తెలుగుపథం TELUGUPATHAM
THE COMPLETE BLOG FOR PEOPLE // NEWS, DEVOTIONAL, TECHNOLOGY, LIFE STYLE, SPORTS, ENTERTAINMENT, SCIENCE, ONLINE EARNING, RIDDLES, SILLY QUESTIONS, IMPORTANT DAYS, BEAUTY TIPS, HEALTH
Adsense
Tuesday, October 15, 2024
Here are some gift ideas for a 1-year-old boy's birthday
Monday, October 14, 2024
అష్ట సోమేశ్వర క్షేత్రాలు
ఇక్కడ లింగం క్రింద సూర్య యంత్రం ఉంది.
ఆ రుద్రమూర్తిని శాంతపరచేందుకు చంద్రుడు ద్రాక్షారామ క్షేత్రంనకు వాయువ్యం దిశలో గల సోమేశ్వరం క్షేత్రంలో ఒక శివ లింగాన్ని ప్రతిష్టించాడు. మిగిలన దిక్కుల యందు అత్రి, భరద్వాజుడు, గౌతముడు, జమదగ్ని, కశ్యపుడు, వశిష్ఠుడు, విశ్వామిత్రుడు అను సప్తర్షులు మరో సప్త లింగాలును (చంద్ర యంత్రాలు) ప్రతిష్టించారు.
ఈ ఎనిమిది ప్రతిష్టలను అష్ట సోమేశ్వరాలయాలుగా పిలుస్తారు. వీటి దర్శనం పుణ్యధాయకం అని ఆర్యులు చెబుతారు.
కోలంక, పెనుమళ్ళ, వెల్ల, సోమేశ్వరం వెంటూరు, కోరుమిల్లి, కోటిపల్లి & దంగేరు గ్రామాలలో ఆ అష్ట సోమేశ్వరాలయాలున్నాయి. ఇవి ద్రాక్షారామం పరిసరాల్లోనే ఉంటాయి. వీటి సందర్శనం వలన చంద్ర గ్రహ దోష నివృత్తి మరియు శివానుగ్రహం కలుగుతుంది. అష్ట సోమేశ్వరాలయాలు జన్మ నక్షత్ర పాద శివలింగాలుగా పేర్కొనారు.
అష్ట సోమేశ్వరాలయాల సందర్శన ముగించి, పిమ్మట ద్రాక్షారామ లోని భీమేశ్వర స్వామిని దర్శించుకోవటం ఆచారం. 8+1=9 ఆలయాల సందర్శనతో యాత్ర సఫలం అవుతుంది.
1. కోలంక - శీ ఉమాసమేత సోమేశ్వ లింగము (తూర్పు క్షేత్రం): శ్రీ ఉమా సమేత సోమేశ్వర లింగమును అర్చించిన వారికి సకల శుభములు కలుగును అని భక్తుల విశ్వాసం. మేషరాశి, భరణి నక్షత్రం నందు జన్మించిన వారి నక్షత్ర దోష ఉపశమనం కోసం కోలంక* - సోమేశ్వర లింగమునకు అభిషేక శాంతులు నిర్వహించుతారు.
2. పెనుమళ్ళ - శ్రీ పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర లింగము (ఈశాన్య క్షేత్రం): ఆలయంనందు నిత్యం శ్రీ సోమేశ్వర లింగమునకు అభిషేకాలు, అర్చనలు జరుగుతాయి. మహా శివరాత్రి సందర్భముగా విశేష అభిషేకాలు నిర్వహించుతారు. వీటితో పాటు గ్రహ అభిషేక శాంతులు నిర్వహించుతారు. మిధునరాశి, ఆరుద్ర నక్షత్రం నందు జన్మించిన వారి నక్షత్ర దోష ఉపశమనం కోసం పెనుమళ్ళ సోమేశ్వర లింగమునకు అభిషేక శాంతులు నిర్వహించుతారు.
3. వెల్ల - శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ సోమేశ్వర లింగము (ఉత్తరం క్షేత్రం): వెల్ల గ్రామంలో శ్రీ సోమేశ్వరాలయం మరియు శ్రీ వేణు గోపాల స్వామి ఆలయం ఒకే ప్రాంగణములో ఉంటాయి.
స్ధానికులు శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత సోమేశ్వరాలయమును పెద్ద దేవుడు గుడిగా పిలుస్తారు. శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత సోమేశ్వర లింగమును అర్చించిన వారికి సకల శుభములు కలుగును అని భక్తుల విశ్వాసం. కర్కాటక రాశి & సింహ రాశి నందు జన్మించిన వారి నక్షత్ర దోష ఉపశమనం కోసం వెల్ల - సోమేశ్వర లింగము నకు అభిషేక శాంతులు నిర్వహించుతారు.
4. సోమేశ్వరం - శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత సోమేశ్వర లింగము (వాయువ్యం క్షేత్రం)
ఇచ్చట సోముడు (చంద్రుడు) ఒక మండల కాలము తపస్సు చేసి, ఒక శివ లింగాన్ని ప్రతిష్టించి ఆరాధించాడు. ఆ కారణముగా క్షేత్రం సోమేశ్వరంగా ఖ్యాతి పొందినది. ఇచ్చట శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత సోమేశ్వరాలయం దర్శించగలము. కన్యారాశి, హస్త నక్షత్రం నందు జన్మించిన వారి నక్షత్ర దోష ఉపశమనం కోసం సోమేశ్వరం - సోమేశ్వర లింగము నకు అభిషేక శాంతులు నిర్వహించుతారు.
5. వెంటూరు - శ్రీ పార్వతి సమేత సోమేశ్వర లింగము(పశ్చిమ క్షేత్రం): శ్రీ పార్వతి సమేత సోమేశ్వర లింగమును అర్చించిన వారికి సకల శుభములు కలుగును అని భక్తుల విశ్వాసం. తులరాశి, స్వాతి నక్షత్రం నందు జన్మించిన వారి నక్షత్ర దోష ఉపశమనం కోసం వెంటూరు - సోమేశ్వర లింగమునకు అభిషేక శాంతులు నిర్వహించుతారు.
6. కోరుమిల్లి - శ్రీ రాజరాజేశ్వరీ సమేత శ్రీ సోమేశ్వర లింగము (నైఋతి క్షేత్రం): సోమేశ్వర స్వామి గొప్ప మహిమ గల వానిగా, నిత్యాభిషేకములతో విరాజిల్లుతూ భక్తుల కోరికలు తీరుస్తూ భక్త వత్సలుడైనాడు. స్వామి కృపతో సుఖ, సంతోష, ఆయురోగ్య, విజయ, ఐశ్వర్య, భోగ భాగ్యములు కలుగుతాయి. ధనుస్సురాశి, పుర్వాషాడ నక్షత్రం నందు జన్మించిన వారి నక్షత్ర దోష ఉపశమనం కోసం కోరుమిల్లి - సోమేశ్వర లింగము నకు అభిషేక శాంతులు నిర్వహించుతారు.
7. కోటిపల్లి - శ్రీ రాజరాజేశ్వరీ సమేత ఛాయ సోమేశ్వర లింగము (దక్షిణ క్షేత్రం): పావన గౌతమీ నదీ తీరాన శ్రీ రాజరాజేశ్వరీ సమేత ఛాయ సోమేశ్వర స్వామి ఆలయం ఉంది. ఇది అష్ట సోమేశ్వర ఆలయాలలో దక్షిణ క్షేత్రంగా ప్రతితీ.
మకర మరియు కుంభ రాశి,ధనిష్ట, శతభిషంనందు జన్మించిన వారి నక్షత్ర దోష ఉపశమనం కోసం కోటిపల్లి - సోమేశ్వర లింగము నకు అభిషేక శాంతులు నిర్వహించుతారు.
8. దంగేరు - శ్రీ ఉమా సమేత సోమేశ్వర లింగము (ఆగ్నేయం క్షేత్రం): ఇక్కడ కశ్యప మహర్షి ప్రథమ పూజ గావించినాడు. మీన రాశి, ఉత్తరాబాద్ర నందు జన్మించిన వారి నక్షత్ర దోష ఉపశమనం కోసం దంగేరు లోని సోమేశ్వర లింగము నకు అభిషేక శాంతులు నిర్వహించుతారు.
మహిమాన్విత 108 లింగాలు
1. ఓం లింగాయ నమః
2. ఓం శివ లింగాయనమః
3. ఓం శంబు లింగాయనమః
4. ఓం ఆధిగణార్చిత లింగాయనమః
5. ఓం అక్షయ లింగాయనమః
6. ఓం అనంత లింగాయనమః
7. ఓం ఆత్మ లింగాయనమః
8. ఓం అమరనాదేశ్వర లింగాయనమః
9. ఓం అమర లింగాయనమః
10. ఓం అగస్థేశ్వర లింగాయనమః
11. ఓం అచలేశ్వర లింగాయనమః
12. ఓం అరుణాచలేశ్వర లింగాయనమః
13. ఓం అర్ధ నారీశ్వర లింగాయనమః
14. ఓం అపూర్వ లింగాయనమః
15. ఓం అగ్ని లింగాయనమః
16. ఓం వాయు లింగాయనమః
17. ఓం జల లింగాయనమః
18. ఓం గగన లింగాయనమః
19. ఓం పృథ్వి లింగాయనమః
20. ఓం పంచభూతేశ్వర లింగాయనమః
21. ఓం పంచముఖేశ్వర లింగాయనమః
22. ఓం ప్రణవ లింగాయనమః
23. ఓం పగడ లింగాయనమః
24. ఓం పశుపతి లింగాయనమః
25. ఓం పీత మణి మయ లింగాయనమః
26. ఓం పద్మ రాగ లింగాయనమః
27. ఓం పరమాత్మక లింగాయనమః
28. ఓం సంగమేశ్వర లింగాయనమః
29. ఓం స్పటిక లింగాయనమః
30. ఓం సప్త ముఖేశ్వర లింగాయనమః
31. ఓం సువర్ణ లింగాయనమః
32. ఓం సుందరేశ్వర లింగాయనమః
33. ఓం శృంగేశ్వర లింగాయనమః
34. ఓం సోమనాథేశ్వర లింగాయనమః
35. ఓం సిధేశ్వర లింగాయనమః
36. ఓం కపిలేశ్వర లింగాయనమః
37. ఓం కాపర్డేశ్వర లింగాయనమః
38. ఓం కేదారేశ్వర లింగాయనమః
39. ఓం కళాత్మక లింగాయనమః
40. ఓం కుంభేశ్వర లింగాయనమః
41. ఓం కైలాస నాదేశ్వర లింగాయనమః
42. ఓం కోటేశ్వర లింగాయనమః
43. ఓం వజ్ర లింగాయనమః
44. ఓం వైడుర్య లింగాయనమః
45. ఓం వైద్య నాదేశ్వర లింగాయనమః
46. ఓం వేద లింగాయనమః
47. ఓం యోగ లింగాయనమః
48. ఓం వృద్ధ లింగాయనమః
49. ఓం హిరణ్య లింగాయనమః
50. ఓం హనుమతీశ్వర లింగాయనమః
51. ఓం విరూపాక్షేశ్వర లింగాయనమః
52. ఓం వీరభద్రేశ్వర లింగాయనమః
53. ఓం భాను లింగాయనమః
54. ఓం భవ్య లింగాయనమః
55. ఓం భార్గవ లింగాయనమః
56. ఓం భస్మ లింగాయనమః
57. ఓం భిందు లింగాయనమః
58. ఓం బిమేశ్వర లింగాయనమః
59. ఓం భీమ శంకర లింగాయనమః
60. ఓం బృహీశ్వర లింగాయనమః
61. ఓం క్షిరారామ లింగాయనమః
62. ఓం కుమార రామ బిమేశ్వర లింగాయనమః
63. ఓం మహానంది ఈశ్వర లింగాయనమః
64. ఓం మహా రుద్ర లింగాయనమః
65. ఓం మల్లికార్జున లింగాయనమః
66. ఓం మహా కాళేశ్వర లింగాయనమః
67. ఓం మల్లీశ్వర లింగాయనమః
68. ఓం మంజునాథ లింగాయనమః
69. ఓం మరకత లింగాయనమః
70. ఓం మహేశ్వర లింగాయనమః
71. ఓం మహా దేవ లింగాయనమః
72. ఓం మణికంధరేశ్వర లింగాయనమః
73. ఓం మార్కండేయ లింగాయనమః
74. ఓం మాడిణ్యేశ్వర లింగాయనమః
75. ఓం ముక్తేశ్వర లింగాయనమః
76. ఓం మృతింజేయ లింగాయనమః
77. ఓం రామేశ్వర లింగాయనమః
78. ఓం రామనాథేశ్వర లింగాయనమః
79. ఓం రస లింగాయనమః
80. ఓం రత్నలింగాయనమః
81. ఓం రజిత లింగాయనమః
82. ఓం రాతి లింగాయనమః
83. ఓం గోకర్ణాఈశ్వర లింగాయనమః
84. ఓం గోమేధిక లింగాయనమః
85. ఓం నాగేశ్వర లింగాయనమః
86. ఓం ఓంకారేశ్వర లింగాయనమః
87. ఓం ఇంద్ర నిల మణి లింగాయనమః
88. ఓం శరవణ లింగాయనమః
89. భృగువేశ్వర లింగాయనమః
90. ఓం నీలకంటేశ్వర లింగాయనమః
91. ఓం చౌడేశ్వర లింగాయనమః
92. ఓం ధర్మ లింగాయనమః
93. ఓం జోతిర్ లింగాయనమః
94. ఓం సైకత లింగాయనమః
95. ఓం చంద్రమౌలీశ్వర లింగాయనమః
96. ఓం జ్వాలా లింగాయనమః
97. ఓం ధ్యాన లింగాయనమః
98. ఓం పుష్యా రాగ లింగాయనమః
99. ఓం నంది కేశ్వర లింగాయనమః
100. ఓం అభయ లింగాయనమః
101. ఓం సహస్ర లింగాయనమః
102. ఓం ఏకాంబరేశ్వర లింగాయనమః
103. ఓం సాలగ్రామ లింగాయనమః
104. ఓం శరభ లింగాయనమః
105. ఓం విశ్వేశ్వర లింగాయనమః
106. ఓం పథక నాశన లింగాయనమః
107. ఓం మోక్ష లింగాయనమః
108. ఓం విశ్వరాధ్య లింగాయనమః.
