Adsense

Friday, April 5, 2024

స్త్రీల శిరోజాల సంరక్షణ (పూర్వ పద్ధతి) HAIR CARE FOR WOMEN (OLD PROCESSES)

స్త్రీల శిరోజాల సంరక్షణ
స్త్రీలకు సహజ సౌందర్యమిచ్చు వస్తువులలో శిరోజములు ఎన్నదగినవి. వానిని దువ్వుకొనుటలో అవలంబింపదగిన కొన్ని సలహాలను వినీత భావముతో నాసోదరీమణులకు నివేదించుచున్నాను.

శిరోజముల చిక్కుదీర్చు దువ్వెనలు పదునై న మొసలుగలిగి యుండరాదు. తీగెల బ్రష్టులతో తల దువ్వుకొనుట తగదు. బిరుసు వెండ్రుకలతో చేయబడిన బ్రష్టుల నుపయోగించుటకూడ తలకట్టునకు చెఱుపే మాడపట్టున కెదురుగాదువ్వెనను నొక్కి దువ్వరాదు. సగము మృదువుగను సగము బిరుసుగను నుండెడు దువ్వెనలను వాడ రాదు. లోహపుదువ్వెననుగాని బ్రష్షునుగాని వినియోగించుట తగదు. పండ్లవరుసలో ఎగుడు దిగుడుకల దువ్వెనను వాడుట ప్రమాదకరము.
కురులు దువ్వుకొను బ్రష్టును దువ్వెనను అమోనియా (Ammonia) కలిపిన గోరువెచ్చని నీటిలో తఱచు శుభ్రపఱచుట గమనింపదగిన విషయము. సూర్యరశ్మిలో తలకట్టు తఱచుగా అర్చుకొనుట మంచిది. సూర్యరశ్మి శిరోజములను దీర్ఘ కాలము ఆరోగ్యస్థితిలో నుంచుటకు దివ్యమైన యాషధరాజము, శిరోజముల నార బెట్టుటలో సూర్యాభీముఖముగా గూర్చుండరాదు. వీపు సూర్యుని వై వుంచి అప్పుడప్పుడు తలనిటు నటు ద్రిప్పుచుండవలెను.

శిరోజములను ముందు దువ్వెనతో దువ్వి పిమ్మట బ్రష్టును ఉపయోగించుట నాగ రికపు స్త్రీ లవలంబించు మంచిమార్గములలో నొకటి; అగుటచే నది స్త్రీజనముచే నవశ్య ముగా నవలంబింపదగినది, శిరోజములకు గూడ విశ్రాంతి యుండవలయును గావున తరచుగా దువ్వుట—అనగా రోజునకు అయిదారుసారులు అనుట— ఆరోగ్యకరమగు పద్ధతికాదు. బ్రష్టు నుపయోగించుటవలని యుపయోగములలో నొకటి తలనుండి వచ్చు నొక విధమగు నూనెను అన్ని వెంట్రుకలకు సమానముగ సర్దుబాటు చేయుటయే యనువిషయము తల దువ్వుకొనునపుడెల్ల స్త్రీలు జ్ఞప్తియందుంచుకొనవలయును,

( సేకరణ)

Thursday, April 4, 2024

స్త్రీల గడ్డము అందంగా ఉండేందుకు చేయాల్సిన వ్యాయామం (సులభమైన పూర్వ పద్ధతి) Chin shape exercises for women

గడ్డము..:

* పలుచని శరీరము గలవానికి గడ్డ మెల్లప్పుడును అందముగ నుండును. కొంచెము స్థూలముగ నున్న వారిలో కొంతమందికి గడ్డముక్రింద కండ పెరిగి రెండు గడ్డములవలె జూపట్టి యందమును చెడుచుటయు గలదు. అట్టిదానినుండి తప్పించు కొనుటకు మూడు మార్గములు కలవు. గడ్డము క్రిందనున్న కండను బిగియబట్టి కంఠముపై చేయినుంచి చర్మమును క్రిందికిలాగి ఆకండను మెల్లెగ యటు నిటు రుద్ది సరిచేయుట మెదటి విధానము. ఇది చాలా కాలము చేసిన గాని ఫలితము కనబడదు. రెండవది కట్లుకట్టుటచే కండ్లను సరియయిన స్థానమున నుండునట్లు చేయుట. కొన్ని నెలలపాటు ప్రతిరాత్రియు, గడ్డముక్రింద కండను, చమురుతో నిమిరి గుడ్డతో చెవులమీదుగా కట్టుకట్టినచో కండ తగ్గును. కట్టుగట్టిగయుండీ రక్తప్రసారము నాపు చేయునట్లుండ రాదు. గట్టిగ లేకున్నచో కట్టిన లాభమేయుండదు. పరిశ్రమ చేయుట మూడవ విధానము. ఇది తప్పక గుణ మిచ్చుటయే గాక త్వరలోకూడ దీని ఫలితమును చూడనగును. తలను వీలయినంత వెనుకకును ముందునకును నెమ్మదిగా యాడించుము. తల ముందుకు వచ్చునప్పుడు నోరు బాగుగా తెరచి యుంచి గడ్డముక్రింది కండరముల బిగబట్టుము. తలపైకి వెళ్లినప్పుడు కండరముల బాగుగ సాగనిమ్ము. తలను ప్రక్కలకు వీలయినంత వరకు, గడ్డము భుజముల మీదికి పోవునట్లు త్రిప్పుట, తరువాత చేయవలసిన పరిశ్రమ. ఇట్లు చేసినచో కొన్ని వార ములలో గడ్డము మార్పు చెందినట్లు చూడవచ్చును.

A person with a thin body is always beautiful. Some people who are slightly obese can have a growth of muscle under the chin, which can look like two chins. There are three ways to avoid it. By tightening the muscle below the chin, pull the skin down from the hand on the neck and gently rub the muscle. This has been done for a long time but no result is seen. The second is to keep the eyelets in the correct position. Every night for a few months, a bandage under the chin and an oil-soaked cloth over the ears will reduce the swelling. Blood circulation does not come as it should. If it is not hard, there will be no profit. Industrialization is the third approach. It must be good but I will not see the result soon. Slowly move the head backwards and forwards as far as possible. As the head comes forward, the mouth opens wide and the chin muscles tighten. Stretch the muscles as you go overhead. The next exercise is to tilt the head as far as possible, so that the chin does not fall over the shoulders. If you do this, you will see a change in the beard within a few weeks.

పెదవుల సౌందర్యం / lip care ( పూర్వ పద్ధతి)

పెదవులు
పెదవులపై చర్మము బహుసున్నితమైనది. దాని నొకసారి నిర్లక్ష్యము చేసినచో యది ముదుగు బారి బీటలువారును. తరువాత ఎంతయోశ్రద్ద తీసికొనినగాని మొదటి మృదుత్వము దానికి తిరిగిరాదు. కాబట్టి పెదవుల విషయమై తగు జాగరూకత తీసికొనవలెను. సిగ రెట్లు హెచ్చుగా కాల్చుట చే పెదవులు నల్లబడి యారిపోయి పగులును. కొంతమంది తీరిక గాయున్నప్పుడు పెదవులను కొరుకుకొను దురభ్యాస ముండును. అందుచే వాని పైనుండు పలుచటి చర్మము మాటిమాటికి తొలిగింపబడి యని మొద్దుబారుటయు, కొన్ని పెదవుల యాకృతి చెడుటయు తటస్థించును. శీతకాలములో రాత్రులందు పెదవులకు నెయ్యి రాయుటచే మేత్తబడును. మంచి యారోగ్యముగలవారికి పెదవులు రక్తముతో నిండి యరుణ కాంతితో నుండునుగాన యారోగ్యమునకై శ్రద్దతీసికొనుము. పెదవులెర్రగానుండుటకు పాశ్చాత్య. యువతులును, మనదేశమందు పార్సీలు మొదలగువారును రంగువేయుదురు గాని తాంబూల చర్వణ మంతటి సులభమయినదియు, గుణ కారియు, హిందూసుందరికి మరొకటిలేదు.
( సేకరణ)

The skin on the lips is very sensitive. If you neglect it once, it will come back to haunt you. No matter how much care is taken later, the first softness does not return to it. So, proper care should be taken regarding the lips. Burning six times higher will cause the lips to become blackened and cracked. Some people have a bad habit of biting their lips when they are sore. Therefore, the thin skin on top of the mouth is removed and the dullness and bad shape of some lips are neutralized. In winter it is nourished by applying ghee on the lips at night. Pay attention to the health of those with good health whose lips are full of blood and bright with the light of Yaruna. Western to be full of lips. Young women, in our country, Parsis etc. are dyed, but Tambula Charvana is easy and beneficial, there is no other for Hindu women.

స్త్రీ హస్త సాముద్రికం

ఆర చేయియొక్క పొడవు వేళ్లకంటే ఎక్కువ గానున్న యెడల మనస్సెప్పుడు విశేష భావములతో నిండియుండును. వ్రేళ్లకంటే పొట్టిగా నుండిన తెలివిగలిగి పనులు చేయుటను, సూక్ష్మజ్ఞానము, చురుకుదన మును సూచించును.

హస్తము, వేళ్లు, సమాన పొడవుగా నుండిన, బుద్ధికుశలతయు, సమగ్ర భావమును, న్యాయా న్యాయ విచక్షణ జ్ఞానమును సూచించును.

అరచేయి పల్లము గుంటవలె మిక్కిలి లోతుగా నుండిన దురదృష్టమును, కష్టమును సూచించును.

అరచేయి ఎండుబారి కదలించుటకు సాధ్యముగాక యుండిన ఏకార్యమునందును ఆలస్యము గలిగియుండుటను సూచించును.
అర చేయి వర్ణము

తెల్లని రంగుగల చేయి చూచుటకు స్వచ్ఛముగాని తెలుపురంగు గలచేయి రక్త ప్రసారము తక్కు నగుట చేత కలుగును. ఇది విషయములందు వాంఛలేమి, ఆరోగ్యములేమి, ఉత్సాహ హీనత, మనశ్చాంచల్యము వీటిని దెలుపును.

పాలిపోయి అతితెల్లగా నుండిన వాత తత్వము, పాండు రోగము, చైతన్య హీనతను దెలుపును. పసుపురంగుగల అర చేయి పిత్తాశయ రోగమును దెలుపును. మరియు ఆడకువ, మితభాషిత్వము,

ఆధైర్యమును సూచించును.

గులాబిరంగుగల చేయి సంతోషము, ధైర్యము, సౌఖ్యము, భావోద్రేకము, చుఱుకుదనము, ఆరో గ్యైశ్వర్యమును సూచించును.

కుంకుమ వర్ణముగల చేయి కోపము, సాహసము, రక్తాధిక్యత, ఉద్రేకము వీటిని సూచించును.

నీలవర్ణముగల చేయి దౌర్బల్యము, శరీరము నందొక దీర్ఘ వ్యాధి వ్యాపనము, బలహీనము, దుఃఖము వీటిని సూచించును.

మిక్కిలి నలుపుగల చేయి ఈర్ష్య, అహంకారము, శీఘ్ర మృత్యువు, వీటిని సూచించును.

అరచేతియందు నల్లని డాగులు కనబడిన చర్మ వ్యాధులు, సుఖవ్యాధులు, చెడురక్తము, మనోదౌర్బ ల్యము వీటిని సూచించును.

అరచేతి యందు తెల్లని డాగులు కనబడిన జీర్ణించిన చర్మవ్యాధులని ఎఱుంగ రలయును. ఇది అట్ట శుభ సూచకము గానేరదు.

పూర్వం నీటి వైద్యం #water therapy (old)

జలమువలన పనేక రోగములు నయమగును. సమస్తరోగములు జలమువలన నే నయమగునను జర్మను పండితుని సిద్ధాంతానుసారము మనదేశమం దనేకులు నీటివైద్యమును చేయుచున్నారు. దానినే తొట్టిస్నానములని నుడువుదురు. ప్రాతః స్నానము సర్వరోగనివారణమనియు, సర్వపాపపరిహారమనియును ఆరోగ్యసాధనమనియు పెద్దలు చెప్పియున్నారు. ఆంధ్రదేశమున ప్రాతఃస్నానమొనర్చు యాచారము బ్రాహ్మ ణులయందు మాత్రముండెను. కాని యిటీవల యదితగ్గినది. మద్రాసు కలకత్తా మొదలగు ప్రదేశములయందు చదువుకొనివచ్చిన విద్యార్థులు ఉషఃకాలమున గాకున్నను స్నానానంతరమె కార్యరంగమున బ్రవేశింపుచున్నారు. ఇది శుభసూచక మేగాని స్త్రీల యందుమాత్ర మాయభ్యాసముతప్పిపోయినది. ప్రాతఃస్నానమును మఱచినారనుట యతి శయోక్తిగాదు. ప్రాతఃస్నానము వలన నారోగ్యము నృద్ధియగునని వేరుగనుడువుట యనా వశ్యకము. శరీరమునకు మెరుగుగ కొబ్బరినూనెను పూసి సూర్యోదయమునకు పూర్వము తలనిండ చన్నీటస్నానము చేయవలయును. చలి వేయదు. పిల్లలకుగూడ నటుల చేయించిన యెడల తలయందు పేలు, పుండ్లు, గజ్జి, దురద మొదలగునవి క్రమక్రమముగ నశించును. శరీరమునకు బలము గలుగును. మనస్సు వికసించును. కావున నాంధ్రదేశ మందలి స్త్రీలయభివృద్ధికై పాటుబడుశ్రీలీ విషయము బోధించి, తల్లులు పిల్లల యారోగ్య సాధనకు గడంగవలయును.
(1) తలపోటు, తలనొప్పివలన బాధపడుచుందువారు శిరమున జలముధారగను పోయవలయును. అందువలన బాధతగ్గును.

(2) ముక్కు నుండి నెత్తురుకారుచుండిన శీతలజలమును నాసికతోడ పీల్చవలయును. అందువలన నిది సాధారణముగ సయమగును.

(3) ప్రతిదిన ముదయమున శీతల జలమును నాసికతోడ వీల్చిన యెడల 'పీనస' 'స్వరభంగము' దొలంగును.

(4) వాతరోగులు, అజీర్ణగ్రస్తులు మలద్వారమున శీతల జలమును పిచికారి చేసిన మిక్కిలి మేలుగలుగును.

(5) ఉదరమునందు బాధ యేర్పడిన యెడల వేడినీటి కాపు బెట్టవలయును. అందువలన శీఘ్రముగ నా బాధ తొలగును.

(6) విరోచనబద్ధముగలవారు శయనించునప్పుడు శీతలజలమును, నిద్దుర లేవగనే వేడినీటిని ద్రావుచుండిన యెడల మలబద్ధము నశించును,

(7) పొంగు, ఆటలమ్మ, స్ఫోటకము మొదలగు చర్మరోగములవల్ల బాధపడు వారికి శీతల జలమున తడిపిన వస్త్రమును గప్పవలయును. అందువలన వారికా బాధ చాలవరకు లాఘనమగును.

(8) వేడినీటిని ద్రావిన యెడల వాంతియగును,

(9) శిశువులకు యీడ్పులు వచ్చినప్పుడు తలకు మంచుగడ్డను లేక శీతల జలమును ప్రయోగించిన యెడల మిక్కిలి మేలుగలుగును.

(10) స్పృహతప్పి పడిపోయినవారి మోముపైన చన్నీటిని గొట్టిన వానికి వెంటనే స్పృహవచ్చును. "దెబ్బతగిలినచోట తడిగుడ్డచుట్టుట మంచిమార్గము.

(11) చేతులుకాళ్లు కొంగర బోవుచుండినయెడల శీతలజలమును ధారగబోయ వలెను. లేకకల్లును పట్టివేయవలయును. అందువలన బాధచాలవరకు తగ్గును. మిక్కిలి దెబ్బతగిలి పడిపోయిన రోగిని పరుండ బెట్టి తలయొకింత క్రిందుగ నుండునట్లు చేసి వేడి నీటితో కాచినయెడల మిక్కిలి మేలుకలుగగలదు.

భూపతనమైన శిశువులకు శ్వాశనిరోధమందు సమయమున నీటి వైద్యముపక రించుము. ఒక భాండమందుష్ట జలమును, మఱియొక భాండమందు శీతల జలమునుంచి ఆశిశువును ప్రథమమున యువజలమున కంఠమువరకును ముంచి యొకనిముసముంచి పిమ్మట శీతలజల మందు కంఠమువరకుముంచి యొక నిముసము వరకునుంచి దీసిన యెడల శ్వాసవిడచును.

వాతరోగిని ప్రథమమున మంచి వేడినీటియందును, తర్వాత శీతలజలమందును ముంచినయెడల మిక్కిలి మేలుగలుగును. పడిశము బాధనందువారికి వేడినీటిస్నానము మిక్కిలి యుపకారి.

(- సేకరణ)

Wednesday, April 3, 2024

పూర్వం బిడ్డను తొలిసారి అత్తగారింటికి పంపునప్పుడు చెప్పే బుద్దులు (కొన్ని దేశాలలో)




జపాన్ దేశంలో..

1. నీవు నా కూతురవుగావు, ఆ తింటికోడలువు ఇప్పుడు,

2. పెండ్లిఆయినందున నీవొకరి సొత్తువు, నీవాయజమాని ఆజ్ఞలను కనులకద్దుకొని సేవింపుము"

3. నీ అత్తగారిని సంతోష పెట్టుటవలన నీకు శాశ్వతమైన సంతోషము లభింప వీలుగలదు.

4. ఎవరితో విరోధము పెట్టికొనకుము ఓర్పులేనితనము, కపటము నీలో నుండఁదగవు•

5. ఒక వేళ నీ భర కోపపడినప్పటికిని నోరు పొడుగుగా పోనీయకుము. అతనికోపమును నీశాంతము వినయవిధేయతలతోను ప్రశంశా వాక్యములతోను నిమ్మలింపుము.

6. ఇంటిపనుల నేర్పుతో జక్కపెట్టుము. తగినట్లు ఏర్పాట్లు చేయుచుండుము, మితముగా ఖర్చు బెట్టుటను మరువవద్దు.

7. జ్యోతిష్కులతోను, మాంత్రికులతోను నీ కష్టములను గూర్చి సలహా తీసికొనకుము'

8. నిరాడంబరమైనవి, వెలతక్కువవిగానుండు శుభ్రమైన దుస్తులను ధరింపుము.

9. గర్వపడకుము. హెచ్చులు గొట్టకుము దీనివలన మానవులు గౌరవంగోల్పోయి హైక్యముపొందుదురు

10. నీతిల్లిదండ్రుల పదవులనుజూచియు, వారిధనధాన్య రాజ్యభోగ్యములను దలంచియు, విఱ్ఱవీఁగకుము' మఱియు నిట్టిమాటలను సగర్వముగా నీభర్తతో గాని, నీఅత్తగారివారగు నెవ్వరితోఁగానివచింపకుము"
అరేబియా దేశములో:-

1. ఓ బిడ్డా! నీవు సర్వదా తృప్తితోనుండుము. నీభర్త ఆజ్ఞలను శిరసావహింపుము.

2. నీభర్తయొక్క కన్నులమీఁదను, ముక్కుమీఁదరు నీదృష్టినుంచుము. అతనికన్నులు నీవలని చెడు పములు చూడకుండా, మంచిశీలముతో నుండుము. ఆతని నానిక నీవైపునుండి సుగంధమునే ఆఘ్రాణించునట్లు జాగ్రత్త వహింపుము

3. భర్త భుజించు సమయమునను నిద్రించసమయమునను మిక్కిలి ప్రసన్నతతోను, శాంతితోను, మృదువుగానుండుము, ఏలన మిక్కుట మైన ఆఁకలి మనుష్యుని భయంకరముగా మార్చివేయఁగలదు, ఆటులే నిద్రలోనున్న ప్పుడు పరిజ్ఞానములేకుండా మేల్కొలిపినప్పుడు, నిద్రను భంగము చేయునట్లు అల్లరి చేసిన ప్పుడును ప్రళయకారియైన కోపమునకు గుఱి కావలసియుండును.

4. నీభర్త ఆజ్ఞ గల్లంఘింపకుము. ఆతనిరిహస్యముల నొరులకు జెప్పకుము.

5. అతఁడు విచారముగా నున్నప్పుడు సంతోషమును, సంతోషముతో నున్నప్పుడు దుఃఖమును ప్రకటింపకుము.

6. ఆతని సంతోషమునకు నీసంతోషమునకంటె ప్రాముఖ్యము నొసఁగవలెను' అతని కోరికలను నీకోరి కలకంటె ముఖ్య మైనట్టివిగా నిశ్చయించి ఆచరింపుము ”

[ స్వీయ - "స్త్రీధర్మ” నుండి ] (సేకరణ)

సుభాషితాలు - old quotations

1. "ఎప్పటికైనా నీకాళ్లమీద నీవు నిలవబడడం నేర్చుకో” దీనినే భగవద్గీతలో " ఉద్ధరేదాత్మ నాత్మానం” అన్నారు.

2. పట్టుదల వుంటే ఏ పనీ కాకపోదు అందుకే పెద్దలు "కృషితో నాస్తి దుర్భిక్షమ్" అన్నారు.

3. "నీవు సుఖపడి ఒకళ్లను సుఖపెట్టడమే పరమ ధర్మం” స్వయంతీర్వా పరాంస్తారయేత్" అంటే ఇదేకదా!

4. "నీలాగా ఒకరిని చూచుకో అందులో చాలా సుఖం ఉన్నది?" "ఆత్మ వత్సర్వభూతాని యళ్ళ పశ్యతి” అనే భగవద్గీతా వాక్యంకూడా ఇదే చెపుతూంది,

5. " అంతరాత్మ మంచిదే అని చెబుతూన్నపుడు ఆ పని చెయ్యటంలో సందేహించకు భగవంతు డనే వాడుంటే ఆపని న్యాయబద్ధమైనపుడు నిన్నూ నీపనినీ ఎందు కాశీర్వదించడు!" గౌతమ బుద్ధుని ఆజీవిత ప్రభోదం ఇదే అని ఇప్పటికి మనం తెలుసుకోగల్గితే సంతోషమే.
6. మనస్సులో ఒకటి తలిచి పైకి ఒకటి చెయ్యకు అంతరాత్మను మోసం చెయ్యకుండా మానసిక సంకల్పాన్ని ఆచరణలో పెట్టడమే పరాయణము, "మనసా కాయేనా వాచా సమానోభవ' అనే ఆచా ర్యుల వాక్యమే ఇందుకు ప్రమాణం,

7. "ఏదైనా మంచిదని తోచినపుడు వెంటనే చెయ్యి, ఆలస్యం కూడదు" "భుభశ్య శీఘ్రం" అని మన పెద్దలు అందుకే చెప్పారు.

8. “ఒక్కొక్కపుడు ఆలోచనకంటే ఆచరణలో విజయం ఉంటుందని గమనించు” “ధైర్యే సాహ・శ్రీః" అని ఊరికే అన్నారా!

9. "సంతృప్తికిమించిన వస్తు నీ ప్రపంచంలో లేదు. సంతుష్టుడీ మూడు జగముల బూజ్యుండు" అని భాగవతం ప్రమాణం పల్కుతుంది.

10. కష్టం అనేది ఈశ్వరప్రసాదం, కష్టం వచ్చినపుడు నిన్ను నీవుకాని, ఒరులను కాని నిందించకు. కష్టసమాయాలలో పట్టుదలతో నిలువబడు. అపుడే విజయానికి అర్హుడవౌతావు” “కష్ట్ ఫలీ'” అనేవాక్యం ఊరికే పుట్టిందా మఱి!

11. కష్ట సుఖాల్లో ఒక్క విధంగా ఉండగల్గడం ప్రయత్నించైనా నేర్చుకో "యః - సుఖదుః భేషు సమస్సంగ వివర్ణిత:... మేప్రియోన్నర:'' అని కృష్ణ పరమాత్మ సెలవిచ్చారు.

12. "పని చెయ్యడమే నీవంతు ఫలాఫలాలు దేవునిమీద వదులు. ఫల సంగము దుఃఖ హేతువు" "కర్మణ్యే వాధికారస్తే మాఫలేషు కదాచన” అని అధికారిక వచనం చెప్పేదికూడా ఈఉత్కృష్టధర్మాన్నే,

13. అపజయమే విజయసౌధానికి బాట. ఆ అపజయానికి వెరువక అభివృద్ధి పదంలో ముందుకు సాగిపోవుటే ధీమంతుల లక్షణం. అటువంటివారే ఎప్పటికైనా కార్యసాధకు లౌతారు. "ధరణి ససాధ్యము లేదు సోత్సాహమతుల కెపుడు” అనేవాక్యం దీన్ని ఉద్భోదిస్తూంది.

14. ప్రజాసేవలోనే అన్ని పరమార్ధాలూ ఉన్నాయి. తోడి మానవులకు నేవచెయ్యడంలోనే ఈశ్వరుడుకూడా సంతుష్టు డౌతాడు. "కుర్యాద్విద్వాం సధాత్ శక్తశ్చి కీర్తుల్లోక సంగ్రహమ్" అనే భగవద్గీతా వాక్యాని కింతకంటే వేరే యర్థమేమి ?"

దంతములు—సౌందర్యము (పాత పద్దతి) - Dental Care old System


ఎంత సుందర వదనమునకైనను పాఁచిపట్టిన పండ్లు అందవికారము నాపాదించును. అందవికారమును గొని తెచ్చుటయే కాను జీర్ణకోశమునకు సంబంధించిన అనేకరోగము లకు అవి ఆహ్వాసక ర్తలు కాగలవు. పిప్పిపండ్లు, పాఁచిపట్టిన పండ్లు ఆరోగ్యమును భంగించు నవి గావున దంతములను అతిశుభ్రముగ నుంచుకొనవల ముసు. మనము పడుకునుండి లేచినతోడనే దంతధావనముచేయుట అమళ్యూతాచారమై యున్నది. ఇది యెంతయు మంచి ఆచారము. పడుకొనబోవు పుడుకూడ పండ్లు తోముకొనుట అవశ్యము అవలంబింపవలసిన ఆచారము, ఏమందురా? మాటలాడుట, నవ్వుట, ఏదైన పదార్థములను తీసికొనుట మొదలగు పనులు చేయుచున్నంత కాలమును నోటినుండి 'సెలై వా' (నోటియందు ఊరెడు నీరు) ఊరుచు దంతశుద్ధికి కొంతవరకు తోడుపడుచుండును, మనము నిద్రించునపుడట్లుకాదు. 'సెలైవా' ఊరుట' తగ్గియుండును; గావున అప్పుడు పండ్లసందున యిఱుకుగొను పదార్థశికలములు పులిసి బాక్టీరియా రోగమునకు మార్గము ఏర్పఱచును. కావున పండుకోసపోవునపుడు పండ్లసందున ఎట్టి పదార్థము ఇఱుకుకొని ఉండకుండ ధారాళముగ నీటితో పుక్కిలించుట, దంతముల పాఁచి పూర్తిగ తొలగిపోవుటకు కుంచెవలె నమలిన దంతకాష్టముతో తోముట విధిగ చేయునాచారము అలవఱచుకొనవలయును. దంతముల కంటియుండు సున్నితమగు చర్మము సురిఁగిపోకుండులాగున వానిని తోముకొనునపుడు క్రిందనుండి పైకి తోయవలెను. ప్రక్కవాటున ఎన్నడును తోమినతరువాత కూడ పండ్లసందున ఇంక నేమైన చిక్కియున్నట్లుండెనేని ఒక చెంబుడు నీళ్లలో ఒక టీస్పూను (చెమ్చాడు) బై కార్బొనేటు ఆఫ్ సోదాను వైచి ఆ నీళ్లతో పుక్కిళించి ఉమియవలయును. ఈ విధుల సనుసరించుచో దంతములు తెలుపెక్కి తేటు దేజి ఆరోగ్యవర్ధకములగుటకు తోడు కొత్తలావణ్యమును కొనితేగలవు. మందహాసము చేసినపుడు వెలికి బాఱు దంతములు మర్బ మరబియ్యపుగింజలవలె ధవళధవళములై యుండుచో నదనవికాసము చేసి ఎంతటి అందమును గొనితెచ్చునో అనిర్వాచ్యముగదా !

చింతపండు పచ్చడి తయారీ ఇలా.. Tamarind Pickle (old telugu food)

చింతపండు పచ్చడిని తెలుగువారు కొందరు చిన్నమ్మ అని కందిపప్పు పచ్చడిని 'పెద్దమ్మ' అని వాడుటగలదు. ఏకూరలు దొరకనప్పుడు యీ రెండు పచ్చళ్లను చేసికొని అన్నమును భుజించెదరు. ఈపచ్చడిని చేయువిధమును నాకుతెలిసినది వ్రాయుచున్నాను.

కావలసిన చింతపండును తీసికొని, అందుండు యీనెలను విత్తులను తీసివైచి మెత్తగానూరి పెట్టుకొనవలయును. అటుపిమ్మట పొయ్యిమీద బాణలి పెట్టి నువ్వులనూనెను పోసి, కాగినపిమ్మట ఇంగువఫలుకులను నూనెలో వేసి పేలినపిమ్మట కావలసిన యెండుమిరపకాయలను నూనెలో వేసి, మిరపకాయలు ఎర్రరంగుగా మారువరకు వేయించ వలయును. పిమ్మట కొద్దిగా మెంతులు మెంతులకు మూఁడుభాగములు జీలకర్ణను బాణలిలో వేసి చిటపట వేగినపిమ్మట బాణలిని క్రిందికిదించి పెట్టవలయును. వేగిన మిరపకాయల వేడి ఆరకముందే బండమీదవేసి కావలసిన ఉప్పును వేసి నూరినపిమ్మట, చింతపండును వేసి, కలియనూరవలెను. కడపట వేగిన మెంతులను జీలకర్రను, ఇంగువను వేసి నూరి, తీసికొన వలయును. కొందరు కొద్దిగ బెల్లమునుకూడ చేర్చినూరుకో నెదరు.
మినుముల చింతపండు పచ్చడి.:
మినుముల చింతపండు పచ్చడికూడ ఆంధ్రులకు ప్రియమైనదే. ఈ పచ్చడిని మినపపప్పుతో చేయుట కంటె, ముడిమినుములతో తయారు చేసిననే దాని రుచి తెలియగలదు.

ప్రయాణములకు యాత్రకు బోవువారుయీ సంబారు చింతపండు పచ్చడిని అన్నంలోపొడిని యేమారరు.

దీనిని నీళ్లు లేక నూరిన ఒక మాసము వరకుకూడ నిలువయుండును. దీనిని మెత్తగ నూగకూడదు. " వక్కా ముక్కగా నూరిననే దానిరుచి' అని ఆంధ్రులనెదరు. మినపగింజ పంటికి తగులుచుండ వలయును. దీనిని యీ క్రిందివిధముగ తయారుచేయనగును.

చింతపండును తీసికొని దానిలో యీనెలు, తొక్కలు, విత్తులు వేరుపరచి, కావలసిన ఉప్పును వేసి మెత్తగా రోటిలో దంచవలయును. ఆ దంచినముద్దను వేరుగా "పెట్టుకొనవలయును

పిమ్మట పొయ్యిమీద బాణలిని పెట్టి నువ్వులనూనెను బాణలిలోపోసి యింగువముక్కలను కాల్చి తీసి పెట్టుకొనవలయును. పిమ్మట ఆకాగిన నూనెలోనే బాగుచేసిన ముడిమినుములను కావలసిన మట్టుకు వేసి కమ్మని వాసనరాగానే, యెండుమిరపకాయలను బాణలిలో వేసి వేయించి క్రింద పెట్టవలయును, మొదట వేయించిన మినుములను పక్కా ముక్కగదంచి, పిమ్మట మిరపకాయలు, ఉప్పు, యింగువనుకలిపి దంచ వలయును.

పిమ్మట చింతపండును దానిలోవేసి ముద్దగునట్లు దంచి వాడుకొనవలయును. దీనిలోకూడ కొద్దిగ బెల్లమును వేసి నూరవచ్చును.

గౌరీ ప్రార్థన Gaurī prārthana


మంగళమో గౌరీ 
మంగళమో దేవీ !

మంగళమయము నీ
 మహనీయ చరితము 
మదిలోన తలచెద
మము బ్రోవు గౌరీ || మంగళమో గౌరీ ||

శంశరి : భక్తవ శంకరి, 
దురితనా శంకరి! 
హరియించు సంకటములనూ. ||మంగళమో గౌరీ ||

మంగళకరుడైన 
మదన వేరికి నీవు 
మరులు కొల్పిన దేవి
మము దయ జూడుమా ||మంగళమో గౌరీ||

కమల దళేక్షణ 
విమలసద్గుణ చరిత
 కరుణించి గ్రహియించు
 కర్పూర హారతి  ||మంగళమో గౌరీ||

కామిత ఫలదాయి 
కల్యాణి సావిత్రి 
కామదహనుని రాణి 
కలుష సంహారిణి  ||మంగళమో గౌరీ||

పంకజలోచని ! 
పాప వినాశనిః 
భక్త రక్షణి ! 
ఇహ పరసౌఖ్య దాయిని  ||మంగళమో గౌరీ||

GENERAL KNOWLEDGE March 25- March 31

March 25- March 31

● India's Prime Minister Narendra Modi has topped the list of the world's most popular leaders by British magazine 'The Economist'.

*  The Francis Schottky Bridge in Baltimore, USA collapsed when a commercial ship collided with it.

* Israel- Hamas's war has wreaked havoc in the Gaza Strip of Palestine. The situation in Gaza has become deplorable with the deaths of civilians on one side and the cries of hunger on the other. 18 people lost their lives trying to grab food by airdrop.

* A Nellore breed cow called 19 FIV Mara Imovis sold for US$ 4.8 million at an auction in Brazil. It is Rs.40 crores in Indian currency.
* The Islamic country of Saudi Arabia has decided to participate in beauty pageants on an international stage for the first time in the country's history.  Rumi Alkahani, a 27- year- old beauty, has been selected for this.

* The most powerful solar storm has recently hit Earth. As a result of this storm, severe disruptions in the geomagnetic field have occurred, according to the US Meteorological Agency.

* Renowned mathematician of Indian origin Dr. TN Subramaniam (76) passed away in Michigan, USA. He is the founder of the 'Route One Company' which he started for the American automobile giant General Motors.

* Baloch militants attacked one of the naval airbases in  Balochistan province of Pakistan. Immediately alerted Pakistani armed forces launched a counter attack. Four terrorists were killed in these attacks. 

* Russian President Vladimir Putin said that the attack on the concert hall was carried out by Islamic terrorists.

• The former President of the Maldives, Ibrahim Sole, suggested that the president of the Maldives should give up his stubborn attitude and hold talks with India.

* Aviation giant Boeing has announced that Fly CEO Dave Calhoun will step down.

• Scientists from Weill Cornell Medicine and Cornell Engineering in America have created an ear replica that resembles the human ear.

* Government of India on investigation into the killing of Hardeep Singh Nijjar, a terrorist declared by India  Canadian Prime Minister Justin Trudeau said that he wants to work constructively.

• 42 soldiers and civilians were killed in airstrikes by the Israeli army and rebel groups near Aleppo, Syria.

The US District Court sentenced Sham Bankman Fred, the co- founder of the bankrupt crypto exchange company 'FTX', to 25 years in prison for defrauding customers and investors.

• Famous film director Christopher Nolan will be honored with Knightwood by the British government. It is known that Nolan's film Oppenheimer won the Oscars this year.

●It has been found that polar ice caps are melting due to global warming, which is causing fluctuations in the Earth's rotation speed. It is said that its effect is on the calculation of time. The study was done by researchers from the Scripps Institute of Oceanography at the University of California, San Diego Yanam's details were published in the journal Nature.

* Renowned cognitive psychologist and Nobel laureate Daniel Kahneman (90) has passed away. Deep research on the way humans make decisions has been recognized worldwide.

• The United Nations 'Food Waste Index' report states that 19 percent (in 2022) of food is wasted worldwide, while 78.3 crore people are caught in the grip of hunger. The United Nations is tracking the progress of developing countries with a goal of halving food waste by 2030.

• A team from Aston University in Birmingham has created internet speeds of 301 terabits per second (TBPS) (equivalent to 9000 H movies) using standard optical fiber. This is almost 45 lakh times faster than the average broadband internet speed.

NATIONAL: 

* The Bharat Ratna Awards ceremony was held at the Rashtrapati Bhavan in  Delhi.

• Center appoints Sadanand Vasant Date as Director General of National Investigation Agency. He is a 1990 batch Indian Police Service officer of Maharashtra cadre.

* The Association of Democratic Reforms has revealed the information regarding the 17th Lok Sabha which lasted for five years till 24th of 2019. During this period, the Lower House held a total of 15 meetings for 55 days

• According to the 'India Employment Report 2024' jointly prepared by the ILVO and the Institute for Human Development (IH), 83 percent of the total unemployed population in India will be youth in 2022. According to the report, the number of educated youth among the unemployed was 54.2 percent in 2000 and will increase to 65.7 percent in 2022. Among them, there are more women (76.7 percent) than men (62.2 percent).

• Delhi CM Kejriwal, who was arrested in the liquor case, is in ED custody. He is issuing government orders from jail. This was blamed by the Lt. Governor of the state, VK Saxena.

• India strongly condemned America's comments against Delhi CM Kejwal, who was arrested in the liquor policy case.

* Composed of oncologists for any cancer patients The team is free to doctor consultation 'Second Opinion' Helpline 9355520202.. started.

● President of Ramakrishna Mission, Ramakrishna Mutt, Swami Smaranananda (95) passed away.

● Environmental activist Sonam Wanguk has called off her 21- day hunger strike to protect tribal rights in Ladakh state.

• Association for Democratic Reforms (ADR), an NGO, revealed that 225 or 44 percent of sitting Lok Sabha MPs have criminal cases against them.

| The University Grants Commission (UGC) has decided to provide admissions on the basis of National Eligibility Test (NET) score without the need to conduct separate examinations for PHA admissions. All universities have been advised to implement this from 2024-25 onwards.

* At present, the scarcity of sand and the spread of carbon dioxide have become a problem for the environment. To overcome this, carbon dioxide is mixed with soil and construction waste to create a new material, according to the Center for Sustainable Technologies of IIS. This material they have developed reduces the use of cement by 30 percent and sand by 50 percent.

● Smartphones and computers in India, which have been working on the basis of network time protocol of America, will now work through our own system. For this ISRO has developed 'Rubidium Atomic Clock'. Cesium atoms are used in atomic clocks that are widely used around the world. Rubidium atoms were used in this clock.

* The Insurance Regulatory and Development Authority of India (IRDAI) has decided to digitize the insurance policies taken by everyone from now on. As a result, all the policies issued by the insurance companies to their policy holders have to be provided in 'e- insurance' mode.

● Foreign Exchange (Forex) Reserves For the week ended March 22, RBI said forex reserves rose to $642.63 billion.

● Defense Minister Rajnath Singh has said that the government is ready to make changes if necessary in the 'Agniveer' scheme for recruitment in the armed forces.

* Microsoft has appointed Pawan Davuluri, an Indian- origin IIT Madras alumnus, to head its Windows and Surface divisions.

State: 

* AIG Chairman Dr D Nageshwar Reddy said that a diabetic research center has been set up in their organization in Hyderabad.

* Prabhavati, Chief Scientist at the Indian Institute of Chemical Technology, who researches cooking oils and healthy fats, received the award.

* The Bharat Ratna Awards ceremony was held at Rashtrapati Bhavan in Delhi. on behalf of PV Narasimha Rao His son Prabhakar Rao Received the award through the hands of President Draupadi Murmu.


• Justin Sujay Paul sworn in as High Court judge. High Court Chief Justice Justice Alok Aradhe administered the oath to him.

* Popular film actor and former minister Babu Mohan has been appointed as the President of Prajashanthi Party Telangana.

* The Central Election Commission has taken a key decision on volunteers in AP. Due to a series of lawsuits, the High Court has imposed restrictions on the services of volunteers. It has issued instructions not to conduct any money distribution programs related to welfare schemes with the volunteers and made it clear that the volunteers' mobile phones, tablets and supplies should be handed over to the DEOs.

The Indian star player in tennis 
Miami Open final.   Rohan Bopanna, a teammate of Australia. Matthew Elden won the men's doubles final 6-7 (7-3), 6-3, 10-6 against Ivan Dodig (Croatia) and Austin Krycek (USA). With this victory, Bopanna created history as the player who won the 'ATP Masters 1000' title at the age of 44. Women's Singles Finals Collins won the women's title by defeating Rybakina 7-5, 6-3.

• Sri Lanka will host the Women's Asia Cup (T20) from July 19 to 28 this year. 8 countries will participate in this tournament.

Immadi Sanvi, who hails from Hyderabad, has made it to the US women's national cricket team.

• Pakistan's star player Babar Azam has been selected as the ODI and T20 captain.

India's young Grandmaster Uppala Praneeth won the title in the Fejerness Slow Blitz Chess Tournament held at Fly Spain.

● In the 17th season of the Indian Premier League, Sunrisers Hyderabad scored a record score of 277 for the loss of 3 wickets in the history of IPL.

• India's star player Virat Kohli, who set a record with 50 centuries in ODIs, recently scored a hundred fifties in T20Is.


దుర్గా పంచరత్నం అద్భుతమైన శ్లోకం

దుర్గా పంచరత్నం దుర్గాదేవిని స్తుతిస్తూ చేసిన మహాద్భుతమైన స్తోత్రం. దీన్ని మనకు అందించినది పరమాచార్య స్వామి వారు. ఆ స్తోత్రం ఎలా వచ్చిందో దానికి సంబంధించిన కథను చూద్దాం. అది తేనంబాక్కంలో మహాస్వామి వారు మకాం చేస్తున్న కాలం. అప్పుడు మధ్యాహ్నం 2 గంటల సమయం. మహాస్వామి వారు ఒక కాలును నీటిలో ఉంచి చెరువు గట్టు పైన కూర్చుని ఉన్నారు. మహాస్వామి వారు చప్పట్లు చరచి నన్ను రమ్మని ఆజ్ఞాపించారు. ఒక కాగితం కలం తీసుకుని తన ప్రక్కన కూర్చో అని సైగ చేసి చెప్పారు. నేను వాటిని తీసుకుని వచ్చి వారి వద్ద కూర్చున్నాను. మహాస్వామి వారు ఒక్కొక్కటిగా సంస్కృత పదాలను చెప్పడం ప్రారంభించారు. ఒక్కొక్క సందర్భంలో ఒక భావాన్ని చెప్పి దానికి సరియగు సంస్కృత పదం చెప్పమనేవారు.

అలా అన్ని పదములు జతకూడిన తరువాత ఒక మహత్తరమైన స్తోత్రం వచ్చింది. అదే దుర్గా పంచరత్నం (శ్వేతాశ్వర ఉపనిషత్ సారము). ప్రతి శ్లోకము యొక్క చివరి పాదము “మాం పాహి సర్వేశ్వరీ మోక్షధాత్రి ” అనే మకుటంతో ముగుస్తుంది. (ఈ శ్లోకాన్ని మనం కామాక్షి ఆలయ ముఖద్వారానికి ఎడమ ప్రక్కన ఉన్న గోడపై పాలరాతి శిలపైన చెక్కి ఉండటం గమనించవచ్చు)

మహాస్వామి వారు ఈ స్తోత్రం చేస్తూ మధ్యలో “నీవే భగవద్గీతను బోధించిన దానివి” అని వచ్చింది. ఒక్క క్షణం ఇటుతిరిగి అలోచిస్తున్న నా వైపు చూసి, మహాస్వామి వారు “కామాక్షి గీతోపదేశం చేసింది అనునది నీకు ఎందుకు తప్పు అని అనిపిస్తోంది” అని అడిగారు. నేను చిన్నగా నవ్వి మౌనం వహించాను.

వెంటనే వారు గీతాభాష్యం పుస్తకం తీసుకురమ్మని చేతులతో సైగ చేసి ఆదేశించారు. వెనువెంటనే 8 సంపుటముల గీతాభాష్యం స్వామి వారి వద్దకు వచ్చి చేరింది. వారు ఒక పుస్తకమును తీసుకుని దాన్ని తెరిచి అక్కడ తెరవబడి ఉన్న పుటములో ఒక శ్లోకమును దాని భాష్యమును చదవమన్నారు.

ఆ శ్లోకం ఇదే “బ్రహ్మణోహి ప్రతిష్ఠాహమ్”

“మార్పులేని శాశ్వతమైన బ్రహ్మానికి, శక్తి రూపమైన మాయ ప్రతిష్ఠ. అది నేను. నేను బ్రహ్మాన్ని మరియు దాని ప్రతిష్ఠను అనునది సరియగును. ఎందుకంటే దానికి భాష్యం “శక్తి శక్తిమతోః అభేదత్” అని ఉంది. శక్తి మరియు ఆ శక్తి కలిగిన వారు వేరు వేరు తత్వము కాదు. శక్తికి ఆ శక్తి ఉన్నవాడికి అభేదము.”

ఈ సంఘటన ఆ స్తోత్రం యొక్క విశిష్టతని తెలియజేస్తుంది.

దుర్గా పంచరత్న స్తోత్రం
తే ధ్యాన యోగానుగతాపస్యన్
త్వామేవ దేవీం స్వగునైర్నిగూడాం
త్వమేవ శక్తిహి పరమేశ్వరస్య
మాం పాహి సర్వేశ్వరీ మోక్షధాత్రి . 1

ఓ సర్వాధిష్ఠానేశ్వరీ! ఓ మోక్షప్రదాత్రీ! నిరంతరము ధ్యానయోగమునందు మునులు యోగులు మున్నగువారు సత్వరజస్తమో గుణములచే వ్యక్తముకాకుండగానున్న సకలదేవతాస్వరూపిణియగు నిన్నే చూచుచున్నారు. ఆ పరమేశ్వరునియొక్క శక్తివి కూడా నీవే. నన్ను రక్షించు.

దేవాత్మ శక్తీహీ శ్రుతివాక్య గీత
మహర్షిలోకస్య పుర: ప్రసన్న
గుహపరం వ్యోమ సద ప్రతిష్ఠ
మాం పాహి సర్వేశ్వరీ మోక్షధాత్రి . 2

ఓ సర్వేశ్వరీ! మోక్షధాత్రి ! నీవు దివ్యమగు ఆత్మశక్తిని, వేదవాక్యములచే గానముచేయబడితివి. మహర్షిలోకమును ముందుగా అనుగ్రహించితివి. అత్యంతనిగూఢమగు నివాసము నీది. సత్పదార్థమునకు అధిష్ఠానము నీవు. నన్ను రక్షించు.

పరాస్యశక్తిహీ వివిధైవ శ్రూవ్యసే
శ్వేతాశ్వ వాక్యోదిత దేవీ దుర్గే
స్వాభావికీ జ్ఞాన బలక్రియార్తే
మాం పాహి సర్వేశ్వరీ మోక్షధాత్రి . 3

ఓ దుర్గా! శ్వేతాశ్వతరోపనిషద్వాక్యములచే చెప్పబడిన దివ్యరూపిణీ, నీవు పరాశక్తివి. అయినను అనేకులచే అనేకవిధములుగా చెప్పబడగా వివిధరూపములుగా వినబడుచునావు. నీయొక్క జ్ఞాన, బల సంబంధమగు క్రియారూపములోని శక్తి నీకు స్వాభావికమైనది. సర్వేశ్వరీ! మోక్షప్రధాత్రి ! నన్ను రక్షించు.

దేవాత్మ శబ్దేన శివాత్మ భూత
యత్కూర్మ వాయవ్య వచో వివృత్య
త్వంపాశ విఛ్చేద కరి ప్రసిద్ద్హ
మాం పాహి సర్వేశ్వరీ మోక్షధాత్రి . 4

దేవాత్మశబ్దముచే చెప్పబడు నీవు, కూర్మ వాయుపురాణముల వాక్యవివరణచే శివాత్మురాలివైతివి. నీవు ఈ భవపాశములను ఛేదింపగలిగినదానిగా ప్రసిధ్ధురాలవు. ఓ సర్వేశ్వరీ! మోక్షప్రధాత్రి ! నన్ను రక్షించు

త్వం బ్రహ్మ పుచ్చా వివిధా మయూరీ
బ్రహ్మ ప్రతిష్ఠాసి ఉపతిష్ట గీత
జ్ఞాన స్వరుపాత్మదయఖిలానాం
మాం పాహి సర్వేశ్వరీ మోక్షధాత్రి . 5

అమ్మా, నీవు బ్రహ్మమే పుచ్చముగాగల వివిధరూపములనుండు మయూరివి బ్రహ్మమునకు అధిష్టానమైనదానివి. అనేక గీతలను ఉపదేశించిన దానవు. అందరిలోనుండు జ్ఞాన స్వరూపము నీవే. అందరిలోని దయాస్వరూపము నీవే. ఓ సర్వేశ్వరీ! మోక్షప్రధాత్రి ! నన్ను రక్షించు

కంచి కామకోటి పీఠాధిపతులు జగద్గురు శంకరాచార్య శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి విరచితం. ప్రతిరోజు దీన్ని చదివిన వారికి మోక్షం తథ్యం.

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।

శీతలా అష్టమి

హోళీ తర్వాత వచ్చే సప్తమి, అష్టమి తిధులను శీతలా సప్తమి, శీతలా అష్టమి గా వ్యవహారిస్తారు.

శీతల అష్టమిని *'బసోడా పూజ'* అని కూడా పిలుస్తారు. నేడు శీతలా దేవి వ్రతం ఆచరించటం ద్వారా అనేక వ్యాధుల నుండి విముక్తులు అవుతారు అని నమ్ముతారు.

శీతలా మాతా గాడిదపై ఆశీనురాలై, ఒక చేతితో చీపురు, ఇంకో చేతిలో కుండ పట్టుకొని దర్శనం ఇస్తుంది.

శీతలా అష్టమి వేడుకలు ఉత్తర భారత రాష్ట్రాలైన రాజస్థాన్, గుజరాత్ మరియు ఉత్తర ప్రదేశ్లలో భక్తులు ఎంతో ఉత్సాహంతో, భక్తితో జరుపుకుంటారు.

ఈ సందర్భంగా భారీ ఉత్సవం నిర్వహించబడుతుంది మరియు అనేక సంగీత కార్యక్రమాలు కూడా జరుపుకుంటారు.

శీతలా అష్టమి నాడు సాంప్రదాయాల ప్రకారం కుటుంబాలు వంట కోసం అగ్నిని వెలిగించరు, అందువల్ల వారు ఒక రోజు ముందుగానే ఆహారాన్ని తయారుచేస్తారు.

ముందు రోజు వండిన ఆహారాన్ని మాత్రమే శీతలా దేవికి నివేదించే ప్రత్యేకమైన ఆచారం ఉంది.

భక్తులు ఉదయాన్నే లేచి, సూర్యోదయానికి ముందు స్నానం చేస్తారు.
వారు శీతలా దేవి ఆలయాన్ని సందర్శించి, దేవతను 'హల్ది', 'బజ్రా' తో పూజిస్తారు.

అనంతరం వారు *'బసోద వ్రత కథ'* వింటారు.
'రాబ్రీ', 'పెరుగు' మరియు ఇతర ముఖ్యమైన నైవేద్యాలను శీతలా దేవికి సమర్పిస్తారు.

వారి పెద్దల ఆశీర్వాదం తీసుకుంటారు.
సిద్ధం చేసిన ఆహారాన్ని శీతలా దేవీ కి నివేదిస్తారు.
దీనిని వారు 'బసోడా' అని పిలుస్తారు.
అర్పించిన ఆహారాన్ని స్వీకరిస్తారు మరియు ఇతర భక్తులకు కూడా పంచుతారు.

ఈ రోజున 'శీతలాష్టకం' చదవడం చాలా శుభంగా , మంగళకరంగా భావిస్తారు...

*_శ్రీ శీతలా దేవి అష్టకం_*

అస్యశ్రీ శీతలాస్తోత్రస్య మహాదేవ ఋషిః
అనుష్టుప్ ఛన్దః శీతలా దేవలా దేవతా లక్ష్మీర్బీజం – భవానీశక్తిః సర్వ విస్ఫోటక నివృత్తయే జపే వినియోగః

*ఈశ్వర ఉవాచ:*

వన్దేహం శీతలాం దేవీం రాసభస్థాం దిగమ్బరామ్|
మార్జనీకలశోపేతాం శూర్పాలంకృత మస్తకామ్||

వన్దేహం శీతలాం దేవీం సర్వరోగ భయాపహామ్|
యామాసాద్య నివర్తేత విస్ఫోటక భయం మహత్||

శీతలే శీతలే చేతి యో బ్రూయాద్దాహ పీడితః|
విస్ఫోటక భయం ఘోరం క్షిప్రం తస్య ప్రణశ్యతి||

యస్త్వా ముదకమధ్యేతు ధృత్వా పూజయతే నరః|
విస్ఫోటకం భయం ఘోరం గృహే తస్య న జాయతే||

శీతలే జ్వర దగ్ధస్య పూతిగంధయుతస్యచ|
ప్రనష్టచక్షుషః పుంస్ః త్వామాహుర్జీవనౌషధమ్||

శీతలే తనుజాన్రోగాన్ నృణాం హరసి దుస్త్యజాన్|
విస్ఫోటక విదీర్ణానాం త్వమేకామృతవర్షిణీ||

గలగండగ్రహా రోగా యే చాన్యే దారుణా నృణామ్|
త్వదనుధ్యాన మాత్రేణ శీతలే యాన్తి సంక్షయమ్||

నమన్త్రోనౌషధం తస్య పాపరోగస్య విద్యతే|
త్వామేకాం శీతలే ధాత్రీం నాన్యాం పశ్యామి దేవతామ్||

మృణాల తంతు సదృశీం నాభి హృన్మధ్య సంశ్రితామ్|
యస్త్వాం సంచిత యేద్దేవి తస్య మృత్యుర్నజాయతే||

అష్టకం శీతలాదేవ్యా యోనరః ప్రపఠేత్సదా|
విస్ఫోటక భయం ఘోరం గృహేతస్య నజాయతే||

శ్రోతవ్యం పఠితవ్యం చ శ్రద్ధాభక్తి సమన్వితైః|
ఉపసర్గ వినాశాయ పరం స్వస్త్యయనం మహత్||

శీతలే త్వం జగన్మాతా శీతలే త్వం జగత్పితా|
శీతలే త్వం జగద్ధాత్రీ శీతలాయై నమోనమః||

రాసభో గర్దభశ్చైవ ఖరో వైశాఖనందనః|
శీతలా వాహనశ్చైవ దూర్వాకంద నికృంతనః||

ఏతాని ఖరనామాని శీతలాగ్రేతు యఃపఠేత్|
తస్యగేహే శిశూనాం చ శీతలా రుజ్ఞజాయతే||

శీతలాష్టక మేవేదం నదేయం యస్యకస్యచిత్|
దాతవ్యం చ సదా తస్మై శ్రద్ధా భక్తియుతాయవై||

ఇతి శ్రీస్కన్దపురాణే శీతలాష్టకం సంపూర్ణం

 శ్రీ మాత్రే నమః 

Tuesday, April 2, 2024

Here are some of the best Indian summer foods to beat the heat

* Aam Panna: This is a delicious and refreshing drink made from raw mangoes, spices, and sugar. It is a great way to stay hydrated and cool down on a hot day.
* Lassi: This is a yogurt-based drink that is often flavored with fruits, nuts, or spices. It is a refreshing and healthy drink that is perfect for summer.
* Chaas: This is a salty yogurt drink that is often flavored with mint and cumin. It is a refreshing and hydrating drink that is perfect for summer.
* Sattu: This is a roasted gram flour that is often mixed with water, spices, and vegetables. It is a healthy and filling snack that is perfect for summer.
* Fruit Chaat: This is a delicious and refreshing snack made from fruits, nuts, and spices. It is a great way to get your daily dose of fruits and vegetables, and it is also a great way to stay hydrated and cool down on a hot day.

* Kulfi: This is a traditional Indian ice cream that is made from milk, cream, and sugar. It is a delicious and refreshing treat that is perfect for summer.
* Falooda: This is a delicious and refreshing drink made from milk, ice cream, vermicelli, and fruits. It is a great way to stay hydrated and cool down on a hot day.
* Jalebi: This is a sweet and crispy Indian snack that is made from deep-fried batter. It is a delicious and satisfying treat that is perfect for summer.
* Gulaab Jamun: This is a sweet and juicy Indian dessert that is made from milk, rose water, and sugar. It is a delicious and satisfying treat that is perfect for summer.
* Rasgulla: This is a sweet and spongy Indian dessert that is made from milk, sugar, and cardamom. It is a delicious and satisfying treat that is perfect for summer.
* Iced Tea: This is a refreshing and delicious drink that is made from tea, sugar, and ice. It is a great way to stay hydrated and cool down on a hot day.
* Lemonade: This is a refreshing and delicious drink that is made from lemon juice, sugar, and water. It is a great way to stay hydrated and cool down on a hot day.
* Fruit Juice: This is a refreshing and delicious drink that is made from fruits. It is a great way to get your daily dose of fruits and vegetables, and it is also a great way to stay hydrated and cool down on a hot day.

"వైకుంఠపాళి" - కొంచెం పెద్దదే, కానీ "చదివితే జీవితం తెలుస్తుంది."

తెలుగు తోటలో పండిన విక్రమకేళి - వైకుంఠపాళి

కేవలం నాలుగు గవ్వలతో మూడో నాలుగో చింత పిక్కలతో (ఆడేవాళ్ళ సంఖ్యను బట్టి) జీవితాన్ని ఆస్వాదించగలిగే, అనుభవించగలిగే, ఎదిరించగలిగే ధైర్యాన్ని, స్థైర్యాన్ని ఇచ్చే ఈ ఆట తెలుగు వారి సృష్టి. తెలుగు సంస్కృతిలో పుత్రకామేష్టి.

ఇందులో 11 వరుసలుంటాయి. ఒక్కో వరుసలో 11 గడులుంటాయి. మొత్తం 121 గడులు పూర్తయ్యాక 11 గడులలో ‘పరమపదసోపానపటము’ అక్షరాలు రాసి ఉంటాయి. ఆ పైన “ధరసింహాసనమైనభంబు గొడుగై తద్దేవత భృతులై...సిరిభార్యామణియై” అన్నట్లుగా పదిమంది దివ్య పురుషుల మధ్యలో శ్రీ మహావిష్ణువు కొలువై ఉంటాడు. చివరకు చేరుకోవల్సిన స్థానం అది. అక్కడకు చేరుకొనే వరకు (జీవితమనే) ఆట ఆడుతూ ఉండవలసిందే. ఈలోగా ఒకటి నుంచి 121 వరకు ఎక్కుతూ దిగుతూనే ఉండాలి. పడుతూ లేస్తూనే ఉండాలి. అంటే పరమపదాన్ని చేరుకునే వరకు ఈ జనన మరణ సంసార చక్రంలో పడుతూ లేస్తూ ఉండటం తప్పదని హెచ్చరిక.

పదకొండు అంటే సంస్కృతంలో ఏకాదశి. ఏకాదశీవ్రతం భారతీయులందరికీ ఆచరణీయం. ఏకాదశి మహా పర్వదినం. ఆ రోజు ఉపవాసం, జాగరణ, దైవస్మరణం అనే మూడూ తప్పని సరి. అలా 11 ఏళ్ళు వరుసగా ఏకాదశీ వ్రతం చేస్తే పరమపదం చేరుకోవచ్చనేది పురాణ కథనం. అయితే ఇదంతా ఆధ్యాత్మికం.

గెలుపోటములు మానసికానుభూతులు. పరమపదం చేరుకోవడం ఆధ్యాత్మిక పరమార్ధం. ఇదొక రకంగా అరచేతిలో వైకుంఠం. ఇందులో గొప్ప వ్యక్తిత్వ వికాస సూత్రాలున్నాయి. నీ ఉన్నతి నీ చేతిలోనే ఉందని చెప్పడం. గవ్వలతో గెలవగలవని జీవితం కోసం ‘రవ్వ’ పెట్టుకోవద్దని ఉపదేశం.

ఇందులో చాలా గళ్ళలో ఏదో ఒక బొమ్మ, దానికో పేరు ఖచ్చితంగా ఉంటాయి. కొన్ని గళ్ళు అడ్డంగా దాటేస్తూ నిచ్చెనలు ఊరిస్తాయి. కొన్ని గళ్ళు అమాంతం దించేస్తూ ఉంటాయి. అంతలో ఉత్సాహం అంతలోనే నిరుత్సాహం. అంతిమంగా ద్వంద్వాతీతమైన పరమశాంతి. ఇదీ ఆట నడిచేతీరు.

ఈ ఆటలో పాములు, నిచ్చెనల గడుల్లోని పేర్లను నిశితంగా పరిశీలిస్తే అద్భుత రహస్యాలు కనిపిస్తాయి. ఉదాహరణకు 75వ గడిలో ఒక పాము తల దగ్గర కర్కోటకుడు అని రాసి ఉంటుంది. దాని తోక 10వ గడిలోకి పాకుతుంది. అక్కడ పంది బొమ్మ ఉంటుంది. పాము కరవడం వల్ల కిందికి రావడం అనేది పైకి కనిపించే విషయం. జీవితంలో కర్కోటకంగా వ్యవహరిస్తే వచ్చే జన్మలో పందైపుడతావనేది ఆధ్యాత్మిక హెచ్చరిక. పందిలా హీనంగా చూస్తారనేది వ్యక్తిత్వ పాఠం.

అలాగే 55వ గడిలో ఒక పాము తల ఉండి దుర్యోధనుడు అని రాసి ఉంటుంది. దాని తోక 12 వ గడిలోకి పాకుతుంది. 43 గడులు కిందికి జారిపోవడం పైకి కనిపించే ఓటమి. దుర్యోధనుడు అసూయకు ప్రతిరూపం. దాని వల్లే కురు వంశ క్షయం. అలానే... మనమూ అసూయపడితే జీవితం నరకప్రాయమవుతుందని, సుఖ శాంతులు నశిస్తాయని హెచ్చరిక.

పాముల అమరిక ఇంత అర్ధవంతంగా ఉంటే నిచ్చెనల ఏర్పాటు మరింత పరమార్ధ బోధకంగా ఉంటుంది. 63వ గడిలో ఒక నిచ్చెన అడుగు భాగం ఉంటుంది. అక్కడ భక్తి అని రాసి ఉంటుంది. ఒక భక్తుని బొమ్మ ఉంటుంది. దాని కొస 83వ గడి వరకూ సాగుతుంది. అక్కడ బ్రహ్మలోకం అని రాసి ఉంటుంది. బ్రహ్మదేవుని చిత్రం ఉంటుంది. భక్తిగా ఉండటమే బ్రహ్మలోకానికి చేరే ఉపాయమన్నది పరమైతే..ఏ పనైనా దాని మీద భక్తితో చేస్తేనే మంచి ఫలితాలొస్తాయన్నది ఇహం.

అలాగే 65వ గడిలో ఒక నిచ్చెన మొదలు ఉంటుంది. అక్కడ చిత్తశుద్ధి అని ఉంటుంది. దాని కొస 105వ గడిలో ఉంటుంది. అక్కడ మహాలోకం అని ఉంటుంది. మొత్తం వైకుంఠపాళిలో ఇదే పెద్ద నిచ్చెన. 40 గడులు అమాంతం ఎగబాకవచ్చు. ఇదంతా పైకి ఆశ పెట్టే విధానం. చిత్తశుద్ధి ఉంటే మహాలోకాలు నీకోసం ఎదురుచూస్తూ ఉంటాయని అంతరార్ధం. లోకంలో మహానుభావుడిగా కీర్తిపొందుతారని విశేషార్ధం. ఏ చిత్తశుద్ధి కొరవడటం వల్ల ఇవాళ దేశం అవినీతి ఊబిలో కూరుకుపోయిందో అటువంటి చిత్తశుద్ధి ప్రాధాన్యాన్ని చిన్నతనంలోనే పిల్లలకు ఆటల రూపంలో నేర్పిన ఏకైక జాతి మన తెలుగుజాతి.

ఇంత గొప్ప విషయాన్ని చెబుతూనే చెంతనే పొంచి ఉన్న ముప్పును గుర్తించి జాగ్రత్త పడమనడం ఈ ఆట ప్రత్యేకత. సాధారణంగా 105వ గడి వరకు రాగానే ఆటగాడికి కొంచెం గర్వం వస్తుంది. ఇంక 16 గడులు దాటితే పండిపోయినట్లే కదా అనుకుంటాడు. అక్కడే ఎదురవుతుంది పెద్ద ప్రమాదం. 106వ గడిలో అరుకాషుడు అనే అతి పెద్ద సర్పం ఉంటుంది. దాని నోట్లో పడితే అమాంతం కిందికి జారి మొదటి గడిలోకి అంటే కోతి లోకి వచ్చి పడతాడు. అంటే ప్రముఖుణ్ణి (సెలబ్రిటీ) అయ్యాను కదా అని గర్వించి ఒక్క పొరపాటు (ఒకటి వెయ్యడం)చేసినా మళ్ళీ ఆట మొదటికి రావడం ఖాయం అని హెచ్చరించడం అన్నమాట. పైగా వైకుంఠపాళి పరిభాషలో ఒకటిని గుడ్డి అంటారు. అంటే ఎంత పెద్ద స్థానంలో ఉన్నా గర్వించి ఒక్క గుడ్డి పనిచేసినా మళ్ళీ కిందకి జారిపోవడం తప్పదని చెప్పడం.

ఇంత జరిగినా ఆట మానకూడని పరిస్థితి ఇందులో విచిత్రమైన విషయం. ఒకడు పెద్దపాము నోట్లో పడినా ఇంకొకడు ఇంకా పడలేదు కాబట్టి అతను ఇతన్ని ఆడమని ప్రోత్సహిస్తాడు. ప్రత్యర్ధిని సైతం బాగా ఆడమని ప్రోత్సహించే ఏకైక క్రీడ బహుశా వైకుంఠపాళీయే నేమో!

ఇంతకీ చివిరిదైనా చిన్నది కాని విషయం మరొకటుంది.

GK TODAY. 31/03/2024

1. Which Union Minister has inaugurated the special CCMS of NIA?

Ans:- Amit Shah


2. India and which country have signed the Law and Dispute Agreement?

Ans:- Singapore

3. Who has flagged off the new Vande Bharat Express in Jharkhand state?

Ans:- Narendra Modi

4. How many million loan agreement has been signed by the Government of India and ADB to strengthen the Fintech ecosystem?

Ans:- 23 million dollars.

5. Who has become the new Chief Information Commissioner of Uttar Pradesh?

Ans:- DGP Rajkumar Vishwakarma.

6. Who has been appointed as Director (Project) of NHPC Limited?

Ans:- Shri Sanjay Kumar Singh.

7. Who has been appointed as the new Chairman and Managing Director of NCL?

Ans:- B Sairam.

8. Which team has won the Women's Premier League 2024 title?

Ans:- Royal Challengers Bangalore.

9. For which country will the Indian government buy 1650 tonnes of onion from traders?

Ans:- Bangladesh.

10. Majuli mask of which state has been given GI tag?

Ans:- Assam‌‌

Sunday, March 31, 2024

అష్ట మంగళ చిహ్నాలు..!!

శ్రీ వైష్ణవ సంప్రదాయం లో  యజ్ఞ యాగాదుల  సమయంలో అష్ట మంగళ చిహ్నాలకి, మహాకుంభాభిషేకానికి  ఎంతో ప్రాధాన్యత వుంది.

మహా కుంభానికి చుట్టూ యీ అష్టమంగళ చిహ్నాలను అమరుస్తారు. ఈ అష్ట మంగళ శక్తులు మహా కుంభానికి చేరి , పరమాత్మ లో లీనమౌతాయి. ఇప్పుడు అష్ట మంగళ చిహ్నాలని  వేటిని అంటారో చూద్దాము..

1. శ్రీ వత్సము..

శ్రీ హరి వక్షస్ధలం మీద లక్ష్మీ దేవి నివసించే ప్రదేశము.  లక్ష్మీ దేవికి జన్మస్థలం పాలకడలి.

దేవదానవులు పాలకడలిని చిలికినప్పుడు ఐరావతమనే ఏనుగు, ఉఛ్ఛైశ్వర్యమనే అశ్వము , కామధేనువు అనే గోమాత తో పాటు ఉద్భవించింది శ్రీ మహా లక్ష్మీ దేవి. శ్రీ మన్నారాయణుని పతిగా పొందిన సౌభాగ్య వతి.

ఆయన వక్షస్ధలమునే  నివాసస్ధానము చేసుకొన్న ది. శ్రీ మన్నారాయణుని  ఎన్నటికీ విడివడని హృదయ నివాసిని యైనది. ఆ నివాస స్ధలమునే  శ్రీ వత్సము అని అంటారు.


2.పూర్ణ కుంభము....

బంగారము, వెండి, రాగి  వస్తువులను బిందెలో వేసి ,నీటి తో నింపి బిందె బైట వైపు దారంతో  చుట్టి దాని మీద పసుపు కుంకుమ ,చందనములతో  అలంకరించి,

పట్టు వస్త్రము చుట్టి బిందె లోపల కుడివైపు మామిడి  కొమ్మలు పెట్టి  , దానిలో కొబ్బరికాయ పెట్టి అలంకరించినదే పూర్ణకుంభము.

లక్ష్మీ దేవి అంశగాను, మంగళప్రదమై శక్తి చిహ్నంగా భావింపబడుతోంది. 

ఎవరైనా ప్రముఖులు, ఉన్నతాధికారులు, అన్ని రంగాల లో వున్నతమైన వారికి స్వాగతం చెప్పే సమయంలో  పూర్ణకుంభంతో ఆహ్వానిస్తారు.

3.భేరీ...

భేరీ , నాదం వలన  దుష్ట శక్తులు దరి చేరవు. 
భగవంతుని పూజా సమయంలో, హారతి సమయంలో పెద్ద ధ్వనితో , భేరీ మ్రోగిస్తారు.  భేరీ ధ్వనులతో అమంగళం అప్రతిహతమౌతుంది. 


4. దర్పణ మండము....
దర్పణం అంటే పెద్ద అద్దం. శ్రీ మహావిష్ణువు సన్నిధిలో ఎదురు గా పెడతారు.  అద్దంలో శ్రీ హరి ప్రతి బింబం కనపడుతుంది.  ఆలయ సన్నిధిలో పెట్టిన అద్దంలో , శ్రీ మహావిష్ణువు తన అందం చూసుకొని మురిసేందుకు పెడతారు. అన్నీ తానే అనే  తత్వం తెలపడానికి యీ దర్పణం...

5. రెండు మీనాలు....
ఒకదాని కొకటి సమంగా జోడిగా ఒకదానిని ఒకటి చూచుకొనే విధంగా అమర్చిన మీనాలు.  మీనాలు రెండూ జీవాత్మ పరమాత్మ . మీనాలు నీళ్ళల్లో మాత్రమే నివసిస్తాయి.  తీరానికి వస్తే జీవం కోల్పోతాయి.

చేపలు నీటిని విడచి బయటకు రావు. అలాగే జీవాత్మ పరమాత్మ ల ఐక్యత తెలుపుతుంది. 
మనం భగవంతుని ప్రార్ధించేటప్పుడు, మనజీవాత్మ పరమాత్మ తో ఏకమై ప్రార్ధించాలి.

6 . శంఖం...

శంఖం తెల్లగా,స్వఛ్ఛమైనది.  పవిత్ర మైన ఓంకార నాదాన్ని కలిగిస్తుంది. 
శ్రీ మన్నారాయణుడు ఎప్పుడూ శంఖు చక్రాలను ధరించి వుంటాడు.  శంఖాలు రెండు రకాలు. దక్షిణావర్త శంఖం యిది మంగళకరమైనది. పాలకడలి లో శ్రీ మహాలక్ష్మి తో పాటు పుట్టినదే.  యీ వలంపురి శంఖం శ్రీ మహావిష్ణువు ఎడమ చేతిలో వుంటుంది.  వలంపురీ శంఖం నుండి
ఓంకారనాదం సహజంగానే ధ్వనిస్తుంది.

7. శ్రీ చక్రం....

వలయాకారంలో సులభంగా చుట్టేది చక్రం.  కాలాన్ని కాల చక్రం అంటారు. సూర్య భగవానుడు కాలాన్ని నడిపిస్తాడని అంటారు. 
చక్రత్తాళ్వారు శ్రీ  చక్రం యొక్క అంశ.  శ్రీ మన్నారాయణుని ప్రధాన ఆయుధంగా చెప్పబడుతుంది. శ్రీ మన్నారాయణుడు ఎప్పుడూ చక్రమును చేతిలో ధరించి వుంటాడు.

8. గరుత్మంతుడు.....

కశ్యపముని వినతల పుత్రుడు.  ఆయనను "గరుడాళ్వార్"అని "పెరియ తిరువడి" అని పిలుస్తారు. శ్రీ మహావిష్ణువు యొక్క వాహనం.  బ్రహ్మోత్సవాల  సమయంలో  గరుడోత్సవం ఘనంగా జరుపుతారు.
గరుత్మంతుడు మహాబలశాలి ,ధైర్యశాలి.
దానవులతో యుధ్ధం చేసి,అమృత కలశమును భద్రముగా తీసుకుని వచ్చినవాడు.
నిరంతరం వైకుంఠం లో శ్రీ మహావిష్ణువు సన్నిధి భాగ్యము పొందిన వాడు గరుత్మంతుడు.

ఈ పక్షీంద్రుడు వేదస్వరూపుడు,కాంతిమంతుడు. నాగులను ఆభరణములుగా ధరించిన వాడు. వైకుంఠం లో భగవంతుని కి అద్దంగా నిలబడినట్లు చెప్తారు. శ్రీ మహావిష్ణువు ఆలయమునుండి ఊరేగింపు కి బయలుదేరుటకు ముందు అద్దాల సేవ జరుగుతుంది.

సర్వాంతర్యామి యైన భగవంతుడు భక్తుల పూజలను స్వీకరించి సర్వదా సంరక్షిస్తూ వుంటాడు....స్వస్తి.

సుందరకాండ విశిష్టత ...!!

సుందరకాండ విశిష్టత ...!!


ఆంజనేయుని సుందర రూపానికి దృశ్య మాలిక సుందరకాండ.

ఇది రామాయణంలో ఐదవ కాండ. సుందరకాండను "పారాయణ కాండ" అని కూడా అంటారు.

హనుమంతుడు సాగరమును లంఘించుట, సీతాన్వేషణము, లంకాదహనము, సీత జాడను రామునికి తెలియజెప్పుట ఇందులో ముఖ్యాంశాలు.

సుందరకాండకు ఆ పేరు ప్రతిపాదించడానికి అనేక కారణాలున్నాయి.

తరచి చూస్తే, ఈ సుందరకాండ లో సుందరం కానిది ఏది లేదని చెప్పవచ్చు. శబ్ధ, అర్ధ మరియు రస సౌందర్యముల మేలుకలయిక సుందరాకాండ.

భగవానునికి విష్ణు సహస్రనామములలో ‘సుందరు’ అని నామము కలదు.

అలాగే అమ్మవారికి ‘సుందరి’ అని పేరు కలదు. సుందరుడు అనగా ఆనందము కలిగించువాడని అర్ధము.

సుందరే సుందరో రామః సుందరే సుందరీ కథః సుందరే సుందరీ సీత సుందరే సుందరం వనం సుందరే సుందరం కావ్యం సుందరే సుందరం కపిః సుందరే సుందరం మంత్రం సుందరే కిం న సుందరం?

అనగా,సుందరుడైన రామచంద్రమూర్తిని వర్ణిస్తున్నది కావున ఇది సుందరకాండ. సుందరమైన కథను చెబుతున్నది కావున సుందరకాండ.

సుందరమైన సీతను గురించి చెబుతున్నది కావున సుందరకాండ. సుందరమైన అశోకవనాన్ని వర్ణిస్తున్నది కావున సుందరకాండ.

సుందరమైన అంత్యాను ప్రాసలతో ఉపమాలంకార శబ్ధాలతో చెప్పబడినది కావున సుందరకాండ. సుందరమైన హనుమంతుడి గాథను చెబుతున్నది కావున సుందరకాండ.

పారాయణకు సంబంధించిన అన్ని రకములైన సుందర విషయాలు చెబుతున్నది కావున సుందరకాండ.

మంత్రయుక్తమైన రామాయణ కావ్యంలో, విశేషించి సుందరకాండలో, హనుమ యొక్క కుండలినీ యోగసాధన, త్రిజటా స్వప్నంలో గాయత్రీ మంత్రం నిక్షేపింపబడినవి.

ఇది రామాయణమునకంతటికీ బీజ కాండము. ఇందులో సీతయే పరాశక్తి అని వాల్మీకి వాడిన అనేక శబ్దాల వలన, పదాల వలన గ్రహించవచ్చును.

అట్టి అమ్మవారే సౌందర్యనిధి. ఆమెయే సౌందర్యము. అందుకే దీనిని ‘ఉపాసనకాండ‘ అని కూడా అంటారు. అటువంటి సుందరకాండను పారాయణం చేసే క్రమము.

సంక్షేప రామాయణం, శ్రీరామావతారము, సీతాకళ్యాణము, సీతారామోయోః సుఖజీవనము, నాగపాశము విమోచనము, ఆదిత్య హృదయము, రావణవధ, బ్రహ్మకృత రామస్తుతి, పట్టాభిషేకము.

ఈ క్రమములో సంపూర్ణ రామాయణ పారాయణం చేసిన విశేష ఫలం లభిస్తుందని పెద్దలు చెపుతారు...జై శ్రీరామ్.

అహల్యా, ద్రౌపదీ, సీతా, తారా, మండోదరి గురించి తెలుసుకుందాం. Let's learn about Ahalya, Draupadi, Sita, Tara and Mandodari

 అహల్యా, ద్రౌపదీ, సీతా, తారా, మండోదరి తథా పంచకన్యా స్మరేన్నిత్యం మహాపాతక నాశనమ్.

అహల్య, ద్రౌపదీ, సీత, తార, మండోదరి ఈ ఐదుగురు పుణ్య మాత మూర్తులను రోజూ స్మరించినట్లయితే మహాపాతకాలు కూడా నాశనమవుతాయని ఈ శ్లోక భావం. ఈ నలుగురు పతివ్రతా మూర్తుల గురించి తెలుసుకుందాం.

అహల్య
అహల్య గౌతమ మహర్షి భార్య..! ఈమె వృత్తాంతము రామాయణములో పేర్కొనబడినది. శాపము వలన రాయిగా మారిన అహల్య, రాముని పాదధూళి సోకి శాప విమోచనమై తిరిగి స్త్రీ రూపము ధరించిందని కొన్ని రామాయణ వృత్తాంతాలలో పేర్కొనబడినది.

ద్రౌపదీ..
పూర్వ జన్మలలో ఆమె వేదవతి, ఆ తరువాత మౌద్గల్య ముని భార్య ఇంద్రసేన. ఆ తరువాతి జన్మలో ఆమె కాశీరాజు కుమార్తె అనామికగా జన్మించింది. పతికోసం ఘోరమైన తపస్సు చేసింది. పరమశివుడు ప్రత్యక్షమై ఏం కావాలని అడిగాడు. పతి అన్న పదాన్ని ఐదుసార్లు పలికింది ఆమె. ఐదుగురు పతులను అనుగ్రహించాడు శివుడు. నీకు ఐదుగురు పతులున్నా అది ధర్మవిరుద్ధమని ఎవరూ భావించరు అని, ఆమె కోరుకొన్న విధంగా ఐదుగురితో సుఖించటానికి తగ్గ యవ్వనం, కామభోగేచ్ఛ, వారిని సేవించేందుకు అవసరమైన శుశ్రూషాభావం, కన్యాత్వం, సౌభాగ్యం అనుగ్రహించాడు. మరుజన్మలో ఆమె యజ్ఞం చేస్తున్న ద్రుపదుడికి అగ్నిగుండంలో లభించింది.

సీతాదేవి! వాల్మీకి మహర్షే శ్రీ రామాయణాన్ని "సీతాయాశ్చరితం మహత్'' అని వెల్లడిచేశారు.

క్షమ..దయ...ధైర్యం...వివేకం... ఆత్మాభిమానం కలబోసిన ఉదాత్తమైన స్త్రీ పాత్ర 'సీత'. ఆమె లేనిదే రామాయణం లేదు. ఒక ఇల్లాలిగా తన భర్త బాధ్యతలో, కర్తవ్య దీక్షలో తను కూడా పాలుపంచుకొని ఆదర్శ గ హిణిగా మెలిగిన మహాసాధ్వి 'సీతాదేవీ'. రాముడు అరణ్యవాసానికి వెళ్లినప్పుడు భర్త అడుగుజాడల్లో తనూ నడిచి, అతని కష్టసుఖాల్లో పాలు పంచుకోవడానికి సిద్దమైన ధర్మపత్నిగా తన ధర్మాన్ని నిర్వర్తించింది. రావణ చరలో బందీ అయినప్పటికీ కూడా తన భర్తపై కల వాత్సల్యాన్ని ప్రేమను వదులుకోలేదు. రావణ వినాశనానికి, ధర్మ స్థాపనకు కారణం అయింది. దయాశాలి, అభిమానవతి, క్షమాగుణి, ధైర్యశాలి అయిన సీతామాత గుణగణాలను రామాయణంలో అడుగడుగునా వాల్మీకి మహర్షి ఎన్నో సందర్భాలలో చెప్పారు.

తారాదేవి!
వాలి భార్య తారాదేవి. సుగ్రీవుడి భార్యను వాలి చెరబట్టి, అతన్ని రాజ్యబహిష్క్రుతున్ని చేసినప్పుడు అది తప్పని వాలికి చెప్పింది. అన్నదమ్ములు కలహించుకుంటే రాజ్యానికి చేటని హితవు చెప్పింది. కానీ వాలి వినలేదు. దాంతో రామబాణానికి నేలకొరిగాడు. మరణించిన పతిదేవుని చూసి తాను కూడా చనిపోతానని తన పతిభక్తిని చాటుకుంది. ధర్మం ప్రకారం సుగ్రీవున్ని రాజ్యానికి రాజును చేసింది. కిష్కింధ రాజ్య పాలనకు మహారాణిగా తన సలహాలను చెప్పింది. రామకార్యానికి సుగ్రీవున్ని సమాయిత్తం చేసింది. మాటలు ఆచితూచి ఎలా మాట్లాడాలో రామాయణం చెప్తుంది అంటారు. కొన్ని ఘట్టాలు ఉదాహరణలు గా చూసి చాలా నేర్చుకోవాలి అని అనిపించక మానదు. ముఖ్యం గా సుందరకాండలో హను మంతుల వారు మాట్లాడిన తీరు, వాలి భార్య తార మాట్లాడే తీరు చదివితే తెలుస్తుంది. సుగ్రీవుడు అప్పుడే దెబ్బలుతిని పోయినవాడు మరల తిరిగి వచ్చి, సింహనాదం చేస్తూ వుంటే వాలిని వెళ్ళవద్దని, బలమైన కారణం వున్నది కనకే సుగ్రీవుడు తిరిగి వచ్చాడని నిశిత పరిశీలనతో చెబుతుంది. హెచ్చ రిస్తుంది. వాలి వినడు చని పోతాడు. ఆతర్వాత కూడా రామకార్యం మరిచి పోయాడని సుగ్రీవుడిపై కోపగించిన లక్ష్మణుడిని తన సంభాషణా చాతు ర్యంతో చల్లపరుస్తుంది. ఆమె ఆ సమ యంలో చెప్పిన మాటలు చూడండి. చాలా కాలం కష్టాలు పడ్డాడు. ఇప్పుడే ఆయన రాజు అయ్యాడు. రాముని దయ వల్ల రాజ్యం, రుమా, నేనూ దక్కాము. భోగాలనుభవిస్తున్నా, రాముని పని మానలేదు సుమా' అంటూ మాటాడగల్గిన చతుర తార . ఇలా తారాదేవి ప్రస్తావన రామాయణంలోని సుందరకాండలో అద్భుతంగా వివరించబడి ఉంది.

మండోదరి దేవి!!
రామాయణం జరగడానికి కీలకమైన వ్యక్తులలో ఒకరు రావణాసురుడు. అతడు ఎంతటి శివభక్తుడైనా సరే పరస్త్రీని వాంఛించడం అనే ఒకే ఒక్క దుర్గుణం వల్ల నాశనమైనాడు. అతడి భార్యే మండోదరి దేవి. రావణాసురుడు ఎంతటి అసురుడో ఈమె అంతటి మహాపతివ్రత. మాయాసురుడు కుమార్తె. రావణాసురుడు ఈమెను మోహించి అపహరించి పెళ్ళాడాడు. ఈమెకు పుట్టిన కొడుకు పేరు ఇంద్రజిత్తు. మండోదరి దేవి మిక్కిలి సౌందర్య రాశి. కేవలం బాహ్య సౌందర్యరాశి మాత్రమేగాదు అంతస్సౌందర్యం కూడా కలిగింది. అందుకే సీతమ్మ తల్లిని వెతుక్కుంటూ వచ్చిన హనుమంతుడు రావణుడితో కూడి ఉన్న ఈ స్త్రీరత్నాన్ని చూసి ఆమే సీతాదేవి అనుకున్నాడు కూడా. రావణాసురుడు సీతమ్మని అపహరించి తెచ్చినప్పుడు పరస్త్రీ వ్యామోహం వద్దని, నీతిని, ధర్మాన్ని కర్తవ్యాన్ని రావణాసురునికి బోధించింది. రావణాసుర వధానంతరం భర్తతో పాటు ప్రాణత్యాగం చేయ డానికి సాహసించింది.