విశ్వామిత్రునితో కలసి రామలక్ష్మణులు సిద్ధాశ్రమం చేరారు...
విశ్వామిత్రుడు వెంటనే యజ్ఞ దీక్ష స్వీకరించాడు.
రామ లక్ష్మణులు ఆ రాత్రికి విశ్రమించారు. ఉదయం లేచి స్నాన సంధ్యాదులు ముగించుకొని విశ్వామిత్రుని నమస్కరించి.....
మహర్షి!కాక్షసులు ఏ సమయం లో వస్తారు?మేము ఎప్పుడు యాగ రక్షణ పూనుకోవాలి అని ప్రశ్నించగా.....
సమీపం లో ఉన్న ఇతర మునులు సమాధానం గా
రాఘవులారా ! నేటినుంచి ఆరురోజులు రేయింబవళ్ళు మీరు రక్షణ బాధ్యతను వహించాలి.
మహర్షి యాగదీక్షలో భాగంగా మౌనవ్రతం స్వీకరించారు. పలకరు.
ఈ మునుల వాక్యాలు విని రామలక్ష్మణులు ఆరురోజులపాటూ రేయీపగలూ
తేడా లేకుండా రెప్పవాల్చకుండా రక్షణలో నిమగ్నులయ్యారు. ధనుర్ధారులై యాగశాలనూ విశ్వామిత్రుణ్నీ సంరక్షిస్తున్నారు.
అయిదు రోజులు గడచిపోయాయి. ఆరవరోజు వచ్చింది. సౌమిత్రీ ! సావధానం. సిద్ధంగా ఉండు అని రాముడు హెచ్చరించాడు.
అంటుండగానే భీకరమైన మారీచ సుబాహులు అనుచరులతో ఆకాశం లో
ఆవరించి రక్తం కుమ్మరించారు...
లక్ష్మణా అదిగో చూడు రాక్షసులు వీళ్ళని మానావాస్త్రం తో ఎగరగిడుతాను అంటూ అంభిమంత్రించి అస్త్రాన్ని ప్రయోగం చేసాడు...
మారీచుడు మూర్ఛపోయి శతయోజనమ్ దూరం లో దాటి సముద్రం ఒడ్డు న పడెను. ఈ అస్త్రం తో తెలివి తప్పి నాడు కానీ చనిపోలేదు.
మిగిలిన రాక్షసులైన సుబాహువు గుండెలపై ఆగ్నేయాస్త్రం సంధించాడు, వాడు అక్కడే ప్రాణాలు కోల్పోయాడు...
వాయవ్యాస్త్రం తో మిగిలిన రాక్షసులు అంతమొందారు.
ఈ విధముగ రాక్షసులనందరిని అంత మొందించిన రాముని చూచి అచట మునులందరు సంతోషముతో పూజించిరి.
యజ్ఞము సమాప్తమైనది. దిక్కులన్నియు ప్రకాశించుచుండెను. విశ్వామిత్రుడు సంత సించెను. రామునితో మహాబాహూ! రామా! నేను కృతార్థుడనేతివి.
గురువు వాక్యమును నీవు నెరవేర్చితివి.సిద్దాశ్రమము అనెడి పేరు ఈనాడు సార్ధకమైనది" అని అనెను.
మునిసింహమా ! ఇదిగో కింకరులం ఇద్దరము, నీ సన్నిధిని నిలబడ్డాం. ఆజ్ఞాపించు. నీ ఇష్టం. ఏమి ఆనతి ఇస్తే అది ఆచరిస్తాం.
ఇమౌ స్మ మునిశార్దూల కింకరౌ సముపస్థితౌ౹
ఆజ్ఞాపయ యథేష్టం వై శాసనం కరవావ కిమ్ ||
ఇలా సవినయంగా పలుకుతున్న రామునివైపు ప్రశంసాపూర్వకంగా చూస్తూ మునులంతా ముక్తకంఠంగా బదులు పలికారు.
మిథిలాధిపతియైన జనకుడు యజ్ఞం చేస్తున్నాడు. అది చూడడానికి మేమంతా వెడుతున్నాం. మీరు మాతో రండి అని ఆహ్వానం పలికారు...
( సశేషము )
No comments:
Post a Comment