Sunday, October 13, 2024
ఆడవాళ్ళ అందం ఎందులో ఉంటుంది?
- పాపిటలో ఉంటుంది.
- నుదుట బొట్టులో ఉంటుంది.
- జడ ముందుకేసుకోవడంలో ఉంటుంది.
- రింగుల జుట్టు అమ్మాయిలు జడవేసుకుని రబ్బరు బ్యాండు పెట్టుకుని వదిలేసిన జుట్టు అంచు గుండ్రంగా పిచ్చుక గూడులా ఉంటుంది. ఆ పిచ్చుక గూడు అందంగా ఉంటుంది.
- కళ్ళ కాటుకలో ఉంటుంది.
- ముక్కు పుడకలో ఉంటుంది.
- చెవులకు పెట్టుకునే బుట్టల్లో ఉంటుంది.
- మొహం మీదకు వస్తున్న జుట్టు పాయల్ని వేళ్ళతో వెనక్కి తోసుకోవడంలో ఉంటుంది.
- జుట్టు ముడి వేసుకోవడంలో ఉంటుంది.
- లంగా ఓణీలో ఉంటుంది. పట్టు చీరలో ఉంటుంది, సిల్కు చీరలో ఉంటుంది. కొంతమంది కట్టుకుంటే చీరకే అందం వస్తుంది.
- కోపంలో ఉంటుంది.
- 'పళ్ళు రాల్తాయి' అని సుతిమెత్తగా తిట్టడంలో ఉంటుంది.
- 'మా ఆయన' అని అందరితోనూ చెప్పడంలో ఉంటుంది.
- మగవారు చేసే తప్పుల్ని ఎత్తిచూపడంలో ఉంటుంది. దెప్పిపొడవడంలో ఉంటుంది.
- తమకు బాగా ఇష్టమైన వారితోనే భావోద్వేగాలను పంచుకోవడంలో ఉంటుంది.
- వారి ధైర్యంలో ఉంటుంది.
- గారంగా నచ్చింది కొనిపించుకోవడంలో ఉంటుంది.
- కుటుంబం మీద చూపించే అనురాగంలో ఉంటుంది.
- పసిపిల్లలను కంటికి రెప్పలా సాక్కునే ఆప్యాయతలో ఉంటుంది.
- ఇంటిని చక్కబెట్టడంలో ఉంటుంది.
- ఊరెళ్లిన భర్త తిరిగి వచ్చేవరకూ చూసే ఎదురు చూపులో ఉంటుంది.
- కొత్తగా పెళ్లయిన అమ్మాయి అబ్బాయిని అతనే సర్వస్వం అనుకోవడంలో ఉంటుంది.
Tuesday, October 1, 2024
INDIA TO JAPAN TOUR 7-10 DAYS PLAN
Monday, September 30, 2024
శ్రీ బాలా త్రిపుర సుందరి అష్టోత్తర శతనామావళి
Saturday, September 28, 2024
ladies long hair Washing requires some extra care
Monday, September 23, 2024
మానవాళికి ఎక్కువ లబ్ది చేకూరాలంటే ఏయే చెట్లు నాటాలి. స్కంద పురాణంలో శ్లోకం ఉంది
అశ్వత్థమేకం పిచుమందమేకం
న్యగ్రోధమేకం దశ తిన్త్రిణీకం|
కపిత్థ బిల్వాఁ మలకత్రయాంచ
అశ్వత్థ = రావి (100% కార్బన్ డై ఆక్సైడ్ను గ్రహిస్తుంది)
న్యగ్రోధ = మర్రి చెట్టు (80% కార్బన్ డై ఆక్సైడ్ను గ్రహిస్తుంది)
తింత్రిణి = చింత (80% కార్బన్ డై ఆక్సైడ్ను గ్రహిస్తుంది)
కపిత్థ = వెలగ 80% కార్బన్ డయాక్సైడ్ను గ్రహిస్తుంది)
బిల్వ = మారేడు (85% కార్బన్ డయాక్సైడ్ను గ్రహిస్తుంది)
అమలకా = ఉసిరి (74% కార్బన్ డయాక్సైడ్ గ్రహిస్తుంది)
ఆమ్రాహ్= మామిడి (70% కార్బండయాక్సైడ్ గ్రహిస్తుంది)
వాపి - నుయ్యి
అర్థం
ఈ చెట్లను నాటి ఒక దిగుడు బావి నిర్మించి సంరక్షించినవారు నరకం చూడవలసిన అవసరం ఉండదు.
మూలే బ్రహ్మ చర్మం విష్ణు శాఖ శంకరమేవచ|
పత్రే పత్రే సర్వదేవయం వృక్ష రాజ్ఞో నమోస్తుతే||
భావం: ఏ మూలంలో బ్రహ్మ, కాండములో విష్ణువు, శాఖలలో శంకరుడు, ఆకులలో సర్వ దేవతలు నివసిస్తారో అటువంటి వృక్షరాజం రావిచెట్టుకి నమస్కారాలు.
గ్రంథాలలో, రావి చెట్టుని చెట్లరాజు అని పిలుస్తారు.
రాబోయే సంవత్సరాల్లో రావి, మర్రి, వేప, మారేడు, ఉసిరి చెట్లను నాటితేనే మన భారతదేశం కాలుష్య రహితంగా మారుతుంది.
మనిషిగా పుట్టిన ప్రతీవాడికీ అనేక ఋణాలున్నాయి
దేవ ఋణం:
"ఈ జీవితాన్ని ప్రసాదించిన పరమేశ్వరుడిని నిరంతరం స్మరించడం ద్వారా, పూజ ద్వారా దేవ ఋణాన్ని తీర్చుకోవచ్చును".
ఋషి ఋణం:
"మనకు ఋషులు సంస్కృతిని, విజ్ఞానాన్ని ప్రసాదించారు. వారి స్మరణతో ఆ ఋణ విముక్తి కలుగుతుంది."
పితృ ఋణం:
"ఈ శరీరానికి జన్మనిచ్చిన తల్లి తండ్రులు వంశ కర్తలు, వారి పేరు ప్రఖ్యాతులు ఇనుమడించేట్లుగా ప్రవర్తించడం ద్వారా, అలాగే వారికి పితృ తర్పణాలు వదలడం ద్వారా వారి ఋణం తీర్చుకోవచ్చును".
భూత ఋణం:-
"మన జీవన యాత్రలో కనబడే పశు, పక్షి, వృక్ష, క్రిమి కీటకాదుల పట్ల దయ కలిగి ఉండటం, వాటికి ఆహారాది వితరణ చేయడం ద్వారా భూతఋణం తీర్చుకోవచ్చును."
మనుష్య ఋణం:
"సమాజ సంక్షేమ కార్యక్రమాల్లో పాలు పంచుకుని దీనులకి తగిన సహాయం చేసి వారి దుఃఖాన్ని తొలగించడం ద్వారా మనుష్య ఋణాన్ని తీర్చుకోవచ్చును".
"మనం ధర్మమైన కర్మాచరణ చేస్తే, అది కర్మ బంధం కాకపోగా, పాత కర్మలు తొలగి కర్మ బంధంలో చిక్కుకోం. పైగా ఆ చిక్కుల్లోంచి బయటపడతాము."
అసలు ధర్మం అంటే ఏమిటి?
"ధారణా ధ్ధర్మ ఇత్యాహుః ధర్మో ధారయతే ప్రజాః!!"
భావం: "ఏది ఒక వ్యవస్థని విచ్ఛిన్నం కానీయకుండా ధరించి ఉంటుందో అదే ధర్మం. ధర్మమే ప్రజలని ఛిన్నాభిన్నం కానీయకుండా ధరించి కాపాడుతుంది. ఏది ధర్మమో, ఏది కాదో మనందరికీ చాలా స్పష్టంగా తెలుసు. తెలిసీ అధర్మం చేస్తూంటాం. ఎందుకు? దుర్యోధనుడు మనందరిలోనూ ఉన్నాడు కాబట్టి".
"జానామి ధర్మం న చ మే ప్రవృత్తిః!
జానామి అధర్మం న చ మే నివృత్తిః!!"
భావం:
"ధర్మమని తెలిసీ ఆచరించలేను. అధర్మమని తెలిసీ వదలలేను. అని దుర్యోధనుడు చెప్పాడు."
"వ్యాసుడు ధర్మాన్ని ఇలా నిర్వచించాడు. ఈ ధర్మాన్ని అతిక్రమించడం దుష్కర్మే అవుతుంది."
"యదన్యైద్విహితం నేచ్చేతో ఆత్మనః కర్మ పురుషః!*
*న తత్పరేషు కుర్వత ఏష ధర్మ స్సనాతనః!!"
"భావం:-
"ఇతరులు ఏది చేస్తే నీకు ఇష్టం కాదో అలాంటి పనిని ఇతరుల విషయంలో నువ్వు చేయద్దు. ఇదే సనాతన ధర్మం.
"మహాత్ములు, ఏది పాపం? ఏది పుణ్యం? అన్నది ఎవరికి వారు నిర్ణయించుకోడానికి ఒకే 'లిట్మస్ టెస్ట్' ఇచ్చారు".
"అధర్మం అంటే ఏమిటి?"
"ధర్మానికి విరుద్ధమైనదంతా అధర్మమే. మనం చేసే అనేక దుష్కర్మలన్నీ అధర్మాలే." "కర్మ బంధం"
'మనిషిగా పుట్టిన ప్రతీవాడికీ అనేక ఋణాలున్నాయి. వాటి నించి స్వచ్ఛందంగా ఋణ విముక్తుడు అవడం ఎలా?” అన్న అంశం మీద మన సనాతన సాంప్రదాయం ఇలా చెపుతుంది."
పద్దెనిమిది మంది సాక్షులుంటారు మనం చేసే ప్రతీ పనికీ. బహుపరాక్
చుట్టూ ఎవరూ లేనప్పుడు తప్పుడు పనులకు తెగించడం మానవ బలహీనత . కానీ ’నేను ఒక్కడినే కదా ఉన్నాను, నన్ను ఎవరూ గమనించడం లేదు అని మనిషి అనుకోవటం చాలా పొరపాటు .
మనిషి ఏ పని చేస్తున్నా నిశితంగా గమనించేవి ముగాసాక్షులు పద్దెనిమిది ఉన్నాయి . అవి: నాలుగు వేదాలు, పంచభూతాలు, అంతరాత్మ, ధర్మం, యముడు, ఉభయ సంధ్యలు, సూర్య చంద్రులు, పగలు, రాత్రి.
వీటినే అష్టాదశ మహా పదార్థాలు అంటారు . ఈ మూగసాక్షులు మనిషిని అనుక్షణం నీడలా పర్యవేక్షిస్తుంటాయి.
ఇవి మనలోకంలోని న్యాయస్థానాల్లో సాక్ష్యం చెప్పపోవచ్చును. కానీ వీటి గమనిక నుండి మనిషి తప్పించుకోవడం సాధ్యపడదు .
దీన్ని గుర్తించలేని కారణంగానే ఇవన్నీ జడ పదార్థాలేనని, సాక్ష్యం చెప్పడానికి నోరులేనివని మానవుడు భ్రమపడుతుంటాడు .
ఈ మహాపదార్థాలు రహస్యయంత్రాల వంటివి .
అవి మనిషి ప్రతి చర్యనూ నమోదు చేస్తాయి .
ఆ నివేదికల్ని విధికి చేరవేస్తాయి . అది వాటిని కర్మలుగా మలుస్తుంది . మనిషి చేసే పనులు మంచి అయితే సత్కర్మలుగా, చెడ్డవి అయితే దుష్కర్మలుగా విధి నిర్ణయిస్తుంది . సత్కర్మలకు సత్కారాలు, దుష్కర్మలకు జరిమానాలు అమలవుతాయి .
అవి ఏవో మరుజన్మకో ఆ తరువాతో ఫలిస్తాయని అనుకోకూడదు, ఈ జన్మలోనే అమలు చేయబడవచ్చు .
ఇది నిరంతరాయంగా సాగిపోయే సృష్టిపరిణామక్రమం.
అంతరాత్మ అనేది ఒకటుందని ప్రతి మనిషికీ తెలుసు.
అది మనం చేసే పని మంచిదా ? చెడ్డదా ? అనే విషయాన్ని ఎప్పటికప్పుడే చెప్పేస్తుంది .
కానీ ఆవేశం, కోపం, క్షణికావేశం తో విచక్షణ కోల్పోయిన వ్యక్తి అంతరాత్మ సలహాను కాలరాస్తాడు అది అనర్థాలకు దారితీయటం మనందరికి అనుభవమే .
ఒక్కోసారి అంతరాత్మ నిలదీస్తున్నప్పుడు పశ్చాత్తాపంతో సిగ్గుతో తలదించుకుంటాం.*
కానీ దీన్ని మనమెవరితోనూ పంచుకోము . అందువల్ల అంతరాత్మ అనుభవపూర్వకంగా నిజమైనప్పుడు మిగతా పదిహేడు కూడా నిజమేనని గ్రహించగలగడమే వివేకం
నలుగురికీ తెలిసేలా దానధర్మాలు, క్రతువులు, పూజలు నిర్వహించాలన్న కుతూహలం అవివేకం.
అష్టాదశ సాక్షులు ఎల్లవేళలా గమనిస్తున్నాయంటే…ఎవరు చూడాలో వాళ్ళు చూస్తున్నట్లేగా అర్థం.*
ఈ ఎరుక కలిగినప్పుడు ఏ మనిషీ చెడ్డ పనులు చేయటానికి తెగించడు.
ఎవరు చూసినా చూడకపోయినా మంచితనంతో, తోటివారికి సాధ్యమయినంత సహాయం చేయాలనే సత్సంకల్పంతో జీవితాన్ని గడపడం ఉత్తమం . ఈ జ్ఞానం వల్ల మనిషి సాధ్యమైనన్ని మంచిపనులు చేయడానికి పయ్రత్నిస్తూ సుఖశాంతులకు దగ్గరవుతాడు.
హర హర మహాదేవ శంభో శంకర
దేవాలయాల ముందు ధ్వజస్తంభాలు ఎందుకు ఉంటాయో తెలుసా?
అశ్వమేధ యాగం సంధర్బంగా తామ్రధ్వజునితో పోరాడుతున్న అర్జునుడి కథాసారం నుంచి..
మయూర ధ్వజుడు. వీరు మహా పరాక్రమవంతుడు, గొప్ప దానశీలి. . మయూరధ్వజుని కుమారుడు తామ్ర ధ్వజుడు.
మయూర ధ్వజుడు పాండవుల యాగాశ్వమును బంధిస్తాడు. ఆగ్రహించిన పాండు కుమారులు అర్జునుడు భీముడు సహదేవుడు మయూర ధ్వజనితో యుద్ధానికి దిగుతారు.తనతో యుద్ధం చేసిన నకుల సహదేవ భీమార్జునుల్ని మయూరధ్వజుడు ఓడిస్తాడు. పట్టు వదలని పాండు కుమారులు ఆగ్రహోదగృలై ఉంటారు
తన తమ్ముళ్ళు ఓడిపోయిన విషయం తెలిసిన ధర్మరాజు స్వయంగా మణిపురం వైపు బయలుదేరతాడు. అది గ్రహించిన కృష్ణుడు ధర్మరాజును వారిస్తాడు. మయూరధ్వజుణ్ణి జయించేందుకు ఒక కపటోపాయాన్ని చెబుతాడు.
పన్నాగం ప్రకారం శ్రీకృష్ణుడు, ధర్మరాజులిద్దరూ వృద్ధ బ్రాహ్మణుల రూపంలో మణిపురం చేరుకుంటారు.. అతిథులను చూసిన మయూరధ్వజుడు వారికి ఆహ్వానం పలికి , దానం ఇవ్వదలచి, ఏమి కావాలో కోరుకో మంటాడు.
అందుకు శ్రీకృష్ణుడు కల్పించుకుంటూ " మహారాజా! మేము తమరి దర్శనార్ధమై బయలుదేరి వస్తుంటే.... అరణ్య మార్గంలో ఒక మృగరాజు దురదృష్టవశాత్తు
ఇతడి కుమారుడిపై దాడి చేసింది. ఈ హఠాత్పరిణామానికి మేము మిక్కిలి చింతిస్తూ.... అన్యం పుణ్యం ఎరుగని బాలుడిని విడిచిపెట్టవలసిందని మృగరాజును ప్రార్థించాము. అప్పుడా మృగరాజు విచిత్రంగా మానవ భాషలో మాట్లాడుతూ.... " ఈ బాలుడు మీకు దక్కాలంటే మణిపుర రాజ్యాధిపతి మయూరధ్వజుని శరీరంలో సగభాగం నాకు ఆహారంగా ఇప్పించండి " అని కోరుకుంది . దానకర్ణులైన ప్రభువులు మా యందు దయదలచి తమ శరీరమున సగభాగం దానమిచ్చిన యెడల ఆ పసి బాలుడిని .... భవిష్యత్తు ఉన్న బాలుడిని కాపాడుకున్న వారిని అవుతాము... " అని హృద్యంగా చెప్పుకుపోయాడు .
ఆ మాటలు విని మయూరధ్వజుడు ఏ మాత్రం వెనక ముందు ఆలోచించనివాడై తన శరీరాన్ని బాలుడి ప్రాణాల్ని రక్షించడం కోసం దానం ఇచ్చేందుకు ఒప్పుకుంటాడు.
అప్పుడు శ్రీకృష్ణుడు... " తమరి భార్యాపుత్రులే మీ శరీరాన్ని స్వయంగా కోసి ఇవ్వాల్సింది " అనే నియమాన్ని కూడా విధిస్తాడు. అందుకు కూడా మయూరి ధ్వజుడు వెనకడుగు వేయకుండా, అతిథిదేవోభవ అని గౌరవిస్తూ, తన శరీరాన్ని తన భార్య సుతులే స్వయంగా ఖండించేందుకు తగిన ఏర్పాట్లు చేయించి, భార్యాసుతుల్ని రప్పించి , త్యాగానికి సిద్ధమై కూర్చుంటాడు . మయూరధ్వజుడి భార్య పిల్లలు గుండె నిబ్బరం చేసుకుని ఆదేశించిన కార్యానికి కుడి దిశ నుండి సిద్ధమవుతారు.
దానధర్మాలో గొప్పవాడైన ధర్మరాజు, మయూరధ్వజుని దాన గుణానికి నివ్వెర పోతాడు.
ఇంతలో మయూరధ్వజుని ఎడమ కన్ను నుంచి నీరు రావటం ధర్మరాజు గమనిస్తాడు . అందుకు వెంటనే స్పందిస్తూ....
"తమరు కన్నీరు కారుస్తూ ఇచ్చిన దానం మాకు వద్దు గాక వద్దు " అంటాడు
అందుకు మయూరధ్వజుడు కూడా వెంటనే స్పందిస్తూ .....
" మహత్మా ! తమరు పొరబడుతున్నారు. నేను చింతిస్తూ బాధపడుతూ వేదన చెందుతూ నా శరీరాన్ని మీకు దానంగా ఇవ్వడం లేదు . నా కుడి భాగం పరోపకారానికి ఉపయోగపడింది. ఆ భాగ్యం నాకు కలుగలేదు కదా అని ఎడమ నేత్రం మిగుల బాధపడుతున్నది " అంటూ వివరిస్తాడు.
అది విని కృష్ణుడు, ధర్మరాజు, మిక్కిలి ఆశ్చర్యపోతారు. మయూరధ్వజుని దానశీలతకు
ఉప్పొంగి పోతారు. వెంటనే తమ నిజరూపాన్ని ప్రదర్శిస్తారు.
" నీ దానశీలతకు మెచ్చాను ఏం వరం కావాలో కోరుకో " అంటూ మయూరిధ్వజుడుని శ్రీకృష్ణుడు అడుగుతాడు.
మహానుభావుల నిజరూపాలు చూసి మయూరధ్వజుడు వుక్కిరిబిక్కిరవుతూ
"పరమాత్మా! నా ఈ శరీరం అశాశ్వతమైనది.. కార్యక్రమం లో ఈ శరీరం నశించినా, నా ఆత్మ పరోపకారార్ధం ఉపయోగపడేలా.... నిత్యం మీ ముందుండేలా....దీవించండి" అని హస్తాలతో ముకులళిత కోరుకుంటాడు . అందుకు శ్రీకృష్ణుడు ఆశీర్వదిస్తూ ....
" మయూరధ్వజా! తథాస్తు! నేటి నుండే భూలోకంలో ప్రతి దేవాలయం ముందు నీ గుర్తుగా నీ పేరున ధ్వజ స్తంభాలు వెలుస్తాయి. వాటిని ఆశ్రయించిన నీ ఆత్మ చీరంజీవియై....నిత్యం దైవ సాన్నిధ్యంలో ఉంటుంది.
పరోపకారార్థం నీవు ప్రకాశిస్తావు....
ముందు నిన్ను దర్శించి ప్రదక్షిణ నమస్కారాలు ఆచరించిన మీదటనే ప్రజలు తమ ఇష్టదైవాలను దర్శించుకుంటారు. ప్రతినిత్యం నీ శరీరమున దీపం ఎవరుంచుతారో వారి జన్మసఫలం అవుతుంది. నీ శిరస్సున వుంచిన దీపం రాత్రులందు బాటసారులకు దారి చూపుతుంది..... " అంటూ అనుగ్రహిస్తాడు.
అందుకే ఆనాటి నుంచీ ఆలయాల ముందు ధ్వజ స్తంభాలు విధిగా ప్రతిష్టించడం ఆచారమయింది.
Sunday, September 22, 2024
విష్ణుసహస్రనామం, లలితాసహస్రనామం చదివేప్పుడు పాటించాల్సిన నియమాలు
- స్నానం చేసి లేదా కనీసం చేతులు కాళ్లు ముఖము కడుక్కుని - చదవడానికి కూర్చోవాలి
- అవకాశం ఉన్నంతవరకు ఒక నిర్దిష్ట సమయాన్ని - మీకు వీలైన సమయాన్ని నిర్దేశించుకుని, ప్రతిరోజు ఆ సమయానికే చదవడం అన్నది మంచి ఫలితాలను ఇస్తుంది.
- అలాగే మీ దేవుడి గదిలో కానీ లేదా ఒక నిర్దిష్టమైనటువంటి ప్రదేశాన్ని నిర్ధారించుకుని రోజు అదే ప్రదేశంలో కూర్చుని పారాయణ చేయడం మంచిది
- అవకాశం ఉంటే స్తోత్ర పారాయణ కన్నా ముందే ఒక దీపాన్ని వెలిగించి, మీరు చదవడం పూర్తయ్యేంతవరకు ఆ దీపం వెలుగుతూ ఉండేలా చూసుకోవాలి. అలాగే అగరబత్తీ కూడా. ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం దైవీశక్తులను బాగా ఆకర్షిస్తుందిట.
- రోజు ఒక్కసారి అయినా చదవాలి - రెండు పూటలా చదవగలిగితే ఇంకా మంచిది.
- ఉభయసంధ్యలు అంటే ఉదయం 6:00 మరియు సాయంత్రం 6:00 సమయం పారాయణలకి, ప్రార్థనలకి చాలా అనుకూలమైన సమయం.
- భోజనం లేదా ఏదైనా ఘన ఆహారం తీసుకున్న మూడు గంటల వరకు పారాయణకు పనికిరాదు.
- మాంసాహారం కనుక తీసుకుంటే మూడు నాలుగు గంటల తరువాత తల మీద స్నానం చేసి పారాయణకు కూర్చోవచ్చు.
- ఇంట్లో చదువుకోవడానికి మడి తడి లాంటి అడ్డంకులు ఏవైనా ఉంటే - ఏదైనా దేవాలయంలో కూర్చుని పారాయణ చేసుకోవడం శ్రేష్టం.
- చాలా నియమాలు ఉన్నాయి; ఇవన్నీ పాటించాలా అని కంగారు పడనవసరం లేదు. కుదిరినన్ని పాటించండి. ఎన్ని నియమాలు పాటిస్తారు అన్నది మీ భావ తీవ్రతను బట్టి, మీ సమస్య యొక్క తీవ్రతను బట్టి, మీ శారీరిక క్రమశిక్షణ బట్టి - అన్నింటికీ మించి మీకు ఎంత వీలు కుదురుతుంది అన్నదాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది.
తలమీద ఎక్కువ దోమలు తిరుగుతాయి ఎందుకు కారణం ఏమిటి?
ఏదైనా పార్క్ కు లేదా, దోమలు ఎక్కువ ఉన్న ప్రదేశంలో సాయంత్రం వేళ..కేవలం తలపైనే దోమలు తిరుగుతాయి. ఇలా తలమీద రౌండ్ గాఈ దోమలు ఎందుకు తిరుగుతాయ్ ?
🍀. కార్బన్ డయాక్సైడ్….. మనం శ్వాసించే గాలిలో ఉండే కార్బన్ డయాక్సైడ్ దోమలకు ఆకర్షణీయంగా ఉంటుంది.
🍀. వెచ్చదనం….. మన తలలు మిగిలిన శరీరం కంటే వేడిగా ఉండటం వలన దోమలు వాటి వైపు ఆకర్షితమవుతాయి.
🍀. చెమట…. చెమటలో ఉండే లాక్టిక్ యాసిడ్ దోమలకు ఆకర్షణీయంగా ఉంటుంది.
🍀. జుట్టు….దట్టమైన నల్లటిజుట్టు దోమలకు దాగడానికి మంచి ప్రదేశం.
🍀. పరిమళాలు…. తలకు రాసుకొనే షాంపూ, సుగంధ ద్రవ్యాలు మరియు ఇతర సౌందర్య సాధనాల వంటి పరిమళాలు దోమలను ఆకర్షిస్తాయి.
🍀. రక్త ప్రవాహం….మన తలలో రక్త ప్రవాహం ఎక్కువగా ఉంటుంది, దీని వల్ల దోమలకు రక్తాన్ని గుర్తించడం సులభం అవుతుంది.
🍀. సమయం… సాయంత్రం మరియు తెల్లవారుజాము సమయాల్లో దోమలు చాలా చురుగ్గా ఉంటాయి.
Saturday, September 21, 2024
తెలుగులో వంద ఉత్తమ పుస్తకాలు
●కన్యాశుల్కం - గురజాడ అప్పారావు
●మహాప్రస్థానం - శ్రీశ్రీ
●ఆంధ్ర మహాభారతం - కవిత్రయం
●మాలపిల్ల - ఉన్నవ లక్ష్మినారాయణ
●చివరకు మిగిలేది - బుచ్చిబాబు
●అసమర్థుని జీవయాత్ర - గోపీచంద్
●అమృతం కురిసిన రాత్రి - దేవరకొండ బాలగంగాధర తిలక్
●కాలాతీత వ్యక్తులు - డాక్టర్ శ్రీదేవి
●వేయి పడగలు - విశ్వనాథ సత్యనారాయణ
●కళాపూర్ణోదయం - పింగళి సూరన
●సాక్షి - పానుగంటి లక్ష్మీనారాయణ
●గబ్బిలం - గుఱ్ఱం జాషువా
●వసు చరిత్ర - భట్టుమూర్తి
●అతడు ఆమె - ఉప్పల లక్ష్మణరావు
●అనుభవాలూ..జ్ఞాపకాలు - శ్రీపాద సుబ్రమణ్యశాస్త్రి
●అముక్త మాల్యద – శ్రీకృష్ణదేవరాయులు
●చదువు - కొడవగంటి కుటుంబరావు
●ఎంకి పాటలు - నండూరి సుబ్బారావు
●కవిత్వ తత్వ విచారము - డాక్టర్ సిఆర్ రెడ్డి
●వేమన పద్యాలు – వేమన
●కృష్ణపక్షం – కృష్ణశాస్త్రి
●మట్టిమనిషి - వాసిరెడ్డి సీతాదేవి
●అల్పజీవి – రావిశాస్త్రి
●ఆంధ్రుల సాంఘిక చరిత్ర - సురవరం ప్రతాపరెడ్డి
●ఆంధ్ర మహాభాగవతం – పోతన
●బారిస్టరు పార్వతీశం - మెక్కుపాటి నరసింహశాస్త్రి
●మొల్ల రామాయణం – మొల్ల
●అన్నమాచార్య కీర్తనలు - అన్నమాచార్య
●హంపీ నుంచి హరప్పా దాకా - తిరుమల రామచంద్ర
●కాశీయాత్రా చరిత్ర - ఏనుగుల వీరాస్వామయ్య
●మైదానం – చలం
●వైతాళికులు – ముద్దుకృష్ణ
●ఫిడేలు రాగాల డజన్ – పఠాభి
●సౌందర నందము - పింగళి, కాటూరి
●విజయవిలాసం - చేమకూర వేంకటకవి
●కీలుబొమ్మలు - జివి కృష్ణారావు
●కొల్లాయి గడితేనేమి - మహీధర రామమోహనరావు
●మ్యూజింగ్స్ – చలం
●మనుచరిత్ర- అల్లసాని పెద్దన
●పాండురంగ మహత్యం - తెనాలి రామకృష్ణ
●ప్రజల మనిషి - వట్టికోట ఆళ్వార్ స్వామి
●పాండవోద్యోగ విజయములు - తిరుపతి వేంకటకవులు
●సమగ్ర ఆంధ్ర సాహిత్యం – ఆరుద్ర
●దిగంబర కవిత - దిగంబర కవులు
●ఇల్లాలి ముచ్చట్లు - పురాణం సుబ్రమణ్యశర్మ
●పానశాల - దువ్వూరి రామిరెడ్డి
●శివతాండవం - పుట్టపర్తి నారాయణాచార్యులు
●అంపశయ్య – నవీన్
●చిల్లర దేవుళ్లు - దాశరథి రంగాచార్య
●గణపతి - చిలకమర్తి లక్ష్మీనరసింహం
●జానకి విముక్తి – రంగనాయకమ్మ
●స్వీయ చరిత్ర – కందుకూరి
● మహోదయం - కెవి రమణారెడ్డి
●నారాయణరావు - అడవి బాపిరాజు
●విశ్వంభర – సినారె
●దాశరథి కవిత – దాశరథి
●కథాశిల్పం - వల్లంపాటి వెంకటసుబ్బయ్య
●నేను.. నా దేశం - దర్శి చెంచయ్య
●పెన్నేటి పాట - విద్వాన్ విశ్వం
●ప్రతాపరుద్రీయం - వేదం వెంకటరాయశాస్త్రి
●పారిజాతాపహరణం - నంది తిమ్మన
●పల్నాటి వీర చరిత్ర – శ్రీనాథుడు
●రాజశేఖర చరిత్ర – కందుకూరి
●రాధికా సాంత్వనము - ముద్దు పళని
● స్వప్న లిపి – అజంతా
●సారస్వత వివేచన - రాచమల్లు రామచంద్రారెడ్డి
●శృంగార నైషధం – శ్రీనాథుడు
●ఉత్తర రామాయణము - కంకంటి పాపరాజు
●విశ్వ దర్శనం - నండూరి రామమోహనరావు
●అను క్షణికం - వడ్డెర చండీదాస్
●ఆధునిక మహాభారతం - గుంటూరు శేషేంద్రశర్మ
●చంఘీజ్ ఖాన్ - తెన్నేటి సూరి
●చాటు పద్య మంజరి - వేటూరి ప్రభాకరశాస్త్రి
●చితి.. చింత - వేగుంట మోహనప్రసాద్
●గద్దర్ పాటలు – గద్దర్
●హాంగ్ మీ క్విక్ - బీనాదేవి
●ఇస్మాయిల్ కవిత – ఇస్మాయిల్
●కుమార సంభవం - నన్నే చోడుడు
●మైనా - శీలా వీర్రాజు
●మాభూమి - సుంకర, వాసిరెడ్డి
●మోహన వంశీ – లత
●రాముడుండాడు రాజ్యముండాది – కేశవరెడ్డి
●రంగనాథ రామాయణం - గోన బుద్దారెడ్డి
●సౌభద్రుని ప్రణయయాత్ర - నాయని సుబ్బారావు
●సూత పురాణం - త్రిపురనేని రామస్వామిచౌదరి
●సాహిత్యంలో దృక్పథాలు - ఆర్ఎస్ సుదర్శనం
●స్వేచ్ఛ – ఓల్గా
●కరుణశ్రీ - జంధ్యాల పాపయ్యశాస్త్రి
●వేమన - రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ
●తృణకంకణం – రాయప్రోలు
●హృదయనేత్రి - మాలతీ చందూర్
●బ్రౌను నిఘంటువు - చార్లెస్ బ్రౌన్
●నీతి చంద్రిక - చిన్నయ సూరి
●తెలుగులో కవితా విప్లవాల స్వరూపం - వేల్చేరు నారాయణరావు
●నీలిమేఘాలు – ఓల్గా
●అడవి ఉప్పొంగిన రాత్రి – విమల
●చిక్కనవుతున్న పాట - జి లక్ష్మినరసయ్య, త్రిపురనేని శ్రీనివాస్
●కొయ్య గుర్రం – నగ్నముని
●నగరంలో వాన – కుందుర్తి
●శివారెడ్డి కవిత – శివారెడ్డి
తప్పకుండా చదవాల్సిన 10 పుస్తకాలు ఏమిటి ?
- అంతర్ముఖం (యండమూరి వీరేంద్రనాథ్)
- అందమైన జీవితం (మల్లాది వెంకటకృష్ణమూర్తి)
- కీర్తి కిరీటాలు (యద్దనపూడి సులోచనారాణి)
- పెంకుటిల్లు (కొమ్మూరి వేణుగోపాలరావు)
- చక్రభ్రమణం(కోడూరి కౌసల్యాదేవి)
- మరణకాంక్ష (సలీం)
- బారిష్టర్ పార్వతీశం (మొక్కపాటి నరసింహశాస్త్రి)
- ప్రేమ పల్లకీ (శ్రీరమణ)
- నల్లంచు తెల్లచీర (యండమూరి వీరేంద్రనాథ్)
- కూలిన గోడలు (రంగనాయకమ్మ)
చాలామంది పది గొప్ప పుస్తకాలు సూచించండి. అంటే అందులో తప్పకుండా చివరికి మిగిలేది, అసమర్థుని జీవయాత్ర, మైదానం, వేయి పడగలు, కన్యాశుల్కం లాంటివి సూచిస్తారు. అలాంటి సీరియస్ రచనలు చదివి తలబొప్పి కట్టింది. ఎవరో ఎవరికో గొప్పతనం ఆపాదించారు కదా అని అందరికీ గొప్పగా అనిపించాలని లేదు.
త్వరగా బరువు తగ్గడానికి ఉపవాసం ఎలా చేయాలి?
త్వరగా బరువు తగ్గడానికి ఉపవాసం చేయాలనుకుంటే, సురక్షితంగా చేయడానికి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ .. విరామ ఉపవాసం అత్యంత ప్రజాదరణ పొందినది..
🍃 16/8 పద్ధతి…. ఇది అత్యంత ప్రజాదరణ పొందినది. 16 గంటలు ఉపవాసం, 8 గంటల్లో తినడం. ఉదాహరణకు, మధ్యాహ్నం 12 నుండి రాత్రి 8 వరకు మాత్రమే తినడం.
🍃 5 : 2 పద్ధతి…. వారంలో 5 రోజులు సాధారణంగా తినడం, 2 రోజులు తక్కువ క్యాలరీలు 500-600 తీసుకోవడం.
🍃 Eat - Stop - Eat…. వారానికి 1 - 2 సార్లు 24 గంటల ఉపవాసం పాటించడం.
🍃 ద్రవాలు తీసుకోండి…. ఉపవాస సమయంలో నీరు, తేనీరు లాంటి ద్రవాలు తాగడం ముఖ్యం.
🍃 క్రమంగా ప్రారంభించండి…. ఒక్కసారిగా దీర్ఘకాలిక ఉపవాసం కాకుండా, చిన్న కాలవ్యవధులతో మొదలుపెట్టి క్రమంగా పెంచుకోవడం మంచిది.
🍃 పోషకాహారం తీసుకోండి…. తినే సమయాల్లో సమతుల్య, పోషకాహారం తీసుకోవడం చాలా ముఖ్యం.
🍃 వ్యాయామం…. మితమైన వ్యాయామం చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అయితే తీవ్రమైన వ్యాయామం మానుకోవడం మంచిది.
🍃 శరీర స్పందనను వినండి…. అసౌకర్యం, బలహీనత అనిపిస్తే ఉపవాసాన్ని ఆపేయండి.
🍃 నిద్ర…. సరిపడా నిద్ర పొందడం ముఖ్యం.
🍃 వైద్యుని సలహా తీసుకోండి…. ఉపవాసం ప్రారంభించే ముందు తప్పనిసరిగా వైద్యుని సంప్రదించండి.
Wednesday, September 18, 2024
స్వార్ధ కర్మ - పారమార్ధిక కర్మ
ప్రతీ మనిషి కర్మ, రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి స్వార్థ కర్మ.రెండోది పరమార్ధ కర్మ.
స్వార్ధ కర్మ అంటే - మనందరికీ తెలుసు. తన స్వప్రయోజనాల కోసం మాత్రమే, అధర్మమైన పని చేయడం.
పరమార్ధ కర్మ అంటే - భగవంతుడికి సంబంధించిన పని అని చాలామంది భావిస్తూంటారు. కాని అది పరిపూర్ణ అర్ధం కాదు. ఇతరుల ప్రయోజనం కోసం తన స్వప్రయోజనాలని వదులుకుని పని చేయడం కూడా పరమార్ధ కర్మ అవుతుంది.
స్వార్ధ కర్మని ఇంకో కోణం లోంచి కూడా చెప్పచ్చు. తన ఆధ్యాత్మిక పరిణామక్రమానికి వ్యతిరేకంగా చేసే పని స్వార్ధ కర్మ, అలాగే తన ఆధ్యాత్మిక పరిణామక్రమానికి అనుకూలంగా చేసే పని పారమార్ధిక కర్మ అవుతుంది. స్వార్ధ కర్మని పాపం అని, పరమార్ధ కర్మని పుణ్యం అని కూడా అంటూంటాం..
వివిధ శాస్త్రాల్లో కర్మలని విభజించారు. ఐతే అవన్నీ పై ఒకటి, రెండు తరహా కర్మల్లోని మూడు విభాగాల్లో ఏదో ఓ దానికి చెందినవే తప్ప వాటికి చెందనివి ఏవీ లేవు. వాటిలో ఓ విభజన...
1. నిత్య కర్మలు:
సంధ్యా స్నానం జపో హోమో దేవతానాంచ పూజనమ్!
ఆతిథ్యం వైశ్వదేవం చ షట్కర్మాణి దినే దినే!!
పై శ్లోకం నిత్య కర్మలు ఏవో చెప్తోంది. అవి వరసగా -- స్నానం, సంధ్య, జపం, హోమం, దేవతార్చన, వైశ్వదేవాన్ని ఆచరించడం, అతిధులని ఆదరించడం, అనే ఏడు నిత్య కర్మలు.
ఇవన్నీ శుభ అగామి కర్మల కిందకి వస్తాయి. వీటిని ఆచరించడం వల్ల చిత్త శుద్ధి ఏర్పడి, మనశ్శాంతి లభిస్తుంది. మనిషి ఇష్టాఇష్టాలతో నిమిత్తం లేకుండా వీటిని నిత్యం చేయాలి.
2. నైమిత్తిక కర్మలు:
వివిధ నిమిత్తాలని అనుసరించి ఒక నిమిత్త కాలం, అంటే ఆ దినం మాత్రమే చేసే కర్మలు. ఉదాహరణకి గ్రహకాలంలో, మహాలయ అమావాస్య నాడు తర్పణాలు వదలడం, పితృదేవతలకి శ్రాద్ధం పెట్టడం మొదలైనవి నైమిత్తిక కర్మలు. ఇవన్నీ కూడా శుభ అగామి కర్మలు కిందకి వస్తాయి. నైమిత్తిక కర్మల వల్ల కూడా మనశ్శాంతి లభిస్తుంది. నిత్య, నైమిత్తిక కర్మలు పాప క్షాళనని చేస్తాయి కాబట్టి వీటిని చేయడం వదలకూడదని శాస్త్రం.
3. కామ్య కర్మలు:
చేసిన కర్మలకి ఫలాన్ని ఆశించి, వ్యక్తి ఇష్టాఇష్టాలని అనుసరించి చేసేవి కామ్య కర్మలు.
జప, తప, హోమ, యజ్ఞ, యాగాది కర్మలు - సంతానం, బంధు మిత్రులు, భార్య మొదలైన వాటిని, ధన ధాన్య వస్తు వాహనాది సంపదలని పొందాలని చేసేవి కామ్య కర్మలు. భౌతిక లేదా లౌకిక ఫలితం ఆశించి చేసేవన్నీ కామ్య కర్మల కిందకే వస్తాయి.
స్వర్గాన్ని కోరి జ్యోతిప్టోమాన్ని, పుత్ర సంతానం కోరుకుని పుత్రకామేష్టి యాగాన్ని, సత్యనారాయణ వ్రతం లాంటి ఫలం కోరుకుని చేసేవి, మొక్కులు కామ్య కర్మలు. జీతం కోరి చేసే ఉద్యోగం కూడా కామ్య కర్మే. ఇవి అశుభ అగామి కర్మలు. కామ్య కర్మల వల్ల మనశ్శాంతి లేకుండా పతనమవుతారు.
యోగశాస్త్రంలో కర్మలు రెండు రకాలుగా చెప్పారు.