Adsense

Showing posts with label దశరథుని పూర్వజన్మ వృత్తాంతము. Show all posts
Showing posts with label దశరథుని పూర్వజన్మ వృత్తాంతము. Show all posts

Thursday, March 30, 2023

దశరథుని పూర్వజన్మ వృత్తాంతము

దశరథుని పూర్వజన్మ వృత్తాంతము 
శతరూపామనువుల తపస్సు:

🌾సృష్టి ప్రారంభ కాలమున బ్రహ్మదేవుడు మొట్టమొదట స్వయంభువు మనువును, శతరూపను సృష్టించెను.

🌾అనంతరము ఈ పుణ్యదంపతుల వలననే సృష్టి విస్తరించెను. వారి సదాచారములను, శీలములను, పవిత్ర ధర్మాచరణములను గూర్చిన వర్ణనలు వేదములలో గలవు.

🌾మానవులందఱును ఈ శతరూపామనువుల సంతానమే.

🌾వారి పెద్దకుమారుని పేరు ఉత్తానపాదుడు. భాగవతోత్తముడైన ధ్రువుడు ఆ ఉత్తానపాదుని కుమారుడే.

🌾మనువు యొక్క రెండవ కుమారుడు ప్రియవ్రతుడు, కూతురు దేవహూతి. ఈమె వివాహము కర్దమఋషితో జరిగెను.

🌾భగవంతుడు ఈ దంపతులకు 'కపిలుడు' అనుపేరుతో పుత్రుడుగా జన్మించెను. ఇతడు తనతల్లియైన దేవహూతికి సాంఖ్య దర్శనమును ఉపదేశించెను.

🌾మనుచక్రవర్తి సప్తద్వీపములతో గూడిన ఈ భూమండలమును పెక్కుసంవత్సరములు పరిపాలించెను.

🌾అతని రాజ్యమున ప్రజలు సుఖముగా జీవించిరి. ఎవ్వరికిని ఎట్టికష్టమూ లేకుండెను.

🌾అందఱును ధర్మనిరతులై ఉండిరి. ఇట్లు పెక్కు సంవత్సరములు ప్రజాపాలనము చేసిన పిమ్మట మనువు తన ముసలితనము నందు తన పెద్దకుమారుడైన ఉత్తానపాదునకు రాజ్యభారమును అప్పగించెను.

🌾పిమ్మట ఏకాంతమున భగవద్ధ్యానము చేయుటకై ఆయన తన భార్య శతరూపతో గూడి, నైమిశారణ్యమునకు వెళ్లెను.

🌾నైమిశారణ్యమునందలి మునులు ఆ పవిత్రదంపతులకు సాదరముగా సాకిరి.

🌾శతరూపా మనువులు అచటి తీర్థములలో స్నానములను ఆచరించిన పిదప ఒక వటవృక్షము క్రింద కూర్చుని తపస్సు చేసిరి. కొన్నిదినములు వారు కేవలము నీటినే ఆహారముగా తీసికొనిపి దీక్షవహించియుండిరి.

🌾ఆ పరమాత్మను వేదములు నేతినేతి (న+ఇతి, న+ఇతి)యన ఒక్క అంశము నుండియే పెక్కు మంది బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఉద్భవింతురు.

🌾శతరూపామనువులు ఈ విధముగా కేవలము జలాహారముతోడనే ఆఱువేల సంవత్సరములు తపమొనరించిరి.

🌾పిమ్మట ఏడువేల సంవత్సరములు వాయువును ఆహారముగాగొనుచు తపస్సు చేసిరి.

🌾 పదివేలసంవత్సరములు వారు ఒంటికాలి పైనిలబడి తపస్సును ఆచరించిరి.

🌾బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వారి తీవ్రతపస్సులకు మెచ్చి, వరములను ఇచ్చుట కొఱకు పెక్కుమార్లు సిద్ధపడిరి. కాని మనువు ఆవిషయమును పట్టించుకొనలేదు.

🌾కఠిన తపస్సు చేసిన కారణముగా వారి శరీరములు కేవలము అస్థిపంజరములుగా మిగిలియుండెను.

🌾 వారు మనో వాక్కాయకర్మలచే (త్రికరణశుద్ధిగా) తనకు పరమభక్తులని భావించి, వరములను కోరుకొనుడు అని భగవంతుడు ఆకాశవాణిరూపములో పలికెను.

🌾వెంటనే వారి శరీరములు రక్తమాంసములతో పరిపుష్టములయ్యెను. అప్పుడు మనువు చేతులు జోడించి, నమస్కరించుచు ఇట్లు పలికెను.

🌾 "ప్రభూ! మీరు మాయెడ ప్రసన్నులైనచో మనోహరమైన మీ దివ్యరూపమును సాక్షాత్కారమొనర్పుడు. దయతో మాకు ఈ వరమును ప్రసాదింపుడు.

🌾వెంటనే భగవానుడు మనువుతో ఇట్లనెను. "ఓ రాజా! నేను మీయెడల మిగుల ప్రసన్నుడనైతిని.

🌾నీ మనస్సులోని కోరికను నిస్సంకోచముగా తెలుపుము. నీవు దేనిని అడిగినను ఇచ్చెదను.

🌾అప్పుడు మనువు ఇట్లు పలికెను. "ప్రభూ! మీరు నాయెడల ప్రసన్నులైనచో మీవంటి పుత్రుని ప్రసాదింపుడు.

🌾ఓ కృపానిధీ ! ఇదియే మిమ్ము మేము కోరెడు వరము."

🌾అంతట భగవంతుడు ఇట్లు నుడివెను. "రాజా! అట్లేయగును.

🌾కాని నావంటి పుత్రుని కొఱకు నేను ఎక్కడ వెదకుదును? మీరు ఇద్దఱును నా ఆదేశమును పాటించి, కొంతకాలము వరకు ఇంద్రుని అమరావతిలో నివసింపుడు.

🌾 త్రేతాయుగమున దశరథుడు అను పేరుతో అయోధ్యకు రాజువు అగుదువు.

🌾 అప్పుడు నేను నా అంశలతో గూడ నాలుగు రూపములతో మీకు పుత్రునిగా అవతరింతును.” ఇట్లు పలికినపిమ్మట భగవానుడు అంతర్ధానమయ్యెను.