సంతానం లేదని చింతనతో మంత్రి పురోహితులతో సమావేశం ఏర్పాటు చేయాలని దశరథుడు సుమంత్రునికి ఆదేశాలు జారిచేసేను.
రాజు గారి అదేశాలమేరకు సుయజ్ఞుడు, వామదేవుడు, జాబాలి,కాశ్యపుడు ఇతర బ్రాహ్మణ పురోహితులు ఇతర మంత్రివర్గం తో సమావేశం ఏర్పాటు చేసెను.
ఆ సమావేశం లో దశరథుడు తన మనసులోని మాటను వారి ముందు ఉంచెను.
సంతానం లేని నేను అశ్వమేధ యాగం చేయ బూనినాను.శాస్త్రము యందు చెప్పబడినట్టు నియవిజ్ఞముగా ఎట్లు చేయవలెనో ఉపాయము ఆలోచించి తెలపండి అని తెలిపెను.
రాజు నోటినుండి వెలువడిన మాటలకు మంత్రి పురోహిత వర్గము సంతోషముతో
యాగమునకు కావాల్సిన సామాగ్రి సమకూర్చుకోనుము,యజ్ఞాశ్వమును విడువుము, సరయూ నది తీరంలో యజ్ఞాశాలను నిర్మించుము అని అశ్వమేధ యాగానికి కావాల్సిన పూర్వరంగమును సమాయత్తము చేసెను.
అంతపురమునకు దశరథుడు వెళ్లి తన ముగ్గురు భార్యలైన కౌసల్య, సుమిత్ర ,కైకేయి లతో తెలియజేసెను.
ఇక మీరు యజ్ఞ దీక్ష తీసుకొనవలెను సంతానార్థమైన యజ్ఞము లో భాగం అని చెప్పిన వెంటనే వారి ముఖాలు మంచు విడిచిన కలములవలె ప్రకాశించెను.
No comments:
Post a Comment