Adsense

Wednesday, July 20, 2022

స్వర్గం నుంచి శ్రీకృష్ణుడు తెచ్చిన పారిజాతవృక్షం ఎక్కడుందో తెలుసా...??

 


🌿పారిజాత పూలతో దేవుడికి పూజ ఎంతో ప్రీతిపాత్రమైనదిగా చెబుతారు.

🌸 ప్రపంచంలో ఏ చెట్టుకీ లేనంత ప్రత్యేకత పారిజాత వృక్షానికే ఎందుకంటే స్వర్గలోకం నుంచి తీసుకొచ్చినందునే. 

🌿అందుకే ఈ పూలు నేరుగా చెట్టునుంచి కోయరు..కిందపడినవి ఏరి పూజచేస్తారు. దేవతావృక్షం నుంచి పూలు నేలపై రాలిన తర్వాతే అవి భూమికి చేరినట్టు అని భావిస్తారు. 

🌸నారదుడు ఓ సందర్భంలో శ్రీకృష్ణుడిని కలవడానికి ద్వారకా నగరానికి వచ్చినప్పుడు స్వర్గలోకం నుంచి పారిజాత వృక్షాన్ని తన వెంట తీసుకొచ్చి దేవలోకంలో మాత్రమే లభించే ఈ అపురూప పుష్పం మీకు ఇస్తున్నాను,

🌿 దీన్ని మీకు బాగా నచ్చినవారికి ఇవ్వమని చెప్పగా, అప్పుడు అంతఃపురంలో తనతో పాటూ ఉన్న రుక్మిణికి ఇస్తాడు శ్రీకృష్ణుడు. 

🌸ఆ విషయం చెలికత్తెల ద్వారా తెలుసుకున్న సత్యభామ అలకలపాన్పు ఎక్కుతుంది. అందరికన్నా ఎక్కువని చెప్పి ఇప్పుడిలా చేస్తారా అని రుసరుసలాడుతుంది. 

🌿అప్పుడు స్పందించిన శ్రీకృష్ణుడు నీకోసం ఏకంగా చెట్టే తీసుకొచ్చేస్తానని చెప్పి అలకమాన్పిస్తాడు.

🌸తానూ దేవలోకానికి వస్తున్నట్లుగా శ్రీకృష్ణుడు ఇంద్రుడికి కబురు పెట్టి స్వర్గలోకానికి సత్యబామతో కలసి బయలుదేరుతాడు. 

🌿ఇలా దేవలోకానికి వెళ్లి వన విహారం చేస్తూ పారిజాత వృక్షాన్ని చూసి ఆ చెట్టుని పెకిలించి తీసుకువెళుతుండగా ఇంద్రుడు అడ్డుకోవడంతో యుద్ధానికి దిగుతాడు శ్రీకృష్ణుడు. 

🌸యుద్దానికి దిగి చివరకు ఓటమిని అంగీకరించి పారిజాతవృక్షాన్ని శ్రీకృష్ణుడికి ఇస్తాడు ఇంద్రుడు. 

🌿అప్పుడు సత్యభామతో కలసి భూలోకానికి వచ్చిన శ్రీకృష్ణుడు పారిజాతవృక్షాన్ని సత్యభామ అంతఃపురం బయట నాటుతాడు.

🌹 స్వర్గం నుంచి 
శ్రీకృష్ణుడు తెచ్చిన పారిజాతవృక్షం ఎక్కడుందో తెలుసా...??🌹
        
🌸ఈ పారిజాత వృక్షం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బారబంకి జిల్లాలోని కింటూర్ గ్రామం వద్ద ఉంది..

🌿శ్రీకృష్ణ పరమాత్మ ఇంద్రలోకం నుంచి తెచ్చి సత్యభామకి బహూకరించిన పారిజాత వృక్షం

 🌸ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బారబంకి జిల్లాలోని కింటూర్ గ్రామంలో ఉంది.. ప్రపంచంలోకెల్ల విలక్షణమైన వృక్షంగా శాస్త్రజ్ఞులు దీనిని అభివర్ణించారు. 

🌿దీని శాఖ ముక్కల నుండి పునరుత్పత్తి గాని, పండ్లు గాని ఉత్పత్తి చేయదు. అందుకే ఈ వృక్షం ఒక ప్రత్యేక వర్గం లో ఉంచబడింది. 

🌸ప్రపంచంలోని ఏ ఇతర చెట్టుకు లేని ప్రత్యేకత ఈ వృక్షం స్వంతం. 
దిగువ భాగంలో ఈ చెట్టు ఆకులు, 

🌿చేతి ఐదు వేళ్ళను పోలి ఉంటాయి. పై భాగాన ఆకులు ఏడు భాగాలుగా ఉంటాయి. 

🌸వీటి పుష్పాలు కూడా చాలా అందంగా బంగారు రంగు మరియు తెలుపు రంగులో కలిసిన ఒక ఆహ్లదకరమైన రంగులో ఉంటాయి.

 🌿పుష్పాలు ఐదు రేకులు కలిగి ఉంటాయి. చాలా అరుదుగా ఈ వృక్షం వికసిస్తుంది. 

🌸అదీ జూన్ / జూలై నెలలో మాత్రమే. ఈ పుష్పాల సువాసన చాలా దూరం వరకు వ్యాపిస్తుంది. 

🌿ఈ వృక్షం యొక్క వయస్సు సుమారు 5000 సంవత్సరాలుగా వ్రృక్ష శాస్త్రవేత్తల చేత చెప్పబడుతున్నది. 

🌸ఈ వృక్ష కాండము చుట్టుకొలత 50 అడుగులుగాను, ఎత్తు 45 అడుగుల గాను చెప్పబడింది. 

🌿ఈ వృక్షం యొక్క మరొక గొప్పతనం దీని శాఖలు గాని ఆకులు గాని కుంచించుకుపోయి కాండంలో కలిసిపోవటమే కాని ఎండిపోయి రాలిపోవటం జరగదు..🙏💐

జై శ్రీకృష్ణా..

No comments: