Adsense

Wednesday, June 15, 2022

శ్రీ వరసిద్ధి వినాయక ఆలయం, కాణిపాకం


👉 తిరుమలపై కోనేటి రాయుని కోనేటి రాయని దర్శించుకున్న భక్తులు  కాణిపాకంలో స్వయంభువుగా వెలసిన వరసిద్ధి వినాయకుని దర్శించుకుంటారు. ఇక్కడ వినాయకుడు బావిలో దర్శనమివ్వటం విశేషం. ఇక్కడ స్వామివారి మహిమలు అనంతం. 

👉ఎందరో భక్తులు వినాయకుడి మహిమలను కథలు కథలుగా చెప్పుకుంటారు. కాణిపాకం ప్రజలు సాధారణంగా న్యాయస్థానాలను ఆశ్రయించరు, పోలీసులకు ఫిర్యాదు చేయరు. దోషిగా అనుమానించిన వ్యక్తి చేత కాణిసాకం వినాయకుని వద్ద ప్రమాణం చేయిస్తారు. ప్రమాణం సత్యమైనదైతే అతడు నిర్దోషి, ఒకవేళ అసత్య ప్రమాణం చేసి ఉంటే వినాయకుడే వెంటనే అతడి పని పడతాడని భావిస్తారు.

🔅 కాణిపాకంగా మారిన విహరపురి : చరిత్ర,  విశిష్టత. 

👉కాణిపాకం క్షేత్రం  ఒకప్పుడు విహరపురి గా పిలువబడేది.
కాణిపాకం పేరు వెనుక అసలు రహస్యం.. 
కాణి అంటే పావు ఎకరా మడిభూమి లేదా మాగాణి అని, పారకం అంటే నీళ్లు పొలంలోకి పారటం అని అర్ధం.
టెంకాయ నీళ్ళు కాణి భాగం అంతా ప్రవహించడం వల్ల కాణిపాకం అయింది

👉 ప్రకృతి వైపరీత్యాల వల్ల విహరపురి తన మునుపటి వైభవాన్ని కోల్పోయింది. వరదలు వచ్చి, బహుదా నది పొంగిపొర్లడంతో ఆలయంలోని వరసిద్ధి వినాయకుడు బావిలోకి జారి, అక్కడే ఉండిపోయాడు.
 విహరపురి ఈ వరదల నుండి కోలుకుంటుండగానే అనావృష్టి సంభవించి పట్టణం మరుభూమిగా మారిపోయింది. 
ఈ దుర్భర పరిస్థితుల్లో కూడా కలిసివెలసి జీవిస్తున్న ముగ్గురు మిత్రులకు కాణి పొలం వుండేది.

👉 కాణి అంటే 1.3 ఎకరం. వీరిలో మొదటివాడు గుడ్డి, రెండవవాడు చెవిటి, మూడవవాడు మూగ. వీరికి పుట్టుకతోనే ఈ వైకల్యాలు సంభవించాయి. పంట వేయడానికి అవసరమైన నీటి కోసం బావిని లోతు చేయడానికి చెవిటి, మూగ మిత్రులు చేతిలో గునపాలతో బావిలోకి దిగారు. గుడ్డి మిత్రుడు మాత్రం గట్టునే ఉండిపోయాడు. మిత్రులిద్దరూ గునపంతో పోటు వేయగానే ఠంగ్ మన్న శబ్దం వచ్చింది. వెంటనే వెచ్చటి రక్తం పైకి చిమ్మింది. ఈ రక్తపు చుక్కలు మీద  పడగానే చెవిటి మిత్రునికి మాట వినిపించింది. మూగ మిత్రునికి మాట వచ్చింది. ఇది భగవంతుడి మహాత్మ్యమని తెలుసుకున్న మిత్రులిద్దరు రక్తదారను ఆపడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. అయితే నెత్తుటి ధార ఆగకుండా ఇంకా పైకి చిమ్మి గుడ్డివాని కనులను తాకింది. వెంటనే వానికి చూపు వచ్చింది. వెంటనే అతడు రాజు వద్దకు పరుగుతీసి, జరిగినదంతా చెప్పాడు. అది విని రాజు తన రాణులతోను, దానదాసీజనంతోను, అక్కడకు చేరుకుని ఆ బావిలో లెక్కిలేనన్ని కొబ్బరికాయలు కొట్టి, స్వామివారిని శాంతింప జేశాడు. అలా బావి నుండి ఉబికి వచ్చిన కొబ్బరి నీరు కాణిపై పారింది. దాంతో విహారపురికి కాణిపాకం అనే పేరు సార్థకమై, క్రమంగా కాణిపాకంగా మారింది.

