Adsense

Wednesday, July 14, 2021

🎻🌹🙏*దేవతలను పద్మాలలో కూర్చున్నట్లుగా వర్ణించడానికి కారణం..

🎻🌹🙏*దేవతలను పద్మాలలో కూర్చున్నట్లుగా వర్ణించడానికి కారణం..
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

*పద్మం పరిపూర్ణ కుసుమం. అది ఐశ్వరానికి, వికసించిన జ్ఞానానికి సంకేతం. జ్ఞానంలోనే దేవతా శక్తి దీపిస్తుంది. దేవతా శక్తి అనుగ్రహించినప్పుడే ఐశ్వర్యం లభిస్తుంది. దేవత అంటేనే ఐశ్వర్య శక్తి. వాక్కు, జ్ఞానం, ధనం, ధాన్యం, సంతోషం, ఆయువు ... ఇవన్నీ ఐశ్వర్యాలు.*


*వీటిని అధిష్టించి ఉంటారు దేవతలు. ఐశ్వర్యాధి దేవత లక్ష్మిని 'కమల'గా వర్ణిస్తారు. హృదయాన్ని కూడ పద్మంగా పేర్కొన్నారు. సద్భావనలతో పరిమళించి, శాంతానందమే అనుభూతి మకరందంగా, మెత్తదనమే లక్షణంగా జ్ఞానంతో వికసించిన మనః పద్మంలో దైవం గోచరిస్తాడు.*


*దానికి సంకేతంగా పద్మంలో దైవాన్ని దర్శిస్తారు. యోగపరంగా - సుషుమ్నా నాడి మార్గంలో ముఖ్య ప్రాణ రూపంగా ప్రసరించే దైవ చైతన్యాన్ని ఆరు చక్రాలలో ఆవిష్కరించుకుంటాం. ఆ ఆరు చక్రాలు స్పందించి వికసించాలి. ఏ అవరోధాలు లేకుండా శక్తిని ఆవిష్కరించుకొనేలా ఆ చక్రాలు వికసించినప్పుడు, పద్మంవలె భాసిస్తాయి.*

 
*ఆ ఆరు చక్రాలనే ఆరు పద్మాలుగా వర్ణిస్తారు. వాటిలో ప్రకాశించే ఆత్మ చైతన్యమే దేవత. పరమపదంగా, బహు విధాలుగా బ్రహ్మ రంధ్రంలో ప్రకాశవంతమైన సహస్రార కమలంలో పరిపూర్ణ పరబ్రహ్మ తేజస్సు గోచరిస్తుంది. ఈ స్థితిని గ్రహించడానికి పద్మంలో కూర్చున్న దైవాన్ని ఆరాధించడం మార్గం.*..🌞🙏🌹🎻

🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸

No comments: