అయినా మహానుభావులైన పరమయోగి పుంగవులు కావించే కఠిన తపస్సులు ఫలించడానికే ఎన్నో పరీక్షలకు గురి కావలసి వుంటుంది కదా ! ఇక నావంటి సామాన్యురాలు కావించే తపం ఆ స్వామికి వినిపించే అవకాశం వుంటుందంటారా ? అయినా ఎప్పటికైనా ఈ జన్మలో కాకపోతే మరో జన్మలోనైనా ఆ స్వామి కరుణార్ద్ర దృష్టి నాపై ప్రసరించకపోతుందా అనుకుంటూ ఎదురుచూస్తున్నాను !’’ అంటూ తన విషయాలు చెప్పింది దాపరికం లేకుండా ! చిన్నగా నవ్వాడు వృద్ధుడు !
🌸 ‘‘నీ భక్తిశ్రద్ధలు , నీ మృధుభాషణం నన్ను ప్రసన్నుడిని కావించాయి ! బాలికా భగవత్స్వరూపుడైన మణికంఠుడు సర్వవ్యాపకుడు ! బాహ్య ప్రపంచమంతటా , ఈ ప్రపంచంలో నివసించే ప్రాణులందరిలో ఆత్మజ్యోతిగా వెలుగుతూ నిలిచి వుండే ఆ భగవంతుడిని జ్ఞాన నేత్రంలో దర్శించడానికి ప్రయత్నించాలి ! అందుకు నిర్మలమైన హృదయం , దృఢమైన విశ్వాసం అనే రెండు సాధనాలు అవసరం !......సశేషం... 🙏
🌹తరువాయి భాగం రేపటి శీర్షికలో తెలుసుకుందాం...🌞
No comments:
Post a Comment