👉 సంతానం లేని దంపతులు, దీర్ఘ వ్యాధులతో బాధపడుతున్న వారు కాణిపాకం వినాయకుని దర్శించుకుని, 11 లేదా 22, 41 రోజులు నియమానుసారం పూజలు చేస్తే సంతాన ప్రాప్తి, ఆరోగ్యప్రాప్తి కలుగుతాయని భక్తుల విశ్వాసం. వరసిద్ధి వినాయకుడు స్వయంభువుగా వెలసిన బావిలోని జలాన్ని భక్తులు తీర్థంగా స్వీకరిస్తారు.

👉ప్రతిఏటా వినాయకచవితి పండుగ రోజు నుంచి 21 రోజులపాటు స్వామివారి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతాయి. బ్రహ్మోత్సవాల రోజుల్లో లక్షలాది మంది భక్తులు సత్యప్రమాణాల స్వామి దర్శనానికి వస్తుంటారు. 

👉చిత్తూరు జిల్లా కేంద్రానికి 12 కిలోమీటర్ల దూరంలో వెలసిన కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి దివ్యక్షేత్రం దక్షిణాది రాష్ట్రాల్లోనే అత్యంత ప్రాచుర్యం పొందిన ఆలయాల్లో ఒకటిగా ప్రసిద్ధిగాంచింది. తిరుమల తిరుపతికి 72 కిలోమీటర్ల దూరంలో వుంది.

🔅 పెరుగుతున్న విగ్రహం : 

👉స్వామి దినదిన ప్రవర్థమానంగా పెరుగుతూ వున్నాడని భక్తుల నమ్మకం. దీనికి సాక్ష్యంగా సుమారు 50 సంవత్సరాల ముందు స్వామి వారికి చేయించిన వెండి కవచం నేడు స్వామి వారికి సరిపోవడం లేదు. స్వామివారు ఆవిర్భవించినప్పుడు కనిపించని బొజ్జ ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. ఇది స్వామి పెరుగుతూ వున్నాడనడానికి చక్కని నిదర్శనం. అందుకే స్వామి వారు స్వయంభువునిగా ఖ్యాతినొందారు.

🔅 బాహుదానది చరిత్ర : 

👉వినాయకస్వామి వెలసిన బాహుదానదికి ఆ పేరు రావడం గురించి కూడా పురాణ కథవుంది. 
స్వామిని చూడాలని శంఖుడు, అంఖితుడు అనే ఇరువురు సోదరులు కాలినడకన బయలుదేరారు.
దైవ లీలలో భాగంగా చేయని తప్పుకు అంఖితుడికి రాజుగారి ద్వారా చేతులు నరకమని శిక్ష పడింది. 
భటులు రాజు ఆజ్ఞ ప్రకారం అంఖితుడి చేతులను ఖండించారు. తమ్ముడికి ఊహించిన శిక్ష పడటంతో దు:ఖంతో తమ్ముని వెంటబెట్టుకొని శంఖుడు కాణిపాకం వినాయకస్వామి దర్శనానికి వెళ్ళాడు. 
దైవదర్శనానికి ముందుగా అక్కడ నదిలో స్నానమాచరిస్తుండగా ఖండించిన అంఖితుని చేతులు తిరిగివచ్చాయి.పోయిన బహువులు తిరిగి వచ్చిన కారణంగా ఆ నదికి బహుదానదిగా పేరు వచ్చింది.

👉 శివుడు, విష్ణువు ఒకే పుణ్యక్షేత్రంలో అదీ ఒకే ప్రాంగణంలో వుండటంతో కాణిపాకం క్షేత్రాన్ని శివవైష్ణవ క్షేత్రంగా పిలుస్తారు.

No comments: