శ్రీ అయ్యప్ప స్వామి దివ్య చరిత్ర 27 ,వ భాగం ప్రారంభం...!!🌹🙏
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸
🌿అమ్మను దర్శించుకున్న భక్తులు , ఆ రవికలు అమ్మకు ఇచ్చి పూజ చేయించి , తీసుకుని వచ్చి ఆ కన్యలకు ఇస్తారు
వారు రవికెలు కుట్టించుకుంటారు ! ఆ తల్లి తన వివాహ కోర్కెను , వీరికి వివాహ ప్రాప్తిని కలిగించి , వరం ప్రసాదించి తృప్తి పడుతుంది. ఇక్కడ టెంకాయలు కొట్టరు ! ఇరుముడి లోని ఆ కాయను , దొర్లించి గుడిలో వదిలేస్తారు ! పేలాలు , అటుకులు జల్లుతూ ప్రదక్షిణలు చేస్తారు ! ఏడాదికి ఒకమారు , అమ్మ , - అయ్యప్ప చెప్పిన మాటపై కోలాహలంగా, శరంగుత్తి వచ్చి చూస్తుంది.
🌸అక్కడి కన్నిస్వాములు విడిచిన శరములను చూచి,ఈ సంవత్సరం కూడా కన్నిస్వాములు వచ్చినట్లు గ్రహించి ప్రతి సంవత్సరంలా నిరుత్సాహం చెందుతూ ఉంటుంది మాలికాపురత్తమ్మ ! (కన్నిస్వాములు రాని సంవత్సరం , ఆమెను వివాహం చేసుకుంటానని మణికంఠస్వామి చెప్పారు) అందువల్ల ఆ విధంగా జరగటానికి అవకాశం లేకుండా ప్రతి సంవత్సరం కన్నిస్వాముల సంఖ్య ఎక్కువవుతూనే వుంటున్నది.
🌿మాలికాపురత్తమ్మ ఆలయం దర్శించిన తర్వాత గణపతి ఆలయం, నాగరాజు - నాగయక్షిణిల ఆలయాలను దర్శించుతారు ! ఇక్కడ పూజలు చేసి , నాగులమీద పాటలు పాడతారు ! ఆ విధముగా చేయడంవల్ల సర్వ సర్పదోషాలు , జాతక రీత్యా సంభవించు కష్ట నష్టాలు , తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు. పిదప మధ్యలో వచ్చే, అయ్యప్ప మిత్రుల ఆలయాలను కూడా దర్శిస్తారు !
🌸భస్మకొలను
ప్రస్తుతం ఈ కోనేరు స్వామి గుడి వెనుక భస్మకొలను పేరిటనున్నది. ఇందులో భక్తులు స్నానం ఆచరించి , తడిబట్టలతో , స్వామి ఆలయమునకు , పొర్లు దండాలు చేస్తారు. బసకు తిరిగి వెళతారు
🌹ఇరుముడి విప్పటం:🌹
🌿మండల దీక్ష , యాత్ర విజయవంతంగా పూర్తిచేసుకుని , ఇతర దేవీ దేవతల మందిరాలను దర్శించుకుని ఎంతో తృప్తినిండిన హృదయాలతో ఇరుముడలను , గురుస్వాములకు అప్పగిస్తారు దీక్షాధారులు ! గురుస్వామి ఇరుముడులను విప్పి పూజా సామగ్రిని వేరుచేస్తారు ! ముందుగా ముద్ర కాయను పగులగొట్టి అందులోని నేతిని వేరుగా ఒక పాత్రలోకి వేస్తారు !
🌸ఈ నేతి పాత్రతో , గంధం , పంచామృతాలు, విభూది వేరు వేరు పాత్రలలో తీసుకుని దీక్షాధారులు తిరిగి అయ్యప్ప గుడికి వెళ్లి స్వామికి నెయ్యాభిషేకం చేయించి, ఆ నేతిని ప్రసాదంగా స్వీకరించి తమ వెంట తీసుకువెళతారు ! స్వామికి అభిషేకం చేసిన ఈ నెయ్యి పరమ పవిత్రమైనది ! సర్వరోగ నివారిణి !
🌿 దీర్ఘరోగాలతో భాధపడేవారు , ఈ నెయ్యిని కొద్దిగా సేవించటం వల్ల సత్వరంగా ఉపశమనం లభిస్తుంది ! ప్రసాదపు నెయ్యిని జాగ్రత్తగా ఇళ్ళకు తీసుకువెళతారు. అభిషేకానంతరం పూజా ద్రవ్యాలను , గంధం , కొబ్బరికాయలను సమర్పించుతారు !
🌸 ముద్ర కాయ కొబ్బరి చిప్పలు గుడి ముందున్న హోమ గుండంలో వేస్తారు. గణపతి హోమంలో వేసిన కొన్నిటిని ప్రసాదంగా తీసుకుంటారు. తరువాత విభూదిని పళ్లెంలో వేసుకుని , కర్పూర హారతి చూపి , భస్మం ఇతరభక్తులమీద జల్లుతూ అమ్మవారి గుడిని చేరి , ఇరుముడిలో నుండి వేరు చేసిన రవిక గుడ్డలు , పూజాద్రవ్యాలు సమర్పించి తిరిగి రవిక గుడ్డలు ప్రసాదంగా తీసుకొని వస్తారు !
🌿ఇరుముడిలో కట్టి తెచ్చిన మిరియాలను వావరు స్వామి గుడిలో సమర్పిస్తారు ! ఇరుముడి తలమీద పెట్టుకుని స్వామిని దర్శించటం , తిరిగి దానిని విప్పి తెచ్చిన నెయ్యి , ఇతర పూజా ద్రవ్యాలు స్వామికి సమర్పించి ప్రసాదాల తో తిరుగుప్రయాణం కోసం భద్రపరచుకోవడం పూర్తయిన తర్వాత సాయంత్రం మకర జ్యోతి దర్శనం కోసం ఆత్రంగా ఎదురుచూడటం మొదలౌతుంది ! స్వామివారి ఆభరణాలు కూడా ఆ రోజు సాయంత్రానికే సన్నిధానం చేరుకుంటాయి !
🌹స్వామివారి ఆభరణాలు: 🌹
🌸స్వామి రాకుమారుడుగా ధరించిన ఆభరణాలను పందల రాజు , స్వామి తండ్రి అయిన రాజశేఖరుని విన్నపాన్ని అంగీకరించి ప్రతి సంవత్సరం మకర సంక్రాంతినాడు వాటిని స్వామి విగ్రహానికి అలంకరించడం జరుగుతున్నది ! ఆ ఆభరణాలు వుంచిన మూడు పెట్టెలు పంబల రాజవంశీయుల అధీనంలో ఉంటాయి ! మకర సంక్రాంతినాడు పెట్టెలను ఉత్సవంగా మేళతాళాలతో తలమీద వుంచుకుని బయలుదేరుతారు.
🌿 ప్రస్తుత రాజవంశం రాజు , అప్పుడు స్వయంగా , అయ్యప్ప ఇచ్చిన కరవాలంతో నగల తో పాటు వస్తారు. ఆ సమయం లోనే ఆకాశమార్గాన పెద్ద గరుడ పక్షి ఎగురుతూ, పెట్టెలకు రక్షణగా , శబరిమల దాకా వచ్చి ఆలయం పై ప్రదక్షణాలు చేసి వెళ్ళి పోతుంది. శబరిమలమీద వున్న భక్తులకు ఆ పక్షి కనబడుతుంటుంది. దాన్ని చూసి ఆభరణాల పెట్టెలు బయలుదేరాయని గ్రహిస్తారు భక్తజనం !
🌸అయ్యప్ప దీక్ష విరమణ
తిరిగి తమ ఊర్లకు చేరుకున్న తరువాత ఇరుముడిలో కట్టి తెచ్చిన బియ్యంతో పొంగలి తయారుచేసి ప్రసాదంగా కుటుంబ సభ్యులందరూ స్వీకరించాలి ! తరువాత ముందుగా మాల వేయించుకున్న గుడికి వెళ్లి గురు స్వాములను దర్శించుకుంటారు మాలధారులు ! గురుస్వామి మంత్రపూర్వకంగా వారి మెడలనుండి మాల తీసివేయడంతో దీక్ష విరమణ జరుగుతుంది !
🌹అయ్యప్ప మాలావిసర్జన మంత్రం
"అపూర్వమచలా రోగాద్దివ్య దర్శన కారణః
శాస్త్రుముద్రాత్ మహదేవ దేహిమే
వ్రత విమోచన సమస్త సలీద రక్షకన
శరణమయ్యప్ప స్వామియే శరణం " 🌹
🌿పై మంత్రాన్ని చెప్పిస్తూ మాలను తీయిస్తారు గురుస్వామి ! ఆయనకు కృతజ్ఞతా పూర్వకంగా దక్షిణ తాంబూలాలు సమర్పించి ఇండ్లకు చేరుకుంటారు దీక్ష తీసుకుని యాత్ర చేసుకువచ్చిన భక్తులు !
🌸దీక్షవస్త్రాల పవిత్రత
యాత్రలో ఎన్నో తీర్థాలలో మునిగి, కాలినడకన వెళ్ళేటప్పుడు ఆ ప్రాంత ధూళి సోకి పునీతవౌతాయి దీక్షాధారులు ధరించే వస్త్రాలు ! వాటిని ధరించి స్వామి దర్శనం చేయడంవల్ల వాటికి మరింత పవిత్రత చేకూరుతుంది !
🌿అందుచేత ఇండ్లకు చేరుకోగానే ముందుగా ఆ వస్త్రాలను విప్పి ఒక పాత్రలో తడిపి , ఆ తడిపిన నీటిని ఇల్లంతా ప్రోక్షించాలి ! తరువాత వస్త్రాలను శుభ్రంగా వుతికి , ఆరిన తరువాత శుభ్రమైన స్థానంలో భద్రపరచుకుని తిరిగి యాత్రకు మరుసటి సంవత్సరం వెళ్ళేటప్పుడు వాడుకోవచ్చును !
🌸ఈ వస్త్రదారణవల్ల చిత్తశుద్ధి కలుగుతుంది ! మనోధైర్యం పెరుగుతుంది ! దీక్షాకాలంలో వాడుకున్న చాప , దుప్పట్లను దీర్ఘరోగాలతో బాధ పడుతున్న వారికి దానం చేయవచ్చును ! మాలలు జాగ్రత్తగా భద్రపరచుకోవాలి ఇతరులకు ఇవ్వకుండా ! మరు సంవత్సరం వాటినే ధరించాలి ! దీక్షకాలంలో చేసే నియమాలు వచ్చే పుణ్యఫలమంతా మాలలోనే విలీనమై వుంటుంది !
🌿 ‘‘శబరిమల అయ్యప్పను ప్రతిరోజూ వెళ్లి దర్శనం చేసుకోవడానికి వీలుకాదు ! ఆలయం కొన్ని ప్రత్యేక కాలాలలోనే తెరిచి వుంటుంది !
ఆలయం తెరిచి వుంచే రోజులు
ప్రతి సంవత్సరం నవంబర్ 16 నుండి డిసెంబర్ 27 వరకు ఆలయం తెరిచి ఉంచుతారు ! ఈ కాలాన్ని మండల పూజాకాలం అంటారు.
🌸జనవరి 1 నుండి 20వ తేదీ వరకు ఆలయం తెరిచి ఉంటుంది. ఈ సమయంలో దేశ విదేశాల నుండి అసంఖ్యాకంగా భక్తులు తరలివస్తారు. మకరజ్యోతి , మకర విళక్కు (దీపం) ఉత్సవాలు చూడటానికి !
మలయాళ పంచాంగం ప్రకారం ప్రతి నెలా మొదటి ఐదు రోజులు ఆలయం తెరిచి వుంటుంది !
🌿అయ్యప్ప స్వామివారి పుట్టినరోజు ఫాల్గుణ మాసం, శుక్లపక్ష పంచమి , ఉత్తరా నక్షత్రంతో కూడిన పర్వదినం ! మార్చి ఆఖరు - ఏప్రిల్ మొదటివారంలో వచ్చే ఈ రోజున ‘ఫాల్గుణి ఉత్తర’ పూజ అని స్వామివారికి జన్మనక్షత్ర విశేష పూజలు జరుగుతాయి !
🌸విషు మహోత్సవం:
మలయాళీయుల కొత్త సంవత్సరాదిని ‘విషు ’ అని అంటారు ! ఈ రోజు కేరళ రాష్టమ్రంతటా అయ్యప్పస్వామి వారిని గుడులలో పండ్లు , పూలు , ధాన్యాలతో అలంకరిస్తారు......సశేషం...
🌹తరువాయి భాగం రేపటి శీర్షికలో తెలుసుకుందాం...🌞
🌸దీక్షవస్త్రాల పవిత్రత
యాత్రలో ఎన్నో తీర్థాలలో మునిగి, కాలినడకన వెళ్ళేటప్పుడు ఆ ప్రాంత ధూళి సోకి పునీతవౌతాయి దీక్షాధారులు ధరించే వస్త్రాలు ! వాటిని ధరించి స్వామి దర్శనం చేయడంవల్ల వాటికి మరింత పవిత్రత చేకూరుతుంది !
🌿అందుచేత ఇండ్లకు చేరుకోగానే ముందుగా ఆ వస్త్రాలను విప్పి ఒక పాత్రలో తడిపి , ఆ తడిపిన నీటిని ఇల్లంతా ప్రోక్షించాలి ! తరువాత వస్త్రాలను శుభ్రంగా వుతికి , ఆరిన తరువాత శుభ్రమైన స్థానంలో భద్రపరచుకుని తిరిగి యాత్రకు మరుసటి సంవత్సరం వెళ్ళేటప్పుడు వాడుకోవచ్చును !
🌸ఈ వస్త్రదారణవల్ల చిత్తశుద్ధి కలుగుతుంది ! మనోధైర్యం పెరుగుతుంది ! దీక్షాకాలంలో వాడుకున్న చాప , దుప్పట్లను దీర్ఘరోగాలతో బాధ పడుతున్న వారికి దానం చేయవచ్చును ! మాలలు జాగ్రత్తగా భద్రపరచుకోవాలి ఇతరులకు ఇవ్వకుండా ! మరు సంవత్సరం వాటినే ధరించాలి ! దీక్షకాలంలో చేసే నియమాలు వచ్చే పుణ్యఫలమంతా మాలలోనే విలీనమై వుంటుంది !
🌿 ‘‘శబరిమల అయ్యప్పను ప్రతిరోజూ వెళ్లి దర్శనం చేసుకోవడానికి వీలుకాదు ! ఆలయం కొన్ని ప్రత్యేక కాలాలలోనే తెరిచి వుంటుంది !
ఆలయం తెరిచి వుంచే రోజులు
ప్రతి సంవత్సరం నవంబర్ 16 నుండి డిసెంబర్ 27 వరకు ఆలయం తెరిచి ఉంచుతారు ! ఈ కాలాన్ని మండల పూజాకాలం అంటారు.
🌸జనవరి 1 నుండి 20వ తేదీ వరకు ఆలయం తెరిచి ఉంటుంది. ఈ సమయంలో దేశ విదేశాల నుండి అసంఖ్యాకంగా భక్తులు తరలివస్తారు. మకరజ్యోతి , మకర విళక్కు (దీపం) ఉత్సవాలు చూడటానికి !
మలయాళ పంచాంగం ప్రకారం ప్రతి నెలా మొదటి ఐదు రోజులు ఆలయం తెరిచి వుంటుంది !
🌿అయ్యప్ప స్వామివారి పుట్టినరోజు ఫాల్గుణ మాసం, శుక్లపక్ష పంచమి , ఉత్తరా నక్షత్రంతో కూడిన పర్వదినం ! మార్చి ఆఖరు - ఏప్రిల్ మొదటివారంలో వచ్చే ఈ రోజున ‘ఫాల్గుణి ఉత్తర’ పూజ అని స్వామివారికి జన్మనక్షత్ర విశేష పూజలు జరుగుతాయి !
🌸విషు మహోత్సవం:
మలయాళీయుల కొత్త సంవత్సరాదిని ‘విషు ’ అని అంటారు ! ఈ రోజు కేరళ రాష్టమ్రంతటా అయ్యప్పస్వామి వారిని గుడులలో పండ్లు , పూలు , ధాన్యాలతో అలంకరిస్తారు......సశేషం...
🌹తరువాయి భాగం రేపటి శీర్షికలో తెలుసుకుందాం...🌞
No comments:
Post a Comment