Adsense

Tuesday, February 22, 2022

మాఘ పురాణం - 21 వ అధ్యాయము.. శివస్తుతి



శ్రీమహావిష్ణువు చేసిన శివ ప్రశంస - నారదుని శివస్తుతి.

గృత్నృమదమహర్షి జహ్నుమునితో మరియు నిట్లనెను. 

విష్ణువు శివుని జూచి యిట్లనెను. శంకరా! నీవు నాతో సమానుడవు.

 మన యిద్దరికిని భేదము లేదు. నావలెనే సర్వ పూజ్యుడవు. సర్వవ్యాపకుడవు, సర్వోత్తముడవు, సర్వవ్యాపివి, సర్వాత్మకుడవు సుమాయని యిట్లు స్తుతించెను.

     *🌷విష్ణుకృత శివస్తుతి🌷*

🌹🙏శంభో భవానర్కహిమాంశు నహ్నివేత్రత్రయస్తే ఖిలలోక కర్తా
తధాసమస్తామర పూజితాంఘ్రీః సంసేవ్యమానస్పురయోగిబందైః ||

వచాస్తికించిత్తవ మిత్ర భేదస్తే హంచ్వహం త్వం సురనాధసత్యం
వేదాంద వేద ప్రముఖా నిశం ర్వాంసన్యాసినస్వృర్గ విముక్తి హేతుం
వదంతి తద్వత్ సుభజంతిశంభో ప్రయాంతి ముక్తించ తివ ప్రసదం ||

సర్వభేదవినిర్ముక్తః సర్వభేదాశ్రయోభవాన్
త్వంత్వరిష్ఠాయలోకేస్మిన్ మహాదేవో మహేశ్వరః ||

త్వమేవ పరమానందస్త్వమే వాభయదాయకః
త్వమక్గరం పరంబ్రహ్మ త్వమేవహినిరంజనః ||

శివస్స్ర్వగతః సూక్ష్మః 
ప్రబ్రహ్మవిదామసి
ఋషీణాంచ వశిష్ఠస్త్వం వ్యాసోవేదనిదామసి ||

సాంఖ్యానాంకపిలోదేవః రుద్రాణామపి శంకరః
ఆదిత్యానాముపేంద్రప్త్యం వసూనాం చ హిపొవకః ||

వేదానాంసామవేదస్త్యం సావిత్రి చందసామపి
ఆధ్యాత్మ విద్యావిద్యానాం గతీనాం పరమాగతిః ||

మాయాత్వం సర్వశక్తీనాం కాలకలయతామపి
ఓంకారస్సర్వగుహ్యానాం వర్ణానాం చ ద్విజోత్తమః ||

ఆశ్రమాణాం చ గార్హ్యస్థ్యం ఏశ్వరాణాం మహేశ్వరః
పుంసాంత్వమేకుపురుషః సర్వభూతహృదిస్థితః ||

సర్వోపనిషదాంచేవ గుహ్యోపనిషదుచ్యతే
కల్పానాంచమహాకల్పః 
యుగానాంకృత మేవచ
ఆదిత్యః సర్వమారాణాం వాచాందేవి సరస్వతీ ||

ర్వం లక్ష్మీశ్చారురూపాణాం విష్ణుర్మాయావినామసి
సూక్తాణాం పౌరుషంసూక్తం బ్రహ్మసిబ్రహ్మవేదినాం ||

సావిత్రీచాసి జాహ్యిరాం యజుషాం శతరుద్రీయః
పర్వతానాం మహామేరుః అనంతోయోగినామపి ||

సర్వేషాం పరబ్రహ్మచ్వన్మయం సర్వమేనహి
యరైవాహం త్వంహి సర్వముఖ్యోషు శంకర ||...🙏🌹

శంకరా! నీకు నాకును భేదమే లేదు. వేదాంతవేత్తలకిది స్పష్టముగ తెలియును.

 నేను నారదునకు నీ మహిమను చెప్పగా నతడు నీయనుగ్రహమునకై తపమాచరించెను.

 నిన్ను దర్శింపనెందెను. నీవాతని ననుగ్రహించితివి. అతడు నిన్నెట్లు స్తుతించెనో గుర్తున్నదా? మరల స్మరింపుము.

కూపంతనాశేష కధాభిగుప్తం అగోచరం నిర్మలమేకరూపం
అనాదిమధ్యాంత మనంతమాద్యం నమామి దేవంతమనః పరస్తాత్ ||

ర్వాందేకపస్యంతి జగతృసూతిం వేదాంత సునిశ్చితార్థాః
ఆనందమాత్రం ప్రణనాభిధానం చతేవరూపం శరణం ప్రపధ్యే ||

ఆశేషభూతాంతర సన్నివిష్టం ప్రభావతాయోని వియోగహేతుం తేజోమయం జన్మవినాశహీనం ప్రాణాభిధానం ప్రణతోస్మిరూపం ||

ఆద్యంత హీనం జగదాత్మభూతం విభిన్న సంస్థం ప్రకృతేపరస్తాత్
కూటస్థమవ్యక్తవపు స్తదైవ నమామిరూపం పురుషాభిదానం ||

సర్వాశ్రయం సర్వజగద్విధానం సర్వతనం సర్వతమ ప్రవిష్టం
సూక్ష్మంవిచిత్రం త్రిగుణం ప్రసన్నం నతోస్మిలే రూపములుస్త భేధం ||

ఆద్యం మహత్త్వే పురుషార్త్మరూపం ప్రకృత్యవస్థం త్రిగుణాత్మబీజం
ఐశ్వర్య విజ్ఞాన విరాగధర్మైస్పమన్వితం దేవనతోస్మిరూపం ||

ద్వీసప్తలోకాత్మకమంబు సంస్థం విచిత్ర భేదం పురుషైకరాధం
అనంత భూతైరధివాసితంతే వతోస్మ్యహం తజ్జ గదంద స్థంస్థం ||

అశేష దేవాత్మక మేకమాద్యం స్వతేజసారూపితలోక భేదం
త్రికాలహేతుం పరమార్జరూపం నమామ్యహం త్వాం రవి మండలస్థం ||

సహస్రమూర్థానమనంత శక్తీం సహస్రబాహుం పురుషం పురాణం
శయానమంతస్పంలే తదైవ నారాయణాఖ్యం ప్రణతోస్మినిత్యం ||

దంష్ట్రాకరాళం త్రిదశాదినంద్యం యుగాంత కాలావల కాలరూపం
అశేషరూపాండ వినాశహేతుం నమామి రూపం తవకాల సంజ్ఞం ||

ఫణా సహస్రేణ విరాజమానం భోగీంద్రముఖ్యైరభీ పూజ్యమానం
జనార్దన ప్రీతి మహత్కరం త్వాం సతోస్మిరూపంతవ శేష సంజ్ఞం ||

అన్యాహతైస్వర్యమయుగ్మ నేత్రం బ్రహ్మమృతానంద రవజ్ఞమేకం
యుగాంతశేషం దివిసృత్యమానం నతోస్మ్యహంత్వామె తిరుద్ర సంజ్ఞం ||

ప్రక్షీణశోకం విమలం పవిత్రం సురాసురైర్చిత పాదయుగ్మం
మకోమలం హింద్ర సుశుభ్రదేవాం నమామ్యహాం త్వామఖిలాభినాధం ||

చతుర్భుజం శూలమృగాగ్నిపాణీం ప్రయత్నతో భక్తవర ప్రదానం
వృషధ్వజం త్వాం గిరిజారదేహం వతోస్మ్యహందేవ కృపాకరేశం ||


శంకరా! నారదుడు చేసి అమోఘమైన యీ స్తుతిని విని నీవు నిక్కిలి సంతోషించితిమ్ని. 

మునులందరి స్తోత్రమును చదువుచు నిన్ను సేవించిరి కదా. కావున నీకును నాకును బ్రహ్మకును భేదమును లేదు.

 మనకు భేదమున్నదని తల్చు మూఢులు నరకమున బడుదురు సుమా అని శ్రీమన్నారాయణుడంతర్థానము నందెను.

జహ్నుమునీ! విష్ణు ఏ విధముగ రజస్తమోగుణ భేదము వలన వివాదపడిన బ్రహ్మను శివుని శాంతపరచి లోకములకి వినయము నీ విధముగ తెలిపెను.

 ప్రస్తుతం  ముగ్గురికి భేదములేకున్నను భేదమున్నదని తలచివాదించు, అహంకార పండితులకొరకీ సంఘటన జరిగినది. మాధమాసవ్రతము నాచరించు వారి విషయమును తప్పక గ్రహింపవలయును. అజ్ఞానముచే నాలోచించి దోషమునకు ఓడిగట్టరాదు.

కావున బుద్ధిమంతులు సత్వగుణ ప్రధానుడై సర్వాత్మకుడైన విష్ణువునే భావించి జ్ఞానులైముక్తినందవలెను.
అజ్ఞానులు మాఘమాసవ్రతము నాచరించి జ్ఞానులై యిహపరముల యందు సుఖింపవలయును సుమా వృధాపదములు బుద్ధిహీనులకే గాని బుద్ధిమంతులకుగాదని తెలుపుటే యీ సంఘటన జరిగినది లెనిచో సర్వాధికిలు సర్వాధారులు సర్వోత్తములునగు త్రిమూర్తులకు కలహమేమి యెక్కువ తక్కువలేమి? మూర్ఖుడైనను భక్తితో మాఘమాసవ్రతము నాచరించిన జ్ఞానియై సుఖించును.

అహంకారము దుఃఖమును కలిగించునని అది త్రిమూర్తులంతటి వారికైనను తప్పదని దీని భావము.

 గర్వమని అశక్తుడైన వాని నాక్షేపింతురు. సర్వసమర్థుడైన వానికేది అయినను వానిశక్తికి లోబడినదే. పరమాత్మకు అహంకారమెట్లుండును ఉండదు. ఏదియును అయనను మించినది లేదుకదా. 

జ్ఞానము కలుగలలెనని భగవంతుడే యిట్టి సంఘటన నేర్పరచి మనవంటి మూఢులకు అహంకూడదని తెలిపెను. కావున గర్వమును, సిగ్గును, అభిమానమును విడిచి బుద్ధిమంతుడు మాఘమాసవ్రతము నాచరించి విష్ణుకథలను విని తరింపవలెను.

 యధాశక్తి దానములాచరించి సాటివారియందు ప్రేమనుచూపుచు సర్వాత్మకుని దయా విశేషము నందవలయును అని గృత్నృమదమహర్షి జహ్నుమునికి మాఘమాస మహత్త్యమును భగన్మహిమను బోధించెను...🙏💐

నేటి మాఘ పురాణం 21,వ రోజు పారాయణం సమాప్తం.

No comments: