Adsense

Wednesday, June 15, 2022

శ్రీ కళ్యాణవేంకటేశ్వర ఆలయం: శ్రీనివాస మంగాపురం: (చిత్తూరు జిల్లా)


👉 శ్రీనివాస మంగాపురం తిరుపతి కి 12 కి.మీ. దూరంలో ఉంది. 
ఇక్కడ శ్రీ కళ్యాణవేంకటేశ్వరస్వామి వేంచేసి ఉన్నారు.

🔅 స్వామివారికి ఆ పేరు ఎందుకు వచ్చింది ? 
👉తిరుమలలో శ్రీవారి పాదాల వద్ద ప్రవహించే నది " విరజా నది" . ఆ నది తిరుమల గిరుల నుండి ప్రవహించి కిందకు వచ్చాక రెండుగా చీలిపోతుంది . అవే స్వర్ణముఖి మరియూ కల్యాణి.
ఇతిహాసాల, పురాణాల ప్రకారం స్వామి నారాయణవనం లో కళ్యాణం చేసుకొని, 
శాస్త్రప్రకారం పెళ్లయిన దంపతులు ఆరు నెలలపాటు కొండలు ఎక్కడం, పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం కూడదని అగస్త్యమహర్షి చెప్పడంతో తిరుమల కొండ మీద వెలసే ముందు పద్మావతి అమ్మవారితో ఇదే కల్యాణి నది ఒడ్డున 6నెలల పాటు కాపురం చేసాడు...కనుకనే కల్యాణవేంకటేశ్వర స్వామి అనే సార్థక నామధేయం వచ్చింది; ఇక్కడి స్వామిని దర్శిస్తే యువతి యువకులకు పెళ్లిళ్లు అవుతాయి అనే నమ్మకం వల్ల కల్యాణ వేంకటేశ్వరస్వామి అని వ్యావహారిక నామధేయం వచ్చింది .

👉 ఇక్కడి స్వామి వారి విగ్రహం ముమ్ముర్తుల తిరుమల శ్రీవారిని పోలి ఉంటుంది మరియు ఇక్కడి మూలవిరాఠ్ తిరుమలలోని మూలవిరాఠ్ కన్నా పెద్దది. తిరుమలో జరిగే అన్ని పూజాదికాలు ఇక్కడ కూడ జరుగుతాయి. ఇక్కడ భక్తుల తాకిడి అంతగా లేనందున ప్రశాంతంగా దర్శనం చేసుకోవచ్చు.
 పాకాల -- తిరుపతి రైలు మార్గంలో శ్రీనివాసమంగాపురం వద్ద గతంలో రైల్వే స్టేషన్ వుండేది. ఆ దారిన వచ్చే భక్తులు అందరు శ్రీనివాసమంగాపురంలొ దిగి అక్కడి స్వామి వారిని దర్శించుకొని 
ఇక్కడికి దగ్గరలోని తిరుమల కొండల పాధ భాగాన వున్న శ్రీవారి మెట్టు వద్దకు వెళ్లి అక్కడి నుండి ప్రారంబమౌ నూరు మెట్ల దారి గుండా తిరుమలకు వెళ్లెవారు. తిరుపతిలోని అలిపిరి వద్దనున్న మెట్ల దారికంటే ఈ మెట్ల దారి అతి దగ్గర. 

👉 ఈ ఆలయాన్ని 16వ శతాబ్ధంలో తాళ్లపాక అన్నమాచార్యుల మనుమడు తాళ్లపాక చినతిరుమలయ్య పునరుద్ధరించారు.

👉ఈ క్షేత్రానికి ఎక్కువగా అవివాహితులు తమ తల్లిదండ్రులతో కలిసివచ్చి కల్యాణోత్సవం చేయిస్తుంటారు.
చివరలో అర్చకులే ఇచ్చే ‘‘కల్యాణకకంణం’’ ధరించిన వారికి వెంటనే వివాహం జరుగుతుందని భక్తుల విశ్వాసం. ఆ కారణంగానే ఈ ఆలయంలో రోజూ ఎంతోమంది యువతీ యువకులు తమ తల్లిదండ్రులతో కలిసి కల్యాణోత్సవం చేయిస్తుంటారు. తిరుమల క్షేత్రానికి వెళ్లలేనివారు ఇక్కడే స్వామివారిని దర్శించుకుని తరిస్తుంటారు. 

👉తిరుమలలో శ్రీవారికి నిర్వహించే అన్ని అర్జితసేవలు ఇక్కడ కూడా నిర్వహిస్తుంటారు.
ఎన్నో వ్యవయప్రయాలకు ఓర్చి రోజుల తరబడి ఎదురు చూసినా తిరుమలలో క్షణకాంల శ్రీనివాసుడి దర్శనభాగ్యం కలిగితే అదే మహాభాగ్యంగా భక్తులు భావిస్తుంటారు. ఆ లిప్తపాటు దర్శనానికి వెళ్ళలేనివారు ఇక్కడ స్వామివారిని తనివితీరా ఎక్కువసేపు దగ్గరగా  దర్శించుకుని తృప్తిపొందుతారు.
 ఈ క్షేత్రానికి దగ్గరలోనే శ్రీనివాసుడు తిరుమల కొండకు నడిచి వెళ్ళిన శ్రీవారిమెట్లు కలవు. 

👉యోగం, భోగం, వీరం, అభిచారిక అనే నాలుగురకాల మూర్తుల్లో ఏదో ఒక మూర్తిని వైష్ణవాలయాలలో ప్రతిష్టిస్తారు. కాని తిరుమల శ్రీవేంకటేశ్వరుడు స్వయంభువు కాబట్టి శ్రీనివాసుడు ఈ రూపాలకు అందనివాడూ, అన్నిటికీ అతీతుడు కాబట్టి ఆయన విగ్రహం ఏ శాస్త్రాలకు అందని అర్ఛావతారం. శ్రీనివాస మంగపురంలో శ్రీనివాసుడు కూడా అర్ఛావతార స్వరూపుడే.

👉తిరుమలకు వెళుతూ శ్రీనివాసుడు తన భక్తులకు రెండువరాలు ప్రసాదించాడని చెబుతారు. తిరుమలకు వచ్చి తనను దర్శించుకోలేని భక్తులకు శ్రీనివాసమంగాపురంలో అర్చావతార స్వరూపంతో దర్శనభాగ్యం కల్పిస్తాననీ, పద్మావతీదేవిని పరిణయమాడిన వెంటనే తాను విడిది చేసిన ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించిన వారికి సకల శుభాలు, పెళ్లికానివారికి కల్యాణ సౌభాగ్యాన్ని అనుగ్రహించినట్లు చెబుతారు.

👉కాంచీపురంలో ఉన్న సుందరరాజస్వామి అనే అర్చకునికి స్వామికి కలలో కన్పించి తాను శ్రీనివాసమంగాపురంలో ఉన్నానని తనుకు పూజాదికాలు నిర్వహించమని చెబుతారు. అప్పటినుండి మళ్లీ ఆలయం కళకళలాడుతుంది. ఆయనకు స్వామివారు కలలో కనిపించిన రోజున సాక్షాత్కార వైభవోత్సావాన్ని మూడురోజుల పాటు జులై మాసంలో వైభవంగా నిర్వహిస్తుంటారు.

బ్రహ్మోత్సవాలు : తిరుమలలో లాగానే ఇక్కడకూడా ఏటా బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తుంటారు. ధ్వజారోహణంతో మొదలై తొమ్మిదిరోజులపాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి. 
స్వామివారు తిరుమలకు వెళుతూ దగ్గర్లోని సువర్ణముఖీ నదిలో అగస్త్య మహాముని ఆశ్రమంలో పెట్టిన పాదాన్ని భక్తులు "విష్ణుపాదం" గా కొలుస్తుంటారు.


అన్నమయ నిత్యం తన ఇంట్లో పూజించే  అలమేలు మంగ , శ్రీనివాస విగ్రహాలు ఎవరో దొంగిలించి పోయ్యారు.
 అయితే ఇది అన్నమయ జీవితం లో 5 సార్లు జరిగినట్టు చరిత్ర చెప్తోంది .
ఒకసారి హనుమ , ఒకసారి గరుడ , ఒకసారి విశ్వసేన , ఒకసారి పూరీ జగన్నాద స్వామి ,ఒకసారి శ్రీవారి అనుగ్రహం తో అన్నమయ వద్దకు వచ్చాయి .

👉ఇప్పటికీ వారు పూజించిన విగ్రహాలు శ్రీనివాస మంగాపురం లో చూడవచ్చు.

No comments: