Adsense

Thursday, March 30, 2023

భద్రాచలం'లో మూలమూర్తులకు కూడా కళ్యాణం జరుగుతుందని తెలుసా?..!!




🌿మూలమూర్తికి వివాహం అన్నది ప్రపంచములో మరెక్కడా లేదు, ఒక్క భద్రాచలంలో తప్ప..

🌸ఔరంగజేబు కాలంలో ఆతనిసైన్యం భద్రాద్రిరామయ్య మీదకూడా దండెత్తారు. అప్పుడు అక్కడి అర్చకులు ప్రదర్శించిన ధైర్యసాహసాలు ఎనలేనివి.

🌿 ఔరంగజేబ్ సైన్యం వస్తున్నది అనేవార్త తెలియగానే, "కాకుళ్ళ రామానుజాచార్యులు" అనే స్వామి, ఆలోచించి వెంటనే మూలవరులకు ముందు అడ్డంగా, వారు
కనపడకుండా ఒక గోడ 
కట్టించేసారు.

🌸ఉత్సవార్లను, మిగిలిన పరివారవిగ్రహాలనూ ఒక పెట్టెలో పెట్టి, గోదావరినదిలో ఒకచోట భద్రపరిచి, అక్కడ ఒక రహస్యగుర్తు ఏర్పాటు చేసుకున్నారు.

🌿 దండయాత్ర అయిపోయి, అంతా మామూలు అయ్యాక, మూలవిగ్రహాల ముందు కట్టిన గోడ పడగొట్టించారు. గోదావరిలో ఉన్న, ఉత్సవ విగ్రహాలను బయటకు తీయగా, అందులో అందరూ ఉన్నారు గానీ, సీతమ్మ కనపడలేదు.

🌸అది బ్రహ్మోత్సవ సమయం. సీతమ్మ లేకుండా కళ్యాణం ఎలా చేయాలని ఆలోచించి, ఇక ఆ ఆప్షన్ లేదు కనుక, మూలమూర్తులకు కళ్యాణం చేసారు.

🌿తరువాత సీతమ్మవిగ్రహం దొరకినా, మూలమూర్తుల కళ్యాణం ఆనాడు పూర్వాచార్యులు రామయ్యని రక్షించడానికి చేసిన త్యాగానికి, శ్రమకీ, గుర్తుగా ప్రతిఏటా చేయడం ఒక ఆనవాయితీగా వస్తోంది...
జై శ్రీరామ్.

No comments: